ఇండియాలో 25 లక్షలమంది మృత్యువాత పడవచ్చట‌!

భారత్‌లో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. ప్ర‌స్తుతం 500 కేసుల‌తో దూకుడు పెంచింది. వీరిలో 40 మంది విదేశీయులు ఉన్నారు. కరోనా బారిన పడి ఇప్పటి వరకూ మన దేశంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంటికే పరిమితం కావడం, సామాజిక దూరం పాటించడం వల్ల కరోనా కేసుల సంఖ్యను 62 శాతం వరకు తగ్గించొచ్చని.. తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటితో పోలిస్తే కేసుల సంఖ్యను 89 శాతం వరకు తగ్గించగలమని ఐసీఎంఆర్ తెలిపింది. కరోనా లక్షణాలు కనిపించని వారిని కనీసం 75 శాతం మందిని గుర్తించగలిగితే కరోనా వేగంగా వ్యాప్తి చేయకుండా అడ్డుకోగలమని తెలిపింది. కరోనా లక్షణాలు కనిపించని 90 శాతం మందిని గుర్తించగలిగితే.. ఈ వ్యాధి సగటు సమయాన్ని 20 రోజులకు వాయిదా వేయగలమని ఐసీఎంఆర్ అంచనా వేసింది. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ రీసెర్చ్ భారత్ లో కరోనా వైరస్ వ్యాప్తిని అంచనా వేస్తూ ఒక జర్నల్ ను ప్రచురించింది. వైరస్ వ్యాప్తి ఫిబ్రవరి నుంచి 50రోజుల వ్యవధిలో ఢిల్లీలో ఒక కోటి కేసులు - ముంబైలో 40లక్షల కేసులు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. అయితే మెడికల్ కౌన్సిల్ రీసెర్చ్ ప్రచురించిన ఈ జర్నల్ పూర్తిగా మ్యాథమెటికల్ మోడల్ అని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ్ తెలిపారు. వైరస్ ఇండియాలో ప్రవేశించడానికి ద్వారాలైన ఢిల్లీ - ముంబై - కోల్ కతా - బెంగళూరు వంటి నగరాల్లోని విమానాశ్రయాలపై ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఈ రిపోర్ట్ను తయారుచేసినట్టు తెలిపారు. దేశంలో కరోనా వ్యాప్తి ఇలాగే ఉంటె 30 కోట్ల మంది భారతీయులకి కరోనా సోకే అవకాశం ఉంది అని cddep డైరెక్టర్ రామణన్ లక్ష్మి నారాయణ ఆందోళన వ్యక్తం చేసారు. ఇప్పటినుండే ప్రజలు ప్రభుత్వాలు జాగ్రత్తలు పాటిస్తే ఈ సంఖ్యని 20 కోట్ల వరకు తగ్గించవచ్చు అని - లేదంటే దాదాపుగా 25 లక్షలమంది మృత్యువాత పడవచ్చని హెచ్చరించారు. అమెరికా బ్రిటన్ లో వైరస్ వ్యాప్తి పై అధ్యయనం చేసి ఈ వివరాలు చెప్పినట్టు అయన వెల్లడించారు.

కరోనా చావు ఎలా వుంటుందో తెలుసా?

