కేంద్రంపై కాంగ్రెస్ ఎంపీల అవిశ్వాస తీర్మానం

  నిన్నవెలువడిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను కాంగ్రెస్ అధిష్టానం ఇంకా పూర్తిగా జీర్ణించుకోక ముందే, దానినెత్తిన మరో పిడుగు పడబోతోంది. ఈ రోజు డిల్లీలో సమావేశమయిన కాంగ్రెస్ యంపీలు లగడపాటి, రాయపాటి, ఉండవల్లి, సాయి ప్రతాప్, హర్షకుమార్, యస్పీవై రెడ్డి, సబ్బంహరి తమ కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం తెచ్చేందుకు లేఖపై సంతకాలు చేసారు. ఈ రోజు సాయంత్రంలోగా దానిని స్పీకర్ మీరా కుమార్ కి అందజేయనున్నారు. కానీ చిరంజీవి, పురందేశ్వరి, కిల్లి కృపా రాణీ, జేడీ శీలం, కావూరి, పళ్ళంరాజు తదితరులు మాత్రం వేనుకంజవేసినట్లు తెలుస్తోంది.   పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం సభలో ప్రవేశ పెట్టాలంటే కనీసం 55 మంది సభ్యుల మద్దతు తెలపాల్సి ఉంటుంది. కాంగ్రెస్ యంపీలు స్వయంగా తమ స్వంత ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తున్నారు గనుక సభలో ఇతర పార్టీల సభ్యులు కూడా దానికి మద్దతు ప్రకటించే అవకాశం ఉంది. స్పీకర్ కాంగ్రెస్ యంపీల అవిశ్వాస తీర్మానాన్ని స్వీకరించినట్లయితే కాంగ్రెస్ పార్టీకి అంతకంటే అవమానం మరొకటి ఉండబోదు.   ఇప్పటికే నాలుగు రాష్ట్రాలలో ఓటమితో క్రుంగిపోతున్న కాంగ్రెస్ అధిష్టానానికి ఇది జీర్ణించుకోవడం కష్టమే. గనుక వారిని బుజ్జగించే పని మొదలుపెడుతుందేమో! అప్పుడు వారిని ప్రసన్నం చేసుకొనేందుకు వారు కోరినట్లు తెలంగాణా బిల్లులో ఏమయినా మార్పులు చేర్పులకి అంగీకరిస్తే అప్పుడు టీ-కాంగ్రెస్ నేతలు అవిశ్వాసం ప్రతిపాదిస్తారేమో చూడాలి. ఏమయినప్పటికీ సోనియాగాంధీకి కాంగ్రెస్ నేతలు ఆమె పుట్టిన రోజున చాలా అరుదయిన కానుక సమర్పించుకొంటున్నారని ఒప్పుకోక తప్పదు.

కాంగ్రెస్ శని వదిలింది: బాబు

      దేశానికి పట్టిన కాంగ్రెస్ శని వదిలింది. నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు దీనిని ప్రతిబింబిస్తున్నాయి. ఈ ఫలితాలను కాంగ్రెస్ కూడా స్వాగతించాలి. భవిష్యత్‌లో అవినీతి పార్టీలకు ఇదే గతి పడుతుంది. దేశ ప్రజలు నరేంద్ర మోడీని ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ వెంటిలేటర్ మీద ఉంది. ప్రజలు నీతివంతమయిన పాలనకే పట్టం కట్టారు అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయడు అన్నారు. తెలంగాణ విషయంలో అందరికీ ఆమోదయోగ్యమయిన పరిష్కారం చూపిస్తానని చెప్పిన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మాట తప్పారని ఆయన విమర్శించారు. సోనియాగాంధీ చేతిలో ప్రధాని కీలుబొమ్మగా మారారని, ఆయన దేనికీ ఎదురు చెప్పడం లేదని తప్పుపట్టారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశం మీద రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశానని అన్నారు.  371 డీ ఆర్టికల్‌ను వర్రీకరించి మాట్లాడుతున్నారని, అటార్నీ జనరల్ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోలేదని, ఏ చట్టం కింద ఉమ్మడి రాజధాని చేస్తున్నారో చెప్పలేదని అన్నారు. నీటి మీద, హైదరాబాద్ మీద కేంద్రం తన పెత్తనం కోసం చూస్తుందని తప్పుపట్టారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పాలించే హక్కు కోల్పోయిందని అన్నారు.

కాంగ్రెస్, బీజేపీలకు మద్దతు ఈయము, తీసుకోము: అరవింద్

  రాజకీయ దిగ్గజాలయిన కాంగ్రెస్, బీజేపీలకు ఏడాది వయసు కూడా లేని ఆమాద్మీ పార్టీ డిల్లీలో చుక్కలు చూపించింది. ఆమాద్మీ దెబ్బకు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోగా, బీజేపీ అధికారం చెప్పట్టేందుకు కేవలం నాలుగు సీట్ల దూరంలో నిలిచిపోయింది. ఇప్పుడు ఆమాద్మీ మద్దతు ఇస్తే తప్ప డిల్లీ పీఠం ఎక్కాలనే బీజేపీ కల సాకారం కాదు. అందుకే ఆ పార్టీ తరపున ఎన్నికయిన అభ్యర్ధులతో అప్పుడే బీజేపీ బేరసారాలు మొదలుపెట్టింది. ఈవిషయాన్ని ఆ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ కూడా దృవీకరించారు.   అయితే తమ పార్టీ తరపున గెలిచిన వారెవరూ కూడా బీజేపీ ప్రలోభాలకు లొంగేవారు కారని, వారు కూడా తనలాగే ఈ రాజకీయ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయాలనే సంకల్పంతోనే రాజకీయాలలోకి వచ్చినందున, ఈ సంకీర్ణ బేరసార రాజకీయాలకు ఇష్టపడటం లేదని అన్నారు. తమ పార్టీ బీజేపీకి మద్దతు ఈయడం లేదా ఆ పార్టీ మద్దతు పుచ్చుకోవడం గానీ జరగదని అరవింద్ కేజ్రీవాల్ నిర్ద్వందంగా ప్రకటించారు. ఎందుకంటే భ్రష్టరాజకీయ సంస్కృతికి ఆలవాలమయిన కాంగ్రెస్, బీజేపీలకు వ్యతిరేఖంగా పుట్టిన తమ పార్టీ, నిన్నటి వరకు వాటితో పోరాడి, మళ్ళీ ఇప్పుడు అవే పార్టీలతో జత కడితే, ఇక తమకు వాటికీ ఏమీ తేడా ఉండదని అన్నారు. కాంగ్రెస్ హయంలో లక్షల కోట్ల కుంభకోణాలు నిత్యం వెలుగు చూస్తున్నాయని, అటువంటప్పుడు స్వచ్చమయిన రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేసుకొనేందుకు మరో 50 లేదా 100 కోట్లు ఖర్చుచేసి మళ్ళీ మరోమారు డిల్లీలో ఎన్నికలు నిర్వహించుకొంటే తప్పుకాదని అన్నారు.   అయితే సామాన్య మధ్యతరగతి కుటుంబాల నుండి వచ్చిఈ ఎన్నికలలో పోటీ చేసి గెలిచిన ఆమాద్మీ పార్టీ శాసనసభ్యులు దేశముదురు బీజేపీ చేసే రాజకీయాలకు, ఒత్తిళ్లకు, ప్రలోభాలకు లొంగకుండా ఉండగలరా? వారిని ఆమాద్మీ బీజేపీ నుండి కాపాడుకోగలదా? అరవింద్ కేజ్రీవాల్ కి ఉన్న దృడ సంకల్పం, దృడ నిశ్చయం వారూ కూడా కనబరచగలరా?   ఒకవేళ ఆమాద్మీ పార్టీ తన సిద్దాంతాలను కొంత సడలింపు చేసుకొని, బీజేపీతో జత కట్టి ప్రభుత్వంలో చేరి మరింత బలపడే ప్రయత్నం చేస్తుందా? లేకుంటే నిక్కచ్చిగా తన మాట మీద నిలబడి మళ్ళీ ఎన్నికలు ఎదుర్కొనేందుకే సిద్దపడుతుందా? కాంగ్రెస్ పార్టీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆమాద్మీని మళ్ళీ ఎన్నికలకే పురిగొల్పుతుందా? వంటి ధర్మసందేహాలకు జవాబులు రానున్నరెండు మూడు రోజుల్లోనే తేలిపోవచ్చును.

మంచు మనోజ్‌కు గాయాలు

  టాలీవుడ్‌ హీరో మంచు మనోజ్‌కు ప్రమాదం తప్పింది.. ఆదివారం రాత్రి ఓ పెళ్లికి వెళ్తున్న మనోజ్‌ కారు జౌటర్‌ రింగ్‌ రోడ్‌లోని అప్పా జంక్షన్‌ వద్ద ప్రమాదానికి గురైంది. రోడ్డుపై ఓ పడి ఉన్న ఓ గేదె మృతదేహాన్ని డీకొన్న మనోజ్‌ కారు బోల్తాపడి దాదాపు 200 మీటర్ల దూరం రోడ్డుపై రాసుకుంటు వెళ్లింది. ఈ ప్రమాదంలో మనోజ్‌తో పాటు కారు డ్రైవర్‌, బాడీగార్డులు కూడా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే ఈ ముగ్గురిని బంజార్‌హిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. మనోజ్‌ కుడిచేతిపై, కుడి కంటి సమీపంలో గాయలయ్యాని వైధ్యులు తెలిపారు. చికిత్స అనంతరం రాత్రి మనోజ్‌ను డిశ్చార్జ్‌ చేశారు.

ఈ ఫలితాలు కూడా ఆ లెగ్గు మహత్యమేనట!

