బాబు మొహం చూసి ప్రజలు ఓటేయలేదు: లక్ష్మీ పార్వతి

  రాజకీయాలలో శాశ్విత మిత్రులు కానీ, శత్రువులు గానీ ఉండరని అందరూ అంటారు. కానీ కొందరు వ్యక్తులను చూస్తే ఆమాట నిజం కాదేమోననిపిస్తుంది. అటువంటి ‘ప్రియ శత్రువులు’ మన రాష్ట్ర రాజకీయనాయకులలో చాలా మందే ఉన్నారు. ఉదాహరణకు చంద్రబాబును లక్ష్మీపార్వతి ఎల్లపుడూ ద్వేషిస్తూనే ఉంటుంది. ఆమె ఏ సందర్భంలో ఏ విషయం గురించి మాట్లాడినా, చివరికి చంద్రబాబును విమర్శించడంతోనే ముగించడం ఆమెకు అలవాటు. కానీ, ఆమె విమర్శలను చంద్రబాబు ఎన్నడూ పట్టించుకొన్న దాఖలాలు లేవు. అయినప్పటికీ ఆమె తన అలవాటు ప్రకారం ఆయనపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు.   ఈరోజు స్వర్గీయ యన్టీఆర్ 91వ జయంతి సందర్భంగా హైదరాబాద్ లో యన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించడానికి వచ్చిన లక్ష్మీ పార్వతి, అనంతరం మీడియాతో మాట్లాడుతూ, మొన్న జరిగిన ఎన్నికలలో ప్రజలు చంద్రబాబు మొహం చూసి ఓట్లేయలేదని, వారు కేవలం స్వర్గీయ యన్టీఆర్ ని చూసి వేసారని అన్నారు. కనీసం ఇప్పుడయినా చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి స్వర్గీయ యన్టీఆర్ కు భారతరత్న అవార్డు ఇచ్చేలా చేయాలని కోరారు. రాష్ట్రాభివృద్ధికి తనవంతు కృషి తాను చేస్తానని ఆమె అన్నారు.

స్వర్గీయ యన్టీఆర్ కి కుటుంబ సభ్యుల ఘన నివాళి

  ఈరోజు స్వర్గీయ యన్టీఆర్ 91వ జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు అందరూ ఆయనకు నివాళి అర్పించేందుకు హైదరాబాద్ లో యన్టీఆర్ ఘాట్ కు తరలివస్తున్నారు. హరికృష్ణ, ఆయన కుమారులు కళ్యాణ్ రామ్, జూ.యన్టీఆర్ లతో కలిసి వచ్చి స్వర్గీయ యన్టీఆర్ కు నివాళులు అర్పించారు.   ఈ సందర్భంగా హరికృష్ణ మీడియాతో మాట్లాడుతూ స్వర్గీయ యన్టీఆర్ తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం వారి సంక్షేమం కోసం పోరాడారని, అందువల్ల తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా విడిపోతున్నప్పటికీ, రెండు రాష్ట్రాలలో తెలుగు ప్రజలు సుఖ సంతోషాలతో కలిసి మెలిసి జీవించాలని, అభివృద్ధి సాధించాలని, అదే వారు స్వర్గీయ యన్టీఆర్ కి ఇచ్చే ఘన నివాళి అవుతుందని అన్నారు.   హరికృష్ణ కుమారుడు జూ.యన్టీఆర్ మాట్లాడుతూ, ఆ మహానుభావుడు స్వర్గీయ యన్టీఆర్ మళ్ళీ మరొకసారి తెలుగునేలపై పుట్టి, తెలుగునేలను పావనం చేయాలని కోరుకొంటున్నాని అన్నారు.   స్వర్గీయ యన్టీఆర్ భార్య లక్ష్మీ పార్వతి, ఆయన కుమార్తె పురందేశ్వరి, ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వర రావు, హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణా రెడ్డి తదితరులు యన్టీఆర్ ఘాట్ వద్దకు వచ్చి నివాళులు అర్పించారు. మరికొద్ది సేపటిలో తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు, బాలకృష్ణ తదితరులు వచ్చి స్వర్గీయ యన్టీఆర్ కు నివాళులు అర్పించిన తరువాత అక్కడి నుండి నేరుగా గండిపేటలో జరుగుతున్న మహానాడు సమావేశానికి వెళతారు.

చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు అయ్యింది. వచ్చేనెల అంటే జూన్ 8న ఉదయం 11.40 గం.లకు గుంటూరు వద్ద గల ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఉన్న మైదానంలో ప్రజల మధ్య ప్రమాణ స్వీకారం చేస్తారు. అంతకంటే ముందు తెదేపా శాసనసభ్యులు తిరుపతిలో సమావేశమయ్యి చంద్రబాబును తన శాసనసభా పక్షం నేతగా ఎన్నుకొంటారు. చంద్రబాబు జూన్ 8న ప్రమాణస్వీకారం చేసే వరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం రాష్ట్రపతి పాలనలోనే ఉంటుంది. కానీ జూన్ 2న తెలంగాణాకు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేస్తున్నందున, అదేరోజున అక్కడ రాష్ట్రపతి పాలన తొలగించబడుతుంది.

కేజ్రీవాల్ బెయిల్ తీసుకోవాల్సి౦దే..!

      బీజేపీ నేత నితిన్ గడ్కారీ పై అవినీతి ఆరోపణలు చేసినందుకు జైలుపాలయిన మాజీ డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి టైమ్ కలిసి రావడం లేదు. బెయిల్ బాండ్ ఇచ్చేందుకు నిరాకరించి జైల్లో వుండి ప్రజల్లో సింపతి కొట్టేద్దామని అనుకున్న కేజ్రీవాల్ కి ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. కేజ్రీవాల్ తన కస్టడీ విషయమై ఢిల్లీ హైకోర్టుకు అప్పీల్ చేసుకున్నారు. కేజ్రీవాల్ దరఖాస్తును పరిశీలించిన ధర్మాసనం...'బెయిల్‌ తీసుకోడానికి ఎందుకు నిరాకరిస్తున్నారు.. జైల్లోనే వుండాలని ఎందుకు అనుకుంటున్నారు..’ అని కోర్టు ప్రశ్నించేసరికి, విధిలేని పరిస్థితుల్లో కేజ్రీవాల్‌, బెయిల్‌ తీసుకోవడానికి ఒప్పుకున్నారు. ప్రజలు ఆయనను డిల్లీకి ముఖ్యమంత్రిని చేసి పాలించమని కోరితే, దానిని తృణీకరించిన ఆయన తీహార్ జైలులో ఉండేందుకే ఇష్టపడుతున్నట్లున్నారు. పాపం కోర్టు కూడా ఆయన ముచ్చట కాదనేసింది.

మహానాడులో హరి, బాలయ్యలే ప్రత్యేక ఆకర్షణ

    హైదరాబాద్ గండిపేటలో జరుగుతున్న తెలుగు దేశం పార్టీ 33వ మహానాడులో న౦దమూరి బ్రదర్స్ హరికృష్ణ, బాలకృష్ణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అందరికంటే ముందుగానే వేదిక దగ్గరకు వచ్చిన నందమూరి హరికృష్ణ నేతలందరిని పలకరిస్తూ సభ వేదికపైన సందడి చేస్తూ కనిపించారు. ఆ తరువాత చంద్రబాబుతో కలిసి బాలకృష్ణ వేదికపైకి వచ్చారు. వేదికపై ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. చంద్రబాబుతో విభేదాలున్నాయని భావిస్తున్న తరుణంలో హరికృష్ణ మహానాడుకి రావడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఎన్నికలకు ముందు హరికృష్ణ, బాబు మధ్య విబేధాలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే టిడిపి అధికారంలోకి వచ్చాక హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌లు బాబును కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పుడు హరి మహానాడుకు హాజరయ్యారు. దీంతో నందమూరి కుటుంబంలో విభేదాలు తొలగిపోయాయని నందమూరి అభిమానులు, టిడిపి కార్యకర్తలు భావిస్తున్నారు.

మళ్ళీ పోలవరం ముంపు రగడ..!

      పోలవరం ముంపు ప్రాంతాల వివాదం మళ్ళీ మొదలైంది. పోలవరం ప్రాజెక్ట్ కు తాము వ్యతిరేకం కాదని, ఆర్టికిల్ మూడు కింద సరిహద్దులు మార్చాలి తప్ప, ఆర్డినెన్సు ల ద్వారా చేయజాలరని టీఆర్ఎస్ అధినేత కేసిఆర్ అన్నారు. ఇప్పటికే తాను ఢిల్లీలో కొందరు అధికారులతో మాట్లాడాననీ, వారి నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఆర్డినెన్స్‌ తయారవుతోందనీ, అలా అర్డినెన్స్‌ తీసుకురావడం దుర్మార్గమనీ ఆయన అన్నారు. ఇరు రాష్ట్రాల శాసనసభల అంగీకారం లేకుండానే సరిహద్దులు మార్చరాదని కేసీఆర్‌ అంటున్నారు. పోలవరం డ్యాం నిర్మించే ప్రాంతంలో భూకంపం ముప్పు ఉందని నిపుణులు చెప్పారని, సీమాంధ్ర నీటి పారుదల నిపుణులే ప్రస్తుత డిజైన్ ను వ్యతిరేకిస్తున్నారని ఆయన తెలిపారు.

