English | Telugu

'ఏజెంట్' కాదిది.. మరో 'లైగర్'!

కొందరు యువ హీరోలు పెద్ద దర్శకులను నమ్మి నెలల తరబడి కష్టపడి బాడీ బిల్డప్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాతో తమ దశ తిరిగినట్టే అని కలలు కంటూ దర్శకుడు చెప్పినట్టుగా చేసి, సినిమా కోసం ప్రాణం పెట్టి పని చేస్తున్నారు. తీరా సినిమా విడుదలయ్యాక బొక్క బోర్లా పడుతున్నారు. చేతిలో పెద్ద దర్శకుడు ఉన్నాడు, భారీ బడ్జెట్ పెట్టే నిర్మాతలు ఉన్నారు.. ఇక మనం దర్శకుడు కోరినట్టుగా మనల్ని, మన దేహాన్ని మలచుకుంటే చాలు అనుకుంటున్నారు తప్ప.. అన్నింటి కన్నా ముఖ్యమైన బలమైన కథ ఉందా లేదా అని ఆలోచించడం లేదు. అదే ఘోర పరాజయాలకు కారణమవుతోంది.

విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన పాన్ ఇండియా మూవీ 'లైగర్'. గతేడాది భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. విడుదలకు ముందు ఈ మూవీ టీమ్ చేసిన హడావుడి అంతాఇంతా కాదు. ముఖ్యంగా విజయ్ అయితే సినిమా విడుదలయ్యాక థియేటర్లు బద్దలవుతాయి, వసూళ్ల సునామీ సృష్టిస్తుంది అన్నాడు. తీరా విడుదలయ్యాక ప్రేక్షకులు ఆ సినిమా చూసి.. అసలు సినిమాలో ఏముందని ఇంత హడావుడి చేశారంటూ పెదవి విరిచారు. ఇంచుమించు 'ఏజెంట్' విషయంలోనూ ఇప్పుడదే సీన్ రిపీట్ అయింది.

అఖిల్ అక్కినేని హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ 'ఏజెంట్'. మొదట పాన్ ఇండియా సినిమా అని ప్రమోట్ చేసినా.. చివరికి తెలుగు, మలయాళ భాషల్లోనే విడుదల చేశారు. సినిమా ప్రకటించిన కొత్తలో విపరీతమైన బజ్ ఏర్పడింది. విడుదల ఆలస్యం కారణంగా సినిమాపై బజ్ తగ్గినా.. టీం మాత్రం సినిమాపై చాలా నమ్మకం పెట్టుకున్నారు. అఖిల్ మార్కెట్ కి మించి భారీ బడ్జెట్ పెట్టారు నిర్మాతలు. అఖిల్ ఈ సినిమా కోసం ఎన్నో నెలల పాటు కష్టపడి బాడీ పెంచాడు. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని, సినిమా తర్వాత తన రేంజ్ మారిపోతుందని అఖిల్ ఎంతగానో నమ్మాడు. లైగర్ విడుదలకు ముందు విజయ్ చెప్పినట్లుగానే.. ఏజెంట్ విడుదలకు ముందు అఖిల్ కూడా సినిమా గురించి ఎంతో గొప్పగా చెప్పాడు. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అన్నట్టుగా మాట్లాడాడు. తీరా విడుదలయ్యాక మొదటి షో నుంచే ఇది మరో లైగర్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ రెండు సినిమాల విషయంలోనూ హీరోలు పెద్ద దర్శకులని నమ్మారు, బాడీలు పెంచి బాగా కష్టపడ్డారు కానీ.. కీలకమైన స్క్రిప్ట్ ఎంపికపై మాత్రం దృష్టి పెట్టలేదని స్పష్టమవుతోంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.