ఒక పేషెంట్ చనిపోతే  పిక్ లో చూపించినట్లుగా బాగ్ లో చుట్టి  ప్లాస్టిక్ బాక్స్ లో సీల్ వేస్తారు కనీసం బాడీ ని ఇంటికి కూడా పంపించరు కాలిన తర్వాత బూడిద  కూడా ఇస్తారో ఇవ్వరో  తెలియని పరిస్థితి ఇది ఒక భయంకరమైన  వీడ్కోలు... ఇంతలా ఆ మహమ్మారి విజృంభించకూడదని కేంద్ర  రాష్ట్ర  ప్రభుత్వాలు లాక్ అవుట్ ప్రకటిస్తే కనీసం పట్టించుకోకుండా  రోడ్లపై తిరుగుతున్న  మిమ్మల్నెమనాలి. ఒక వారానికి సరిపడా  సరుకులు  లేవా మీ మీ ఇళ్లల్లో.... ఒక వారం ఇంట్లో ఉండలేరా  పెళ్ళాం పిల్లలతో ... దేశ భవిష్యత్ ఆలోచించిన  పెద్దలే  స్వయం  నిర్బంధం చేసుకుంటుంటే  నీకేమైందిరా ద‌రిద్రుడా.... మాములు జబ్బైతే  నువ్వొక్కడివే  పోతావ్  ఇది గాలితో కలిసి నిన్నూ నీ కుటుంబాన్ని ఈ సమాజాన్ని  కూడా నాశనం చేయగలిగే శక్తివంతమైన వైరస్ అని ఇంకెప్పుడు తెలుసుకుంటావ్ ...  రెండవ దశ లో ఉంది కాబట్టే ఇలా అయినా కంట్రోల్ చేయగలవు నీ వంతుగా..  స్టేజి దాటిందో  పర్యవసానాన్ని  ఊహించలేవు గుర్తు పెట్టుకో.. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకో...

ఆర్టికల్ 360 కింద అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తారా?