అభివృద్ధి కోసం కష్టపడాలి: బాబు పిలుపు

    కష్టకాలంలో కష్టపడి పనిచేయాలి, ప్రతికూల పరిస్థితులను ప్రజా శ్రేయస్సుకు అనుగుణంగా మార్చుకోవాలి అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పిలుపు ఇచ్చారు. ప్రస్తుతం సీమాంధ్రలో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయని, అలాగే తెలంగాణాలో సామాజిక న్యాయాన్ని సాధించవలసిన అవసరం ఉన్నదని ఆయన గుర్తు చేశారు. ఈ 32 ఏళ్లలో అనేక దేశంలో ఎన్నో మార్పులు వచ్చాయి, మనం జాతీయ పార్టీగా మారుతున్నాం అంటూ ప్రతి ఒక్కరం మరింత దృఢ సంకల్పంతో ముందుకు సాగాలని ఆయన పిలుపు ఇచ్చారు. ప్రజలు మన మీద ఆశలు పెట్టుకున్నారు, రాష్ట్ర సమస్యల పరిష్కారంకోసం మనం రాష్ట్రాన్ని అభివృద్ధిపధంలోకి తీసుకువెళ్లాలని ఆయన అన్నారు. సంక్షోభాలను మనం ఒక అద్భుత అవకాశంగా తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అభివృద్ధికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చుదిద్దుదాం, యువతకు మంచి భవితను ఇద్దాం, ఇదే ఇప్పుడు మన అందరి తక్షణ కర్తవ్యం అని చంద్రబాబు దిశానిర్దేశనం చేశారు.

మోడీ కేబినెట్‌: మంత్రులు..శాఖలు

      రాజ్‌నాథ్‌సింగ్‌ - హోంశాఖ సుష్మా స్వరాజ్‌ - విదేశీ వ్యవహారాల శాఖ అరుణ్‌ జైట్లీ - ఆర్థిక, కార్పొరేట్‌ వ్యవహారాలు, రక్షణ శాఖ వెంకయ్యనాయుడు - అర్బన్‌ డెవలప్‌మెంట్‌, హౌసింగ్‌, పేదరిక నిర్మూలన శాఖ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ నితిన్‌ గడ్కరీ - రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌, జాతీయ రహదారులు, షిప్పింగ్‌ సదానంద గౌడ - రైల్వే శాఖ ఉమా భారతి - నదీ జలాల శాఖ, గంగా పరిరక్షణ నజ్మా హెప్తుల్లా - మైనార్టీ ఎఫైర్స్‌ గోపీనాథ్‌ రావ్‌ ముండే - రూరల్‌ డెవలప్‌మెంట్‌, పంచాయితీ రాజ్‌, తాగునీటి శాఖ రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ - ఆహార, ప్రజా పంపిణీ మనేకా గాంధీ - మహిళా శిశు సంక్షేమ శాఖ అనంతకుమార్‌ - కెమికల్స్‌, ఫెర్టిలైజర్స్‌ రవిశంకర్‌ ప్రసాద్‌ - కమ్యూనికేషన్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, న్యాయ శాఖ అశోక్‌ గజతిరాజు - పౌర విమాన యాన శాఖ అనంత్‌ గీతే - భారీ పరిశ్రమల శాఖ హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ - ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఇండస్ట్రీస్‌ శాఖ నరేంద్ర సింగ్‌ తోమార్‌ - గనులు, ఉక్కు, లేబర్‌ అండ్‌ ఎంప్లాయిమెంట్‌ జువల్‌ ఓరమ్‌ - ట్రైబల్‌ ఎఫైర్స్‌ రాధామోహన్‌ సింగ్‌ - అగ్రికల్చర్‌ థావర్‌ చంద్‌ గెమ్లాట్‌ - సోషల్‌ జస్టీస్‌ అండ్‌ ఎంపవర్‌మెంట్‌ స్మృతి ఇరానీ - హ్యూమన్‌ రీసోర్సెస్‌ డెవలప్‌మెంట్‌ హర్షవర్ధన్‌ - ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ స్వతంత్ర హోదా సహాయ మంత్రులు జనరల్‌ వీకే సింగ్‌ - డెవలప్‌మెంట్‌ నార్త్‌ ఈస్ట్‌ రీజియన్‌ (స్వతంత్ర), విదేశీ వ్యవహారాలు ఇంద్రజిత్‌ సింగ్‌ రావు - ప్లానింగ్‌ (స్వతంత్ర), స్టాటిస్టిక్స్‌ అండ్‌ ప్రోగ్రామ్‌ ఇంప్లిమెంటేషన్‌ (స్వతంత్ర), రక్షణ శాఖ సంతోష్‌కుమార్‌ గంగ్వార్‌ - టెక్స్‌టైల్స్‌ (స్వతంత్ర), పార్లమెంటరీ వ్యవహారాలు, జల వనరుల శాఖ, గంగా పరిరక్షణ శిర్పాద్‌ ఎస్సో నాయక్‌ - కల్చర్‌, టూరిజం (స్వతంత్ర) ధర్మేంద్ర ప్రధాన్‌ - పెట్రోలియం, సహజ వాయువు (స్వతంత్ర) సర్బనంద సోనోవాల్‌ - స్కిల్‌ డెవలప్‌మెంట్‌, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌, యూత్‌ ఎఫైర్స్‌ మరియు క్రీడలు (స్వతంత్ర) ప్రకాష్‌ జవదేకర్‌ - సమాచార, ప్రసార శాఖ (స్వతంత్ర), పర్యావరణ, అటవీ శాఖ (స్వతంత్ర), పార్లమెంటరీ వ్యవహారాలు పియూష్‌ గోయెల్‌ - పవర్‌, కోల్‌ (స్వతంత్ర) జితేంద్ర సింగ్‌ - సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఎర్త్‌ సైన్సెస్‌ (స్వతంత్ర), పీఎంవో, పర్సనల్‌, పబ్లిక్‌ గ్రీవెన్సెస్‌ మరియు పెన్షన్స్‌, అణుశక్తి శాఖ, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్పేస్‌ నిర్మలా సీతారామన్‌ - కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (స్వతంత్ర), ఫైనాన్స్‌, కార్పొరేట్‌ ఎఫైర్స్‌ సహాయ మంత్రులు... జీఎం సిద్దేశ్వర - పౌర విమానయానం మనోజ్‌ సిన్హా - రైల్వే నిశ్చలానంద్‌ - రసాయనాలు, ఎరువులు ఉపేంద్ర కుషావహా - రూరల్‌ డెవలప్‌మెంట్‌, పంచాయితీరాజ్‌, తాగునీరు రాధాక్రిష్ణన్‌ - భారీ పరిశ్రమల శాఖ, పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ కీరన్‌ రిజ్జు - హోం శాఖ క్రిష్ణపాల్‌ - రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌, హైవేస్‌, షిప్పింగ్‌ సంజీవ్‌ కుమార్‌ బాల్యన్‌ - వ్యవసాయం, ఫుడ్‌ ప్రోసెసింగ్‌ ఇండస్ట్రీస్‌ మన్సుక్‌భాయ్‌ ధంజీభాయ్‌ వాసవ - ట్రైబల్‌ ఎఫైర్స్‌ రావ్‌ సాహెబ్‌ దాదారావ్‌ దాన్వే - కన్జ్యూమర్‌ ఎఫైర్స్‌, ఫుడ్‌ అండ్‌ పబ్లిక్‌ డిస్ట్రిబ్యూషన్‌ విష్ణు దేవ్‌ సాయి - గనులు, స్టీలు, లేబర్‌ అండ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ సుదర్శన్‌ భగత్‌ - సోషల్‌ జస్టీస్‌ అండ్‌ ఎంపవర్‌మెంట్‌

పి.వి.స్మారక చిహ్నం పెట్టిస్తా: మహానాడులో బాబు

      కాంగ్రెస్‌పై రాజీలేని పోరాటం చేసింది తెలుగుదేశం పార్టీయేనని చంద్రబాబు నాయుడు గుర్తుచేశారు. టీడీపీపై కుట్రపన్నినవారు భూస్థాపితమయ్యారని వెల్లడించారు. ఆనాడు ప్రధానిగా పివి నరసింహ రావు అయితే ఆయనకు గౌరవించడం కోసం ఎన్టీఆర్ పోటీ పెట్టలేదని,కాంగ్రెస్ మాత్రం పివిని అవమానించిందని అన్నారు. ఢిల్లీలో పీవీకి స్మారకచిహ్నం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ ఏ నాడు అధికారం కోసం పాకులాడలేదని, దేశం సుస్థిర పాలనకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. తాగు, సాగునీరు, మౌలిక వసతులకు ప్రాధాన్యత కల్పించామన్నారు. కాంగ్రెస్ అవినీతితోనే దేశ ప్రతిష్ట పోయిందని మండిపడ్డారు. దేశ సంపదను కొల్లగొట్టి విదేశాల్లో దాచుకున్నారని, అవినీతిపరులకు సహకరించి దేశాన్ని భ్రష్టుపట్టించారన్నారు. కాంగ్రెస్ పరిస్థితి ప్రాంతీయ పార్టీకన్నా హీనంగా ఉందని బాబు వ్యాఖ్యానించారు. సీమాంధ్రలో కాంగ్రెస్‌కు 2 శాతం ఓట్లురాలేదని ఎద్దేవా చేశారు.

నేడు మోడీ తొలి కేబినెట్ భేటి

      నరేంద్ర మోడీ భారత ప్రధాన మంత్రి మంగళవారం ఉదయం పదవీబాధ్యతలు చేపట్టారు. ఈ ఉదయం 9 గంటలకు ప్రధాన మంత్రి కార్యాలయంలో అడుగుపెట్టిన మోదీ మొదటగా మహాత్మాగాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. పీఎంవో అధికారులు అందజేసిన మొదటి ఫైల్‌పై నరేంద్ర మోదీ సంతకం చేయడంతో ఆయన లాంచనంగా ప్రధాన మంత్రి బాధ్యతలు చేపట్టారు. ఈరోజు సాయంత్రం 6:30 గంటలకు కేంద్ర కేబినెట్ తొలిసారిగా భేటీ కానుంది. మరోవైపు కేంద్ర మంత్రుల శాఖను రాష్ట్రపతి భవన్ ఈ ఉదయం అధికారికంగా ప్రకటించింది.   కేంద్ర మంత్రులకు కేటాయించిన శాఖల వివరాలు : * రాజ్‌నాథ్ సింగ్ - హోంశాఖ * సుష్మాస్వరాజ్ - విదేశీ వ్యవహరాలు * అరుణ్‌జైట్లీ - రక్షణ, ఆర్థిక కార్పొరేట్ వ్యవహరాలు * అనంతకుమార్ - రసాయనాలు, ఎరువుల శాఖ * రవిశంకర్‌ప్రసాద్ - న్యాయ, సమాచార ప్రసార శాఖ * మేనకాగాంధీ - స్త్రీ, శిశు సంక్షేమం * వెంయ్యనాయుడు - పట్టణాభివృద్ధి హౌసింగ్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ * స్మృతి ఇరానీ - మానవవనరులు * ఉమాభారతి - జలవనరులు, గంగా ప్రక్షాళన * నితిన్ గడ్కరీ - రవాణా శాఖ * ప్రకాశ్ జవదేకర్ - అటవీ పర్యావరణ(స్వతంత్ర) * నిర్మలా సీతారామన్ - వాణిజ్యశాఖ (స్వతంత్ర) * వీకే సింగ్ - విదేశాంగ సహాయమంత్రి * సదానందగౌడ - రైల్వేశాఖ * జ్యూయల్ ఓరమ్- గిరిజన సంక్షేమం * నజ్మా హెస్తుల్లా - మైనార్టీ వ్యవహారాలు * గోపీనాథ్ ముండే - గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ * హర్‌సిమ్రాత్‌కౌర్ బాదల్ - ఫుడ్ ప్రాసెసింగ్ * రాధా మోహన్‌సింగ్ - వ్యవసాయం * నరేంద్రసింగ్ తోమర్ - గనులు, స్టీల్, కార్మిక, ఉపాధి * హర్షవర్ధన్ - ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం * పీయూష్ గోయల్ - విద్యుత్, బొగ్గు(స్వతంత్ర) * నిహాల్‌చంద్ - ఎరువులు, రసాయనాలు సహాయమంత్రి * ఉపేంద్ర కుష్వాహా - గ్రామీణాభివృద్ధి * పి. రాధాకృష్ణన్ - భారీ పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థలు * సంజీవ్‌కుమార్ బాలియా - వ్యవసాయ, ఫుడ్ ప్రాసెసింగ్ * క్రిష్ణన్ పాల్ - రోడ్డు రవాణా, హైవే, షిప్పింగ్

మహానాడుకి హరికృష్ణ వచ్చారు..!

      గండిపేటలో తెలుగు దేశం పార్టీ 33వ మహానాడు కార్యక్రమానికి నందమూరి హరికృష్ణ హాజరయ్యారు. చంద్రబాబుతో విభేదాలున్నాయని భావిస్తున్న తరుణంలో హరికృష్ణ రావడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. చంద్రబాబు కుమారుడు లోకేష్ కూడా వచ్చారు. పదేళ్ల తర్వాత టీడీపీ అధికారంలోకి రావడంతో అట్టహాసంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి తెలుగు తమ్ముళ్లు, పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తెలుగుదేశం పార్టీని ఘన విజయం దిశగా నడిపించిన పార్టీ అద్యక్షుడు చంద్రబాబు నాయుడు ను మహానాడు అభినందించింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య తీర్మానం ప్రవేశపెట్టారు.

సమైక్య రాష్ట్రంలో టిడిపి చివరి మహానాడు

      నగరంలోని గండిపేటలో తెలుగు దేశం పార్టీ 33వ మహానాడు మంగళవారం ఉదయం ప్రారంభమైంది. సమైక్య రాష్ట్రంలో టిడిపి పార్టీ చివరి మహానాడు ఇది. ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అక్కడకు చేరుకుని టీడీపీ జెండాను ఆవిష్కరించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. అలాగే బాలయోగి, ఎర్నన్నాయుడు, లాలాజాన్ పాషా, పరిటాల రవి, మాధవరెడ్డిలకు బాబు నివాళులర్పించారు. అనంతరం ఫోటో ఎగ్జిబిషన్, రక్తదాన సిబిరాలను ప్రారంభించారు. టీడీపీ మహానాడుకు ఆ పార్టీ శ్రేణులు భారీగా తరలివస్తున్నారు.మహానాడులో కళాకారులు చేసిన సాంస్కతిక కార్యక్రమాలు సభికులను ఆకట్టుకున్నాయి.

