English | Telugu

మావయ్య నిన్ను చాలా మిస్ అవుతున్నాం.. గల్లా జయదేవ్ ఎమోషనల్!

సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న ఘట్టమనేని కృష్ణ మరణించి ఏడాది గడిచిపోయింది. కృష్ణ మరణం అటు కుటుంబసభ్యుల్ని, ఇటు అభిమానుల్ని శోకసంద్రంలో ముంచేసింది. అలాంటి కృష్ణగారి గురించి గల్లా జయదేవ్ తన ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ పెట్టారు. కృష్ణతో దిగిన ఫోటోని కూడా ఈ సందర్భంగా షేర్ చేశారు. " మీరు మమ్మల్ని విడిచిపెట్టి ఒక సంవత్సరం అయ్యింది, కానీ మేము ప్రతిరోజూ మిమ్మల్ని తలచుకుని బాధపడుతున్నాము. మీతో గడిపిన సమయం , ఆ మధురమైన జ్ఞాపకాలను మర్చిపోలేకపోతున్నాం.

మీ జీవితం నుండి ఎన్నో విషయాలను నేర్చుకున్నాం..ఎంతో ఇన్స్పైర్ అయ్యాము. మామయ్యా నిన్ను మిస్ అవుతున్నాం. మీరు ఎప్పటికీ మా హృదయాల్లో ఉంటారు." అంటూ ఆర్ద్రతతో కూడిన ఒక టాగ్ లైన్ ని జత చేశారు. ఎన్నో రకాల ప్రయోగాలతో అందరికీ నచ్చే సినిమాలు తీసి చరిత్రలో నిలిచిపోయారు. 1960లో కృష్ణ 'చేసిన పాపం కాశీకెళ్ళినా' అనే నాటకంలో శోభన్‌బాబుతో కలిసి నటించారు.

ఆ తర్వాత 'భక్త శబరి', 'సీతారామ కళ్యాణం', 'ఛైర్మన్‌' వంటి నాటకాల్లో నటించి అందరి దృష్టిలో పడ్డారు. కృష్ణ హీరోగా ఎంపికైన ఫస్ట్ మూవీ 'కొడుకులు కోడళ్ళు' రిలీజ్ కాకుండా ఆగిపోయింది. 1968 నుంచి 74 వరకు తెనాలిలో ఉన్న ఏడు థియేటర్స్ లో కృష్ణ నటించే సినిమాలనే ఆడించేవారు. నిర్మాతల హీరోగా కృష్ణకి ఎంతో పేరుంది. టెక్నాలజీ అందుబాటులో లేని రోజుల్లోనే ఆయన జేమ్స్‌బాండ్, కౌబాయ్ క్యారెక్టర్స్ ని పరిచయం చేసి టాలీవుడ్ లో హాలీవుడ్ ని ఆడియన్స్ కి పరిచయం చేసిన ఘనత కృష్ణ గారిదే. అప్పట్లో ఆయన మూవీస్ విషయంలో చేసిన ప్రయోగాలు ఇప్పటి ఎంతో మంది డైరెక్టర్స్ కి మార్గదర్శకాలు అని చెప్పొచ్చు.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.