English | Telugu

అల్లు అర్జున్ క్లోజ్ చేసింది పవన్ కళ్యాణ్ ప్రారంభించబోతున్నాడా!

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)అప్ కమింగ్ మూవీ 'హరిహరవీరమల్లు'(Hari Hara Veeramallu)ఈ నెల 24 న విడుదల కానున్న విషయం తెలిసిందే. 'బ్రో' వచ్చిన రెండేళ్లకి పవన్ నుంచి వస్తున్న మూవీ వీరమల్లునే. దీంతో ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లో 'వీరమల్లు' పై ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది. రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ మేకర్స్ ప్రమోషన్స్ లో వేగం పెంచనున్నారు. అందులో భాగంగా ఈ నెల 20 న 'వైజాగ్' లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని భారీ ఎత్తున జరపబోతున్నారు. ఈ ఈవెంట్ కి దర్శక ధీరుడు రాజమౌళి(SS Rajamouli)ముఖ్య అతిధిగా రాబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.

అల్లు అర్జున్(Allu Arjun)రీసెంట్ హిట్ 'పుష్ప 2' (Pushpa 2)బెనిఫిట్ షో కి అభిమానులు భారీ ఎత్తున తరలిరావడంతో తొక్కిసలాట జరిగి, హైదరాబాద్ లో ఒక మహిళ చనిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఇకపై తెలంగాణాలో బెనిఫిట్ షోస్ ఉండవని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఆ నిర్ణయం తర్వాత అగ్ర హీరోల సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ముందు రోజు నైట్ కానీ,రిలీజ్ రోజు తెల్లవారుజామున గాని బెనిఫిట్ షోస్ అనేవి పడలేదు. మరి ఇప్పుడు 'వీరమల్లు' రిలీజ్ సందర్భంగా తెలంగాణాలో బెనిఫిట్ షో గురించి ఫ్యాన్స్ లో చర్చ నడుస్తుంది. పవన్ కళ్యాణ్ నటించిన చాలా సినిమాలు తెలంగాణాలో 'బెనిఫిట్ షో'లు జరుపుకున్నాయి. ఫ్యాన్స్ కూడా అందరి కంటే ముందుగా పవన్ మూవీని చూడాలనే నేపథ్యంలో, బెనిఫిట్ షో ఉండాలని కోరుకుంటారు. కొన్ని సందర్భాల్లో బెనిఫిట్ షో కోసం ధర్నాలు కూడా చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో వీరమల్లు బెనిఫిట్ షో పై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. పుష్ప 2 తో రద్దయిన బెనిఫిట్ షో వీరమల్లు తో పవన్ ప్రారంభిస్తాడని అభిమానులు సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్నారు. నిర్మాత ఏ ఎం రత్నం అయితే ఇటీవల సి ఎం రేవంత్ రెడ్డి ని కలిసాడు.

ఇక వీరమల్లు లో పవన్ సరసన 'నిది అగర్వాల్'(Nidhhi Agerwal)పంచమి అనే క్యారక్టర్ లో చేస్తుంది. రిలీజ్ టైం దగ్గరపడేకొద్దీ ఆమె పలు ఇంటర్వ్యూలలో పాల్గొని మూవీ ఖచ్చితంగా సూపర్ హిట్ అని చెప్తూ వస్తుంది. క్రిష్, జ్యోతికృష్ణ సంయుక్త దర్శకత్వంలో తెరకెక్కిన వీరమల్లు పవన్ కెరీరి లోనే అత్యంత భారీ వ్యయంతో నిర్మాణం జరుపుకుంది. కీరవాణి సంగీత సారథ్యంలో వచ్చిన సాంగ్స్ కూడా ప్రేక్షకాదరణ పొందాయి. యానిమల్ విలన్ బాబీ డియోల్ ఔరంగజేబుగా చేస్తుండగా రఘుబాబు, అనసూయ, నర్గిస్ ఫక్రి, నౌరా ఫతేహి జిష్ణు సేన్ గుప్తా, పూజిత పొన్నాడ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు.


టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.