నకిలీ మద్యం కేసు...కీలక అప్డేట్

  మొలకలచెరువు నకిలీ మద్యం కేసులో 10 మంది నిందితులను మూడు రోజుల కస్టడీకి తంబలళ్లపల్లె కోర్టు అనుమతించింది. ఎక్సైజ్ శాఖ రేపు వీరిని కస్టడీలోకి తీసుకోనుంది. మరోవైపు ప్రధాన నిందితులు A5 రాజేష్, A17 జయచంద్రారెడ్డి, A18 గిరిధర్‌రెడ్డి ఆచూకి లభించలేదు. కల్తీ మద్యం తయారీకి  సహకరించిన రమేష్, అల్లా భక్షు, శ్రీకర్, అనే ముగ్గురిని విజయవాడలో విచారిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 23 మందిని నిందితులుగా గర్తించగా.. మొత్తం 16 మందిని అరెస్ట్ చేశారు. వారిలో ప్రధాన నిందితుడు జనార్దన్ రావు  కూడా ఉన్నారు. మరో ఏడుగురు నిందితుల కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. మరోవైపు కేసులో ఏ1   నిందితుడు జనార్ధన్‌రావు అరెస్ట్‌పై పీటీ వారెంట్ దాఖలు చేయగా.. తంబళ్లపల్లి కోర్టు పిటిషన్‌పై విచారణను ఈనెల 16కి వాయిదా వేసింది.

బీజేపీ కార్యాలయంలో బీసీ నేతల డిష్యూం డిష్యూం!

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీసీ నేతల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.  బీజేపీ  రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్యల ఎదుటే బీసీ సంఘాల నేతలు ఘర్షణకు దిగారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో చెలరేగిపోయారు.   ఈనెల 18న బీసీ ఐక్యకార్యాచరణ కమిటీ (ఐకాస) నిర్వహించ తలపెట్టిన బంద్‍కు మద్దతు ఇవ్వాలని బీజేపీని కోరేందుకు బుధవారం (అక్టోబర్ 15) ఆర్.కృష్ణయ్యతో పాటు బీసీ సంఘాల నేతలు బీజేపీ కార్యాలయానికి వచ్చారు. రామచందర్ రావుతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సరిగ్గా ఆసమయంలో ఫొటోల విషయంలో బీసీ నేతల మధ్య వివాదం తలెత్తింది. జూనియర్ ఫొటో కోసం ముందు వరుసలో ఎలా ఉంటారంటూ మొదలైన వివాదం ఘర్షణకు దారి తీసింది.    ప్రెస్ మీట్ సందర్భంగా ఫోటోలో ఎవరు ఏ స్థానంలో  నిలబడాలి, మీడియా షాట్‌లో ఎవరు ముందుండాలి అనే అంశంపై నేతల మధ్య గొడవ పిడిగుద్దుల వరకూ వెళ్లింది. పరిస్థితి చేయిదాటిపోవడంతో చక్కదిద్దేందుకు  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చేసిన ప్రయత్నం ఫలించలేదు. దీంతో ఆయన, కృష్ణయ్య అక్కడ నుంచి వెళ్లిపోయారు.  ఈ ఘటనపై అంతర్గత నివేదిక ఇవ్వాలని బీజేపీ క్రమశిక్షణ కమిటీకి ఆదేశాలు రామచంద్రరావు ఆదేశాలు జారీ చేశారు.  

ఇన్స్టా ఇన్ ఫ్ల్యుయన్సర్ హనీ ట్రాప్.. ఇద్దరు యువకులపై వలపు వల

ఇన్స్టా ఇన్ ఫ్ల్యుయన్సర్ హనీ ట్రాప్ లో ఇద్దరు యువకుల నుంచి భారీగా సొమ్ము గుంజుకున్న సంఘటన విశాఖలో వెలుగులోకి వచ్చింది. సౌమ్యాశెట్టి అనే ఇన్స్టా ఇన్ ఫ్ల్యుయెన్సర్ నిర్వాకం ఆ యువకులు పోలీసులను ఆశ్రయించడంతో బట్టబయలయ్యాయి.  వివరాల్లోకి వెడితే.. తెలంగాణకు చెందిన లక్ష్మీకాంత్ రెడ్డి అనే యువకుడితో సోషల్ మీడియాలో పరిచయం చేసుకున్న సౌమ్యాశెట్టి.. అతడిని ప్రేమించానంటూ వలపు వల విసిరింది. శ్రీకాంత్ రెడ్డి తనకు వివాహమైంది అని చెప్పినా వినకుండా రెండో భార్యగా ఉండడానికైనా రెడీ అంటూ అతడిని వలపు ముగ్గులోకి దింపింది. ఆ తరువాత పలు రకాల సమస్యలు చెబుతూ విడతల వారీగా అతడి వద్ద నుంచి దాదాపు కోటి రూపాయలు రాబట్టింది. అంతే ఇక అతడి ఫోన్ ను బ్లాక్ చేయడమే కాకుండా, తనకు ఇక ఫోన్ చేయవద్దంటూ లాయర్ ద్వారా చెప్పించింది.  ఆ తరువాత ఇదే హనీ ట్రాప్ తో రాజేష్ అనే మరో యువకుడికి వల వేసింది. అతడి నుంచి కూడా లక్షల రూపాయలు రాబట్టుకుని.. ఆపై బెదరింపులకు దిగింది. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇలా ఉండగా సౌమ్యాశెట్టి ఈ ఇద్దరినే కాకుండా ఇంకా పలువురిని ఇదే విధంగా మోసం చేసిందనీ, ఇలా హనీట్రాప్ ద్వారా ఆమె దోచుకున్న సొమ్ము ఐదు కోట్ల రూపాయల పైమానేననీ ఆరోపణలు వినవస్తున్నాయి. అంతే కాకుండా గతంలో కూడా సౌమ్యాశెట్టి తన స్నేహితురాలి ఇంట్లో పెద్దమొత్తంలో బంగారం చోరీ చేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి.  

