English | Telugu

అవతార్ 3 థియేటర్స్ కి వార్నింగ్.. లెటర్ తో సహా దొరికిపోయిన అగ్ర దర్శకుడు  

-వార్నింగ్ ఇస్తున్న దర్శకుడు ఎవరు
-ఈ నెల 19 న ఏం జరగబోతుంది
-లెటర్ లో ఏముంది
-జేమ్స్ కామెరూన్ ఏమంటున్నాడు!


వరల్డ్ సినీ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రపంచ సినీ పితామహుడు జేమ్స్ కామెరూన్(James Cameron)మరో అద్భుత సృష్టి 'అవతార్ 3 ఫైర్ అండ్ యాష్'(Avatar 3: Fire and ash)ఈ సారి పాండోరా ప్రపంచానికి కొత్త శత్రువుగా వరాంగ్ ని కామెరూన్ పరిచయం చేయబోతున్నాడు. దీంతో ఈ నెల 19 న ప్రపంచవ్యాప్తంగా మొదటి రెండు పార్టులకి మించి సెల్యులాయిడ్ పై సరికొత్త వండర్ ప్రత్యక్షం కాబోతుంది. ఈ నేపధ్యంలో పార్ట్ 3 ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చూడాలనుకునే వాళ్ల సంఖ్య రోజు రోజుకి పెరుగుతు ఉంది. ఇప్పుడు వాళ్ల తొందరని జేమ్స్ కామెరూన్ రాసిన ఒక లేఖ రెట్టింపు చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.


రీసెంట్ గా కామెరూన్ థియేటర్ టెక్నీషియన్లకు, యజమానులకు ఒక ప్రత్యేకమైన లేఖ రాసారు. సదరు లేఖలో ఈ సినిమాతో పాటు పంపిన డీసీపీ లో ప్రొజెక్షన్ స్పెసిఫికేషన్ ఫైల్, ఫ్రేమింగ్ చార్ట్ ఉన్నాయి. వాటిని తప్పకుండా పాటించాలి. లైట్ లెవల్స్, ఆడియో కాన్ఫిగరేషన్ కూడా ముఖ్యం.సౌండ్ సిస్టమ్ ని నేనే వ్యక్తిగతంగా మిక్స్ చేశాను. పూర్తి అనుభూతి కోసం 7.0 రిఫరెన్స్ సౌండ్ లెవల్‌ని తగ్గించవద్దు. థియేటర్ల నిర్వహణ ప్రేక్షకుల అనుభూతిలో కీలకం.ఆ విషయంలో ఎలాంటి రాజీపడవద్దు. ఒక రకంగా హెచ్చరిక లాంటిదని తన లెటర్ లో కామెరూన్ స్పష్టం చేశారు. ఇప్పుడు ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

also read: తిండి, నిద్ర మానేసి రాత్రంత అదే పని.. దాంతో ఆరోగ్యం నాశనం

దీంతో కామెరూన్ అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు 'ప్రపంచ సినీ ప్రేక్షకులకి అత్యుత్తమ క్వాలిటీ తో సినిమాని అందించాలనే నిబద్దత కామెరూన్ కి ఎంతలా ఉంటుందో అనడానికి ఇదొక నిదర్శనమని కామెంట్స్ చేస్తున్నారు. ఇక అవతార్ 3 సుమారు 400 మిలియన్ల డాలర్స్ తో తెరకెక్కింది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.