ప్రాణాంతక మహమ్మారి కరోనా వైరస్ కారణంగా అతలాకుతలం అవుతున్న దేశ ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టేందుకు కేంద్రం ఆర్థిక ఎమెర్జెన్సీని విధించనుందా? ప్రస్తుత పరిస్థితుల్లో దీనికి అవకాశం కల్పించే ఆర్టికల్ 360ని ఆశ్రయించడమే మార్గమని నరేంద్ర మోదీ ప్రభుత్వం భావిస్తోందా? దేశ వ్యాప్తంగా ఇప్పుడు వ్యక్తమవుతున్న ఊహాగానాలివి. ప్రధాని నరేంద్ర మోదీ గానీ, ప్రభుత్వ అధికారులు గానీ ఎవరూ ఇప్పటి వరకు ఆర్టికల్ 360 ఊసెత్తకపోయినప్పటికీ, సోష‌ల్ మీడియాలో ఈ అంశం చ‌క్క‌ర్లు కొడుతోంది. భారత సెక్యురిటీ మార్కెట్లు ఇవాళ ఘోరంగా పతనం కావడంతో ఇక ఆర్టికల్ 360 విధించడం ఖాయమన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఎన్నడూ లేని విధంగా సెన్సెక్స్ ఏకంగా 3,934 పాయింట్లు పతనమైంది. ట్రేడింగ్ ముగిసే సమయానికి 25,981 వద్ద క్లోజ్ అయ్యింది. మరోవైపు డాలర్‌తో పోల్చితే రూపాయి విలువ సైతం 76 పైసలకు పడిపోయింది. ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్ తీవ్ర ప్రతికూల ప్రభావం చూపించడమే దీనికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ఆర్టికల్ 360 అంటే ఏమిటి? ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రి మండలి సలహా మేరకు దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించేందుకు రాష్ట్రపతికి అధికారమిచ్చే చట్టమే ఆర్టికల్ 360. దీని ద్వారా రాష్ట్రాలు తమ ఆర్ధిక వనరులను ఎలా ఉపయోగించాలో ఆదేశించే అధికారం కేంద్రానికి లభిస్తుంది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను సవరించేందుకు కూడా ఈ చట్టంతో కేంద్రానికి అధికారం కల్పిస్తుంది. ‘‘దేశ ఆర్ధిక వ్యవస్థ స్థిరత్వానికి, లేదా దేశంలోని ఏదైనా ప్రాంతానికి చెందిన ఆర్థిక వ్యవస్థకు ప్రమాదం ముంచుకొచ్చే పరిస్థితి ఉందని రాష్ట్రపతి భావిస్తే.. అధికారిక ప్రకటన ద్వారా ఆయన దీన్ని అమల్లోకి తేవచ్చు..’’ అని ఈ చట్టంలోని 1వ ప్రకరణం చెబుతోంది. ఒక వేళ ఆర్టికల్ 360ని అమల్లోకి తీసుకొస్తే ఆ తర్వాతి రెండు నెలల వరకు లేదా రాష్ట్రపతి దీన్ని రద్దు చేసినట్టు ప్రకటించే వరకు ఇది చెల్లుబాటు అవుతుంది. ఒకవేళ 2 నెలలకు మించి పొడిగిస్తే.. దీన్ని పార్లమెంటు ఉభయ సభల్లో ప్రవేశపెట్టి ఆమోదించుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలో, అరుదైన సందర్భాల్లో, రాజ్యాంగ యంత్రాంగం పూర్తిగా విఫలమయ్యే వేళ పరిస్థితుల్ని కేంద్రం తన అధీనంలోకి తెచ్చుకోవడానికి, చక్కదిద్దడానికి ఉద్దేశించబడిన ఆర్టిక‌ల్ 360 అధికరణాన్ని ఉపయోగించడానికి కేంద్ర ప్రభుత్వం స‌న్న‌ధం అవుతోంద‌నే ప్ర‌చారం విస్తృతంగా జ‌రుగుతోంది. అయితే ఆర్టికల్ 360 కింద అత్యవసర పరిస్థితి ఇంతవరకు జారీ చేయబడలేదు. ఈ కరోనా మహమ్మారి భారతీయ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్ర‌భావం చూపుతోంది. 72 ఏళ్ళ వెనుక‌కు నెట్టేసింది. 1. రిజర్వ్ బ్యాంక్ మొత్తం చరిత్రలో ఇంతకు ముందెన్నడూ చేయని భారతీయ ఆర్థిక వ్యవస్థపై 90 మంది వ్యక్తులతో ఒక రిజర్వ్ బ్యాంక్ ఇప్పటికే ఒక యుద్ధ గదిని ఏర్పాటు చేసింది. 2. విదేశీ పెట్టుబడిదారులు కేవలం 15 ట్రేడింగ్ సెషన్లలో భారత మార్కెట్ నుండి 1.08 లక్షల కోట్ల రూపాయలను ఉపసంహరించుకున్నారు. 