English | Telugu

వర్మ సినిమాకి 5 గురు దర్శకులు

ప్రముఖసంచలన దర్శక,నిర్మాత రామ్(రాంగ్)గోపాల్ వర్మ సంచలనాత్మకంగా తీస్తున్నానని ప్రకటించిన చిత్రం"దొంగల ముఠా".మాస్ రాజా రవితేజ హీరోగా,ఛార్మి హీరోయిన్ గా,లక్ష్మీ ప్రసన్న, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం,సుబ్బరాజు, బ్రహ్మాజీ, అజయ్ తదితరులు ఈ చిత్రంలో పారితోషికం తీసుకోకుండా నటిస్తున్నారు.అంతే కాకుండా ఈ చిత్రాన్ని కేవలం అయిదు రోజుల్లోనే ఈ సినిమా తీస్తానని వర్మ అన్నాడు.దానికి తగ్గట్టుగానే ఈ చిత్రానికి అయిదుగురు ప్రముఖ దర్శకులు పనిచేస్తున్నారు.రామ్ (రాంగ్) గోపాల వర్మ, కృష్ణ వంశీ, వి.వి.వినాయక్,గుణశేఖర్ ‍,హరీష్ శంకర్ తదితరులు పనిచేస్తున్నారు.పూరీ జగన్నాథ్ కూడా ఈ చిత్రానికి పనిచేస్తారని తెలిసినా ఎమదుకనో ఆయని చిత్రానికి పనిచేయట్లేదని తెలిసింది.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.