English | Telugu

ఫిబ్రవరిలో యన్ టి ఆర్ కొత్త చిత్రం

యంగ్ టైగర్ యన్ టి ఆర్ నటించబోయే కొత్త చిత్రం ఫిబ్రవరి నెల నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది.ఈ చిత్రంలో యన్ టి ఆర్ సరసన తమన్నా, తాప్సి హీరోయిన్లుగా నటించనున్నారు.ఈ చిత్రానికి "కిక్" ఫేం సురేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తారు.ఈ చిత్రాన్ని బి.వి.యస్.యన్.ప్రసాద్ నిర్మించనున్నారు.ఈ చిత్రం నవంబర్ లోనే పూజా కార్యక్రమాలు జరుపుకుంది.ఈ చిత్రం పూజ రోజునే పూర్తి బిజినెస్ జరుపుకోవటం తెలుగు సినీ పరిశ్రమను ఆశ్చర్యంలో ముంచెత్తింది.ఈ చిత్రం యొక్క శాటిలైట్ హక్కులను ఒక టి.వి.ఛానల్ వారు నాలుగున్నర కోట్లకు కొన్నారని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి.ఇది యాక్షన్, రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపుదిద్దుకోనుంది.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.