ఆరోగ్యం కోరుకొంటున్న బాలకృష్ణ

  హిందూపురం నుండి ఎన్నికయిన బాలకృష్ణ తను కూడా మంత్రిపదవి చెప్పట్టాలని చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ విషయమై ఇప్పటికే ఆయన చంద్రబాబుతో చర్చించినట్లు తెలుస్తోంది. బహుశః ఆయన కూడా చంద్రబాబుతో బాటే జూన్ 8న మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఆయన తనకు ఆరోగ్యశాఖను కోరుకొంటున్నట్లు తెలుస్తోంది. ఎందువలన అంటే ఆయన చాలా కాలంగా హైదరాబాదులో బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారు. అప్పటి నుండే ఆయనకు నిరుపేద ప్రజలకు కూడా మెరుగయిన వైద్య సేవలు అందించాలనే తపన ఉండేది. ఇప్పుడు ఆరోగ్యశాఖ మంత్రిగా తనకు అవకాశం దక్కినట్లయితే గ్రామీణ ప్రాంతాలకి కూడా ఉన్నత వైద్య సదుపాయాలు విస్తరించాలని రాష్ట్రంలో ప్రభుత్వాసుపత్రులలో సదుపాయాలను పెంచి వాటి పనితీరును మెరుగుపరిచి, కార్పోరేట్ ఆసుపత్రులకు ధీటుగా తీర్చిదిద్దాలని భావిస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెపుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డికి, ఆయన ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చిపెట్టిన రాజీవ్ ఆరోగ్యశ్రీ పధకానికి మరిన్ని మెరుగులు దిద్ది అర్హులయిన ప్రజలందరికీ దానిని అందించాలని భావిస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెపుతున్నారు. కానీ, ఇటువంటి ముఖ్యమయిన శాఖ నిర్వహణకు మంచి అనుభవం, అవగాహన, కార్యదక్షత అవసరం. బాలయ్యకు సినీ పరిశ్రమ కష్టసుఖాల గురించి మంచి అవగాహన ఉన్నందున, చంద్రబాబు ఆయనకు సమాచార, ప్రసార శాఖ లేదా అటువంటి శాఖనే ఈయవచ్చును.

మోడీ ప్రమాణ స్వీకారోత్సవం విశేషాలు

  ఈరోజు నరేంద్ర మోడీ భారతదేశ 15వ ప్రధానమంత్రిగా పదవీ ప్రమాణం చేసారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో చాలా విశేషాలు ఉన్నాయి. మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి దేశవిదేశాలకు చెందిన దాదాపు 4,000 మంది హాజరయ్యారు. వారిలో సార్క్ దేశాలకు చెందిన ప్రధాన మంత్రులు, వివిధ దేశ ప్రతినిధులు, మన దేశం నలుమూలల నుండి వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, పద్మా అవార్డు గ్రహీతలు, అధికార, ప్రతిపక్ష నేతలు, 777 మంది పార్లమెంటు సభ్యులు, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, అనేకమంది కాంగ్రెస్ నేతలు, సినిమా తారలు, క్రికెట్ ఆటగాళ్ళు, కొందరు సాధువులు, పారిశ్రామిక వేత్తలు ఇంకా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.   వారందరి భద్రత నిమిత్తం రెండు రోజుల ముందు నుండే భద్రతా దళాలు డిల్లీని జల్లెడపట్టి, రాష్ట్రపతి భవన్ పరిసరాలను పూర్తిగా దిగ్బందం చేసి తమ అదుపులో ఉంచుకొన్నారు. అంతేగాక రాష్ట్రపతి భవన్, ఆ పరిసర ప్రాంతాలలో భద్రతాదళాలు హెలికాఫ్టర్లతో గగనతలం నుండి కూడా పహారా కాసాయి.   దూరదర్శన్ మరియు అనేక వందలాది ప్రవేట్ టీవీ ఛానల్స్ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయగా, దేశ విదేశాలలో ప్రజలు వీక్షించారు. ఈ కార్యక్రమాన్ని దూరదర్శన్ వారు మొత్తం 9 కెమెరాలతో, ఒక బ్రాడ్కాస్టింగ్ వ్యానుతో ఒకేసారి 15 బాషలలో ప్రత్యక్ష ప్రసారం చేసారు. ప్రమాణ స్వీకారం అనంతరం రాష్ట్రపతి యూపీయే మంత్రి వర్గానికి, మోడీ మంత్రి వర్గానికి, సార్క్ దేశాల ప్రతినిధులకు విందు ఇవ్వనున్నారు.

