English | Telugu

ఓటీటీలోకి అనసూయ తమిళ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

అనసూయ భరద్వాజ్.. ‌అందరికి సుపరిచితమే. జ‌బ‌ర్ధ‌స్త్ షోకు దాదాపు తొమ్మిదేళ్ల పాటు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించింది అన‌సూయ‌. 2022లో ఈ షోకు గుడ్‌బై చెప్పింది. అన‌సూయ స్థానంలో ప్ర‌స్తుతం జ‌బ‌ర్ధ‌స్త్ షోకు సిరి హ‌నుమంతు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది.

తెలుగులో పలు సినిమాలు చేసింది అన‌సూయ‌. క్షణం, రంగస్థలం, పుష్ప, రంగ‌మార్తండ‌, విమానం, పెద‌కాపు వంటి సినిమాల్లో విభిన్న పాత్రలతో మెప్పించింది. ఈ ఏడాది తెలుగులో 'ర‌జాకార్‌'లో క‌నిపించింది. కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వాల‌ని, త‌మిళ సినిమా చేయాల‌ని అన‌సూయ చాలా కాలంగా ఎదురుచూస్తోంది. త‌మిళంలో " ఫ్లాష్‌బ్యాక్ " పేరుతో అన‌సూయ ఓ మూవీ చేసింది. ప్ర‌భుదేవా హీరోగా న‌టించిన ఈ సినిమాలో రెజీనా, అన‌సూయ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. చాలా రోజుల క్రిత‌మే ఈ సినిమా షూటింగ్ పూర్త‌యింది. అనివార్య కార‌ణాల వ‌ల్ల ఈ మూవీ థియేట‌ర్ల‌లో విడుద‌ల‌ కాలేదు.

తాజాగా థియేట‌ర్ల‌లో కాకుండా నేరుగా ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ కాబోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ప్రముఖ ఓటీటీ వేదిక జీ5 ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుందని తెలుస్తోంది. అయితే అఫీషియల్ గా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌ను మేక‌ర్స్ తెలియజేయలేదు. ఫ్లాష్‌బ్యాక్ మూవీ త‌మిళంతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ కానున్న‌ట్లు స‌మాచారం. రొమాంటిక్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాకు డాన్ సాండీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ మూవీలో ప్ర‌భుదేవా ర‌చ‌యిత పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. ఆంగ్లో ఇండియ‌న్ గా రెజీనా క‌నిపించ‌నున్న‌ది. ఈ మూవీలో అన‌సూయ పాత్ర స్పెషల్ అని తెలుస్తోంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.