3. దాదాపు 80% భారతీయ కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుండే పని చేయమని అడుగుతున్నాయి, మ‌రి కొన్ని కంపెనీలు చాలా మంది ఉద్యోగులను కూడా తొలగించాయి. 4. దేశంలోని దాదాపు 80% ప్రధాన ఆర్థిక కేంద్రాలు బెంగళూరు, ముంబై, పూణే, Delhi , లక్నో, కాన్పూర్, హైదరాబాద్, జైపూర్, చెన్నై, కోల్‌కత్తా, గుర్గావ్, నోయిడా, అహెందాబాద్, సూరత్‌తో సహా లాక్డౌన్లో ఉన్నాయి. 5. యుఎస్ డాలర్ భారత కరెన్సీకి వ్యతిరేకంగా అత్యధిక విలువను కలిగి ఉంది, 1 USD 75.62 కు సమానం. 6. ఈ వ్యాసం రాసే సమయంలో భారతదేశంలో కరోనా కేసులు 470 కి చేరుకున్నాయి. 7. హోటళ్ళు, రెస్టారెంట్లు, నైట్ క్లబ్‌లు, బార్‌లు, విమానయాన సంస్థలు, బిపిఓ, టూరిజం, ఎంటర్టైన్మెంట్ & బాలీవుడ్, ఆటో-మొబైల్, ఏవియేషన్, హాస్పిటాలిటీ, దుస్తులు, కన్స్యూమర్ డ్యూరబుల్స్ మరియు ఎలక్ట్రానిక్స్, పౌల్ట్రీ మరియు సీఫుడ్, నిర్మాణం, రవాణా, రైల్వేతో సహా అనేక రంగాలు చెత్తగా ఉన్నాయి ఈ మహమ్మారి దెబ్బతింది. 8. చమురు-పెట్రోల్, భద్రతా సేవా పరిశ్రమ మరియు వారి ఆదాయాలపై ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా పైన పేర్కొన్న రంగాలపై ఆధారపడిన అనేక ఇతర రంగాలు కూడా వారి ఆదాయాలపై భారీ ప్రభావాన్ని చూపాయి. 9. కరోనావైరస్ నిప్పు వ‌లే వ్యాప్తి చెందుతోంది మరియు సమీప భవిష్యత్తులో భారతీయ ఏజెన్సీలు దీనిని నియంత్రించలేవు, పొర‌పాటున నాల్గవ దశలోకి ప్రవేశిస్తే స్వతంత్ర భారతదేశ చరిత్రలో అత్యంత ఘోరమైన సంక్షోభం ఎదుర్కోక త‌ప్ప‌దు. 10. ప్రస్తుతం కరోనావైరస్ ధనవంతులు మరియు ఉన్నత వర్గాలలో మాత్రమే ఉంది, వారు ఆర్థిక భారాలను నిర్వహించగలుగుతారు మరియు ఆరోగ్య సంరక్షణ, పని, ఆర్థిక పొదుపు పరంగా బహుళ వనరులను కలిగి ఉంటారు మరియు ఇంకా స్వీయ వేరుచేయడం మరియు వ్యాప్తి చెందకుండా నిరోధించగలరు కాని ఒకసారి అది ప్రజలలోకి ప్రవేశిస్తుంది. పేదరిక రేఖ క్రింద, దానిని నియంత్రించడం దాదాపు అసాధ్యం మరియు పరిస్థితిని నిర్వహించడానికి భారతదేశ ఆదాయంలో పెద్ద భాగం పెట్టుబడి అవ‌స‌రం అవుతుంది. 11. ప్రస్తుత ప్రభుత్వానికి ఆర్‌బిఐ బహుళ మొత్తాలను పెద్ద మొత్తంలో ఇచ్చిన తరువాత రిజర్వ్ బ్యాంక్ నిల్వ చేసిన నిధులు ఆకస్మిక నిధులు & అత్యవసర నిధులతో ఇప్పటికే క్షీణించాయి. 12. భారతదేశంలో అనేక ప్రైవేటు మరియు ప్రభుత్వ బ్యాంకులు అత్యధిక ఎన్‌పిఎను కలిగి ఉన్నాయి మరియు రుణ ఎగవేతదారులు త్వరలో దాన్ని చెల్లించే మానసిక స్థితిలో లేరు. 13. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఇ) & బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బిఎస్ఇ) తో సహా భారతదేశ వాటా మార్కెట్లు నిరంతరం పడిపోతున్నాయి. 1 నుండి 13 వరకు అన్ని పాయింట్లను కనెక్ట్ చేస్తోంది. కరోనావైరస్ తో పోరాడటం మరియు దేశ ఆర్థిక వ్యవస్థను నియంత్రించడం ప్రస్తుత ప్రభుత్వానికి దాదాపు అసాధ్యమని అనిపిస్తుంది. ఆర్థిక వ్యవస్థను నియంత్రించడానికి ఎటువంటి చర్యలు సహాయపడకపోతే, నరేంద్ర మోడీకి ఆర్టికల్ 360 ప్రకారం భారతదేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించడం తప్ప వేరే మార్గం ఉండదు మరియు దేశం అన్ని కాలాలలోనూ అత్యంత ఘోరమైన మరియు భయంకరమైన మాంద్యంలోకి వెళుతుంది.

హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ను వైద్యుల పర్యవేక్షణ లోనే వాడాలి: ఆంధ్ర ప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ 

హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను వినియోగిస్తే కరోనా రాదనే భావన కొన్ని పత్రికా కథనాల ద్వారా ప్రచారం లోకి వచ్చిందనీ, ఇది వాస్తవం కాదనీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.  సాధారణ వ్యక్తులెవ్వరూ కూడా ఈమందును వినియోగించకూడదు. దుష్పరిణామాలకు దారితీస్తుందని కూడా ఆ శాఖ స్పష్టం చేసింది. కరోనా సోకిన వారికి మాత్రమే ఈమందును వాడాలని అఖిల భారత వైద్య పరిశోధన మండలి స్పష్టంచేసింది. ఇదికూడా ప్రత్యామ్నాయంలో భాగమే నని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ  పేర్కొంది.  అంతేకాక కరోనా సోకిన రోగులకు, సేవలందిస్తున్న వైద్యులకు, సిబ్బందికి ముందు జాగ్రత్తగా మాత్రమే హైడ్రాక్సీ క్లోరోక్వీన్‌ వినియోగిస్తున్నారు. ఇది పూర్తిగా వైద్యుల పర్యవేక్షణలో దీన్ని పాటిస్తున్నారు. అందువల్ల కరోనా రాకుండా ఉండాలంటే. హైడ్రాక్సీ క్లోరోక్వీన్‌ వాడితే సరిపోతుందన్న భావనలోకి ప్రజలెవ్వరూ వెళ్లవద్దని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విజ్ఞప్తి చేసింది.  సాధారణవ్యక్తులెవ్వరూ కూడా ఈ మందును వినియోగించవద్దని కోరుతున్నాం.  హైడ్రాక్సీ క్లోరోక్వీన్‌ను కేవలం నిపుణుల పర్యవేక్షణలో, వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే ఇస్తున్నారు. కోవిడ్‌ సోకినవారికి, వారితో ఉన్నందువల్ల వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నవారికి పూర్తిగా వైద్యుల పర్యవేక్షణలో ఇస్తున్న మందు మాత్రమే. మందు తీసుకున్న వారు పూర్తి వైద్య పర్యవేక్షణలో ఉంటున్నారు. ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించాలని ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ విజ్ఞప్తి చేసింది.

ఆంధ్ర ప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలు వాయిదా

 ఆంధ్ర ప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవానికి మార్చ్ 6 వ తేదీన జరిగిన సమావేశం లో, ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణ కారణంగా ఈ నెల 23 నుంచి జరగాల్సిన పదో తరగతి పరీక్షలు వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమాచారం ఇచ్చింది. స్ధానిక ఎన్నికలతో పదోతరగతి పరీక్షల వాయిదా ఏపీలో ఈ నెల 23 నుంచి జరగాల్సిన పదో తరగతి పరీక్షలను స్ధానిక సంస్ధల ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేసుకుంటున్నట్లు ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమాచారం ఇచ్చింది. ఈ విషయాన్ని మార్చ్ 6 న రాజకీయ పార్టీలతో సమావేశం తర్వాత నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెల్లడించారు. అయితే ప్రభుత్వం నుంచి మాత్రం అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు.   ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను ఈ నెల 21, 24 తేదీల్లోనూ, మున్సిపల్ ఎన్నికలను ఈ నెల 27న నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం లోగడ నిర్ణయించింది. ఈ మేరకు షెడ్యూల్ కూడా విడుదల చేసింది. అదే సమయంలో ఈ నెల 23 నుంచి పదో తరగతి పరీక్షలు మొదలు కావాల్సి ఉంది. అసలే ఎన్నికల సీజన్ కావడంతో పదో తరగతి పరీక్షలకు సిద్దమయ్యే అభ్యర్ధులకు ప్రిపరేషన్ లో ఇబ్బందులు ఎలాగో తప్పవు. కనీసం పరీక్షలు అయినా వాయిదా వేస్తే ఊరట లభిస్తుందని తల్లితండ్రులు భావించారు. అయితే, తదనంతర పరిణామాల్లో, కరోనా వైరస్ కారణంగా మొత్తం ఎన్నికల షెడ్యూల్ నే ఆరు వారలు వాయిదా వేస్తూ ఎన్నికల సంఘం ప్రకటించటం, దరిమిలా, రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి మధ్య ఘర్షణ పూర్వక వాతావరణం నెలొకొనడం అందరికీ తెలిసిన విషయమే. అయితే, కరోనా తీవ్రత దృష్ట్యా, రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు పదో తరగతి పరీక్షల వాయిదా నిర్ణయాన్ని ప్రకటించింది. దీంతో పిల్లలు, వారి తల్లితండ్రులు కూడా ఊపిరి పీల్చుకున్నారు.  