హైదరాబాద్ శివారులో రేవ్ పార్టీ కలకలం

హైదరాబాద్ శివారులో రేవ్ పార్టీ కలకలం సృష్టిం చింది. మహేశ్వరంలోని ఓ రిసార్ట్స్‌లో రేవ్ పార్టీ నిర్వహి స్తున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారంతో  ఎస్ వోటీ  పోలీసులు  ఆ రిసార్ట్ పై దాడి చేశారు.  గుంటూరుకు చెందిన ఫర్టిలై జర్ కంపెనీ డీలర్ ఈ రేవ్ పార్టీ ఇస్తున్నట్లు తేలింది. కంపెనీ యాజమాని తమ దగ్గరున్న డీలర్స్ కోసం ఈ పార్టీ అరేంజ్ చేశారని తేలింది. ఈ రేవ్ పార్టీలో ఏడుగురు మహిళా డాన్సర్లు కూడా ఉన్నారు.   మద్యం తాగి అమ్మాయిలతో చిందులేస్తూ నానా హంగామా సృష్టించారు. దీంతో  స్థానికులు  పోలీసులకు సమాచారాన్ని అందించారు. సమాచారం అందుకున్న వెంటనే రాచకొండ ఎస్ఓటి బృందం రంగంలోకి దిగి ఆ రిసార్టుపై దాడులు చేసింది. అయితే ఈ పార్టీకి ఎక్సైజ్ శాఖ అనుమతి ఉంది.. అయితే  అనుమతి లేకుండా డ్యాన్సర్లను తీసుకువచ్చి అసభ్య నృత్యాలు చేయించడం చట్ట విరుద్ధం కావడంతో పోలీసులు డ్యాన్సర్లను అరెస్టు చేశారు. అలాగే పెద్ద మొత్తంలో మద్యం, క్యాసినో కాయిన్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ వినియోగం కూడా జరిగిందా అన్న కోణంలో పరిశీలిస్తున్నారు.  కేసు నమోదు చేశారు. 

పందెం కోడి.. పరుగో పరుగు!

అన్నమయ్య జిల్లాలో అక్రమంగా జరుగుతున్న కోడి పందాలపై పోలీసులు డ్రోన్లతో  నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. జిల్లాలో ఎక్కడా చట్ట వ్యతిరేక కార్యకలాపాలను జరగనివ్వమని, వాటిని సహించేది లేదనీ, ఉక్కుపాదంతో అణచివేస్తామని జల్లా ఎస్పీ ధీరజ్ కనుబిల్లి పేర్కొన్నారు. జిల్లాలో రహస్యంగా కోడి పందాలు జరుగుతున్నాయన్న సమాచారం మేరకు స్పెషల్ పార్టీ, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, స్థానిక పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించారు. డ్రోన్లతో నిఘా పెట్టడం ద్వారా పక్కా సమాచారంతో కొండల్లో జరుగుతున్న కోడి పందాలపై మెరుపుదాడి నిర్వహించారు. కొడి పందెం నిర్వహిస్తున్న 15 మందిని అదుపులోనికి తీసుకున్నారు. ఈ సందర్భంగా 18 ద్విచక్రవాహనాలు, 24 వేల 200 రూపాయల నగదు, అలాగే పందాలకు సిద్ధం చేసిన 15 కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా పోలీసులు మెరుపుదాడి నిర్వహించిన సమయంలో పలాయనం చిత్తగించిన వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.  

తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.35 కోట్లు

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుడు కొలువై ఉన్న తిరుమల క్షేత్రం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంటుంది. తిరుమలేశుని దర్శనానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా భక్తులు పోటెత్తుతుంటారు. బుధవారం  (అక్టోబర్ 15) తిరుమల శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 17కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా పడుతోంది. ఇక 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు శ్రీవారి దర్శనానికి 3 గంటలకు పైగా సమయం పడుతోంది. కాగా మంగళవారం  (అక్టోబర్ 14) శ్రీవారిని మొత్తం 72,473 మంది దర్శించుకున్నారు. వారిలో 23,900 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 4 కోట్ల 35  లక్షల రూపాయలు వచ్చింది.  