మోడీ కేబినెట్: ప్రమాణం చేసిన మంత్రులు వీరే

    భారత 15 వ ప్రధానమంత్రిగా నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ప్రమాణ స్వీకారోత్సవ సోమవారం సాయంత్రం దేశదేశాలనుంచి వచ్చిన ఆత్మీయ అతిథులమధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో అట్టహాసంగా జరిగింది, గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు నాలుగువేలమంది అతిథులు తరలిరాగా ఈ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. ఈశ్వర్ కీ శపథ్ లేతా హూం అంటూ మోదీ దేవునిపై ప్రమాణం చేశారు. మోడీ కేబినెట్:  ప్రమాణం చేసిన కేంద్ర మంత్రులు వీరే:   రాజ్‌నాథ్ సింగ్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. లక్నో నుండి గెలుపొందారు. మంత్రిగా పని చేసిన అనుభవం. సుష్మా స్వరాజ్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.  విదిష నుండి గెలుపొందారు. మూడుసార్లు మంత్రిగా పని చేసిన అనుభవం. అరుణ్ జైట్లీ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. న్యాయశాఖ మంత్రిగా అనుభవం. అదనపు సొలిసిటర్‌గా పని చేశారు. రాజ్యసభ సభ్యులు. వెంకయ్య నాయుడు - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యులు. రాజ్యసభకు మూడుసార్లు వెళ్లారు. గతంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ప్రమాణం చేశారు. నితిన్ గడ్కరీ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. బిజెపి జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. నాగపూర్ నుండి గెలుపొందారు.   సదానంద గౌడ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బెంగళూరు నుండి ఎంపీగా గెలుపొందారు. రెండుసార్లు లోకసభకు ఎన్నికయ్యారు. ఉమాభారతి - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. మంత్రిగా పని చేసిన అనుభవం ఉంది. నజ్మా హెఫ్తుల్లా - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.  రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్. బిజెపి ఉపాధ్యక్షురాలు. ఐదుసార్లు లోకసభకు వచ్చారు. గోపినాథ్ ముండే - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈశ్వరుడి పేరు మీద ప్రమాణం చేశారు. రామ్ విలాస్ పాశ్వాన్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. హాజీపూర్ నుండి గెలుపొందారు. లోకసభకు ఎనిమిదిసార్లు ఎన్నికయ్యారు. కేంద్రమంత్రిగా పని చేసిన అనుభవం. ఎన్డీయే భాగస్వామి ఎల్జేపీ అధ్యక్షులు. కల్రాజ్ మిశ్రా - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.దేవరియా నుండి గెలుపొందారు. యూపి రాష్ట్ర మంత్రిగా పని చేసిన అనుభవం. రాజ్యసభ సభ్యుడిగా అనుభవం. మేనకా గాంధీ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పిలిపిత్ నుండి గెలుపొందారు. పర్యావరణవేత్త, జంతుసంరక్షణ ఉద్యమాకారిణి. గతంలో కేంద్రమంత్రిగా పని చేశారు. ఆంగ్లంలో ప్రమాణం చేశారు. అనంత్ కుమార్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బెంగళూరు దక్షిణనుండి గెలుపొందారు. కేంద్రమంత్రిగా పని చేసిన అనుభవం. ఆరుసార్లు లోకసభకు ఎన్నికయ్యారు. రవిశంకర ప్రసాద్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.  రాజ్యసభ సభ్యులు. సుప్రీం కోర్టు న్యాయవాదిగా అనుభవం. గతంలో పలు శాఖలకు మంత్రిగా పని చేశారు. అశోక గజపతి రాజు - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. విజయనగరం నుండి గెలుపొందారు. ఎపిలో పలు శాఖల్లో మంత్రిగా పని చేశారు. రాజకీయాల్లో 36 ఏళ్ల రాజకీయ అనుభవం. టిడిపి ఎంపీ. అనంత్ గీతే - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్రమంత్రిగా అనుభవం. ఐదుసార్లు లోకసభకు ఎన్నికయ్యారు. హర్ స్మిత్ కౌర్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. భటిండా (పంజాబ్) నుండి గెలుపొందారు. మూడుసార్లు లోకసభకు ఎన్నికయ్యారు. సామాజిక ఉద్యమకారిణి. నరేంద్ర సింగ్ తోమర్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గ్వాలియర్ నుండి గెలుపొందారు. మున్నాభయ్యాగా అభిమానుల్లో గుర్తింపు. జ్యూయల్ ఓరమ్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సుందర్ ఘడ్ నుండి గెలుపొందారు. నాలుగుసార్లు లోకసభకు ఎన్నికయ్యారు. గతంలో కేంద్రమంత్రిగా పని చేసిన అనుభవం. రాధా మోహన్ సింగ్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పూర్వీ చంపారన్ నుండి గెలుపొందారు. బిజెపిలో పలు కీలక పదవులు నిర్వహించారు. నాలుగుసార్లు లోకసభకు ఎన్నికయ్యారు. టిసి గెహ్లాట్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈశ్వరుడి పేరు మీద ప్రమాణం చేశారు. స్మృతి ఇరానీ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.  రాజ్యసభ సభ్యురాలు. బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు. రాహుల్ గాంధీ పైన పోటీ చేసి ఓడిపోయారు. గతంలో గుజరాత్ నుండి రాజ్యసభకు ఎన్నికయ్యారు. హర్షవర్ధన్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చాందినీ చౌక్ నుండి గెలుపొందారు. ఢిల్లీ మాజీ మంత్రి. గత ఏడాది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థి. జనరల్ వికె సింగ్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఘజియాబాద్ నుండి గెలుపొందారు. మాజీ సైన్యాధిపతి. రక్షణ శాఖలో విశిష్ట సేవలు అందించారు. రావ్ ఇంద్రజిత్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గురుగావ్ నుండి గెలుపొందారు. నాలుగుసార్లు లోకసభకు ఎన్నికయ్యారు. కేంద్రమంత్రిగా పని చేసిన అనుభవం. సంతోష్ గ్యాంగ్ వర్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.  బరేలీ నుండి గెలుపొందారు. ఏడుసార్లు లోకసభకు ఎన్నికయ్యారు. సామాజికవేత్తగా సుపరిచితులు. శ్రీపాద్ నాయక్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.  ఉత్తర గోవానుండి గెలుపొందారు. బిజెపిలో పలు కీలక పదవులు. మూడుసార్లు లోకసభకు ఎన్నికయ్యారు. ధర్మేంద్ర ప్రదాన్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ సభ్యులు. బిజెపి యువమోర్చా నాయకుడు. గతంలో రెండుసార్లు లోకసభకు ఎన్నికయ్యారు. శర్వానంద్ సోనోవాల్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. లఖింపూర్ నుండి గెలుపొందారు. బిజెపిలో పలు కీలక పదవులు నిర్వహించారు. రెండుసార్లు లోకసబకు ఎన్నికయ్యారు. ప్రకాశ్ జవదేకర్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ సభ్యులు. రెండుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. బిజెపి అధికార ప్రతినిధి. పీయూష్ గోయల్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.  బిజెపి కోశాధికారి. 27 ఏళ్ల రాజకీయ అనుభవం. రాజ్యసభ సభ్యులు. జితేంద్ర సింగ్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉదంపూర్ నుండి గెలుపొందారు. బిజెపి జాతీయ కార్యనిర్వాహక సభ్యుడు. జమ్మూ కాశ్మీర్‌లో కీలక బిజెపి నేత. నిర్మలా సీతారామన్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బిజెపి అధికార ప్రతినిధి. జాతీయ మహిళా కమిషన్ మాజీ సభ్యురాలు. ప్రముఖ రాజకీయ విశ్లేషకురాలు. ఆంగ్లంలో ప్రమాణం చేశారు. గౌడర్ మల్లికార్జునప్ప సిద్దేశ్వర - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.  దావణగెరె నుండి గెలుపొందారు. ఆంగ్రంలో ప్రమాణం చేశారు. వరుసగా మూడోసారి లోకసభకు ఎన్నికయ్యారు. మనోజ్ సిన్హా - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గాజీపూర్ నుండి గెలుపొందారు. మూడుసార్లు లోకసభకు ఎన్నికయ్యారు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయం మాజీ అధ్యక్షుడు. నిహాల్ చంద్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉపేంద్ర కుశ్వాహా - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈశ్వరుడి పేరు మీద ప్రమాణం చేశారు. కరాకట్ నుండి గెలుపొందారు. రాష్ట్రీయ లోకసమతా పార్టీ నాయకుడు. గతంలో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. సిపి రాధాకృష్ణన్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కోయంబత్తూర్ నుండి గెలుపొందారు. తమిళనాడు బిజెపి అధ్యక్షుడు. కి రెన్ రిజిజు - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అరుణాచల్ ప్రదేశ్ పశ్చిమ నుండి గెలుపొందారు. రెండుసార్లు లోకసభకు ఎన్నికయ్యారు. క్రిషన్ పాల్ గుజర్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.  ఫరీదాబాద్ నుండి గెలుపొందారు. బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు. సంజీవ్ కుమార్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.  ముజఫర్ నగర్ నుండి గెలుపొందారు. తొలిసారి లోకసభకు ఎన్నికయ్యారు. వాసవ మన్సూక్ భాయ్ ధనాజీ భాయ్- కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.  బారుచ్ (గుజరాత్) నుండి గెలుపొందారు. నాలుగుసార్లు లోకసభకు ఎన్నికయ్యారు. రావ్ సాహెబ్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈశ్వరుడి పేరు మీద ప్రమాణం చేశారు. విష్ణుదేవ్ సాయి - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాయగఢ్ నుండి గెలుపొందారు. రెండుసార్లు లోకసభకు ఎన్నికయ్యారు. సుదర్శన్ భగత్ - కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తొలిసారి లోకసభకు ఎన్నికయ్యారు.

కేంద్రమంత్రిగా అశోక్ గజపతి రాజు ప్రమాణం

      ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సుదీర్గ అనుభవం వున్న టిడిపి సీనియర్ నేత అశోక్ గజపతి రాజు నరేంద్ర మోడీ మంత్రివర్గంలో కేబినెట్ మంత్రిగా ప్రమాణం చేశారు.  1978లో రాజకీయ ప్రవేశం చేసిన ఆయన ఇప్పటి వరకు 7 సార్లు రాష్ట్ర శాసన సభకు ఎన్నికైయ్యారు. ఈ సారి తొలిసారిగా విజయనగరం నుంచి లోక్ సభకు పోటీ చేసి తిరుగులేని నాయకుడిగా గెలుపొందారు. ఆయన సత్ప్రవర్తన, నీతి, నిజాయితీలే ఆయనకు కేంద్ర మంత్రి పదవిని తెచ్చిపెట్టాయి. టిడిపి తరఫున కేంద్రంలో దక్కింది ఒక్క మంత్రి పదవే అయినా, ఆ పదవి కూడా ఆశోక్ గజపతికి దక్కడం విశేషం. ఆయనకు పౌర విమానయ శాఖ కేటాయించినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ , చంద్రబాబు కేబినెట్ లో పలు కీలక శాఖల మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకు వుంది.