English | Telugu

పవన్ కళ్యాణ్ మాట మీద నిలబడతాడా!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)అప్ కమింగ్ మూవీ 'హరిహరవీరమల్లు'(Hari Hara Veera mallu)రిలీజ్ డేట్ ఎన్నిసార్లు వాయిదా పడిందో తెలిసిందే. చారిత్రాత్మక నేపధ్యంతో తెరకెక్కుతున్న ఈ మూవీలో ఫస్ట్ టైం పోరాటయోధుడుగా చేస్తున్న పవన్ ని సిల్వర్ స్క్రీన్ పై చూడాలని అభిమానులు ఎంతగానో ఉవ్విళ్లూరుతున్నారు. కానీ ఎప్పటిప్పుడు వాళ్ల ఆశలన్నీ అడియాసలు అవుతు వస్తున్నాయి. గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న 'ఓజి'(Og)పరిస్థితి కూడా ఇంతే.

ఈ రెండు మూవీలు కొంత భాగం షూటింగ్ ని జరుపుకున్నాయి. వీటిల్లో ఎక్కువ భాగం వీరమల్లు నే జరుపుకుంది. మే 9 న రిలీజ్ అని ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే పవన్ డేట్స్ ఇచ్చాడు. తెలంగాణలోని కొత్తగూడంలో షూట్ కి ప్లాన్ చేసారు. కానీ పవన్ కొడుకు మార్క్ శంకర్ గాయపడటంతో షూటింగ్ కి బ్రేక్ పడింది. దీంతో మే 9 నుంచి కూడా వీరమల్లు వెనక్కి వెళ్ళింది. కానీ ఇప్పుడు మేకర్స్ కి పవన్ నుంచి హామీ వచ్చినట్టుగా తెలుస్తుంది. తన సీన్స్ కి సంబంధించి ఉన్న ప్యాచ్ వర్క్ త్వరగా పూర్తి చేసుకోమని పవన్ చెప్పాడని, మేకర్స్ షూట్ కి రెడీ అవుతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో వీరమల్లు రిలీజ్ మే సెకండ్ వీక్ లో గాని, జులై ఫస్ట్ వీక్ లో గాని ఉండవచ్చని అంటున్నారు.

ఇదే రీతిలో 'ఓజి' నిర్మాతల్ని కూడా షూట్ కి రెడీ చేసుకోమని చెప్పాడని సినీ సర్కిల్స్ లో టాక్ నడుస్తుంది. దీంతో అన్ని అనుకున్నట్టుగా కుదిరితే సెప్టెంబర్ 5 న ఓ జి ని థియేటర్స్ లోకి తీసుకొచ్చే ప్లాన్ లో మేకర్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. గతంలో కూడా ఈ రెండు చిత్రాల నిర్మాతలకి పవన్ మాట ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరి ఈ సారైనా పవన్ తన మాటని నిలబెట్టుకుంటాడా అనే చర్చ సినీ సర్కిల్స్ లో నడుస్తుంది. అభిమానులు మాత్రం రెండు చిత్రాల షూటింగ్ ని పవన్ కంప్లీట్ చేసి సిల్వర్ స్క్రీన్ పై తమని అలరించాలని కోరుతున్నారు. వీరమల్లు ని ఎ ఎం రత్నం(Am Rathnam) నిర్మిస్తుండగా క్రిష్(Krish),జ్యోతికృష్ణ(Jyothi Krishna)దర్శకత్వం వహిస్తున్నారు. ఓజి కి ఆర్ఆర్ఆర్ దానయ్య(Dvv Danayya)నిర్మాత కాగా సుజిత్(Sujeeth) దర్శకుడు.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.