ఫోన్ ట్యాపింగ్ జరిగింది... సర్వీస్ ప్రొవైడర్లు
ఆంధ్రప్రదేశ్ మంత్రులు, ప్రభుత్వాధికారులకు సంబంధించిన ఫోన్లను ట్యాపింగ్ చేసినట్టుగా టెలిఫోన్ సర్వీస్ ప్రొవైడర్లు అంగీకరించినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఏపీ సిట్ సర్వీస్ ప్రొవైడర్లతో జరిపిన విచారణలో ఈ విషయం వెల్లడైంది. తాము ఫోన్ ట్యాపింగ్ జరిపినట్టు సర్వీస్ ప్రొవైడర్లు అంగీకరించారు. అయితే సాంకేతికపరమైన అంశాలు చెప్పడానికి, కాల్డేటా ఇవ్వడానికి కొంత సమయం కావాలని వారు సిట్ని కోరారు. తాము మళ్లీ విచారణకు పిలిచినప్పుడు అందుబాటులో ఉండాలని ప్రొవైడర్లను ఈ సందర్భంగా సిట్ అధికారులు ఆదేశించారు. యునినార్, ఎయిటెల్, ఐడియా, డొకోమో, వోడా, రిలయన్స్ కంపెనీల ప్రతినిధులను ఏపీ సిట్ అధికారులు విచారించారు.