English | Telugu

Akhanda 2: అఖండ 2 నుంచి సాంగ్ రిలీజ్ చేసిన మేకర్స్    

-సాంగ్ కి మంచి స్పందన
-థియేటర్స్ అన్ని దేవాలయాలు
- బాలయ్య తాండవం ఇప్పట్లో తగ్గదు

గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)వరల్డ్ వైడ్ గా ఉన్న థియేటర్స్ లో 'అఖండ 2'(Akhanda 2)తో తన ఏక ఛత్రాధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు. అఖండ అనే నామధేయంతో అఘోర గా బాలయ్య కనపరుస్తున్న పెర్ ఫార్మెన్స్ కి అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ముగ్దులవుతున్నారు. దీంతో వయసుతో తారతమ్యం లేకుండా థియేటర్ లోని అభిమానులు ప్రేక్షకులు తమకి తెలియకుండానే శివ తాండవం చేస్తున్నారు. అంతలా బాలయ్య నట సమ్మోహన శక్తీ, థమన్ ఇచ్చిన సాంగ్స్ ,ఆర్ ఆర్ నిలుస్తున్నాయి.

ఆ తాండవాన్ని మరింత పెంచేలా 'గంగాధర శంకర'(Gangadhara Shankara)అనే సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. సుమారు మూడు నిమిషాల నలబై సెకన్ల నిడివి ఉన్న సదరు సాంగ్ కొంత సేపటి క్రితమే యూట్యూబ్ లో రిలీజయ్యింది. సాంగ్ లోని ప్రతి పదం భోళా శంకరుడి గొప్ప తనాన్ని చాటి చెప్తుండటంతో శివ భక్తులు ఎంతగానో తన్మయత్వం చెందుతున్నారు. అద్వీతీయ రాసిన ఈ సాంగ్ ని ఐశ్వర్య, శృతి రంజని, సౌందర్య ఆలపించారు. రెండు వారాల క్రితమే సాంగ్స్ అన్ని రిలీజ్ అయ్యాయి. కానీ ఇప్పుడు ఒక్కక్కొటి విడిగా చేస్తున్నారు. ఈ క్రమంలోనే గంగాధర సాంగ్ ని రిలీజ్ చేసారు.


Also read: అవతార్ 3 థియేటర్స్ కి వార్నింగ్.. లెటర్ తో సహా దొరికిపోయిన అగ్ర దర్శకుడు


టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.