English | Telugu

చిరంజీవికి 100 కోట్లు సాధ్యమేనా?

ప్రస్తుతం ఉన్న యంగ్ స్టార్స్ లో ప్రభాస్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, కోలీవుడ్ స్టార్ విజయ్ వంటి వారు 100కోట్ల పారితోషికం అందుకుంటున్నారు. వారి సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా మెగాస్టార్ చిరంజీవి సినిమాలు కూడా వ‌సూళ్ల‌ను రాబడుతున్నాయి. మెగాస్టార్ తో సరైన కమర్షియల్ యాంగిల్ లో సినిమా చేస్తే మినిమం 150 నుండి 200 కోట్ల వరకు వసూలు నమోదు అవుతాయి. ఈ విషయాన్ని వాల్తేరు వీరయ్య చిత్రం నిరూపించింది.

చిరంజీవికి ఉన్న స్టార్డం, ఫ్యాన్ ఫాలోయింగ్ నేపథ్యంలో యావరేజ్ టాకు వచ్చినా కూడా 100 కోట్లకు పైగా వసూళ్లు ఈజీగా నమోదు అవుతాయి. ప్రమోషన్ విషయంలో కొత్తగా ఆలోచిస్తూ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ చేస్తే చిరు సినిమాలు రికార్డులు బద్దలు అవుతాయి. చిరంజీవి 100 కోట్ల పారితోషకానికి సరైన వ్యక్తి. ఆరు పదుల వయసు దాటిన తర్వాత 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోబోయే చిరంజీవిని త్వరలో చూడాలని అందరూ భావిస్తున్నారు. టాలీవుడ్ లో ప్రస్తుతం కొందరు హీరోలు మొదట‌ కొంత అడ్వాన్స్ తీసుకొని తరువాత లాభాలలో వాటా తీసుకుంటున్నారు.

అలా చిరు కూడా తీసుకుంటే 100 కోట్ల రెమ్యూనరేషన్ చిరు ఈజీగా అందుకుంటాడని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. లాభాల్లో వాటా కాకుండా మరో రెండు మూడు సినిమాలు 150 నుండి 200 కోట్ల వరకు వసూలు చేస్తే చిరుకి 100 కోట్లు ఈజీగా వచ్చేస్తుంది. వాల్తేరు వీరయ్య లాగా మరో రెండు మూడు చిత్రాలు గనక బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తే చిరు 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్న స్టార్ హీరోల జాబితాలో స్థానం సంపాదించుకుంటాడని కచ్చితంగా చెప్పవచ్చు.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.