సడన్‌గా ప‌వ‌న్‌పై కోమ‌టిరెడ్డి దాడి వెన‌క‌ మర్మం ఏంటో?

  ఏపీ ఉప  ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇటు ఏపీలోని  వైసీపీ ఆపై తెలంగాణ‌లోని బీఆర్ఎస్, కాంగ్రెస్ లీడ‌ర్ల  పాలిట  పంచ్ బ్యాగ్ అయ్యారా? అంటే అవున‌నే తెలుస్తోంది. అప్పుడెప్పుడో ప‌వ‌న్  రాజోలు ప‌ర్య‌ట‌న చేసిన‌పుడు.. అన్యాప‌దేశంగా ఒక మాట అనేశారు. అదేంటంటే ఏపీ,  తెలంగాణ విడిపోవ‌డానికి కార‌ణం కోన‌సీమ‌లోని ప‌చ్చ‌ద‌న‌మే అనేశారు. అందుకే ఇక్క‌డి కొబ్బ‌రి చెట్లు మోడువారిపోయాయ‌ని అనాలోచితంగా అనేశారాయ‌న‌.  త‌న చేతిలో మైకు ఉన్న‌ద‌న్న ఆలోచ‌న‌లో ప‌వ‌న్ ఉన్న‌ట్టు లేరు. ఆపై అక్క‌డి  జ‌నాన్ని ఏదో ఊర‌డించ‌డానికి కూడా ఆయ‌నిలా అని  ఉంటారేమో తెలీదు. తాను ఉప  ముఖ్య‌మంత్రిన‌నీ..  ఇలాంటి మాట‌లు అనాలీ, అన‌కూడ‌ద‌న్న సోయ కూడా ప‌వ‌న్ కి ఆ టైంలో లేక పోయి ఉండొచ్చు. విచిత్ర‌మైన విష‌య‌మేంటంటే రెండు తెలుగు రాష్ట్రాల‌తో పాటు దేశ వ్యాప్తంగా ఎంతో పాపుల‌ర్ అయిన ప‌వ‌న్ అన్న విష‌యం ఒక్కోసారి  మ‌ర‌చి పోయే ప‌వన్ ఇంట్లో వాళ్ల ముందు మాట్లాడిన‌ట్టు ఆ ప్రాంత  ప్ర‌జ‌ల ముందు మాట్లాడేశారు. మ‌న కోన‌సీమ‌కు తెలంగాణ వాళ్ల న‌ర‌దిష్టి త‌గిలి ఉంటుంద‌ని.. అనేశారు. అందుకే ఆ చెట్లు అలా మోడు వారి పోయాయ‌ని తేల్చేశారు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. అయితే ఈ వియంలో ఫ‌స్ట్ రియాక్ట‌య్యింది మాత్రం బీఆర్ఎస్ మాజీ  మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి. ఆపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి. అటు పిమ్మ‌ట వైసీపీ మాజీ మంత్రి అంబ‌టి సైతం ఈ విష‌యంపై త‌న‌వైన సెటైరిక‌ల్ కామెంట్స్ చేశారు. ఇక ఎమ్మెల్సీ బ‌ల్మూరి, మంత్రి వాకిటి శ్రీహ‌రి త‌దిత‌ర మంత్రులు కూడా ప‌వ‌న్ని తిట్ట‌డంలో త‌లో నాలుక వేశారు. ఇక అంద‌రూ అయిపోయారు. ఇక్క‌డితో ఈ మొత్తం వ్య‌వ‌హారం స‌ద్దుమ‌ణిగిన‌ట్టేన‌ని భావించిన‌పుడు స‌డెన్ స‌ర్ ప్రైజ్ గా తెలంగాణ సినిమాటోగ్ర‌ఫీ మంత్రి కోమ‌టి రెడ్డి వెంక‌ట‌రెడ్డి రియాక్ట‌య్యారు. దొంగ‌లు ప‌డ్డ ఆర్నెల్ల త‌ర్వాత ఏంటీ మోత‌.. అన్న ప్ర‌శ్న‌కు ఆస్కార‌మేర్ప‌డింది. ఈ మ‌ధ్య కాలంలో కోమ‌టిరెడ్డికి మంత్రిమండ‌లిలో త‌గిన ప్ర‌యారిటీ ఇస్తున్న‌ట్టు కూడా క‌నిపించ‌డం లేదు. ఇందుకు రిల‌వెంట్ గా ఒక ఎగ్జాంపుల్ ని బ‌ట్టీ చూస్తే.. సీఎం రేవంత్ సినిమాటోగ్ర‌ఫీ మంత్రి అయిన  కోమ‌టిరెడ్డికి ఎలాంటి  స‌మాచారం ఇవ్వ‌కుండానే జూబ్లీ ప్ర‌చారంలో.. సినిమా వారిపై వ‌రాల జ‌ల్లు కురిపించారు. .సంబంధిత మంత్రి అయిన కోమ‌టిరెడ్డి తో సంబంధం లేకుండా సినిమా వారంద‌రితో భేటీ  అయ్యారు కూడా. ఇంకా ఎన్నెన్నో వ‌రాల‌ను సినీ కార్మికుల‌పై కుమ్మ‌రించారు. దీంతో అంద‌రిలోనూ ఒక అనుమానం.. సంబంధిత మంత్రి. కోమటిరెడ్డి ఆఫ్ ప్రెజ‌న్స్ లో.. సీఎం ఈ త‌ర‌హా వ్య‌వ‌హార‌శైలి ఏంట‌న్న ప్రశ్న  త‌లెత్తింది. దీనంత‌టికీ  కార‌ణం కోమ‌టిరెడ్డి మంత్రి ప‌ద‌వి  ఊడిపోనుంద‌న్న మాట వినిపించింది. మ‌రి వీట‌న్నిటి న‌డుమ కోమ‌టిరెడ్డి త‌న ఉనికి కాపాడుకోవ‌డంలో భాగంగానే ప‌వ‌న్ పై ఈ కామెంట్లు చేశారా? అన్న అనుమానం వ‌స్తోంది. త‌న మంత్రిత్వానికి ప్ర‌మాదం ఉంద‌నో ఏమో ఇటీవ‌ల రేవంత్ రెడ్డి కోసం ప్ర‌త్యేక పూజ‌లు చేయించారు కోమ‌టిరెడ్డి. వీట‌న్నిటిని బ‌ట్టీ చూస్తుంటే కోమ‌టిరెడ్డి ఏదో ట్ర‌బుల్లో ఉన్న‌ట్టు క‌నిపిస్తోంద‌ని అంటున్నారు కొంద‌రు. అన్న వెంక‌ట‌రెడ్డి ప‌రిస్థితి ఇలా ఉందంటే త‌మ్ముడు రాజ‌గోపాల్ రెడ్డి వ్య‌వ‌హారం  చూస్తే.. మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌లేద‌ని ఎప్ప‌టి నుంచో బుంగ‌మూతి పెట్టుకుని  కూర్చున్నారు. మ‌రి ఈ న‌ల్గొండ‌ బ్ర‌ద‌ర్స్ ఫ్యూచ‌రేంటి?  తెలియాల్సి ఉంది.

అవినీతి కేసులను మూసేయించుకునేందుకు చంద్రబాబు ప్లాన్ : బొత్స

  తనపై ఉన్న అవినీతి కేసులను మూసివేయించడానికి సీఎం చంద్రబాబు తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పద్ధతి ప్రకారం కుట్రపూరితంగా వ్యవహరించి  కేసులు మూసివేయిస్తున్నారంటూ మండిపడ్డారు.  ఆ ఆరోపణలపై నిష్పక్షపాతంగా వ్యహరించాల్సిన దర్యాప్తు అధికారులు కూడా పూర్తిగా కేసుల మూసివేతకు సహకరిస్తున్నారని బొత్స పేర్కొన్నారు . తనపై ఉన్న కేసులను ఎదుర్కొనే ధైర్యం లేక ముఖ్యమంత్రి అడ్డదారులు తొక్కుతున్నారు. తద్వారా వ్యవస్థలను కలుషితం చేసి, ప్రజాస్వామ్య వ్యవస్థలను అపహాస్యం చేస్తున్నారు.  దేశంలో ఇంత బరితెగింపునకు దిగిన రాజకీయనాయకుడ్ని ఎక్కడ చూడం. తన రాజకీయ జీవితం ప్రారంభం నుంచి కూడా చట్టం నుంచి ఈ రకంగా తప్పించుకోవడం చంద్రబాబుకి అలవాటేని ఆరోపించారు. అదే ఒరవడి ఈసారి కూడా కొనసాగుతోంది. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్న చంద్రబాబుపై గవర్నర్‌ తక్షణం చర్యలు తీసుకోవాలని. అధికార దుర్వినియోగాన్ని అడ్డుకోవాలి. దర్యాప్తు సంస్థల స్వతంత్రతను కాపాడాలని బొత్స డిమాండ్ చేశారు.

హైదరాబాద్‌లో ఆందోళన కలిగిస్తున్న కుక్క కాటు కేసులు

  హైదరాబాద్‌లో కుక్కకాటు ఘటనలు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో రేబిస్ వ్యాధి ప్రబలకుండా ప్రజలు జాగ్రత్తలు తీసు కోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రేబిస్ వ్యాధి ప్రాణాంతకరమైనదని, కుక్కకాటు జరిగిన వెంటనే గాయం శుభ్రం చేయడమే కాకుండా ప్రి–ఎక్స్‌పోజర్ మరియు పోస్ట్–ఎక్స్‌పోజర్ వ్యాక్సినేషన్ తప్పనిసరిగా తీసుకోవాల‌ని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిలో కుక్కకాటు కేసులకు ప్రత్యేక చికిత్స అందిస్తున్నట్లు ఆసుపత్రి సూపరిండెంట్ డా. రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ, ఈ ఏడాది ఇప్పటివరకు కుక్క కాటు కేసుల సంఖ్య గణనీయంగా పెరిగినట్టు వెల్లడించారు. 2023లో 27,172 కుక్కకాటు కేసులు నమోదు కాగా, రేబిస్ కారణంగా 13 మంది మరణించారు. 2024లో కేసులు 29,054కు పెరిగి, రేబిస్‌తో 26 మరణాలు చోటుచేసుకున్నాయి. 2025లో (నవంబర్ వరకు) 31,488 కుక్కకాటు కేసులు నమోదు కాగా, రేబిస్ కారణంగా 38 మంది ప్రాణాలు కోల్పోయారు. కుక్కకాటు కేసుల్లో ప్రతి ఏడాది పెరుగుదల ఉండడం ఆందోళన కలిగిస్తున్నదని ఆయన పేర్కొన్నారు. రేబిస్ వ్యాధి ఒకసారి సోకితే ప్రాణాంతకమని, అందువల్ల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడమే ప్రజలు చేయగల ముఖ్యమైన చర్య అని ఆయన వివరించారు. కుక్కకాటు జరిగిన వెంటనే కనీస నిర్లక్ష్యమూ ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నగరంలో పెరుగుతున్న ఘటనలను దృష్టిలో ఉంచుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.  హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాలలో వీధి కుక్కలు వీరంగం సృష్టిస్తున్నాయి. ఒంటరిగా కనిపించే చిన్నపిల్లలు, మహిళలపై వీధి కుక్కలు విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరుస్తున్నాయి. ఇలా నగరంలో వాళ్ళు కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ రాజేంద్రప్రసాద్ కుక్క కాటు కేసులు ప్రతి సంవత్సరం పెరుగుతున్నయని.... అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ పలు సూచనలు చేశారు...  

తెలంగాణ గవర్నర్ అధికార నివాసానికి కొత్త పేరు

    తెలంగాణ రాష్ట్ర గవర్నర్ అధికారిక నివాసమైన రాజ్‌భవన్‌ కు పేరు మారింది. తెలంగాణ గవర్నర్ అధికారిక నివాసమైన “రాజ్ భవన్, తెలంగాణ” కు ఇకపై “లోక్ భవన్, తెలంగాణ” అనే కొత్త పేరును ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వచ్చింది. లోక్ భవన్ పేరును అమల్లోకి తేవడం ద్వారా, దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్న సమయంలో ప్రజాస్వామ్య విలువల బలాన్ని, ప్రజల ప్రాధాన్యతను మరింత స్పష్టం చేయాలని  ప్రభుత్వం  భావించింది.  సమాజంలో ప్రజాస్వామ్య విలువల పటిమను, జీవాంతకత్వాన్ని ప్రతిబింబించేందుకు ఈ మార్పు చేపట్టినట్లు అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.వికసిత భారత్ వైపు ధైర్యంగా అడుగులు వేస్తున్న ఈ సమయంలో ప్రజలే కేంద్రబిందువని గుర్తుచేయడం ఈ నామకరణం వెనుక ప్రధాన ఉద్దేశ్యంగా తెలుపబడింది.కొత్త పేరు “లోక్ భవన్, తెలంగాణ” ఇకపై అన్ని అధికారిక పత్రాలు, సూచనలు, రికార్డులు మరియు ప్రభుత్వ కమ్యూనికేషన్లలోనే ఉపయోగించబడుతుంది.

గంజాయి డాన్‌ నీతుబాయి ఇంటిపై పోలీసుల దాడి

  నానక్ రాంగూడలో నివాసం ఉంటున్న నీతుబాయి గంజాయి వ్యాపారం చేయడంలో కింగ్... ఇప్పటికే ఈ లేడీ డాన్ ను పోలీసులు పట్టుకొని జైల్లో పెట్టారు. అయినా కూడా వీరి ప్రవర్తనలో మార్పు రావడం లేదు.. మళ్లీ గంజాయి వ్యాపారాన్ని యదేచ్ఛగా కొనసాగిస్తున్నారు... అంతే కాదండోయ్ ఈ లేడీ డాన్ కుటుంబ సభ్యులు గంజాయితో పాటు మద్యం కూడా విక్రయాలు చేస్తూ... డబ్బులు సంపాదిస్తున్నారు. అయితే పోలీసులు గంజాయి విక్రయాలు చేసే ప్రాంతాలపై నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే నానక్‌ రాంగూడలో ఉన్న లేడీ డాన్ నీతూ బాయ్ ఇంట్లో గంజాయి విక్రయాలు జరుపుతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం రావడంతో ఎస్టీఎఫ్‌ బీ-టీమ్‌ పోలీసులు వెళ్ళి ప్రత్యేక దాడులు నిర్వహించారు. టీమ్‌ లీడర్‌ ప్రదీప్‌రావు, సీఐ బిక్షారెడ్డి, ఎస్సై బాలరాజు సిబ్బందితో కలిసి నీతు బాయి ఇంటిపై ఆకస్మిక సోదాలు చేశారు.  ఈ దాడుల్లో 786 గ్రాముల గంజాయి, 110 బీరు బాటిల్స్, బ్రీజర్‌, ఒక బైక్‌, అలాగే గంజాయి విక్రయాల ద్వారా వచ్చిన రూ. 60,890 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో గోవింద్, దుర్గెష్, నీతుబాయి కుమారుడు దుర్గ ప్రసాద్‌లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరు ఒరిస్సా నుండి గంజాయిని వివిధ పద్ధతుల్లో హైదరాబాదుకు తీసుకువచ్చి ఇక్కడ విక్రయిస్తున్నట్లు నిందితులు విచారణలో ఒప్పుకున్నారని టీమ్‌ లీడర్‌ ప్రదీప్‌రావు తెలిపారు. పట్టుబడిన నిందితులు, స్వాధీనం చేసిన గంజాయి, మద్యం, నగదును షేర్లింగంపల్లి ఎక్సైజ్‌ స్టేషన్‌ అధికారులకు అప్పగించి నట్లు పోలీసులు వెల్లడించారు.

కాంగ్రెస్ పార్టీకి ఖమ్మం జిల్లా కంచుకోట : సీఎం రేవంత్‌

  ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. పాల్వంచలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని ప్రారంభించారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ దేశంలో ఆకలి కేకలు చూసి ఎడ్యుకేషన్ ఇరిగేషన్ పెట్టాలని అప్పటి ప్రధాని నెహ్రు వారి వల్లనే సాధ్యమైందన్నారు. తెలంగాణలో ప్రాజెక్టులు శ్రీశైలం, ఎస్సారెస్పీ మొదలగు అన్ని నెహ్రు ప్రారంభించనవేని రేవంత్ స్పష్టం చేశారు. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు కీలక శాఖల్లో ఉండటం వల్లనే ఇక్కడ అభివృద్ధి వేగంగా అవుతుందని ముఖ్యమంత్రి అన్నారు.  సర్పంచ్‌లు మంచి వ్యక్తిని ఎన్నుకొండి అభివృద్ధి చేసే వాళ్లనే సర్పంచ్ లను చేయండని సీఎం పిలుపునిచ్చారు. భట్టి, తుమ్మల, పొంగులేటి ఏది అడిగినా ఇచ్చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి పునాది రాయి పడింది ఇక్కడే అని స్పష్టం చేశారు. రెండేళ్ల క్రితం మీరంతా ఓట్లేసి గెలిపిస్తేనే.. ప్రజలకు మంచి పాలన అందిస్తున్నాం. మంచి ప్రభుత్వం ఉంటేనే ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లు, సన్న బియ్యం, ఫ్రీ కరెంట్‌, రేషన్‌ కార్డులు వస్తాయి. గ్రామాల్లో సర్పంచ్‌లు కూడా మంచోళ్లు ఉండాలి. మంత్రులతో కలిసి పనిచేసే మంచి సర్పంచి మీ ఊళ్లో లేకపోతే.. గ్రామాలు దెబ్బతింటాయిని సీఎం రేవంత్ తెలిపారు.   

ఇక పీఎంవో పేరు సేవాతీర్థ్‌‌గా మార్పు

  కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పీఎంవో( ఆఫీస్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్) పేరును సేవాతీర్థ్‌గా మారుస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. దశాబ్దాలుగా సౌత్‌బ్లాక్‌లోని పీఎంవో నుంచి ప్రధానులు విధులు నిర్వర్తిస్తుండగా.. ఆ కార్యాలయం నూతన భవనంలోకి మారనుంది. ఈ నేపథ్యంలోనే పేరు మార్పుపై ప్రకటన వచ్చింది. ఇప్పటికే గవర్నర్ల అధికారిక నివాసం రాజ్‌భవన్‌ను లోక్‌భవన్‌గా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించిన విషయం తెలిసిందే. ఇక రాజ్ భవన్‌ల పేరు మార్పు ఉత్తర్వులు అందగానే వెంటనే పశ్చిమ బెంగాల్, త్రిపురా, కేరళ, తమిళనాడు, అస్సాం తదితర రాష్ట్రాలు డిసెంబర్ 1 నుంచి సైన్‌బోర్డులు, అధికారిక వెబ్‌సైట్లు, లెటర్‌హెడ్‌లు మార్చేశాయి. ఇదిలా ఉండగా.. తమిళనాడు, వెస్ట్ బెంగాల్ మాత్రం కేంద్ర ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాన్ని వ్యతిరేకించాయి. 

ఒక్క ఆదేశం.. నేతల తీరులో మార్పు.. చంద్రబాబు హ్యాపీ!

కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం విషయాలలో ఇసుమంతైనా వెనుకాడకుండా ముందుకు అడుగులు వేస్తున్నది. అయితే వేళ్ల మీద లెక్కపెట్టేంత మంది నాయకులు, ఎమ్మెల్యేలు వినా మిగిలిన వారంతా పెద్దగా ప్రజల మధ్యకు రావడం లేదు. చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రభుత్వ కార్యక్రమాలలో పాలుపంచుకోవడం లేదు. ఇది ఎవరో ప్రత్యర్థులు చెబుతున్న మాట కాదు. స్వయంగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవలి కాలంలో పలు మార్లు చెప్పిన మాట. ఈ విషయంలో ఆయన తన అసంతృప్తిని ఇసుమంతైనా దాచుకోలేదు. బాహాటంగానే ఎమ్మెల్యేలు, మంత్రులు తమ పద్ధతి మార్చుకోవాలని ఒకింత ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. ముఖ్యంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో నాయ‌కులు పట్టనట్లు వ్యవహరించడాన్ని ఆయన తీవ్రంగా గర్హించారు కూడా.  ప్ర‌జ‌ల్లో సంతృప్తి పెంచేలా వ్య‌వ‌హ‌రించేందుకు ఎమ్మెల్యేలు, నాయకులు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని సమర్థంగా వినియోగించుకోవాలని, ప్రజల వద్దకు వెళ్లాలని పలు మార్లు ఆదేశించారు.  అయితే చంద్రబాబు నోటి మాటగా ఇచ్చిన ఈ సూచనలూ, ఆదేశాలు వారిపై పెద్దగా ప్రభావం చూపలేదు. చంద్రబాబు చెప్పారు, ఇక తప్పదన్నట్లు పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్నారు. ప్రజలతో  మమేకం కావడం లేదు. అదేదో తమకు సంబంధించని ఓ ప్రభుత్వ కార్యక్రమంలా భావిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఓ స్పష్టమైన ఆదేశం జారీ చేశారు. అది సత్ఫలితాలను ఇచ్చింది. ఇంతకీ ఆ ఆదేశం ఏమిటంటే..  పింఛ‌న్లు పంపిణీ చేసే కార్య‌క్ర‌మంలో నాయ‌కులు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఫొటోలు దిగి వాటిని పార్టీ కార్యాలయ వెబ్ సైట్ లో పోస్టు చేయాలి. కార్యక్రమం ప్రారంభం, ముగింపు ఇలా రెండు సమయాల్లోనూ నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులుఫొటోలు దిగాలనీ,  వాటిని పార్టీ ఆఫీస్ వెబ్ సైట్ లో పోస్టు చేయాలన్న చంద్రబాబు ఆదేశాలతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఇంత కాలం పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో తూతూ మంత్రంగా పాల్గొంటున్న వారూ, మొత్తానికే డుమ్మా కొట్టేస్తున్న వారూ ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. దీంతో సోమవారం (డిసెంబర్ 1)న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో దాదాపు 90శాతం మంది పాల్గొన్నారు. కేవలం పాల్గొనడమే కాదు.. ఆ కార్యక్రమం పూర్తయ్యే వరకూ ప్రజలలో మమేకం అయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు పార్టీ కార్యాలయ వెబ్ సైట్ లో పోస్టు చేశారు. దీంతో పార్టీ కార్యాలయ సిబ్బంది ఎవరెవరు ఎక్కడెక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అన్న వివరాలను గణాంకాలతో సహా చంద్రబాబుకు నివేదించారు. ఈ గణాంకాల ప్రకారం తాజాగా జరిగిన  ఎన్టీఆర్ భ‌రోసా పింఛ‌న్ల పంపిణీ కార్యక్రమంలో  90 శాతం మంది నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. దీనిపై సీఎం చంద్ర‌బాబు సంతోషం వ్యక్తం చేశారు. నేతలలో వచ్చిన మార్పు ను స్వాగతించారు. మిగిలిన పది శాతం మంది కూడా ముందుకు రావాలని, ప్రభుత్వ కార్యక్రమాల్లో వంద శాతం నాయకులు పాల్గొనాలనీ సూచించారు. 

