English | Telugu

ఆగస్ట్ 30న 'ఆగడు' ఆడియో

సూపర్ మహేష్ బాబు హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆగడు' సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఆడియోను ఈ నెల30న శిల్పకళా వేదికలో గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేశారు. ఇప్పటికే రిలీజైన టీజర్ లలో మహేష్ చెప్పిన డైలాగ్స్ ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఆగడు చిత్రంలో మహేష్ బాబు సరసన తమన్నా నటిస్తోంది. శృతి హాసన్ ఐటం సాంగు చేయడం మరో ప్రత్యేకత. ఈ సినిమాకి తమన్ సంగీతం అందించారు. దూకుడు కంటే ఆగడు పెద్ద హిట్ అవుతుందని చిత్ర బృందం ధీమాను వ్యక్తం చేస్తోంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.