పాతబస్తీలో షాకింగ్ ఘటన...జ్యూస్ తాగి నిద్రలోకి బాధితులు

  హైదరాబాద్‌ పాతబస్తీ డబీర్‌పురా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని చంచల్‌గూడలో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఖురాన్‌ పఠనం పూర్తి చేసుకున్నానని చెప్పి ఆనందంగా జ్యూస్‌ పంచుతున్నానని ఒక యువకుడు స్థానిక దుకాణాలు, వీధుల్లో తిరుగుతూ జ్యూస్‌ పంపిణీ చేశాడు. కొంతమంది ఎలాంటి అనుమానం లేకుండా జ్యూస్‌ తాగగా, మరికొందరు నిరాకరించారు.  అయితే తాగిన వారంతా కొద్ది సేపటికే గాఢ నిద్రలోకి జారుకున్నారని పోలీసులు తెలిపారు. దాదాపు 12 గంటల తర్వాత మెలకువ వచ్చిన బాధితులు ఏం జరిగిందో అర్థం కాక అయోమయానికి గురయ్యారు .ప్రస్తుతం వారి పరిస్థితి స్థిరంగా ఉందని పోలీసులు పేర్కొన్నారు. నిందితుడి వివరాలు తెలుసుకునేందుకు డబీర్‌పురా పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా గాలింపు ప్రారంభించారు. యువకుడు ఎక్కడి నుంచి వచ్చాడు, జ్యూస్‌లో ఏమి కలిపాడు, ఈ చర్య వెనుక ఉద్దేశం ఏమిటనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.  

12 ఏళ్ల తర్వాత సీబీఐకి చిక్కిన హంతకుడు

  యూఏఈలో భార్య హత్య కేసులో 12 ఏళ్లుగా పరారీలో ఉన్న నిందితుడనీ  ఎట్టకేలకు సీబీఐ అరెస్ట్ చేసింది..ఓ వ్యక్తి యూఏఈలో తన భార్యను హత్య చేసి గత 12 ఏళ్లుగా పరారీలో ఉన్నాడు. అతని కోసం సీబీఐ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు హైదరాబాద్‌లో ఉన్నట్లుగా తెలుసుకున్న అధికారులు నిందితుడిని అరెస్ట్‌ చేశారు.. సత్తార్‌ ఖాన్‌ ( 52) అనే వ్యక్తి డ్రైవర్‌ గా పని చేస్తున్నాడు.  2013 నవంబర్‌ 14న యూఏఈలో పనిచేస్తూ  జీవనం సాగిస్తున్నారు. ఇతను  భార్యను హత్య చేసినట్లు ఆరోప ణలు ఉన్నాయి.  హత్య అనంతరం అతను ఇండియా కి పారిపోయి వచ్చి దాదాపు 12 ఏళ్లుగా అతని జాడ పోలీ సులకు తెలియ కుండా జాగ్రత్తప డ్డాడు...యూఏఈ అధికారుల విజ్ఞప్తి మేరకు సీబీఐ 2022 ఏప్రిల్‌లో  కేసు నమోదు చేసింది.  కేసు నమోదు అయిన తర్వాత సీబీఐ నిందితుడిపై లుక్‌ అవుట్‌ సర్క్యులర్‌ (LOC) జారీ చేసినప్పటికీ, అతను పోలీసులకు చిక్కలేదు.. తరువాత సత్తార్ మరో పాస్‌పోర్ట్‌ ఉపయోగిస్తున్నట్టు తెలిసి, దానిపై మరో లుక్‌ అవుట్‌ సర్క్యు లర్‌ జారీ చేశారు. సాంకేతిక ఆధా రాలు,  గూఢచార సమాచారం ఆధా రంగా చేసుకుని సీబీఐ అధికారులు రంగారెడ్డి  జిల్లాలో అతను నివాసం ఉంటున్నట్లుగా కనుక్కున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న నిందితుడు సత్తార్‌ ఖాన్‌ దోహా వెంటనే అప్రమత్తమై పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా, సిబిఐ బృందం హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో మాటు వేసి అతన్ని అదుపులోకి తీసుకున్నారు.అనంతరం అధి కారులు నిందితు డిని హైదరాబాద్‌ లోని మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుప రచగా, ఢిల్లీ న్యాయస్థానం ముందు హాజరు పరచడానికి ట్రాన్సిట్‌ రిమాండ్‌ మంజూరు చేశారు. సీబీఐ అధికారులు కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

జూబ్లీ ఉప ఎన్నికల్లో రెండో రోజు 11 నామినేషన్లు

  జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో రెండో రోజు 11 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మంగళవారం పీఏటీఏ పార్టీ అభ్యర్థి మాచర్ల వెంకట్ రెడ్డి  రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. అధికారులు అన్ని ప్రకియలను ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం సజావుగా నిర్వహించారు. మొదటి రోజు 10 అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా నేడు రెండో రోజు 11 నామినేషన్లు సమర్పించారు.  రెండు రోజుల్లో మొత్తంగా 22 నామినేషన్‌లు దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. రేపు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ  చేస్తున్న  మాగంటి సునీత గోపీనాథ్‌  నామినేషన్లు దాఖలు చేయనున్నారు. నేడు పార్టీ అధినేత కేసీఆర్ బీఫామ్ అందజేసి ఎన్నికల ఖర్చు నిమిత్తం పార్టీ తరఫున రూ.40 లక్షల రూపాయలు చెక్కును అందించారు. నామినేషన్ల ప్రక్రియ ఈనెల 13 నుంచి 21 వరకు కొనసాగనుంది.

కడప రేణిగుంట గ్రీన్ ఫీల్డ్ హైవేలో కదలిక

  నాలుగేళ్లుగా నిలిచిపోయిన కడప రేణిగుంట  గ్రీన్‌ఫీల్డ్ హైవే ప్రాజెక్ట్ మళ్లీ కదలికలోకి వచ్చింది. కూటమి ప్రభుత్వ చొరవతో కేంద్ర వైల్డ్‌లైఫ్ బోర్డు అనుమతులు లభించడంతో రూ.3,000 కోట్ల విలువైన ఈ ప్రాజెక్ట్‌కు ఫోర్‌లేన్ హైవే విస్తరణ పనులు ఇప్పుడు మళ్లీ ఊపందుకునే పరిస్థితి ఏర్పడింది. కూటమి ప్రభుత్వ చొరవతో ఈ కీలక ప్రాజెక్ట్‌కు కేంద్ర వన్యమృగ సంరక్షణ బోర్డు  ఎట్టకేలకు ఆమోదముద్ర వేసింది. రూ.3,150 కోట్ల వ్యయంతో రెండు దశలుగా చేపట్టబోయే ఈ ప్రాజెక్ట్‌లో మొదటి దశకు ఇప్పటికే అటవీ శాఖ అనుమతులు లభించగా, రెండో దశకు తాజాగా వన్యమృగ సంరక్షణ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండు దశల్లో పనులు కడప నుండి భాకరాపేట, ఒంటిమిట్ట, పెదపల్లె, నందలూరు, రాజంపేట, ఓరంపాడు వరకు మొదలు కానున్నాయి.మొదటి దశలో పనులు కొనసాగనున్నాయి. రెండో దశలో పుల్లంపేట, అయ్యపురెడ్డిపల్లి, బాలాయపల్లి, మామండూరు, రేణిగుంట వరకు విస్తరణ జరుగనుంది.  *అభయారణ్యాల అనుమతులు సవాలు ఈ ప్రాజెక్ట్‌లో శ్రీ వెంకటేశ్వర అభయారణ్యం, పెనుశిల లక్ష్మీనరసింహ అభయారణ్యాల పరిధిలోని మొత్తం 133 హెక్టార్ల భూములను వినియోగించాల్సి రావడంతో అనుమతులు ఆలస్యం అయ్యాయి. అయితే కూటమి ప్రభుత్వం నిరంతర చర్చలతో సమస్యను పరిష్కరించి, చివరికి బోర్డు నుండి 20 షరతులతో కూడిన ఆమోదం పొందింది. *వన్యప్రాణులకు సురక్షిత మార్గాలు అటవీ  ప్రాంతాల గుండా సాగే రహదారుల వద్ద వన్యప్రాణులు స్వేచ్ఛగా సంచరించేందుకు ఎత్తైన అండర్‌పాస్‌లు నిర్మించాలని బోర్డు ఆదేశించింది. అలాగే వర్షాకాలంలో నీరు నిల్వ కాకుండా మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని సూచించింది. గత నాలుగేళ్లుగా కదలని ఈ ప్రాజెక్ట్‌ను కదిలించడంలో కూటమి ప్రభుత్వ పాత్ర కీలకమైంది.  కేంద్రంతో జరిగిన పునరావృత చర్చలు, సాంకేతిక బృందాల పరిశీలనల ఫలితంగా చివరికి ఈ ప్రాజెక్ట్‌కు ప్రాణం పోసినట్లు అయింది. ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తికావడంతో మరో రెండు నెలల్లోనే ఫోర్‌లేన్ పనులు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. అన్నీ అనుకున్నట్టే జరిగితే వచ్చే ఏడాది చివరినాటికి కడప–రేణిగుంట హైవే నాలుగు లేన్లుగా రూపుదిద్దుకోనుంది. *అధికారుల పరిశీలన  కడప–రేణిగుంట గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రాజెక్టు పనులకు గ్రీన్ సిగ్నల్ రావడంతో అధికారులు, కూటమి ప్రతినిధులు రెండు రోజుల క్రితం పరిశీలించారు. సిద్దవటం మండలంలోని గ్రామ శివారులోని జేఎంజే కాలేజ్ సమీపం నుండి కనుములోపల్లి, భాకరాపేట, మిట్టపల్లి, మాధవరం గ్రామాల అటవీ ప్రాంతాల వరకు అధికారులు, నాయకులు పరిశీలనలు నిర్వహించారు.  ఈ సందర్భంగా టిడిపి జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి (వాసు)  హైవే అధికారులతో కలిసి ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రూ.3,150 కోట్ల వ్యయంతో రెండు దశలుగా చేపట్టబోయే ఈ ప్రాజెక్టులో మొదటి దశకు ఇప్పటికే అటవీ శాఖ అనుమతులు లభించగా, రెండో దశకు తాజాగా వన్యమృగ సంరక్షణ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు.  రైతులకు ఈ ప్రాజెక్టు వల్ల ఏవైనా ఇబ్బందులు ఎదురైతే వాటిని తక్షణమే తెలియజేయాలని  తెలిపారు.  

చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ వద్ద హైటెన్షన్

  చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకి తెలంగాణ  జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వచ్చారు. కవితని లోపలి పంపించకుండా గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గేటు ముందు కవిత జాగృతి కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో సెంట్రల్ లైబ్రరీ వద్ద ఉద్రిక్తత పరిస్ధితులు చోటుచేసుకున్నాయి. నిరుద్యోగులు, తెలంగాణ జాగృతి నాయకులు భారీగా రావడంతో  ఉదృత వాతావరణం నెలకొంది.  గ్రూప్-1 పరీక్షల్లో అవకతవకలు నిరుద్యోగ సమస్యలపై చర్చించేందుకు కల్వకుంట్ల కవిత ఈరోజు సాయంత్రం సమయంలో సిటి సెంట్రల్ లైబ్రరీకి వచ్చారు అయితే ఈ విషయం తెలియగానే ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా పోలీసులు అక్కడ భారీగా మోహరించారు. అదే సమయంలో  కవిత అక్కడికి చేరుకొని లైబ్రరీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో పోలీసులు ఆమెను అడ్డుకున్నారు.  లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదంటూ నిరాకరించారు. దీంతో జాగృతి నాయకులకు పోలీసులకు మధ్య పెద్ద ఎత్తున వాగ్వివాదం చెలరేగింది. జాగృతి నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ... రోడ్డు మీద బైఠాయించి ధర్నా చేపట్టారు.. పోలీసులు  ఎంతగా నచ్చచెప్పినా కూడా వినకుండా లైబ్రరీ గేటు ముందు నిల్చని ఉండడంతో అక్కడ కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడింది.  

ఈడీ vs నౌహీరా షేక్ కేసులో సంచలన విషయాలు

  ఈడీ vs నౌ హీరా షేక్ కేసు లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈడీ జప్తు ఆస్తులపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేశారు. వివాదాస్పద వ్యాపారవేత్త నౌ హీరా షేక్ మరియు ఈడి మధ్య కొనసాగు తున్న ఆస్తుల వివాదం కొత్త మలుపు తిరిగింది. ఈడీ జప్తు చేసిన ఆస్తులను విక్రయిం చేందుకు నౌ హీరా షేక్ ప్రయత్నాలు చేస్తున్నారని అధికారులు వెల్లడించారు. ఈడీ అనుమతి లేకుండా జప్తు ఆస్తులను విక్రయించి సుమారు 3 కోట్లు రాబట్టినట్లు ఆరోప ణలు ఉన్నాయి. ఇక మరోవైపు, ఈడీ మాత్రం చట్టపరంగా జప్తు చేసిన 93 కోట్ల విలువైన ఆస్తులను వేలం ద్వారా విక్ర యిస్తోంది. అయితేవేలంలో పాల్గొం టున్న వ్యక్తులను నౌ హీరా బెదిరిస్తు న్నట్లు ఈడి సుప్రీం కోర్టులో ఫిర్యాదు చేసింది. అంతేకాక, ఆస్తుల విక్రయంలో ఒక సబ్ రిజిస్ట్రార్‌ కూడా నౌ హీరా షేక్‌కు సహకరించి నట్లు ఈడి ఆరోపణ ల్లో పేర్కొంది. ఈ పరిణామాల నేపథ్యంలో, సుప్రీం కోర్టు ఈడీ పక్షాన కీలక ఆదేశాలు జారీ చేసింది. నౌ హీరా షేక్‌ను విచారణ కోసం ఈడి ఎదుట హాజరు కావాలని అత్యున్నత న్యాయస్థానం ఆదే శాలు జారీ చేసింది. అలాగే, విచారణకు హాజరు కాకుంటే వెంటనే అతని అరెస్టు చేయాలని కూడా సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పుతో ఈడీ–నౌ హీరా మధ్య సాగుతున్న ఆస్తుల వివాదం మరింత ఉత్కంఠభరిత దశకు చేరింది.  

