English | Telugu

బాలయ్య బర్త్ డేకి

శ్రీ సాయిబాబా మూవీస్ పతాకంపై, వాల్మీకిగా నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు నటిస్తూండగా,నందమూరి నటసింహం, యువరత్న నందమూరి బాలకృష్ణ శ్రీరామచంద్రమూర్తిగా,నయనతార సీతా మహాసాధ్విగా,శ్రీకాంత్ లక్ష్మణుడిగా, సాయికుమార్ భరతుడిగా,బాపు దర్శకత్వంలో,యలమంచిలి సాయిబాబు నిర్మిస్తున్న పౌరాణిక చిత్రం "శ్రీ రామ రాజ్యం".ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, సంభాషణలను ముళ్ళపూడి వెంకట రమణ వ్రాస్తుండగా, ఇళయరాజా సంగీతాన్నందిస్తున్నారు.ఈ చిత్రానికి జొన్నవిత్తుల, వెన్నెలకంటి పాటలూ, పద్యాలూ వ్రాస్తున్నారు.ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ఆల్వాల్ లో వేసిన కోటి రూపాయల ఆశ్రమం సెట్ లో జరుగుతూంది. ఈ చిత్రాన్ని హీరో బాలకృష్ణ జన్మదినమైన జూన్ 10 వ తేదీన విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.