English | Telugu

పవన్ ఫ్యాన్స్ ని టార్గెట్ చేసిన మెగాస్టార్..!

చిరంజీవి రాజకీయాల్లోకి రాకముందు మెగాస్టార్ సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన విషయం తెలిసిందే. సినిమాల్లో మెగాస్టార్‌గా రాణించిన చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చి తనకున్న సినీ ఇమేజ్ ను కూడా డ్యామెజ్ చేస్కున్నాడని ఆయన సన్నిహిత వర్గాలు అంటుంటాయి. ఈ విషయం లేటుగా పసిగట్టిన మెగాస్టార్ ఆ డ్యామెజ్ కంట్రోల్ కు సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించాలని నిర్ణయించుకున్నారట. ఇందుకు రంగం కూడా వేగంగానే సిద్ధ చేసుకొంటున్నారు. ఆయన నటించే 150వ సినిమా మెగాస్టార్‌గా ఆయనకు పూర్వ వైభవం తెచ్చేదిగా ఉండాలని, పెద్ద హిట్‌ అయ్యేలా ఉండాలని ప్లాన్ చేస్తున్నారట. అందుకు ముందుగా పవన్ అభిమానులను టార్గెట్ చేశాడట.

గత కొంతకాలంగా చిరు, పవన్ మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయని మీడియాలో వార్తలు హల్ చల్ చేసిన ఖండించని మెగాస్టార్...తాజాగా వాటికి ఫుల్ స్టాప్ పెట్టె ప్రయత్నాలు మొదలుపెట్టారు. లేటెస్ట్ గా ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. పవన్ తమ్ముడే కాదు నాకు మరో బిడ్డలాంటి వాడు.. రాజకీయాలకు అతీతమైన బంధం మాది. ఎవరికీ సాధ్యం కాని ఇమేజ్ ఏర్పాటు చేసుకున్నాడు.. పవన్ - చరణ్ ప్రేక్షకుల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంటున్నారని అన్నారు. మరి మెగాస్టార్ వేసిన మాస్టర్ ప్లాన్ తో ‘పొలిటికల్‌ ఫెయిల్యూర్‌’ మరుగున పడుతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే!

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.