English | Telugu

మహాభారతంపై అమీర్ ఖాన్ కీలక వ్యాక్యలు..మన రక్తంలోనే అది ఉంది  

స్టార్ హీరో అమీర్ ఖాన్(aamir Khan)కొన్ని రోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు మహాభారతాన్ని(Mahabharatam)నిర్మించాలనేది నా కల. భారతీయులుగా మన రక్తంలోనే ఈ కథ ఉంది. కాబట్టి ఎలాంటి తప్పు లేకుండా జాగ్రత్తగా ఎంతో బాధ్యతతో తెరకెక్కించాలి ఈ ప్రాజెక్ట్ తో భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని అనుకుంటున్నానని చెప్పిన విషయం తెలిసిందే.

రీసెంట్ గా ఒక ఆంగ్ల మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చిన అమీర్ మరోసారి 'మహాభారతం' మూవీకి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసాడు. ఆయన మాట్లాడుతు మహాభారతాన్ని నేటి తరానికి అందించాలనేది నా లక్ష్యం. ఈ ఏడాది దీని పనులు ప్రారంభించాలని అనుకుంటున్నాను. రైటింగ్ కి కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఒకే సినిమాలో దీన్ని చూపించలేం కాబట్టి సిరీస్ లుగా రూపొందించాలని నిర్ణయించుకున్నాను. ఈ ప్రాజెక్టు కోసం ఎంతో మంది దర్శకులు వర్క్ చేస్తున్నారు. స్టోరీ కంప్లీట్ అయిన తర్వాత, క్యారెక్టర్స్ కి ఎవరు సరిపోతారో వాళ్ళని ఎంపిక చేస్తాం. నేను ఇందులో నటిస్తానో లేదో ఇప్పుడే చెప్పలేనని తెలిపాడు.


భారతీయ చిత్ర పరిశ్రమతో అమీర్ ఖాన్ కి నాలుగున్నర దశాబ్దాలపైనే అనుబంధం ఉంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా, అసిస్టెంట్ డైరెక్టర్ గా సత్తా చాటిన అమీర్, ఉత్తమాభిరుచి గల సినిమాలు అందించాలనే లక్ష్యంతో ఇప్పటి వరకు సుమారు 70 చిత్రాల దాకా చేసాడు. వీటిల్లో ఎక్కువ భాగం విజయవంతమైన చిత్రాలే. ఇండియన్ చిత్ర సీమలో ఇప్పటి వరకు హయ్యస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీ కూడా అమీర్ నటించిన దంగల్(Dangal)నే. భారత ప్రభుత్వం చేత ప్రతిష్టాత్మక అవార్డ్స్ పద్మశ్రీ(Padma shri)పద్మభూషణ్(Padma bhushan)కూడా అమీర్ అందుకోవడం జరిగింది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.