English | Telugu

ఘనంగా జరిగిన అల్లు శిరీష్, నైనికా ఎంగేజ్మెంట్.. మెగా హైలెట్స్ ఇవే 

-అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్
-నైనికా ఎవరు
-మెగా ఫ్యామిలీ సందడి

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)సోదరుడు ప్రముఖ హీరో 'అల్లు శిరీష్'(Allu Sirish)కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు త్వరలోనే వివాహబంధంలోకి అడుగుపెడుతున్నానని తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు నైనికా అని ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో నైనికా(Nayanika)ఎవరనే చర్చ అభిమానులతో పాటు నెటిజన్స్ లో జరిగింది.


రీసెంట్ గా అల్లు శిరీష్,నైనికా ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. శిరీష్ ఇంట్లో ఈ వేడుక జరగగా, ఇరు వైపుల పెద్దల సమక్షంలో కాబోయే వధూవరులు ఉంగరాలు మార్చుకున్నారు. నిశ్చితార్థ వేడుకలో అల్లు కుటుంబంతోపాటు మెగాస్టార్ చిరంజీవి(Chiramjeevi),నాగబాబు, రామ్ చరణ్(Ram Charan)వరుణ్ తేజ్ కూడా హాజరయ్యారు. సోషల్ మీడియాలో ఈ కార్యక్రమానికి సంబంధించిన పిక్స్ వైరల్ గా మారాయి. నిజానికి ఈ కార్యక్రమం అవుట్ డోర్ లో జరగాల్సింది. ఈ విషయంపై నిన్న శిరీష్ ఎక్స్ వేదికగా స్పందిస్తు చలికాలంలో అవుట్‌డోర్ నిశ్చితార్థం ప్లాన్ చేశాను. కానీ వాతావరణం, దేవుడికి వేరే ప్లాన్స్ ఉన్నాయ్’ అంటూ శిరీష్ ట్వీట్ చేసాడు.

Also read:నాని సినిమాలో హాలీవుడ్ అగ్ర హీరో!

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.