Read more!

English | Telugu

పాపం ప్రభాస్ ఫ్యాన్స్.. 'సలార్-2' లేనట్టే!

'బాహుబలి' ఫ్రాంచైజ్ తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ కి ఆ తర్వాత నుంచి వరుస షాక్ లు తగులుతున్నాయి. 'సాహో' నార్త్ లో మంచి వసూళ్లు రాబట్టినప్పటికీ ఓవరాల్ గా మాత్రం బాక్సాఫీస్ ఫెయిల్యూర్ గా మిగిలింది. ఆ తర్వాత వచ్చిన 'రాధేశ్యామ్' డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఫస్ట్ లుక్, టీజర్ నుంచే ట్రోల్స్ ఎదుర్కొన్న 'ఆదిపురుష్', విడుదల తర్వాత దారుణంగా నిరాశపరిచింది. 'బాహుబలి' తర్వాత వరుసగా మూడు సినిమాలు నిరాశపరచడంతో 'సలార్'పైనే ఆశలు పెట్టుకున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అయితే ఇప్పుడు వారి ఆశలు అడియాసలు అయ్యేలా ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది.

కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న యాక్షన్ ఫిల్మ్ కావడంతో 'సలార్'పై ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా రెండు భాగాలుగా రానుందని మేకర్స్ ప్రకటించారు. మొదటిభాగం సెప్టెంబర్ 28న విడుదల కావాల్సి ఉండగా, డిసెంబర్ 22 కి వాయిదా పడింది. అయితే ఇప్పుడు ఈ మూవీ గురించి షాకింగ్ న్యూస్ వినిపిస్తున్నాయి. సీజీ వర్క్ పట్ల దర్శకుడు సంతృప్తిగా లేడని, అందుకే వాయిదా పడిందని వార్తలొచ్చాయి. ఇటీవల కొన్ని సీన్స్ రీషూట్ చేస్తున్నారని ప్రచారం జరిగింది. ఇప్పుడైతే మరో షాకింగ్ న్యూస్ వినిపిస్తోంది. 'సలార్' రెండు భాగాల ఆలోచనను మేకర్స్ విరమించుకున్నారని, ఒక్క భాగంగానే రానుందని అంటున్నారు. రెండు భాగాలకు కావాల్సినంత కంటెంట్ లేదని, అందుకే డ్రాప్ అయ్యారని చెబుతున్నారు. సెకండ్ పార్ట్ కి అనుకున్న కొన్ని సన్నివేశాలను కూడా ఫస్ట్ పార్ట్ లోనే చేర్చారట. అందుకే సినిమా ఆలస్యమైందని, అంతేకాదు చివరి నిమిషంలో ఒక ఐటెం సాంగ్ కూడా చేర్చారని టాక్. ఎన్నో అంచనాలున్న 'సలార్' ఇలా అతుకులతుకులుగా తయారవుతుందనే వార్త ఫ్యాన్స్ ని షాక్ కి గురి చేస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెంత? సలార్ గత చిత్రాల్లాగానే షాక్ ఇస్తుందా? లేక ఈ వార్తలకు చెక్ పెట్టి సంచలనాలు సృష్టిస్తుందా? అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది.