English | Telugu

పదేళ్లు పూర్తి చేసుకున్న ట్రెండ్ సెట్టర్ 'స్వామిరారా'

చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని సాధించిన సినిమాలు అరుదుగా ఉంటాయి. అందులోనూ, విజయాన్ని సాధించడమే కాకుండా కొత్త వారికి ధైర్యాన్ని ఇస్తూ ట్రెండ్ సెట్ చేసే సినిమాలు అత్యంత అరుదుగా వస్తాయి. అలాంటి సినిమాలలో ఒకటే 'స్వామిరారా'. నిఖిల్, కలర్స్ స్వాతి జంటగా సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పెద్దగా అంచనాల్లేకుండా 2013, మార్చి 23న విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సూపర్ హిట్ ఫిల్మ్ నేటితో పది వసంతాలు పూర్తి చేసుకుంది.

2013 లో ఎక్కువగా కమర్షియల్ సినిమాల హవానే నడిచింది. ఆ సమయంలో కొత్త, పాత అనే తేడా లేకుండా దర్శకులంతా.. విభిన్న కథలు, ప్రయోగాల జోలికి పోకుండా కమర్షియల్ సినిమాలకే ఎక్కువ మొగ్గుచూపారు. అలాంటి సమయంలో 'స్వామిరారా' అనే క్రైమ్ కామెడీ చిత్రంతో సుధీర్ వర్మ దర్శకుడిగా పరిచయమయ్యాడు. పద్మనాభస్వామి గుడిలో చోరీకి గురైన అత్యంత మహిమ గల గణేష్ విగ్రహం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. కథాంశం, కథనం కొత్తగా ఉండటం.. దానిని ఎంటర్టైనింగ్ గా చెప్పిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంది. యువ నటీనటులతో ప్రేమకథలు మాత్రమే కాదు.. విభిన్న కథలు తీసినా ప్రేక్షకులు ఆదరిస్తారని నిరూపించిన చిత్రమిది. ఒక్క సినిమాతోనే ప్రతిభగల దర్శకుడిగా సుధీర్ వర్మ తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్నాడు. దర్శకుడిగా ఆయనకు ఆ తరువాత భారీ విజయాలు దక్కకపోయినా.. ఇప్పటికీ వరుస అవకాశాలు అందుకుంటూ రవితేజ లాంటి స్టార్ తో 'రావణాసుర' సినిమా చేస్తున్నాడంటే 'స్వామిరారా' ఎంతటి ప్రభావం చూపిందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ సినిమా నుంచే హీరో నిఖిల్ కథల ఎంపికలో మార్పు వచ్చింది. అప్పటిదాకా అందరిలా మూసధోరణిలో వెళ్లిన నిఖిల్.. 'స్వామిరారా' తరువాత నుంచి సినిమా సినిమాకి వైవిధ్యం చూపిస్తున్నాడు. అలాగే ఇది కేవలం ఆ సినిమాకి పని చేసిన వారికి పేరు తీసుకురావడమే కాకుండా.. దర్శకత్వ ప్రయత్నాల్లో ఉన్న ఎందరో కొత్త దర్శకులకు విభిన్న కథాంశంతో సినిమా చేసినా ఆదరణ లభిస్తుందనే ధైర్యాన్ని ఇచ్చింది.

లక్ష్మీ నరసింహ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో రూపొందిన ఈ చిత్రంలో సత్య, పూజా రామచంద్రన్, జీవా, రవిబాబు తదితరులు నటించారు. సన్ని ఎం.ఆర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా రిచర్డ్ ప్రసాద్, ఎడిటర్ గా కార్తీక శ్రీనివాస్ వ్యవహరించారు.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.