  దేశంలో ఎప్పుడు ఎక్కడ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే, అందుకు పార్టీని తప్పుపట్టకుండా,అది అభం శుభం తెలియని రాహుల్ గాంధీ ‘ఐరన్ లెగ్’ మహత్యమేనని జనాలు అవాకులు చవాకులు వాగుతుంటారు. ఏమంటే ఆయన బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో పార్టీకి మంగళ హారతి ఇచ్చేయలేదా? గుజరాత్ లో పార్టీని పక్కనున్న అరేబియా సముద్రంలో ముంచేయలేదా? అంటూ ఏవో చెత్త చెత్త రికార్డులన్నీ తిరగేసి చూపుతుంటారు. కానీ, ఏ ఒక్కరూ కూడా ఆయన కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని ఒంటి చేత్తో ఏవిధంగా గెలిపించారో మాత్రం ప్రస్తావించరు.   ఒకవేళ ఈ పామర జనాలకి అది గుర్తు చేసి ఆయన గొప్పదనం గురించి చెప్పబోయినా, “ఆ..అక్కడ గనుల గాలి జనార్ధన్ రెడ్డి, ఎడ్యురప్పల దెబ్బకి బీజేపీ ఓడిపోయిందని కానీ అదేమి ఆయన గొప్పదనం కాదని వితండ వాదనలు చేస్తారు. మరి ‘ఐరెన్ లెగ్గు.. ఐరెన్ లెగ్గు’ అని వెక్కిరించేవారు మరి కర్ణాటకలో ఆ లెగ్గు మహత్యం ఎందుకు కనబడలేదో చెప్పమంటే మాత్రం జవాబు చెప్పరు. కానీ “ఇదిగో ఇప్పుడు చూసారు కదా... నాలుగు రాష్ట్రాలలో లెగ్గు మహత్యం. ఆయన అడుగుపెట్టిన రాష్ట్రాలలో ఒక్కటంటే ఒక్క రాష్ట్రంలోనయినా కాంగ్రెస్ గెలిచిందా?” అని ఎదురు ప్రశ్నిస్తారు.   “సరే! ఆయన లెగ్గుకే నిజంగా అంత మహత్యం ఉంటే మరి నిత్యం ఆయన పాదదూళితో పునీతమయిపోతున్నడిల్లీలో కాంగ్రెస్ పార్టీ గత 15సం.లుగా గెలుస్తూనే ఉంది కదా?” అని ప్రశ్నిస్తే, ఒక వెర్రి నవ్వు నవ్వి “చరిత్రలొద్దు..చెప్పింది విను” అంటూ 125సం.ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని నిన్నగాక మొన్న పుట్టిన ఒక అమ్ ఆద్మీ చీపురు పట్టుకొని బయటకి ఊడ్చిపడేసినా ఇంకా లెగ్గు మహత్యం అర్ధం కాకపోతే నీకీ రాజకీయాలేందుకు ఈ చర్చలు ఎందుకు?” అంటూ నిలదీస్తారు. అంతే తప్ప పాపం అభం శుభం తెలియని ఆ రాహుల్ బాబు లెగ్గుకి నిజంగా అంత పవర్ లేదంటే ఎవరూ వినిపించుకోరు, కనీసం నమ్మను కూడా నమ్మరు.   పైగా “ఇప్పుడే ఏమి చూసారు? 2014ఎన్నికలలో బాబు లెగ్గు మహత్యం మీరే చూద్దురు గాని” అంటూ వెర్రి వెర్రి కూతలు కూస్తుంటారు. “ప్రస్తుతం తెలుగు గడ్డకి ఆయన లెగ్గు సోకే భాగ్యం లేకపోయినా, కాంగ్రెస్ నేతలు తమ శిరస్సున పూసుకోస్తున్న ఆయన పాదధూళి తగిలినంత మాత్రాన్నేఎన్నికలకు ఇంకా ఆరు నెలల ముందే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఎలా ఊడ్చుకుపోతోందో చూసారా?” అని వెక్కిరింపు ఒకటీ.   ఇక ఆయన ఎన్నికల ప్రచారం కోసం రాష్ట్రంలో అడుగుపెట్టకబోతారా? మేము గెలవక పోతామా? అని రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు ఆయన మీదే గంపెడు ఆశలు పెట్టుకొని ఆయన పాదధూళి కోసం అహల్యా దేవిలా ఎదురుచూస్తున్నాయి. అయినా వచ్చేఎన్నికల తరువాత ఆయన ప్రధాని కుర్చీలో లెగ్గు మీద లెగ్గేసుకొని కూర్చొని దేశాన్నిపాలించేస్తుంటే చూడాలని సాక్షాత్ సోనియమ్మ, మన్మొహనులవారే ముచ్చట పడుతుంటే కాదనేనుందుకు ఈ వెర్రి జనాలెవరు?   కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు కాకపోయినా ఆంధ్రప్రదేశ్ నుండి డిల్లీ వరకు ఈ వీహెచ్, సర్వే,బొత్స,డీయస్, జానా వంటి అనేక మంది కాంగ్రెస్ నేతలున్నారు. వారందరూ ఎప్పుడూ రాహుల్, సోనియా అంటూ నిత్య పారాయణం, భజనలు చేయడమే తప్ప, వారిలో ఒక్కరు కూడా పాపం రాహుల్ బాబు లెగ్గు దోషం (మహత్యం) పోవడానికి చొరవ తీసుకొని ఏ రాహుకేతు పూజలో, నవగ్రహ పూజలో ఎప్పుడయినా చేసారా? అని పామర జనాలు నిలదీస్తున్నారు. అందుకే వారు ఏ మహాత్యమూ లేని పామరులయ్యారని జాలిపడటం తప్ప ఎవరు మాత్రం ఏమి చేయగలరు? అయినా ఏ మాటకామాటే చెప్పుకోవాలి. ఈ వెర్రి జనాలు ఆయన గురించి ఎన్ని అవాకులు చవాకులు వాగినా ఆయన లెగ్గు చాలా పవర్ ఫుల్ లెగ్ అని చచ్చినట్లు ఒప్పుకొంటున్నారు.

ఆమ్‌ఆద్మీ నుంచి పాఠాలు నేర్చుకుంటాం ; రాహుల్‌

  నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో ఘోర పరాజయంపై కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ స్పందించారు. కాంగ్రెస్‌ విజయం కొసం అందరం చాలా కష్టపడ్డామని, షీలా దీక్షిత్‌ కూడా చాలా ప్రయత్నించారని అయినా ఓటమి తప్పలేదన్నారు. ఓటమిని సమీక్షించుకుంటామని, కాంగ్రెస్‌కు తనను తాను సంస్కరించుకునే శక్తి ఉందని, ప్రజల మద్దతు తిరిగి పొందుతామన్నారు. ఆమ్‌ఆదర్మీ పార్టీ విజయంపై మాట్లాడిన ఆయన ఆ పార్టీ నుంచి పాఠాలు నేర్చుకోవటానికి సిద్దమని ప్రకటించారు. ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందిన వారికి రాహుల్ గాంధీ అభినందనలు తెలియజేశారు.

కాంగ్రెస్‌కు గుణపాఠం ; జెపి

  ఈ రోజు ప్రకటించిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌ పార్టీ వైఫల్యాలకు నిదర్శనం అన్నారు లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్‌నారాయణ. రెండు సార్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్‌ అన్నిరంగాల్లో విఫలమైందన్నారు. కాంగ్రెస్‌ వైఫల్యం వల్లే 4లక్షల 80 వేల కొట్ల విధ్యుత్‌ ప్రాజెక్ట్‌లు నిలిచిపోయాయన్నారు. దేశంలో పేదరికం తొలగిస్తామన్న కాంగ్రెస్‌ ప్రజలను మోసం చేసిందన్నారు. విద్య, వైధ్యరంగాలతొ పాటు దేశం అన్నిరంగాల్లో విఫలమవ్వటానికి కాంగ్రెస్‌ నిర్ణయాలే కారణం అన్నారు. దేశవ్యాప్తంగా వనరులు పుష్కలంగా ఉన్నా కాంగ్రెస్‌ వాటిని నాశనం చేసిందన్నారు జెపి.

ఇది చారిత్రాత్మక విజయం ; కేజ్రీవాల్‌

  ఢిల్లీలొ ఆమ్‌ఆర్మీ పార్టీ సాదించిన విజయంపై ఆ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ హర్షం వ్యక్తం చేశారు. ఇది అవినీతి, అరాచకాలకు వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన తీర్పు అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలలో ఆమ్‌ఆద్మీ పార్టీ కాంగ్రెస్‌ పార్టీని వెనక్కు నెట్టి రెండో స్థానం సాదించింది. కేజ్రీవాల్‌ కూడా షీలా దీక్షీత్‌పై ఘనవిజయం సాదించారు, ఈ ఫలితాలతో ఒక సామాన్యుడు కూడా అధికారం చెపట్టవచ్చని ప్రజలు నిర్ణయించారన్నారు కేజ్రీవాల్‌‌. ఈ ఎన్నికల పోరాటంలో తాము ఎన్నో అవాంతరాలు ఎదుర్కొన్నామన్న కేజ్రీవాల్‌‌. అంతిమ విజయం న్యాయానిదే అని ప్రకటించారు.

షీలా దీక్షిత్ పై కేజ్రీవాల్ ఘనవిజయం

      అమ్ అద్మీ పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్, కాంగ్రెస్ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌పై 8,000 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.ముఖ్యమంత్రి షీలా దీక్షిత్పైనే పోటీకి దిగిన అరవింద్ కేజ్రీవాల్ మొదట కాస్త వెనకబడినట్లు కనిపించినా, మళ్లీ ఆధిక్యంలోకి వచ్చారు. సామాన్య మానవుడే ఇక్కడ గెలిచాడని, కాంగ్రెస్ అరాచకాలకు సరైన సమాధానం చెప్పాడని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. జెండాలు ఊపుతూ, నినాదాలు చేస్తూ రాజధాని నగరంలో సంబరాలు చేసుకుంటున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసిన షీలా దీక్షిత్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ ప్రతీకారం తీర్చుకున్నట్లే ఫలితాలు వచ్చాయి. మొత్తం 70 స్థానాల్లో 23 స్థానాల్లో అమ్ అద్మీ పార్టీ (ఏఏపీ) ఆధిక్యంలో కొనసాగుతోంది.

సుబ్బన్న ఇక లేరు

  వెండితెర మీద హాస్యశకం ముగిసింది.. దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను నవ్విస్తూ వస్తున్న ఓ అసామాన్య నటుడు తుది శాస్వవిడిచాడు.. హాస్యనటుడిగా, రచయితగా, దర్శకుడిగా, టెలివిజన్‌ వ్యాఖ్యాతగా, ఇలా  బహుముఖ ప్రజ్ఞాశాలి అనిపించుకున్న ధర్మవరపు సుబ్రహ్మణ్యం శనివారం రాత్రి మృతి చెందారు. ఆయన గత ఏడాది కాలంగా ఊపిరి తిత్తుల క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. హైదరాబాదులో చైతన్యపురి వద్ద గల గీతా ఆసుపత్రిలో నిన్న రాత్రి పది గంటలకు ఆయన మృతి చెందారు. ఆయన స్వస్తలమయిన ప్రకాశం జిల్లాలో సింగరాయకొండలో రేపు అంత్యక్రియలు జరుగుతాయి.    ఆ మహానటునికి నివాళి అర్పిస్తూ ఆయన జీవిత ప్రస్థానాన్ని ఒకసారి గుర్తుచేసుకుందాం...ధర్మవరపు సుబ్రహ్మణ్యం అనగానే ఈ తరం ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చే పాత్ర అమాయకపు కాలేజ్‌ లెక్చరర్‌.. ఎన్నో సినిమాల్లో లెక్చరర్‌గా నటించిన ఆయన తన నటనా పటిమతో ఆ పాత్రకే అందం తీసుకువచ్చారు.. ప్రేక్షకుల మదిలో గుర్తుండిపోయేలా చేశారు..1960 ఆగస్టు 9న ప్రకాశం జిల్లా లొని కొమ్మినేని వారిపాలెంలో జన్మించారు ధర్మవరపు.. చిన్ననాటి నుంచే నటన మీద ఉన్న మక్కువతో నాటకాలు వేసేవారు.. ముఖ్యంగా వామపక్షభావజాలానికి ఆకర్షిడైన ఆయన ప్రజానాట్యమండలితో కలిసి ఎన్నో సందేశాత్మక రచనలు చేశారు.. చదువుకునే వయసులోనే ఎక్కువగా నాటకాల వైపు మల్లడంతో విద్యాబ్యాసం కూడా దెబ్బతింది.. ఒక దిశలో ఇంటర్‌ కూడా ఫెయిల్‌ అయిన ధర్మవరం తల్లి కోరిక మేరకు పట్టుదలగా చదివి ఇంటర్‌ పూర్తి చేశాడు.. తరువాత బీకాం డిగ్రీ పూర్తి చేసిన ఆయన పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌లో ఉద్యోగిగా చేరారు..అయితే నాటకాల మీద ఆయనకు ఉన్న మక్కువ ఆయన్ను ఎక్కువ రోజులు ఉద్యోగిగా కొనసాగనివ్వలేదు.. దీంతో కొంత మంది దగ్గర మిత్రులతో కలిసిన నాటకాలు వేయటం ప్రారంభించారు. అలా నాటక రంగంలో బిజీ కావటంతో ఆయన ఉద్యోగానికి కూడా రాజీనామ చేయాల్సి వచ్చింది.నాటకరంగంలో బిజీగా ఉన్న ఆయన ఆకాశవాణి కొసం నాటకాలు రాయడం ప్రారంభించారు.. అప్పటి వరకు నటిడిగా ఆయనకు ఉన్న అనుభవానికి తన మార్క్‌ హాస్యం జోడించి అద్భుతమైన నాటికలు తయారు చేశారు.. తెలుగు టెలివిజన్‌ రంగానికి ధారావాహికలను పరిచయం చేసిన ఘనత కూడా ధర్మవరానిదే.. అప్పటి వరకు టెలీఫిలిం లు మాత్రమే తెలిసిన తెలుగు వారికి ఒకే సీరియల్‌ను భాగాలు టెలికాస్ట్‌ చేయోచ్చు అంటూ అనగనగా ఒక శోభ సీరియల్‌ ద్వారా పరిచయం చేశారు.. తరువాత  బుల్లితెర మీద ఆయన ఎన్నో విభిన్న పాత్రలతో అలరించారు, సీరియల్‌ దర్శకుడిగా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. ముఖ్యంగా మనసు గుర్రం లేదు కళ్లెం, పరమానందయ్య శిష్యుల కథ లాంటి సీరియల్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు..ముఖ్యంగా దూరదర్శన్‌లో ఆయన చేసిన ఆనందో బ్రహ్మ ఆయనకు నటునిగా దర్శకునిగా మంచి గుర్తింపు నిచ్చింది.. ఈ సీరియల్‌ ఘనవిజయం సాదించటంతో ఆయన టెలివిజన్‌ ప్రేక్షకులకే కాదు.. సినీరంగంలోనూ సుపరిచితులయ్యారు.. టెలివిజన్‌ రంగంలో మంచి పేరు తెచ్చుకోవటంతో సినీరంగం నుంచి కూడా ధర్మవరానికి అవకాశాలు వచ్చాయి.. ఎంతో మంది హస్యనటులకు నటులు జన్మనిచ్చాన జంధ్యాల ధర్మవరాన్ని జయమ్ము నిశ్చయమ్మురా సినిమాతో వెండితెరకు పరిచయం చేశారు.. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ధర్మవరం తరువాత వరుస అవకాశాలతో మంచి హాస్యనటునిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.. టెలివిజన్‌ రంగంలో దర్శకునిగా తనకు ఉన్న అనుభవంతో తోకలేని పిట్ట అనే సినిమాకు దర్శకత్వం కూడా వహించారు ధర్మవరం.. అయితే ఆ సినిమా ఆశించిన విజయం సాదించకపోవటం తరువాత దర్శకత్వానికి దూరంగా ఉంటూ కేవలం నటునిగానే తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు.. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన నువ్వునేను, జయం, ధైర్యం లాంటి సినిమాలతో ఈ తరం ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నారు ధర్మవరం.. ముఖ్యంగా కాలేజీ లెక్చరర్‌తో పాటు తాగుబోతు పాత్రలలో ఆయన నటన కడుపుబ్బ నవ్విస్తుంది.. ఆయన చేసిన పాత్రలలో ఒక్కడు సినిమాలోని పాస్‌ పోర్ట్ ఆఫీసర్‌ క్యారెక్టర్‌తో పాటు, వర్షం సినిమాలోని వాతావరణ శాఖాదికారి పాత్రలు మంచి గుర్తింపు తీసుకువచ్చాయి.. ముఖ్యంగా ఢిఫరెంట్‌ డిక్షన్‌తో ఆయన చెప్పే డైలాగ్‌లకు థియేటర్స్‌లో విజిల్స్‌ పడేవి..మరింత కాలం తన నటనతో మనల్ని అలరిస్తాడనుకున్న ధర్మవరం ఇలా అర్థాంతరంగా మన అందరిన మోసం చేసి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవటంతో సినీ రంగంతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా దిగ్‌భ్రాంతి గురయ్యారు.. ఆయన మరణంతో తెలుగు తెర మీద ఓ హస్యశకం ముగిసింది.. కొన్ని పాత్రల ప్రయాణం ఆగిపోయింది.. ఎన్నో పాత్రలతో తెలుగు ప్రేక్షక లోకాన్ని అలరించిన ధర్మవరపు సుబ్రహ్మణ్యానికి మరొక్కసారి నివాళి అర్పిద్దాం..

కేసీఆర్ పై వర్మ సంచలన వ్యాఖ్యలు

      వివాదాలు అంటే ముందుండె సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రాష్ట్ర విభజన పై, కెసిఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన తర్వాత రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్‌లో కేసీఆర్ని టార్గెట్ చేస్తూ కామెంట్లు పోస్ట్ చేశారు. అమెరికాలో కేసీఆర్ లాంటి వ్యక్తి లేకపోవడం వల్లే అక్కడ విభజన రాజకీయాలు లేవని కామెంట్ చేశారు. కేసీఆర్ అమెరికాకు తన మకాం మార్చి అమెరికా పౌరులకు విభజన పాఠాలు చెప్పాలని సూచించారు.   కేసీఆర్ లాంటి నాయకులు అమెరికాని విభజించాలని వాదించి గెలవగలరని పేర్కొన్నారు. అమెరికా లాంటి పెద్ద దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఎప్పుడూ ప్రత్యేక రాష్ట్రం కావాలన్న ఉద్యమాలు జరగలేదని, ఎందుకంటే అక్కడ కేసీఆర్ లాంటి ‘సమర్థుడైన’ నాయకులు లేకపోవడమే కారణమని వర్మ ట్విట్ చేశారు. కేసీఆర్ అమెరికా పౌరుడిగా పుట్టి వుంటే ఆయన ఏం సాధించేవారో చూడాలని వుందని రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్‌లో కామెంట్ పోస్ట్ చేశారు. 

ఎపిఎన్జీవోలో విభేదాలు

      ఏపీఎన్జీవోలలో విభేదాలు మొదలయ్యాయి. తన స్వార్ధ రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కొరకు అశోక్ బాబు ఉద్యోగులను బలి చేస్తున్నారని, ఇంతవరకు ఆయన ఏపీఎన్జీవోల సంఘానికి వచ్చిన విరాళాల గురించి చెప్పడం లేదని, హైదరాబాద్ లో సమైక్యాంధ్ర సభ పెట్టినప్పుడు అమ్మిన కూపన్ల గురించి చెప్పడం లేదని ఏపీఎన్జీఓ నేత సుబ్బరాయన్ విమర్శించారు. అశోక్ బాబు రాజకీయ పార్టీ పెట్టడానికి రిజిస్టర్ చేశారని, ఆయనకు పార్టీ పెట్ట దలచుకుంటే, రాజకీయాల్లోకి వెళ్ల దలచుకుంటే వెంటనే ఏపీఎన్జీఓల సంఘం నుండి వైదొలగాలని ఆయన డిమాండ్ చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఆయన సొంత విషయంగా ఆశోక్ బాబు చూస్తున్నారని ఆయన విమర్శించారు.

కావూరి నంగనాచి కబుర్లు

      కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు...పదివి రాకముందు అత్యుత్సాహంగా సమైక్యవాదిగా ప్రకటనలు గుప్పించి, పదివి దక్కిన మారుక్షణమే మౌనముద్రలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు అంతా అయిపోయాక నేను ఇంకా వీర సమైక్యవాదినే అంటూ నంగనాచి కబుర్లు చెబుతున్నారు. భద్రాచలం డివిజన్ ను ఆంద్రకు కలపాలని డిమాండ్ చేశామని, హైదరాబాద్ ను పదేళ్లపాటు కేంద్రపాలితం చేయాలని కోరినా ఒప్పుకోలేదని అంటున్నారు.   కర్నూలు,అనంతపురం జిల్లాలకు హైదరాబాద్ అందుబాటులో ఉంటుందని, వారికి ఉపయోగం ఉంటుందని రాయల తెలంగాణ ఇవ్వాలని కోరామని, దానిని ఒప్పుకోలేదని కావూరి చెప్పారు. ఈ నేపధ్యంలో తాను మంత్రివర్గం సమావేశం నుంచి బయటకు వచ్చానని ఆయన అన్నారు. అయితే విభజనకు ఒప్పుకుంటున్నాము కనుక ఇరు ప్రాంతాలకు న్యాయం జరిగే విధంగా చేయాలని డిమాండ్ చేస్తున్నామని కావూరి తెలిపారు. అంతా అయిపోయి సీమాంధ్రుల చేతుల్లో కేంద్రం, కాంగ్రెస్‌ పార్టీ చిప్ప పెట్టేసిన తరువాత కూడా ఇప్పుడు ఇంకా ఆ డిమాండ్ కు అర్థం వుందా!?  

ఆశలు ఆవిరైపోయయా?

      కేంద్ర మంత్రివర్గం పదిజిల్లాల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. ముసాయిదా బిల్లు రాష్ట్రపతి వద్దకు వెళ్ళిపోయింది. ఇక ఇపడు జరగాల్సిందల్లా తెలంగాణ ముసాయిదా బిల్లు రాష్ట్రపతి పరిశీలన తర్వాత రాష్ట్ర శాసనసభకు రావటం, సభ్యుల మనో అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టటం మాత్రమే మిగిలింది.   రాష్ట్ర శాసనసభ సమావేశాలను ఈ నెల 12 నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రపతి బెంగాల్ పర్యటన తరువాత టీ బిల్లు ముసాయిదా రాష్ట్రానికి చేరుతుందంటున్నారు. అంటే 12 తేది లోపే బిల్లు వచ్చేస్తుందన్న మాట. అయితే పార్లమెంటు సమావేశాలు ముగిసే దాకా బిల్లుపై చర్చను సాగదీయాలని సమైక్యాంధ్ర నాయకత్వం ప్రయత్నాలు చేసినా ప్రయోజనం ఏమీ ఉండబోదని సీనియర్ నేతల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. బిల్లుపై చర్చ మాత్రమే జరుగుతుందని, అభిప్రాయ సేకరణ తప్ప ఓటింగ్ అనేది ఉండబోదని తేలిపోయిన స్థితిలో ఎవరెన్ని మాట్లాడినా కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వచ్చే ఢోకా ఏమీ ఉండదు. కేబినెట్ ఆమోదించినంత మాత్రాన రాష్ట్రం ఏర్పాటు అవబోదని కొందరు, శాసనసభలో మెజారిటీ సభ్యులు సమైక్యాంధ్రకు మద్దతు ఇస్తే దాని ప్రభావం బిల్లుపై పడుతుందంటూ ఇంకొందరు, న్యాయ పోరాటంలోనే తేల్చుకుంటామని, ఎలాగైనా విభజన ఆపుతామంటూ మరి కొందరు చేస్తున్న ప్రకటనలు, సవాళ్ళన్నీ అర్థం లేనివిగా రాజకీయ నిపుణులు కొట్టి పారేస్తున్నారు. పార్లమెంటు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని తిరగదోడిన సందర్భాలంటూ ఏవీ లేవని, ఒకవేళ న్యాయపోరాటం చేయాలనుకుంటే రాజ్యాంగంలోని మూడవ అధికరణంపై చేయటమే తప్ప విభజన నిర్ణయంపై చేసే అవకాశమే లేదని రాజకీయ విశ్లేషకులు తేల్చేస్తున్నారు. సభలో ఎవరి అభిప్రాయాలు వారు చెప్పటం సహజమే అయినా అవన్నీ సభ రికార్డుల వరేక పరిమితం అవుతాయి తప్ప వచ్చే నష్టమేమీ లేదని వారంటున్నారు.

కాంగ్రెస్ ఫ్లెక్సీల్లో సోనియాగాంధీ లేదు

      ప్రతిష్టాత్మకమైన పులిచింతల ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. 2004లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పులిచింతల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. జలయజ్ఞంలో చేపట్టిన తొలి ప్రాజెక్టు పులిచింతల. రూ.1,831 కోట్లు తో పులిచింత ప్రాజెక్టు నిర్మాణం తలపెట్టారు. పులిచింత ప్రాజెక్టు సామర్థ్యం 46 టీఎంసీలు.   ప్రాజెక్టు ప్రారంభోత్సవ౦ కోసం కాంగ్రెస్ శ్రేణులు భారీ సభను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో నగరం చుట్టుప్రక్కల ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో పార్టీ అధినేత్రి సోనియాగాంధీ బొమ్మ లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.  ప్రభుత్వం ఇచ్చిన ప్రచార ప్రకటనలలో కూడా ఎక్కడా వీరి ఫోటోలు కనిపించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం పక్షాన ఎక్కడ ఏ కార్యక్రమం నిర్వహించినా, సోనియాగాంధీ, రాహుల్ గాందీ, మన్మోహన్ సింగ్ ల ఫోటోలు తప్పనిసరిగా ఏర్పాటు చేస్తారు. ముఖ్యమంత్రి కిరణ్ స్వయంగా పాల్గొంటున్న ఈ కార్యక్రమంలో వారి ఫోటోలు లేకపోవడం కన్నా వేరే సంకేతం ఏమి ఉంటుంది?

