English | Telugu

కేజిఎఫ్ యష్ సరసన సాయి పల్లవి 

ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా యష్ కొత్త సినిమా ప్రకటన కోసం ఎదురుచూస్తుంది.వాళ్ళందరి కోసం ఈ నెల ఎనిమిదవ తేదీన యష్ తన కొత్త సినిమాని అధికారికంగా ప్రకటించబోతున్నాడు.ఆ రోజే ఆ సినిమా దర్శకుడు బ్యానర్ తో పాటు హీరోయిన్ ఎవరనేది కూడా ప్రకటించబోతున్నారు.కానీ ఈ లోపే యష్ సినిమాలో చెయ్యబోయే హీరోయిన్ గురించి ఒక వార్త బయటికి వచ్చింది .రావడమే కాదు ఇప్పుడు ఆ వార్త ఇండియన్ ఫిలిం సర్కిల్స్ లో సంచలనం సృష్టిస్తుంది.

యష్ 19 గా తెరకెక్కతున్న ఆ మూవీలో యష్ సరసన సాయి పల్లవి హీరోయిన్ గా చెయ్యబోతుందనే టాక్ చాలా బలంగా వినపడుతుంది. ఇదే కనుక జరిగితే ఈ ప్రాజెక్ట్ ఇండియాలోనే సంచలన ప్రాజెక్ట్ గా నిలబడటం ఖాయం. ఎందుకంటే సాయి పల్లవి కి ఇప్పుడు అన్ని బాషల్లోను మంచి నటి అనే గుర్తింపు ఉంది.పైగా తన నటనతో తెలుగు తమిళ మలయాళ భాషల్లో ఎంతో మంది అభిమానులని సంపాదించుకుంది.యష్ ఆల్రెడీ కేజిఎఫ్ తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు.ఈ ఇద్దరి కాంబోలో సినిమా వస్తే కనుక ఆ సినిమా ఇండియన్ సినిమా హిస్టరీ లో సరికొత్త రికార్డు లు సృష్టించడం ఖాయం.ఆల్రెడీ ఇద్దరు కలిసి హిందీలో తెరకెక్కే రామాయణంలో నటించబోతున్నారు.రణబీర్ కపూర్ రాముడు పాత్రలో కనిపిస్తుండగా సీతగా సాయిపల్లవి రావణాసురుడుగా యష్ నటిస్తున్నారు.

సాయి పల్లవి ప్రస్తుతం నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న తండేల్ లో నటిస్తుంది. యష్ సాయి పల్లవిల కొత్త చిత్రానికి ప్రముఖ మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించబోతుంది. ఈమె 2014 లో హిందీలో అబద్దాలు పాచికలు అనే సినిమాని తెరకెక్కించారు. అలాగే 50 కి పైగా చిత్రాల్లో నటిగా కూడా నటించింది. కేవిఎన్ ప్రొడక్షన్ పై యష్ చిత్రం నిర్మాణం జరుపుకుంటుంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .