English | Telugu

నటి జియాఖాన్ తల్లిపై 100 కోట్ల పరువు నష్టం దావా



అనుమానాస్పద రీతిలో బాలీవుడ్ నటి జియాఖాన్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆమె తల్లి రబియా ఖాన్ జియా ఖాన్ మృతి హత్యేనంటూ హైకోర్టులో కేసు వేసి, సిబిఐ విచారణ కావలసిందిగా కోరింది. ఇటీవలే ఈ కేసు సిబిఐకి అప్పగించారు. ఈ నేపథ్యంలో జియాఖాన్ తల్లి రబియా పై ఆదిత్య పాంచోలి 100 కోట్ల రూపాయల పరువు నష్టం కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని ప్రముఖ ఆంగ్ల పత్రిక ప్రకటించింది. జియాఖాన్ కేసులో ఆదిత్య పాంచోలి కొడుకు సూరజ్ ఆలోపణలు ఎదుర్కుంటున్నారు. రబియా ట్విట్లర్లో తమపై అమర్యాద పూర్వకమైన వ్యాఖ్యలు చేస్తూ బాలీవుడ్ లో తమ గౌరవానికి భంగం కలిగిస్తోంది పాంచోలీ కుటుంబం ఈ పిటీషన్లో ఆరోపించింది.


పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.