ముఖ్యమంత్రి సుప్రీంకోర్టులో పిటిషను వేస్తే

  ఈరోజు పులిచింతల ప్రాజెక్టుని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జాతికి అంకితం చేయనున్నారు. నేడు మధ్యాహ్నం జరుగబోయే ఈ సభలో ఎక్కడా సోనియా, రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్ ల ఫోటోలు పెట్టలేదు. ఈ సందర్భంగా పైలాన్ ఆవిష్కరించిన తరువాత ఆయన చేయబోయే ప్రసంగంలో రాష్ట్ర విభజన అంశం గురించి ప్రస్తావించి, కేంద్రంపై తీవ్ర విమర్శలు గుప్పించడం కూడా ఖాయం. ఇక రాష్ట్ర విభజన అంశం తుది దశకు చేరుకొంటున్న ఈ తరుణంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన తదుపరి వ్యూహాలు, రాజకీయ భవిష్యత్ గురించి కూడా ఈ సభలో చుచాయాగా తెలుపవచ్చును.   నిన్నజరిగిన సీమాంధ్ర మంత్రులు, శాసనసభ్యుల సమావేశంలో ఆయన రెండు ఆసక్తికరమయిన సూచనలు చేసారు. ఒకటి శాసనసభలో తెలంగాణా బిల్లుకి వ్యతిరేఖించేందుకు ప్రతిపక్ష పార్టీల మద్దతు కోరడం, తను స్వయంగా సుప్రీంకోర్టులో రాష్ట్ర విభజన వ్యతిరేఖిస్తూ పిటిషను వేయడం. అయితే మొదటి ప్రతిపాదనకు ఎన్ని పార్టీలు మద్దతు ఇస్తాయో తెలియనపటికీ, అదే సాధ్యమయితే శాసనసభ అభిప్రాయానికి వ్యతిరేఖంగా కేంద్రం రాష్ట్ర విభజనకు పూనుకొంటున్నట్లవుతుంది. గనుక అది రాజ్యాంగ విరుద్దమని ఆయనే స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో సుప్రీంకోర్టులో పిటిషను వేస్తే అది మరొక సంచలనం అవుతుంది. కాంగ్రెస్ నేతలే కాంగ్రెస్ పరువు తీసుకోవడానికి ప్రతిపక్షాల సహకారం కోరుతుంటే వారు కూడా కాదనలేకపోవచ్చును.    ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, అందునా తన స్వంత పార్టీ, ప్రభుత్వం నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషను వేస్తే దాని ప్రభావం కాంగ్రెస్ పార్టీపై తప్పక పడుతుంది. ఇంతకాలంగా కాంగ్రెస్ పార్టీ రాజ్యంగ విరుద్దంగా వ్యతిరేఖంగా వ్యవహరిస్తోందని ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలను దీనితో దృవీకరించినట్లవుతుంది గనుక కాంగ్రెస్ అధిష్టానానికి దేశంలో తలెత్తుకోలేని పరిస్థితులు ఏర్పడుతాయి. ఒకవేళ రాష్ట్రపతి లేదా సుప్రీంకోర్టు బిల్లుకి వ్యతిరేఖంగా స్పందిస్తే, ఈవిషయం దేశవ్యాప్తంగా టాంటాం అయిపోయి కాంగ్రెస్ పార్టీ పరువు గంగలో కలిసిపోతుంది. మరోనాలుగయిదు నెలలో ఎన్నికలు వస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఇది తీవ్ర నష్టం కలిగించదమే కాక, ప్రతిపక్ష పార్టీలకు, ముఖ్యంగా బీజేపీకి మంచి ఆయుధంగా మారుతుంది కూడా.     అందువల్ల కిరణ్ కుమార్ రెడ్డి పూర్తిగా తన పరువు తీయక ముందే కాంగ్రెస్ ఆయనని ముఖ్యమంత్రి పదవి నుండి తప్పించడమో లేక ఆయనను ఎదుర్కొనేందుకు తగిన వ్యూహం సిద్దం చేసుకోక తప్పదు.

రాజీనామాను ఆమోదించండి: చిరు

      తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడాన్ని నిరసిస్తూ కేంద్ర పర్యాటక శాఖా మంత్రి చిరంజీవి తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామాను ఆమోదించాలని  ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్ర ప్రజల హక్కులు నెరవేరాలంటే హైదరాబాదును యూటీ చేయాలని, భద్రాచలాన్ని సీమాంధ్రలో కలపాలని ఆయన డిమాండ్ చేస్తూ వచ్చారు.   విభజన అంశం మీద కేంద్రం తీరును తప్పుపడుతూ ఆయన లేఖ కూడా రాశారు. గత అక్టోబరులో ప్రధానికి లేఖ రాసిన సమయంలోనే తన రాజీనామాను ప్రస్తావించానని, రాజీనామాను తక్షణం ఆమోదించాలని యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. మరి చిరు రాజీనామాను ఆమోదిస్తారా ? లేక ఆయన రాజీ పడతారా ? వేచిచూడాలి.