పవన్‌ క్షమాపణ చెప్పకపోతే సినిమాలు ఆడనివ్వం : కోమటిరెడ్డి

  ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై తెలంగాణ మంత్రి  కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా చెబుతున్నా..పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పకపోతే అతని సినిమాలు తెలంగాణలో ఆడవు అని అన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు, తెలంగాణ ప్రజలను అవమానిస్తే ఊరుకోమని హెచ్చరించారు.  పవన్ కళ్యాణ్ వెంటనే క్షమాపణలు చెప్తే తెలంగాణలో ఆయన సినిమాలు కనీసం ఒకటి రెండు రోజులైన ఆడుతాయి.. లేకపోతే తెలంగాణలో ఆయన సినిమాలు ఆడనివ్వమని మంత్రి తెలిపారు.  పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు నన్ను తీవ్రంగా బాధించాయి. తెలంగాణ ప్రజల దిష్టి వల్ల కాదు, గత ఆంధ్ర పాలకుల వల్లే ఇక్కడి ప్రజలు ఫ్లోరైడ్ నీళ్లు తాగారు.  ఈ విషయం తెలుసుకోకుండా మాట్లాడటం సరికాదు. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. పవన్ సోదరుడు చిరంజీవి సూపర్ మ్యాన్‌గా అభివర్ణించిన ఆయన చాలా మంచి వ్యక్తి. కానీ, పవన్ కల్యాణ్‌కు రాజకీయ అనుభవం లేనట్లుంది. అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు" అని కోమటిరెడ్డి అభిప్రాయపడ్డారు. పవన్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే మంచిదని హితవు పలికారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ ఆదాయాన్ని విశాఖ పట్నం, తిరుపతికే వాడుకున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు. అసలు పవన్ ఏమన్నారంటే? ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ గోదావరి జిల్లాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ... గోదావరి జిల్లాల పచ్చదనం వల్లే ఆంధ్రప్రదేశ్ విడిపోయిందని అన్నారు. తెలంగాణ నేతల దిష్టి తగలడం వల్లే గోదావరి జిల్లాల్లో కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయని ఆయన అన్నారు. ఈ కామెంట్స్‌పై తెలంగాణ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

జీడిమెట్లలో అర్ధరాత్రి యువతి హంగామా

  పీకలదాకా మద్యం సేవించిన ఓ మహిళ మాది ఆంధ్ర.. అంటూ తొడ కొడుతూ రోడ్డు మీద హంగామా సృష్టించిన ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. మద్యం మత్తులో ఉన్న ఓ యువతి నిన్న అర్ధరాత్రి సమయంలో రహదారిపై వెళ్తున్న వాహనదారులు, పాదచారులను దుర్బాష లాడుతూ  హంగామా సృష్టించడంతో అక్కడ ఉద్రిక్తత  వాతావరణం నెలకొంది.  ఆకస్మికంగా జరిగిన ఈ పరిణామంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమీపంలో ఉన్న స్థానికులు పరిస్థితిని గమనించి వెంటనే జీడిమెట్ల పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మద్యం మత్తులో ఉన్న ఆ యువతి ఇదంతా అడవి... డబ్బుంటే అన్ని ఉంటాయి. అందుకే కేసీఆర్ నేను ఉన్ననని చెప్పాడు.. కేసీఆర్, జగన్ ఇద్దరు మంచోళ్ళు... నాకు కేసీఆర్ కావాలి... ఒక నెలలో ఈ కాంగ్రెస్ పార్టీ పోయి కేసీఆర్ వస్తాడు.  కేసీఆర్ కోసం మగవాళ్ళు మాత్రమే  చేస్తారని అంటున్నారు కదా ఇప్పుడు నేను వచ్చారు.. నాది ఆంధ్ర అంటూ తొడగొడుతూ.. నేను విజయవాడ తాడేపల్లి కి చెందిన మహిళను.. మా జగన్ మామ హీరో.... ఆంధ్రాలో జగన్... తెలంగాణలో కేసీఆర్ ఇద్దరు సూపర్... కెసిఆర్ కోసం వచ్చాను అంటూ పోలీసులతో ఏదేదో మాట్లా డుతూ నడిరోడ్డు మీద నానా రచ్చ రచ్చ చేసింది.  అంతసేపు పోలీసులు చాలా ఓపికగా ఆమెతో మాట్లా డడంతో ఆమె పరిస్థితి వారికి అర్థమైంది. ఆమె అస్వస్థత ను గమనించిన పోలీసులు, మెరుగైన వైద్యసాయం అందించేం దుకు 108 అంబులెన్స్‌కు సమాచా రమిచ్చారు.తరువాత ఆమెను వైద్యం కోసం ఆసుపత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. మొత్తం ఘటనపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

అమరావతి కోసం.. రెండో విడత ల్యాండ్ పూలింగ్ కు నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం రెండో విడత ల్యాండ్ పూలింగ్‌కు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని ప్రాంతంలోని  గ్రామాలలో ల్యాండ్ పూలింగ్  కోసం మంగళవారం (డిసెంబర్ 2) నోటిఫికేషన్‌  విడుదల చేసింది. రెండో విడత ల్యాండ్ పూలింగ్ లో మొత్తం 16,666 ఎకరాల సమీకరణకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అమరావతి, తుళ్లూరు మండలాలలోని గ్రామాలలో ఈ ల్యాండ్ పూలింగ్ జరగనుంది.   అమరావతి మండలంలోని వైకుంఠపురం, పెద్ద మద్దూరు, ఏండ్రాయి, కర్లపూడి, లెమల్లె గ్రామాల్లో 7,465 ఎకరాలు,  తుళ్లూరు మండలంలోని వడ్లమాను, హారిచంద్రపురం, పెద్ద పరిమి   గ్రామాలలో 9,097 ఎకరాలకు ల్యాండ్ పూలింగ్ కింద భూ సమీకరణ చేయనున్నారు.  రాజధాని అమరావతి ప్రాంతంలో రెండో విడత ల్యాండ్ పూలింగ్‌ చేపట్టాలన్న ప్రతిపాదనకు గత వారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే.  

ఐదు లక్షల బీమా...పెళ్లికి పుస్తే మెట్టెలు సర్పంచ్ అభ్యర్థి వరాలు

  తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గ్రామ సర్పంచ్‌గా పోటీ చేసే అభ్యర్థులు గ్రామస్తులపై వరాల జల్లు కురిపిస్తున్నారు. ఒక్కొక్క గ్రామంలో సర్పంచ్‌గా ఎన్నికల్లో నిలబడ్డ వ్యక్తులు అనేక హామీలు ఇస్తూ ప్రజలను మభ్యపెడు తున్నారు. ఇంటింటికి ఐదు లక్షల బీమా, అమ్మాయి పెళ్లికి పుస్తే మెట్టెలు, ఉచిత అంబులెన్స్ అంటూ గ్రామ ప్రజలకు పోటాపోటీగా ఇలా రకరకాల హామీలు ఇస్తున్నారు... రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కొత్తపేట గ్రామంలో పనుల వనమ్మ నరసింహ యాదవ్ అనే అభ్యర్థి సర్పంచ్‌గా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యం లోనే తనను సర్పంచ్‌గా గెలిపిస్తే ప్రతి ఇంటికి రూ.5 లక్షల చొప్పున జీవిత బీమా చేస్తానని హామీ ఇచ్చాడు. అయితే ఆ గ్రామంలో 700 ఇండ్లు ఉండగా, ప్రతీ ఇంటికి ఏడాదికి రూ.1200 ప్రీమియం కడితే, ఏడాదికి రూ.8.40 లక్షలు, ఐదేళ్లకు రూ.42.5 లక్షలు అవుతుందని గ్రామస్తులు తెలిపారు. అందుకు వనమ్మ నరసింహ యాదవ్ ఒప్పుకోవడమే కాకుండా ఈ హామీతో పాటు తన మ్యానిఫెస్టోలో మొత్తం 15 హామీలు ప్రకటించాడు. ఆడబిడ్డ పుడితే బంగారు తల్లి పథకం కింద రూ.5 వేల ఫిక్స్‌డ్ డిపాజిట్, ఆడబిడ్డ పెళ్లికి పుస్తె మెట్టెలు, అబ్బాయి వివాహనికి రూ.5,116 ఇస్తానని, ఊర్లో నెలకోసారి మెడికల్ క్యాంపు నిర్వహణ, శస్త్రచికిత్స అవసరం ఉన్నవారికి రూ.15వేల ఆర్థికసాయం, ఇల్లు కట్టుకునేవారికి స్లాబ్ వేసుకునే సమయంలో రూ.21వేలు, ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలు, బ్యాగులు, బూట్ల పంపిణీ, ఉన్నత చదువులకు ఆర్ధిక సాయం, గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటు  శివరాత్రి, శ్రీరామ నవమి, మొహరం సందర్భంగా ఊర్లో అన్నదానం, రంజాన్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు, గ్రామ భద్రత కోసం అన్ని వీధుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు, దహన సంస్కారాలకు రూ.10వేలు, అంత్యక్రియల కోసం వైకుంఠ రథం ఏర్పాటు చేస్తానంటూ మొత్తం 15 హామీలను తన మ్యానిఫెస్టో ద్వారా ప్రకటించాడు. ఇదిలా ఉండగా మరోవైపు గద్వాల జిల్లా గట్టు మండలం సల్కాపరం గ్రామంలో ఆంజనేయులు అనే అభ్యర్థి సర్పంచ్ గా పోటీ చేస్తున్నారు.తనను గెలిపిస్తే తాను అమలు చేసే 22 హామీలతో మేనిఫెస్టోను వంద రూపాయల బాండ్ పేపర్ మీద రాసిచ్చి, ఈ హామీలను అమలు చేయకపోతే పదవి నుండి తప్పుకుంటానని బాండ్ పేపర్లో పేర్కొన్నాడు.  ఇక సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి మండలంలో ఉన్న గుడితండ గ్రామంలో గుగులోతు జయపాల్ నాయక్ అనే అభ్యర్థి సర్పంచ్ గా పోటీ చేస్తున్నారు... గుడితండ గ్రామ పంచాయితీ సర్పంచ్ గా నన్ను ఎన్నుకుంటే నేను కానీ, నా కుటుంబ సభ్యులు కానీ ఇప్పుడున్న ఆస్తులకు మించి అక్రమంగా ఎంత సంపాదించినా... కూడా అలా పెరిగిన వాటిని గ్రామపంచాయతీ జప్తి చేసి ప్రజలకు పంచవచ్చునని తెలియజేస్తూ.. ఈ బాండ్ పేపర్ మీద రాసి మీ అందరి చేతుల్లో పెడుతున్నాను.  పనులు చేయడానికే ప్రజల దగ్గరికి వచ్చాను. గ్రామపంచాయతీ సొమ్మును అక్రమంగా వాడుకోను అంటూ హామీతో కూడిన మేనిఫెస్టోను వంద రూపాయల బాండ్ పేపర్ మీద రాసిచ్చారు... అనేక గ్రామాల్లో అభ్యర్థులు కురిపిస్తున్న వరాల జల్లు కారణంగా, వారు ఇచ్చే హామీల కారణంగా, వేలం పాట ద్వారా గ్రామస్తు లందరూ కలిస సర్పంచ్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకుంటు న్నారు.  ఇలా అనేక గ్రామాల్లో నివాసముంటున్న గ్రామ ప్రజలు ఆదిలాబాద్ జిల్లాలో 22 మంది, నిజామాబాద్ జిల్లాలో 10 మంది, కామారెడ్డిలో 5 మంది, నిర్మల్ జిల్లాలో 8 మంది, ఖమ్మం జిల్లాలో 6 మంది, జనగామ జిల్లాలో 6, వరంగల్ జిల్లాలో 5 మంది, మహబూబాబాద్ జిల్లాలో 3 మంది, మహబూబ్‌నగర్‌ జిల్లాలో 2 మంది, ములుగు, భూపాలపల్లి జిల్లాలో ఒక అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు...నల్గొండ జిల్లా కొండమల్లెపల్లి మండలం చిన్న ఆడిశర్లపల్లి గ్రామంలో, గుర్రంపోడు మండలం ములకలపల్లి గ్రామంలో దేవాలయం నిర్మిస్తామని చెప్పిన అభ్యర్థులను కూడా గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.  

మొంథా తుఫాను నష్టం రూ.6352 కోట్లు...అమిత్‌షాకు నివేదిక

  మొంథా తుఫాను కారణంగా ఏపీలో రూ.6352 కోట్ల నష్టం జరిగిందని మంత్రులు లోకేష్, అనిత కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు నివేదిక అందజేశారు.  న్యూఢిల్లీలో టీడీపీ ఎంపీలతో కలిసి అమిత్‌షాతో సమావేశం అయ్యారు. మొంథా తుపాను వల్ల మొత్తం 3,109 గ్రామాలు ప్రభావితమయ్యాయని  లోకేష్ తెలిపారు. 1.92 లక్షల మందిని పునరాస శిబిరాలకు తరలించామన్నారు.  ప్రతి కుటుంబానికి తక్షణ సాయం కింద 3 వేలు ఇచ్చామని తెలిపారు.కూటమి ప్రభుత్వం స్పందించి కూలిన చెట్ల తొలగింపు, తాత్కాలిక నివాస సౌకర్యాలు, నీటి సరఫరా పునరుద్ధరణ వంటి పలు చర్యలను చేపట్టింది. తక్షణ సహాయం కింద రూ.60 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది.  వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.271 కోట్లు, గృహ నష్టం రూ.7 కోట్లు, రహదారులు, మౌలిక సదుపాయాలకు రూ.4,324 కోట్లు, విద్యుత్ రంగానికి రూ.41 కోట్లు, నీటి వనరులు, నీటిపారుదల ప్రాజెక్టులకు రూ.369 కోట్లు, శాశ్వత నిర్మాణాలకు రూ.1,302 కోట్లు, సామూహిక ఆస్తులకు రూ.48కోట్ల మేర నష్టం వాటిల్లింది. మొత్తం రూ.6,356 కోట్ల నష్టంలో NDRF మార్గదర్శకాల ప్రకారం రూ.902 కోట్లు తక్షణ ఉపశమనం, తాత్కాలిక పునరుద్ధరణ కోసం అర్హమైనవి మంత్రి లోకేష్ పేర్కొన్నారు.  

లింగ భైరవీ ఆలయం ఎక్కడుంది.. ఆ దేవత ప్రత్యేకత ఏంటి?

ప్రముఖ నటి సమంత లింగభైరవీ దేవి ఆలయంలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో అసలీ లింగ భైరవీ దేవి ఎవరు? ఆమె ఆలయం ఎక్కడుంది? ఆ ఆలయ ప్రాసిస్థ్యం ఏమిటి? అని నెటిజనులు నెట్టింట తెగ సెర్చ్ చేస్తున్నారు. అంతే కాదు అందరిలో కూడా లింగభైరవీ దేవత ఎవరు? ఆమె ఆయలం ఎక్కడుందన్న ఆసక్తి వ్యక్తం అవుతోంది.   ఆ వివరాల్లోకి వెడితే..  పురుషుల్లో పరమేశ్వర రూపమైన కాలభైరవుడు ఉన్నట్టే.. స్త్రీ రూపంలో భైరవీ దేవి కూడా ఉంది.  లింగ భైరవీ దేవి శక్తిమంతమైన రూపమే కాకుండా లక్ష్మీ, సరస్వతీ, పార్వతీ మాతల సమ్మేళన స్వరూపంగా చెబుతారు పండితులు. తామస, రజో, సత్వ గుణాలను సైతం సూచిస్తుందని అంటారు.  దశ మహా విద్యలలో ఒకటిగా, కుండలినీ శక్తిగా.. పరమేశ్వర ప్రతిరూపమైన కాలభైరవుడి  సతీమణిగా.. లింగ భైరవీ దేవిని కొలుస్తారు. తమిళనాడులోని కోయంబత్తూరులో ఈశా ఫౌండేషన్ నిర్మించిన లింగ భైరవీ దేవి ఆలయంలో ఉంది. ఆ ఆలయంలోనే సమంత పెళ్లి చేసుకున్నారు. ఈ ఆలయంలో కేవలం మహిళా పూజారులు మాత్రమే ఉంటారు.   లింగ భైరవీ దేవి ఆలయంలో సమంత భూత శుద్ధి వివాహ వేడుక చేసుకున్నారు.   ప్రాచీన యోగ శాస్త్రం నుంచి ఉద్భవించిన ఈ వేడుక భౌతిక స్థితిగతులకు అతీతంగా జరుగుతుందని అంటారు పండితులు. ఇది ఆ దంపతుల మధ్య పంచభూత శక్తులను శుద్ధి చేసి వారి మధ్య బంధాన్ని మరింత బలోపేతమవుతుందని విశ్వసిస్తారు. ఇంతకీ ఏమిటీ భూత శుద్ధి వివాహమని చూస్తే.. పంచ భూతాలను శుద్ధి పరుచుకోడానికి.. అగ్ని చుట్టూ తిరిగి ప్రదిక్షణ చేస్తారు నూతన దంపతులు. ఈ వేడుక సారాంశం.. లింగ భైరవీ దేవి శక్తిలో లీనం కావడంగా చెబుతారు ఈశా ఫౌండేషన్ సద్గురు జగ్గీ వాసుదేవ్. దేవిని స్వయంగా ప్రతిష్టించిన సద్గురు మాటల్లో.. తీక్షణత, కరుణల కలబోత లింగ భైరవీ దేవి. ఈ స్త్రీ స్వరూపం 8 అడుగుల ఎత్తులో మూడున్నర చక్రాల శక్తితో దర్శనమిస్తారు. దేవి తన భక్తులకు సంపూర్ణ అనుగ్రహాన్ని శ్రేయస్సు ప్రసాదిస్తుంది. లింగభైరవీ మాత ఆధ్యాత్మిక ప్రగతికి సాయ పడుతుంది. ఈశా ఫౌండేషన్లో గల లింగభైరవీ దేవి ఆలయం ఉదయం ఆరున్నర గంటల నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర వరకూ తిరిగి సాయంత్రం 4.30 గంటల నుంచి రాత్రి 8.30గంటల వరకూ తెరిచి ఉంటుంది. పౌర్ణమి, నవరాత్రుల సమయాల్లో ఇక్కడ ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి.  ఈ పురాతన ప్రక్రియలో కేవలం కొత్త జంటలు మాత్రమే కాదు.. ఇప్పటికే పెళ్లయిన జంటలు కూడా  పాల్గొనవచ్చని అంటున్నారు.  ఈ పవిత్రమైన అనుభూతిని పొందాలనుకునే జంటలు vivaha@isha.org కు మెయిల్ పంపడం ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చని చెబుతున్నారు. అయితే వివాహ ధృవీకరణ పత్రం తప్పనిసరిగా తీసుకురావాలని అంటున్నారు ఇక్కడి వారు. ఇక లింగభైరవీ దేవి ఆలయంలో వివాహ మాడదలు చుకున్న వారు అదనపు రుసుము చెల్లిస్తే ఫోటోగ్రఫీతో పాటు, వీడియోగ్రఫీతో కలిపి లైవ్ సైతం అందిస్తామని చెబుతున్నారు.

చిక్కుల్లో వల్లభనేని వంశీ.. విషయమేంటంటే?

వైసీపీ నాయకుడు, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పీకల్లోతు చిక్కుల్లో కూరుకుపోయినట్లేనా అంటే తాజాగా జరిగిన పరిణామంతో పరిశీలకులు ఔననే అంటున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన వంశీ.. అసెంబ్లీకి ఎన్నికైన రెండు సార్లూ కూడా తెలుగుదేశం అభ్యర్థిగానే విజయం సాధించారు. 2014, 2019 ఎన్నికలలో ఆయన గన్నవరం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలై ప్రతిపక్షానికి పరిమితమైన సందర్భంలో వల్లభనేని వంశీ అవకాశవాదిగా మారి వైసీపీ పంచన చేరారు. రాజకీయాలలో పార్టీలు మారడం అసాధారణమేమీ కాదు. అయితే పార్టీ మారిన తరువాత మాత్రం ఆయన వ్యవహార శైలి అసాధారణంగా మారింది. తనకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ పట్లే కక్షగట్టినట్లుగా వ్యవహరించారు. ఇంత కాలం తన వెన్నంటి ఉండి, తన గెలుపులో కీలకంగా వ్యవహరించిన తెలుగుదేశం శ్రేణులు లక్ష్యంగా దౌర్జన్యాలకు దిగారు. పార్టీ అధినేతపైనా, అధినేత కుటుంబంపైనా కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. తల్లిలాండి భువనేశ్వరిని సైతం దుర్భాషలాడారు. దేవాలయం లాంటి పార్టీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు.  ఈ నేపథ్యంలోనే 2024 ఎన్నికలలో  వైసీపీ ఘోర పరాజయం పాలైంది. వంశీ స్వయంగా గన్నవరం నుంచి ఓడిపోయారు. వైసీపీ హవా కొనసాగిన కాలంలో కూడా తెలుగుదేశం అభ్యర్థిగా విజయం సాధించిన వల్లభనేని వంశీ ఆ పార్టీకి దూరం కావడంతో పరాజయం పాలై మాజీ అయిపోయారు. అయితే గతంలో చేసిన తప్పులు వదలవుగా.. ఎంతటి వారైనా సరే కర్మ అనుభవించక తప్పదుగా? అందుకే వైసీపీ అండ చూసుకుని చెలరేగిపోయి దాడులు, దౌర్జన్యాలకు పాల్పడిన వంశీకి ఆ కేసులు చుట్టుముట్టాయి. దాడులు, దౌర్జన్యాలు, మోసం, కబ్జా ఇలా పలు ఆరోపణలు, ఫిర్యాదులు, కేసులు వంశీపై ఉన్నాయి. వీటిల్లో గన్నవరం తెలుగుదేశం కార్యాలంపై దాడి కేసులో ఫిర్యాదు దారుడిని కిడ్నాప్ చేసి బెదిరించిన కేసులో వంశీ అరెస్టై ఏకంగా 137 రోజులు రిమాండ్ ఖైదీలో కటకటాల వెనుక గడిపి బెయిలుపై బయటకు వచ్చారు.  అయితే తాజాగా అదే కేసులో నిందితులై ఇంత కాలం పరారీలో ఉన్న వంశీ ప్రధాన అనుచరులలో ఇద్దరిని కోర్టు రిమాండ్ కు పంపింది. గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో పరారీలో ఉన్నవంశీ అనుచరులు వజ్రకుమార్, తేలప్రోలు రాముపై కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దీంతో వారిరువురూ ఆ వారెంట్ వెనక్కు తీసుకోవాలని కోరుతూ  విజయవాడ ఎస్సీఎస్టీ కోర్టును ఆశ్రయించారు. ఆ సందర్భంగా ఇరువురూ కోర్టులో సరెండర్ అయ్యారు. వారి అభ్యర్థనపై విచారణ జరిపిన కోర్టు విచారణ పూర్తయిన  తరువాత వారిరువురినీ ఈ నెల 15 వరకూ రిమాండ్ కు పంపిసతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వారిరువురినీ కోర్టు నుంచి నేరుగా జైలుకు తరలించారు పోలీసులు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఇంకా నలుగురు పరారీలోనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఇరువురిని కోర్టు రిమాండ్ కు పంపడంతో ఈ కేసులో బెయిలుపై ఉన్న వంశీకి కూడా చిక్కులు తప్పవని అంటున్నారు.  ఈ ఇరువురి అరెస్టు ప్రభావం బెయిలుపై ఉన్న వంశీపై పడటం ఖాయమంటున్నారు. 

వైసీపీ నుంచి విడదల రజనీ ఔట్?

మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకురాలు విడదల రజనీ జగన్ కు ఝలక్ ఇవ్వనున్నారా? వైసీపీని వీడుతానంటూ పార్టీ అధినేతకు లీకులు పంపిస్తున్నారా? అంటే వైసీపీ వర్గాలు ఔననే అంటున్నాయి. తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన విడదల రజినీ.. అప్పట్లో తాను చంద్రబాబు నాటిన సైబరాబాద్ మొక్కను అంటూ చెప్పుకునే వారు. అయితే తరువాత ఆమె వైసీపీ గూటికి చేరి పలుకు మార్చారు. అసలింతకీ ఆమె పొలిటికల్ జర్నీ ఎలా సాగింది.. ఇప్పుడు వైసీపీ పట్ల ఆమెకు ఎందుకు అంత విరక్తి కలిగిందన్నది చూస్తే...  2014లో ప్రత్తిపాటి పుల్లారావు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన విడదల రజినీ తెలుగు ఇంగ్లీష్, హిందీ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలగడానికి తోడు మంచి వాక్చాతుర్యం  ఉండటంతో అనతి కాలంలోనే తెలుగుదేశం సీనియర్ల గుర్తింపు పొందారు. ఆ క్రమంలోనే  అప్పట్లో విశాఖ వేదికగా జరిగిన మహానాడులో మాట్లాడే చాన్స్ పొందారు.  ఆ అవకాశం రజనికి పార్టీలో మంచి గుర్తింపు తీసుకు వచ్చింది. అంతే కాకుండా..   హైదరాబాద్‌లోని సైబరాబాద్‌లో మీరు నాటిన ఈ మొక్కను అంటూ రజనీ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో అందరినీ బాగా హత్తుకున్నాయి. అదే మహానాడు వేదికపై నుంచి అప్పటి ప్రతిపక్ష నేత వైయస్ జగన్, ఆయన తండ్రి వైయస్ రాజశేఖరరెడ్డిలను నరకాసురులుగా అభివర్ణించిన విడదల   రజినీ మాటలకు తెలుగు తమ్ముళ్లే కాదు, వేదికపైన ఉన్న పెద్దలు సైతం ఫిదా అయిపోయారు.   ఈ నేపథ్యంలో చిలకలూరి పేట సీటు కోసం విశ్వప్రయత్నం చేసిన విడదల రజినికి తెలుగుదేశం హైకమాండ్ నిష్కర్షగా నో చెప్పేసింది. దీంతో ఆమె  తెలుగుదేశం వీడి జగన్ పార్టీలో చేరిపోయారు. 2019 ఎన్నికలలో ఆ పార్టీ అభ్యర్థిగా చిలకలూరి పేట నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తరువాత జగన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఏకంగా మంత్రిపదవి సైతం చేజిక్కించుకున్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా చిలకలూరిపేట కేంద్రంగా రజనీ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆమెపై పలు కేసులు సైతం ఉన్నాయి. అవన్నీ పక్కన పెడితే 2024 ఎన్నికలలో తన ఘోర పరాజయానికి తనను చిలకలూరి పేట నుంచి గుంటూరుకు మార్చడమేనని గట్టిగా నమ్ముతున్నారు. అందుకే ఓటమి తరువాత ఆమె మళ్లీ చిలకలూరి పేటకు వచ్చేశారు. జగన్ ఆమె రిటర్న్ బ్యాక్ కు అనుమతించారో లేదో తెలియదు కానీ, 2029లో చిలకలూరి పేట నుంచే పోటీ చేయాలన్న ధృఢ నిశ్చయంతో ఆమె ఉన్నారంటారు ఆమె అనుచరులు. అయితే ఇప్పుడు తాజాగా ఆమెను రేపల్లె వైసీపీ ఇన్ చార్జ్ గా వెళ్లమని జగన్ ఆదేశించారనీ, అది ఇష్టం లేని రజినీ ఇక వైసీపీకి గుడ్ బై చెప్పేయాలనుకుంటున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ప్రచారానికి కర్త, క్రియ, కర్మ అన్నీ రజినీ వర్గీయులేనని కూడా అంటున్నారు.రేపల్లె ప్రపోజల్ వచ్చినప్పటి నుంచీ రజినీ సైలంట్ అయిపోయారంటున్నారు. చిలకలూరి పేట నియోజకవర్గంలో ఆమె వాయిస్ వినిపించడం లేదు. ఏ కార్యక్రమంలోనూ ఆమె కనిపించడం లేదు. ఇది మాత్రం వాస్తవం. ఇక పోతే వైసీపీకి గుడ్ బై చెప్పి విడదల రజిని చేరే పార్టీ ఏదన్న దానిపై పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపిస్తున్నాయి.  జనసేన, బీజేపీ అంటూ ప్రచారం జరుగుతున్నా.. అదేం జరిగే పని కాదన్న అభిప్రాయమూ వ్యక్తం అవుతోంది. వైసీపీలో ఓ వెలుగు వెలిగిన వాళ్లు.. అలా వెలగడానికి కారణం ప్రత్యర్థులపై ఇష్టారీతిన ఆరోపణలు, విమర్శలూ గుప్పించడమే. అటువంటి వారిని ఇతర పార్టీలు చేర్చుకోవడానికి ఒకటికి వంద సార్లు ఆలోచిస్తారని అంటున్నారు. ఆ రకంగా చూస్తే విడదల రజినికి కూటమి పార్టీల తలుపులు మూసుకుపోయినట్లేనని కూడా అంటున్నారు. మరి ఈ పరిస్థితుల్లో ఆమె వర్గీయులు చేస్తున్న పార్టీ మార్పు ప్రచారం.. జగన్ ను బ్లాక్ మెయిల్ చేసి చిలకలూరిపేటలో కొనసాగడానికే అయి ఉంటుందన్న చర్చ కూడా పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. 

విశాఖ పర్యాటకానికి కొత్త శోభ.. దేశంలోనే పొడవైన గ్లాస్ బ్రిడ్జి!

విశాఖపట్నం కైలాసగిరిలో దేశంలోనే అతి పొడవైన గ్లాస్ బ్రిడ్జ్ సోమవారం (డిసెంబర్ 1) ప్రారంభమైంది. ఏడు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ గ్లాస్ బ్రిడ్జిని ఎంపీ భరత్, మేయర్   పీలా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు , వీఎంఆర్డీఏ ఛైర్మన్‌ ప్రణవ్‌గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా, తుఫాన్‌లు, గంటకు 250 కిలోమీటర్ల వేగంతో వచ్చే గాలులను తట్టుకునేలా 40 ఎంఎం మందం గల జర్మన్ గ్లాస్‌తో నిర్మించిన  ఈ గాజు వంతెన దాదాపు 500 టన్నుల బరువును ఈజీగా మోయగలదు. ఈ గ్లాస్ బ్రిడ్జ్‌ పైనుంచి గాల్లో తేలియాడుతున్న అనుభూతితో ప్రకృతి అందాలను వీక్షించవచ్చు. అదలా ఉంచితే.. దేశంలో ఇప్పటి వరకూ కేరళలో నిర్మించిన 40 మీటర్ల పొడవైన గ్లాస్ బ్రిడ్జే దేశంలో అత్యంత పొడవైన గాజు వంతెనగా రికార్డుల్లో ఉంది. ఇప్పుడు విశాఖలో నిర్మించి, ప్రారంభించిన ఈ గాజు వంతెన ఆ రికార్డును బ్రేక్ చేసింది. ఈ బ్రిడ్జి పొడవు 50 మీటర్లు.  వీఎంఆర్‌డీఏ, ఆర్‌జే అడ్వెంచర్స్‌ సంస్థ సంయుక్తంగా  నిర్మించిన ఈ గ్లాస్ బ్రిడ్జి విశాఖ పర్యాటకానికి కొత్త శోభను తీసుకువస్తుందనడంలో సందేహం లేదు.  

ఐపీఎస్ పాలిటిక్స్.. సునీల్ ఆంతర్యమేంటి?

ఐపీఎస్ అధికారిగా ఉంటూ రాజకీయ కార్యకలాపాలకు సంబంధించిన కామెంట్లు చేయడం ఎంత వరకూ సమంజసం? అన్న చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది.  ఈ విషయంలో.. మాజీ సీఐడీ బాస్ పీవీసునీల్ కుమార్ ఒక ప్రశ్నగా నిలుస్తున్నారు. విధినిర్వహణలో అవకతవకలు, అక్రమాల ఆరోపణలతో ఐపీఎస్ సునీల్  ప్రస్తుతం సస్పెన్షన్ లో ఉన్నారు.  ఏ అధికారైనా సరే సస్పెన్షన్ లో ఉన్న సమయంలో  తనపై ఉన్న అభియోగాలు, ఫిర్యాదులను కానీ క్లియర్ చేసుకుని సత్ప్రవర్తనను రుజువు చేసుకోవాలి. కానీ ఐపీఎస్ సునీల్ రూటే సెపరేటు. ఆయన సస్పెన్షన్ సమయంలో కూడా తన సంచలన వ్యాఖ్యలతో వివాదానికి తెరలేపారు. ఇంతకీ సునీల్ ఏం చేశారంటే.. కులాల కార్చిచ్చు రగిల్చేలా వ్యాఖ్యలు చేశారు.   కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి సీఎం కావాలి,   ఉప ముఖ్యమంత్రిగా దళితుడు ఉండాలి అంటూ ఐపీఎస్ సునీల్ చేసిన వ్యాఖ్యలను బట్టే ఆయన మైండ్ సెట్ ఏమిటన్నది అవగతమౌతుంది.  కాపులే సీఎంలు కావడమేంటి? దళితుడు ఎందుకు కారాదు? అని ఆయన సామాజిక వర్గం నేతలే ఇప్పుడు సునీల్ ను నిలదీస్తున్నారు.  ఇప్పటికే తమ సామాజిక వర్గానికి చెందిన హర్షకుమార్, జడశ్రవణ్, విజయ్ కుమార్ వంటి వారు రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నారు. వారిలో ఒకర్ని ఐదేళ్ల పాటు డిప్యూటీ సీఎంగా ఉండే విధంగా చూడాలన్నారు. రెండేళ్లలో దిగిపోయే ఉప ముఖ్యమంత్రితో మనకు అనవసరమని అన్నారు. అయినా ఒక ఎంపీపై కస్టోడియల్ టార్చర్ చేసిన ఐపీఎస్ సునీల్ కుమార్ ఇలాంటి కామెంట్లు కాక మరెలాంటి వ్యాఖ్యలు చేస్తారు?  అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నెటిజనులు విమర్శలు గుప్పి స్తున్నారు. దళితవాడలను పంచాయితీలను చేయాలన్న తన డిమాండ్ కోసం ఎమ్మెల్యే టికెట్టే నిరాకరించానంటూ సునీల్ ఫక్తు రాజకీయ నాయకుడిలా మాట్లాడుతున్నారు.  జగనన్న చెప్పింది చేసినందుకు నందిగం సురేష్ లా సునీల్ ఏదైనా ఆశిస్తున్నారా అన్నది తేలాల్సి ఉంది. ఏది ఏమైనా సివిల్ సర్వీసుల్లో ఉండి ఇలాంటి పొలిటికల్ కామెంట్లు చేయడం కరెక్టు కాదని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ఇంటి అప్పు తీర్చిన అభయప్రదాత.. బాబు

చంద్ర‌బాబు ఫించ‌న్ పంపీణీ   కార్య‌క్ర‌మంతో స్వయంగా పాలుపంచుకుని లబ్ధిదారుల ఇంటికి స్వయంగా వెళ్లి అందజేస్తున్న చంద్రబాబు.. ఆ సందర్భంగా వారి కష్టాలను వింటున్నారు. వాటిని తీర్చడానికి తన వంతు సహాయం చేయడానికి ఇసుమంతైనా వెనుకాడటం లేదు.   ఆయ‌న ఏ ఇంటికి ఆ ఒక‌టో తారీఖున వెళ్తారో ఆ ఇంటి వారికి ఉన్న సమస్యలన్నీ పరిష్కారమైపోయినట్లే అనడంలో సందేహం లేదు.  కొండకొచో వారి జీవిత కాల సమస్యలకు కూడా చిటికెలో పరిష్కరించేస్తున్నారు.  గతంలో అంటే వైసీపీ హయాంలో వాలంటీర్లు తెల్లవారకుండానే తలుపుతట్టి మరీ పింఛన్లు అందజేసేవారిని జగన్ సర్కార్ గప్పాలు కొట్టుకునేది.  అది ఏ మేరకు వాస్తవమో తెలియదు కానీ, పింఛన్లలోనూ ముడుపులు దండుకునే వారంటూ అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. సరే అది పక్కన పెడితే అప్పటి ముఖ్యమంత్రి జగన్ జనానికి ముఖం చూపిన సందర్భాలు చాలా చాలా తక్కువ. ఏ బటన్ నొక్కుడు కార్యక్రమానికో రోడ్డు కిరువైపులా పరదాలు కట్టి సభా స్థలికి వచ్చే ఆయన ప్రసంగాలు చేసే వారే కానీ ప్రజల వినతులను పట్టించుకున్న దాఖలాలు లేవు. అయితే చంద్రబాబు మాత్రం అందుకు పూర్తి భిన్నం. ఆయన నిత్యం ప్రజలతో మమేకమౌతున్నారు. వారి సమస్యలు వింటున్నారు. పరిష్కరిస్తున్నారు. స్వయంగా ఆయన ఒక లబ్ధిదారు ఇంటికి వెళ్లి మరీ పింఛను అందిస్తున్నారు. అందులో భాగంగా సోమవారం (డిసెంబర్ 1) ఏలూరు జిల్లా గోపీనాథపట్నంలో నాగలక్ష్మి అనే లబ్ధిదారు ఇంటికి వెళ్లిన చంద్రబాబు ఆమెకు పింఛను అందజేశారు. వారి యోగక్షేమాలు విచారించారు. సమస్యలను అడిగి మరీ తెలుసుకున్నారు.  ఆ ఇంట్లో చ‌దువుకుంటున్న యువ‌కుడు, చ‌దువు మ‌ధ్య‌లోనే ఆపేసిన యువ‌తికి సంబందించిన వివ‌రాలను తెలుసుకుని,  ఆ యువ‌కుడికి టీసీఎస్ లో జాబ్ కోసం సిఫారసు చేస్తానన్నారు. అలాగే  చ‌దువు ఆపేసిన  యువ‌తిని హైబ్రిడ్ ప‌ద్ధ‌తిలో తిరిగి ఎలా చ‌దువుకోవాలో సూచించారు. ఇక ల‌బ్దిదారు నాగ‌ల‌క్ష్మికి సంజీవ‌నీ ప‌థ‌కం ద్వారా ఎలాంటి ఆహారం అందించాలో సూచించారు. అక్కడితో ఆగలేదు.. నాగలక్ష్మి ఇంటి నిర్మాణం కోసం ఎంత ఖర్చు అవుతుందో ఆరా తీసి.. వారికి ఉన్న అప్పు ఎంతో తెలుసుకుని ఆ మొత్తాన్ని తీర్చే ఏర్పాట్లు చేయాల్సిందిగా అక్కడికక్కడే కలెక్టర్ ను ఆదేశించారు. దీంతో నాగలక్ష్మి కుటుంబం అప్పు మొత్తం తీరిపోయింది. సమస్యలు దూదిపింజల్లా ఎగిరిపోయాయి. ప్రజా ప్రభుత్వం ఎలా ఉంటుందో, ప్రజా నాయకుడు ఎలా ఉండాలో చంద్రబాబు ఆచరణలో చూపుతున్నారంటూ సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.