English | Telugu

అదును చూసి దెబ్బ కొట్టిన హరిహరవీరమల్లు నిర్మాత.. పవన్ ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో  

రాననుకున్నారా! రాలేననుకున్నారా! ఇంద్ర మూవీలో మెగాస్టార్ చిరంజీవి చెప్పిన ఈ డైలాగ్ అప్పట్లో ఒక ఊపు ఊపింది. ఇప్పుడు ఈ డైలాగ్ ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు. ఇది నూటికి నూరుపాళ్లు నిజం. హరిహర వీరమల్లు రూపంలో సగర్వంగా చెప్పబోతున్నాడు

పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ మూవీస్ లో హరిహర వీరమల్లు ఒకటి. 2022 లోనే షూటింగ్ ప్రారంభం అయ్యింది. కానీ రక రకాల కారణాల వల్ల షూటింగ్ పోస్ట్ పోన్ అవుతు వచ్చింది.పైగా ఆ మూవీ తర్వాత పవన్ ఒప్పుకున్న సినిమాలు విడుదల అయ్యాయి. అసలు వీరమల్లు గురించి అప్ డేట్ కూడా ఎక్కడా రావడం లేదు.మేకర్స్ కూడా సైలెంట్ గా ఉంటు వస్తున్నారు. దీంతో వీరమల్లు ఇప్పట్లో ఉండదనే వార్తలు గత కొంత కాలం నుంచి వినిపిస్తు వస్తున్నాయి. ఈ క్రమంలో మేకర్స్ అదును చూసి అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు. వీరమల్లు టీజర్ మే 2 ఉదయం తొమ్మిది గంటలకి విడుదల కాబోతుంది. ధర్మం కోసం యుద్ధం అనే క్యాప్షన్ తో మేకర్స్ అధికారకంగా ప్రకటించారు.దీంతో పవన్ ఫ్యాన్స్ లో సరికొత్త జోష్ వచ్చింది

మెగా సూర్య మూవీస్ పతాకంపై ఏ ఎం రత్నం అత్యంత భారీ వ్యయంతో వీరమల్లు ని నిర్మిస్తున్నాడు. క్రిష్ దర్శకుడు కావడంతో ప్రాజక్టు పై అందరిలో ఎనలేని ఆసక్తి నెలకొని ఉంది. నిధి అగర్వాల్ హీరోయిన్ కాగా అషు రెడ్డి కీలక పాత్రలో నటిస్తుంది. ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ తో పాటు ఎన్నో భారీ చిత్రాలకి మాటల్ని అందించిన సాయి మాధవ్ బుర్ర వీరమల్లు కి కూడా డైలాగ్స్ ని అందిస్తున్నారు. పవన్ చేస్తున్న మొట్టమొదటి హిస్టారికల్ మూవీ హరిహర వీరమల్లు

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.