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్

  ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక పరిణామాలు చోటు చేసుకు న్నాయి. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు ఐక్లౌడ్ పాస్‌వర్డ్ రీసెట్ చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ టి. ప్రభాకర్ రావుపై ఉన్న ఫోన్ ట్యాపింగ్ కేసులో, ఆయన iCloud ఖాతా పాస్‌వర్డ్ రీసెట్ చేసి, రాష్ట్ర పోలీసు ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో అందజేయాలని సుప్రీం కోర్టు సోమవారం ఆదేశించింది.  న్యాయమూర్తులు బి.వి. నాగరత్న, ఆర్. మహాదేవన్లతో కూడిన బెంచ్ ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ విచారణ ప్రభాకర్ రావు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌లో భాగంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు ఇచ్చిన అరెస్ట్ నుండి రక్షణను రద్దు చేయాలని కోరుతూ ఇంటర్లోక్యుటరీ అప్లికేషన్ దాఖలు చేసింది. సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా రాష్ట్ర తరఫున వాదిస్తూ, ప్రభాకర్ రావు సహకరించడం లేదని, అందువల్ల విచారణలో ఆటంకం కలుగుతోందని కోర్టుకు తెలిపారు. ఈ కోర్టును షాక్‌కు గురిచేసే కొన్ని విషయాలు నేను చూపిస్తానని ఆయన పేర్కొన్నారు. మెహతా ఆరోపణల్లో భాగంగా, కోర్టు రక్షణలో ఉన్నప్పటికీ ప్రభాకర్ రావు ఎలక్ట్రానిక్ పరికరాలను ఫార్మాట్ చేసి, కీలక ఆధారాలను నాశనం చేశారని తెలిపారు. సీనియర్ అడ్వకేట్ దామ శేషాద్రి నాయుడు, ప్రభాకర్ రావు తరఫున వాదిస్తూ, ఈ ఆరోపణలను ఖండించారు. నా క్లయింట్ విచారణకు పూర్తి సహకారం అందించారు. ఆయనను 11 సార్లు పిలిచి, 18 గంటల పాటు విచారణ జరిపారు. ఆ మొత్తం ప్రక్రియ వీడియో రికార్డు చేయబడింది. అందువల్ల ఆయన సహకరించారా లేదా అనేది ఆ రికార్డుల ద్వారానే తేలుతుందని అన్నారు.   పాత iCloud ఖాతా పాస్‌వర్డ్ ఆయన మరిచిపోయారు. పోలీసులు సమక్షంలోనే పాస్‌వర్డ్ రీసెట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నేను ప్రైవసీ హక్కు పేరుతో తప్పించుకోవడం లేదు. కోర్టు ఇచ్చిన స్వేచ్ఛకు తగిన విధంగా సహకరిస్తున్నాననీ పేర్కొన్నారు. అయితే, న్యాయమూర్తి నాగరత్న డేటా డిలీషన్‌పై ప్రశ్నించారు. మీరు డివైసులు డిలీట్ చేశారు కదా? అని అడగగా, నాయుడు సమాధానంగా, అది సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ప్రోటోకాల్ ప్రకారం జరిగింది. నేను డిలీట్ చేయలేదు, డిపార్ట్‌మెంట్ కంప్యూటర్ నిపుణులే చేశారని తెలిపారు.

బనకచర్ల టెండర్‌ను రద్దు చేయాలని సీడబ్ల్యూసీకి లేఖ

  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించి తలపెట్టిన పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టును ఆపాలని తెలంగాణ ప్రభుత్వం సీడబ్లుసీకి లేఖ రాసింది. ఈ లేఖలో పలు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. టెండర్లు, సర్వేను తక్షణమే ఆపాలని కోరింది. ఆ ప్రాజెక్టును ఆమోదించవద్దని, పోలవరం డీపీఆర్‌కు విరుద్దంగా ఉందని లేఖలో వెల్లడించింది. పోలవరం డీపీఆర్‌‌కు విరుద్దంగా ఉందని తెలంగాణ ఆరోపించింది.  గతంలో  మంత్రి ఉత్తమ్ బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించే ప్రసక్తే లేదని, సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో అడ్డుకుని తీరుతామని స్పష్టం చేశారు.  ‘బనకచర్లపై కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ను కలిసి తెలంగాణ అభ్యంతరాలు తెలిపామని పేర్కొన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వమే ఉన్నప్పటికీ మేం ఆలమట్టి ఎత్తు పెంపును వ్యతిరేకిస్తున్నాం. కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన నీటి వాటాపై మేం ట్రైబ్యునల్‌ ఎదుట సమర్థంగా వాదనలు వినిపించాం. ఈ విషయంలో ఎటువంటి రాజీపడమని ఉత్తమ్‌ తెలిపారు

మాగంటి సునీతకు బీఫామ్ అందించిన కేసీఆర్

  జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ  చేస్తున్న  మాగంటి సునీత గోపీనాథ్‌కు పార్టీ అధినేత కేసీఆర్ బీఫామ్ అందజేశారు. సునీత తన కుటుంబ సభ్యులతో కలిసి ఎర్రవల్లిలోని గులాబీ బాస్ నివాసానికి వెళ్లారు. ఎన్నికల ఖర్చు నిమిత్తం పార్టీ తరఫున రూ.40 లక్షల రూపాయలు చెక్కును అందించారు.  ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్, అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నలమోతు భాస్కర్ రావు, తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు.  

