English | Telugu
ప్రభాస్ సినిమాకి రాజమౌళి కథ ఎవరిది
Updated : Apr 6, 2011
ప్రభాస్ సినిమాకి రాజమౌళి కథ ఎవరిది అనే ప్రశ్న ప్రస్తుతం ఫిలిం నగర్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మామూలుగా రాజమౌళి అన్ని సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కథనందించటం పరిపాటి. కానీ ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు అండ్ కో నిర్మిస్తున్న భారీ బడ్జెట్ జానపద చిత్రానికి ఒక విద్యార్థి రాసిన కథని, ఆ విద్యార్థికి అరవై లక్షల రూపాయలనిచ్చి రాజమౌళి ఆ కథను కొనుగోలు చేశారనీ, ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి.
అలా కొనుగోలు చేసిన ఆ కథను రాసింది తన తండ్రేనని రాజమౌళి చెప్పుకుంటున్నారని కూడా ఫిలిం నగర్ లో ప్రచారం జరుగుతోంది. సినిమా టైటిల్ కార్డ్స్ లో కథకుడిగా తండ్రి పేరే వేస్తారనికూడా ఫిలిం నగర్ వాసులంటున్నారు. ఇది ఎంతవరకూ నిజమో కాలమే చెప్పాలి. ఆ కథతో నిర్మించే సినిమాకి మాత్రం దాదాపు వంద కోట్ల రూపాయల భారీ బడ్జెట్ ను కేటాయించటం జరిగిందట. ఈ ప్రభాస్ చిత్రం రానున్న నవంబర్ నెలలో ప్రారంభం కానుంది. ప్రస్తుతం నాని హీరోగా, సమంత హీరోయిన్ గా, ప్రముఖ కన్నడ నటుడు సుదీప్ విలన్ గా నిర్మిస్తున్న "ఈగ" సినిమాతో రాజమౌళి బిజీగా ఉన్నారు.