English | Telugu

వర్మ సినిమాకి 5 గురు దర్శకులు

ప్రముఖసంచలన దర్శక,నిర్మాత రామ్(రాంగ్)గోపాల్ వర్మ సంచలనాత్మకంగా తీస్తున్నానని ప్రకటించిన చిత్రం"దొంగల ముఠా".మాస్ రాజా రవితేజ హీరోగా,ఛార్మి హీరోయిన్ గా,లక్ష్మీ ప్రసన్న, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం,సుబ్బరాజు, బ్రహ్మాజీ, అజయ్ తదితరులు ఈ చిత్రంలో పారితోషికం తీసుకోకుండా నటిస్తున్నారు.అంతే కాకుండా ఈ చిత్రాన్ని కేవలం అయిదు రోజుల్లోనే ఈ సినిమా తీస్తానని వర్మ అన్నాడు.దానికి తగ్గట్టుగానే ఈ చిత్రానికి అయిదుగురు ప్రముఖ దర్శకులు పనిచేస్తున్నారు.రామ్ (రాంగ్) గోపాల వర్మ, కృష్ణ వంశీ, వి.వి.వినాయక్,గుణశేఖర్ ‍,హరీష్ శంకర్ తదితరులు పనిచేస్తున్నారు.పూరీ జగన్నాథ్ కూడా ఈ చిత్రానికి పనిచేస్తారని తెలిసినా ఎమదుకనో ఆయని చిత్రానికి పనిచేయట్లేదని తెలిసింది.

ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు.. మారుతి ఏమంటున్నాడు

రెబల్ సాబ్ ప్రభాస్(Prabhas)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై తన కట్ అవుట్ కి ఉన్న క్యాపబిలిటీని రాజాసాబ్(The Raja saab)తో మరోసారి చాటి చెప్పాడు. ఇందుకు సాక్ష్యం రాజాసాబ్ తో తొలి రోజు 112 కోట్ల గ్రాస్ ని రాబట్టడమే.  ఈ మేరకు  మేకర్స్ కూడా ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటిస్తూ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. దీంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అయితే అవధులు లేవు. చిత్ర బృందం ఈ రోజు రాజా సాబ్ కి సంబంధించిన విజయోత్సవ వేడుకలు నిర్వహించింది. దర్శకుడు మారుతీ తో పాటు, నిర్మాత విశ్వప్రసాద్(TG Vishwa Prasad)రాజా సాబ్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హాజరయ్యారు.