హర్యానాలో మరో పోలీస్ అధికారి ఆత్మహత్య

  హర్యానాలో మరో పోలీస్ అధికారి ఆత్మహత్య చేసుకున్నాడు. ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్‌పై అవినీతి కేసును విచారిస్తున్న ఏఎస్ఐ సందీప్ లాతర్ తుపాకీతో కాల్చుకుని సూసైడ్ చేసుకున్నాడు. 3 పేజీల సూసైడ్ నోట్‌లో తన చావుకు పూరన్ కుమారే కారణమని పేర్కొనడం సంచలనంగా మారింది. సందీప్ రోహ్‌తక్‌లోని సైబర్ సెల్‌లో పనిచేశారు. కాగా తనను వేధిస్తున్నారని 16 మంది సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్‌ల రాసి పూరన్ పూరన్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.   ఏఎస్ఐ ఆత్మహత్యకు ముందు సూసైడ్ లెటర్‌తో పాటు ఓ వీడియోను కూడా రికార్డ్ చేసిన సందీప్ కుమార్, ఐపీఎస్ పూరణ్ కుమార్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. రోహ్‌తక్ సైబర్ సెల్‌లో పనిచేస్తున్న సందీప్, పూరణ్ కుమార్ జాతి వివక్షతో వ్యవహరించారని, నిజాయితీ గల అధికారులను పక్కనబెట్టి అవినీతిపరులను ప్రోత్సహించారని ఆరోపించారు.అంతేకాదు, ఫైళ్లను బ్లాక్ చేసి, పిటిషనర్లను ఫోన్ చేసి మానసికంగా హింసించేవారని, బదిలీల కోసం మహిళా సిబ్బందిని లైంగికంగా వేధించేవారని సంచలన ఆరోపణలు చేశారు.  పూరణ్ కుమార్ అవినీతి మూలాలు చాలా లోతుగా ఉన్నాయని, తనపై వచ్చిన ఫిర్యాదుల ఒత్తిడితోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారని సందీప్ పేర్కొన్నారు.ఇక తక్కువ వ్యవధిలోనే హర్యానా పోలీస్‌ శాఖలో ఇద్దరు ఉన్నతాధికారుల ఆత్మహత్యలు చోటుచేసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.   

ఇది డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ : మంత్రి లోకేశ్

  విశాఖలో గూగుల్ పెట్టుబడుల ఒప్పందం తర్వాత ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ఇది డబుల్ ఇంజిన్ సర్కార్ మాత్రమే కాదు. డబుల్ బుల్లెట్ ట్రైన్ అని పేర్కొన్నారు. కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, నిర్మలా సీతరామన్, సీఎం చంద్రబాబు, గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్‌లతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు. ఏపీ విశాఖలో టెక్ దిగ్గజం గూగుల్ తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్  హబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇది 'వికసిత భారత్' నిర్మాణ దార్శనికతకు అనుగుణంగా ఉందని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టుపై గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో చేసిన పోస్టుకు ప్రధాని మోదీ మంగళవారం బదులిచ్చారు. మరోవైపు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సోషల్ మీడియాలో స్పందిస్తూ, “విశాఖపట్నంలో గూగుల్ తొలి ఏఐ హబ్ ఏర్పాటు చేయబోతున్నాం. ఈ ప్రాజెక్టు ప్రణాళికలను ప్రధాని నరేంద్ర మోదీతో పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఇది భారతదేశానికి ఒక చారిత్రాత్మక క్షణం” అని పేర్కొన్నారు. ఈ ఏఐ హబ్ కేవలం ఒక కార్యాలయం మాత్రమే కాదు, దేశంలోని అత్యంత ఆధునిక సాంకేతిక మౌలిక సదుపాయాలతో కూడిన ఒక ఇన్నోవేషన్ సెంటర్‌గా రూపుదిద్దుకోనుందని ఆయన తెలిపారు. సుందర్ పిచాయ్ వివరించినట్లుగా, ఈ ప్రాజెక్టులో గిగావాట్ స్థాయి కంప్యూటింగ్ సామర్థ్యం, కొత్త అంతర్జాతీయ సబ్‌సీ గేట్‌వే, భారీ ఇంధన మౌలిక సదుపాయాలు వంటి అంశాలు ఒకే చోట కలవనున్నాయి. దీని ద్వారా గూగుల్ తమ అత్యాధునిక టెక్నాలజీని భారతీయ సంస్థలు, పరిశోధకులు, వినియోగదారులకు మరింత చేరువ చేయనుందని తెలిపారు. ఏఐ ఆవిష్కరణలను వేగవంతం చేయడంతో పాటు, భారతదేశ ఆర్థిక వృద్ధికి కూడా ఈ హబ్ దోహదం చేస్తుందని పిచాయ్ ఆశాభావం వ్యక్తం చేశారు. గూగుల్ ఈ నిర్ణయంతో విశాఖపట్నం త్వరలోనే ప్రపంచ స్థాయి టెక్నాలజీ కేంద్రంగా మారనుందనడంలో సందేహం లేదు

