English | Telugu

నాని అభిమానులకి  24 న పండుగ 

కొన్ని సినిమాలు విడుదలకి ముందే ప్రేక్షకుల్లో ప్యూర్ పాజిటివ్ వైబ్రేషన్ ని కలిగిస్తాయి. సినిమా ఫస్ట్ లుక్,టీజర్,సాంగ్స్,ఇలా మూవీ విడుదలకి ముందు ఆ మూవీకి సంబంధించి జరిగే అన్నికార్యక్రమాలు కూడా ఇక ఈ సినిమా హిట్ అనే ఒక వైబ్రేషన్ ని ప్రేక్షకులుకి కలిగిస్తాయి. అలాంటి ఒక చిత్రమే హాయ్ నాన్న. నాచురల్ స్టార్ నాని హీరో గా వస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన తాజా అప్ డేట్ ఒకటి నాని అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను ఆనందాన్ని కలుగ చేస్తుంది.

హాయ్ నాన్న మూవీ ట్రైలర్ 24 న విడుదల కాబోతుంది.ఈ మేరకు చిత్రబృందం అధికారకంగా ప్రకటించింది. ట్రైలర్ ఎలా వుండబోతుందనే ఒక ఉత్కంఠత నాని అభిమానుల్లో ఆడియన్స్ లో ఉంది. నూతన దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో నానికి జోడిగా మృణాల్ ఠాకూర్ నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నుంచి విడిపోయిన చెరుకూరి మోహన్ ఇంకో ఇద్దరితో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. హేషం అబ్దుల్ వహీద్ సంగీతం అందించగా బేబీ కియారా కీలక పాత్రలో నటిస్తుంది.

నాని ప్రస్తుతం హాయ్ నాన్న రిలీజ్ కి సంబంధించిన ప్రమోషన్ పనుల్లోఫుల్ బిజీగా ఉన్నాడు. తెలుగు సినిమా చరిత్రలో ఎప్పుడు లేని విధంగా సరికొత్త రీతిలో హాయ్ నాన్న ప్రమోషన్స్ జరుగుతున్నాయి. హాయ్ నాన్న అనే రాజకీయ పార్టీని కూడా నిర్మించిన నాని ప్రేక్షకులకి ఇటీవలే కొన్ని వాగ్దానాలు కూడా చేసాడు. 24 న విడుదల అయ్యే ట్రైలర్ ద్వారా కూడా నాని ఏమైనా వాగ్దానాలు ఇస్తాడేమో చూడాలి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.