English | Telugu

అట్లీతో మూవీ.. బన్నీ ట్వీట్‌కి అర్థమదేనా?

‘జవాన్’తో ఈ ఏడాది బ్లాక్ బస్టర్ సాధించారు కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ. ఆయన డైరెక్షన్‌లో కింగ్ ఖాన్ షారూఖ్ చేసిన ‘జవాన్’ మూవీ రూ.500 కోట్లకు పైగానే వసూళ్లను సాధించి బాక్సాఫీస్ పోరులో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో అట్లీతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా ఉంటుందనే వార్తలు గట్టిగానే వినిపించాయి. కానీ ఎలాంటి ప్రకటనా రాలేదు. అయితే ఇప్పుడు మాత్రం నెటిజన్స్ అల్లు అర్జున్, అట్లీ కాంబోలో సినిమా ఉంటుందని ఘంటాపథంగా చెబుతున్నారు. అందుకు కారణం బన్ని వేసిన ట్వీట్ అని రుజువుగా చూపెడుతున్నారు. అసలు అంతలా వార్తలు బయటకు రావటానికి బన్ని వేసిన ట్వీట్ ఏంటి? అనే వివరాల్లోకి వెళితే,

గురువారం అల్లు అర్జున్ తన సోషల్ మీడియా మాధ్యమం ద్వారా ‘జవాన్’ సినిమా సాధించిన బ్లాక్ బస్టర్‌ను ఉద్దేశించి ప్రశంసల వర్షం కురిపించారు. ఆ సందర్బంలో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ అల్లు అర్జున్ ట్వీట్‌పై స్పందించారు. ఐకాన్ స్టార్‌కి ధన్యవాదాలను తెలియజేశారు. అయితే దీనికి అల్లు అర్జున్ స్పందిస్తూ నాకు కావాల్సింది థాంక్స్ కాదు.. సూపర్ హిట్ పాటలు అని అన్నారు. బన్ని ఏ పాటల గురించి చెప్పారా? అని అందరూ కొద్ది సేపు ఆలోచించారు. అయితే కొంతసేపటికీ అందరికీ స్ట్రైక్ అయిన విషయమేమంటే, అట్లీతో బన్ని సినిమా కన్ఫర్మ్ అయ్యిందని. అందుకనే తను అలా అనిరుద్‌ని అడిగారని అంటున్నారు. అయితే ఈ మూవీ ఎప్పుడు ఉంటుందనేది మాత్రం తెలియటం లేదు కానీ.. బన్నీ టైట్ షెడ్యూల్‌ను చూస్తే మాత్రం కచ్చితంగా వచ్చే ఏడాది చివరలోనో, ఆ నెక్ట్స్ ఇయర్ కానీ ఉండొచ్చునని సినీ సర్కిల్స్ అంటున్నాయి.

ప్రస్తుతం బన్నీ పుష్ప 2 ది రూల్ సినిమాను కంప్లీట్ చేస్తున్నారు. దీని తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుందనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది. అది కాకుండా అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగాతో ఓ సినిమాకు సంబంధించిన ప్రకటన కూడా వచ్చేసింది. వీటి తర్వాతే అట్లీ డైరెక్షన్‌లో ఐకాన్ స్టార్ మూవీ ఉంటుందనేది టాక్.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.