స్టూడెంట్ మౌనిక ఆత్మహత్య కేసులో కోచ్ అరెస్టు

  స్టూడెంట్ మౌనిక ఆత్మహత్య కేసులో వాలీబాల్ కోచ్ అంబాజీ నాయక్‌ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. కోచ్ అంబాజీ నాయక్ వేధింపులు భరించలేక మౌనిక ఆత్మహత్య చేసు కుంది. అయితే ఈ విషయం తెలిసిన వెంటనే కోచ్ అంబాజీ నిజామాబాద్ లోని తన ఊరికి పారిపోయాడు. అనంతరం తిరుపతికి వెళ్ళాడు. తిరుప తిలోని అడ్వకేట్ ను కలిసి ముందస్తు బెయిలు కోసం ప్రయత్నించాడు. తర్వాత తిరుపతి నుండి తిరిగి సికింద్రాబాద్‌కు వస్తుండగా అదే సమయంలో టాస్క్ ఫోర్స్ పోలీసులకు విశ్వసనీయమైన సమాచారంతో పోలీసులు నిందితుడిని  రైల్వేస్టేషన్‌లో అరెస్ట్ చేశారు.  విద్యార్థిని మౌనిక మృతి చెందగానే కోచ్ అంబాజీ తన మొబైల్ ఫోన్ తో పాటు సిమ్ కార్డును కూడా చేంజ్ చేశాడు. అంబాజీ నాయక్ పాత ఫోన్లో మౌనికను వేధింపు లకు సంబంధించిన డేటా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ డేటా పోలీసులకు దొరకకూడదని అంబాజీ సిమ్ కార్డు ఛేంజ్ చేశాడు. పోలీసులు సిమ్ కార్డు స్వాధీనం చేసుకుని డేటా సేకరించే పనిల్లో పడ్డారు.  సికింద్రాబాద్, లాలా గూడ పరిధిలో నివాసం ఉంటున్న మౌనిక తార్నాక రైల్వే డిగ్రీ కాలేజీలో బిబిఏ సెకండియర్ చదువుతుంది. అయితే అదే కాలేజీలో పని చేస్తున్న వాలీబాల్ కోచ్ అంబాజీ పెట్టిన వేధింపులు భరించ లేక ఆమె ఆత్మ హత్య చేసుకున్న విషయం తెలిసిందే.. కోచ్ వేధిం పుల వల్లే తన కూతురు సూసైడ్ చేసుకుందని మౌనిక తల్లిదం డ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగించి.. ఈరోజు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

టెక్‌ ప్రపంచంలో ఏపీ చరిత్రాత్మక అడుగు

  టెక్‌ ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్‌ చరిత్రాత్మక అడుగులు వేసింది. రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తూ విశాఖపట్నం కేంద్రంగా రూ. 87 వేల కోట్ల పెట్టుబడులు వెల్లువెత్తాయి. ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్ విశాఖలో అడుగు పెట్టేలా అనుబంధ సంస్థ రైడన్‌ ప్రతినిధులతో రాష్ట్ర ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, అశ్వినీ వైష్ణవ్ సమక్షంలో గూగుల్ సంస్థ ప్రతినిధులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి లోకేష్‌  ఒప్పదం చేసుకున్నారు.  ఢిల్లీలోని తాజ్‌ మాన్‌సింగ్‌ హోటల్‌లో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఇతర కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి.. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. గూగుల్ క్లౌడ్ గ్లోబల్ సీఈఓ థామస్ కురియన్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు, నిర్మలా సీతారామన్, అశ్వినీ వైష్ణవ్, లోకేశ్ ఈ మేరకు వివిధ అంశాలపై చర్చించారు. ఈ ఒప్పందంతో విశాఖను ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ నగరంగా రూపొందించడంలో తొలి అడుగు పడినట్లయింది.  గూగుల్ డేటా సెంటర్ విశాఖలో కార్యకలాపాలు ఆరంభించే తరుణంలో భారతదేశ ఏఐ రాజధానిగా ఆంధ్ర ప్రదేశ్ గుర్తింపు పొందుతుంది. అమెరికా బయట అతి పెద్ద ఏఐ కేంద్రాన్ని విశాఖపట్నంలో పెడుతున్నారు. వచ్చే ఐదేళ్లలో గూగుల్ $15 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది. సీఎం చంద్రబాబు దిశా నిర్దేశంలో ఐటీ - ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ అవిశ్రాంత కృషితో, కూటమి ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహంతో ఏపీకి గూగుల్, టీసీఎస్, ఎసెంచర్ వంటి ప్రపంచస్థాయి కంపెనీలన్నీ క్యూ కడుతూ యువతకు ఉద్యోగావకాశాలను మెరుగుపరుస్తున్నాయి.