English | Telugu

పూరి చేసిన ప్రామిస్ తో 100 రోజుల్లో పూనకాలతో ఊగిపోనున్న రామ్ పోతినేని ఫ్యాన్స్


రామ్ పోతినేని,పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో 2019 లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సూపర్ డూపర్ హిట్ అయ్యి రామ్ కెరీర్ లోను అలాగే పూరి కెరీర్ లోను నెంబర్ వన్ చిత్రంగా నిలిచింది. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత వీళిద్దరి కాంబోలో ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ అనే మూవీ రూపుదిద్దుకుంటుంది. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన గుడ్ న్యూస్ ఒకదాన్ని రామ్ అభిమానుల కోసం పూరి వెల్లడి చేసాడు.

రామ్ పోతినేని అండ్ పూరి కలయికలో వస్తున్న డబుల్ ఇస్మార్ట్ మరో 100 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అంటే మార్చ్ 8 న వరల్డ్ వైడ్ గా అత్యధిక థియేటర్స్ లో విడుదల కాబోతుంది. రిలీజ్ కి సంబంధించిన పోస్టర్ ని కూడా కొద్దీ సేపటి క్రితమే మేకర్స్ విడుదల చేసారు. దీంతో రామ్ అభిమానుల్లో నయా జోష్ వచ్చినట్లయ్యింది. పోస్టర్ ని చూసి సినిమా ఒక రేంజ్ లో ఉండబోతోందనే అంచనాకి వచ్చేసారు.శరవేగంగా షూటింగ్ జరుపుంటున్న ఈ చిత్రంలో సంజయ్ దత్ విలన్ గా మెరవబోతున్నాడు.

పూరి ,రామ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ డబుల్ ఇస్మార్ట్ మీద ప్రేక్షకుల్లో చాలా అంచనాలు ఉన్నాయి. అందరి అంచనాలకి తగ్గట్టే పూరి ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కిస్తున్నాడు. లైగర్ పరాజయంతో ఉన్న పూరి ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు .అలాగే రామ్ కూడా ఈ సినిమాతో సరికొత్త రికార్డు లు సృష్టించాలనే పట్టుదలతో ఉన్నాడు. పూరి కనక్ట్స్ పై నిర్మాణం జరుపుకుంటున్న ఈ చిత్రానికి పూరి, ఛార్మీలు నిర్మాతలుగా వ్యహరిస్తుండగా మెలోడీ బ్రహ్మ మణి శర్మ సంగీతాన్ని అందిస్తున్నాడు.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.