బ్రతకండి.. బ్రతికించండి.. బయటకు వెళ్లకండి...!

ఆరోగ్యమే మహాభాగ్యం. బ్రతికుంటే ఏమైనా చేయవచ్చు. ముందు బ్రతకండి. తరువాతే బ్రతుకుదెరువు గురించి ఆలోచించండి. లేదంటే మన దేశం మరో ఇటలీ ఔతుంది. చైనా వాళ్ళు జనవరి 23 నుంచి ఇంట్లో కూర్చుని lockdown లో ఉంటే 60 రోజుల తరువాత, కొత్త cases రాకుండా ఆగాయి. దీనిని బట్టి మనం ఎన్ని రోజులు - ఎంత జాగ్రత్తగా ఉండాలో ఒక్కసారి బాగా ఆలోచించండి. మాకు ఏమి కాదులే అని అనుకుంటే పొరపాటే. ఒకసారి ఈ వైర‌స్ విస్త‌రిస్తూ పోతే కనీసం 1 కోటి మంది చనిపోతారు. వెల్లుల్లి, అల్లం, హోమియో, పసుపు ఇవన్నీ వైరస్ ని చంపేసేవి అయితే, ప్రపంచం అంతా ఎప్పుడో అది వాడి దీన్ని కంట్రోల్ చేసేది. దయచేసి ఆ వెధవల మాటలు నమ్మకండి. దయచేసి ఇంట్లో ఉండండి. చదువు కోని వాళ్ళకి దీని ప్ర‌ధాన్య‌త‌ చెప్పండి. కొంత డబ్బు చేతిలో ఉంచుకోండి. ATMలు బాంకుల పరిస్థితి ఏమి టో చెప్పలేము. డబ్బు చాలా చాలా జాగ్రత్త గా వాడండి. తిండికి, మందులకీ తప్పితే అనవసరంగా దేనికి రూపాయి వృథా చేయవద్దు. సింపుల్ గా జీవించండి. ఇటలీలో 1000 మందికి 2.5 బెడ్స్ ఉంటే నే అంత మంది చచ్చి పోయారు. మ‌న ఇండియాలో 1000 మందికి 0.5 బెడ్స్ మాత్రమే ఉన్నాయ్ హాస్పిటల్స్ లో. మన హాస్పిటల్స్ లో వసతులు అంతంత మాత్రం. మేము బాగున్నాం, మాకు ఎం కాదు, అని అనుకుంటే పొరపాటే. ఇది గాలి లో నుంచి కూడా వస్తుంద‌ని WHO చెప్పింది. ఇది ఆయుర్వేద, హోమియో, యునాని మరి ఏ ఇతరత్రా పద్దతి ద్వారా తగ్గేది కాదు. అలా తగ్గు తుంది అని లేదా రాదు అని ఎవరైనా చెపితే అది కేవలం వాళ్ళు డబ్బులు చేసు కోవడం కోసమే. దయ చేసి డాక్టర్ల‌కు, నర్సులకు పని పెంచవద్దు. ఎక్కడికి వెళ్లద్దు. మీకు ఎవరి మీద అయిన ప్రేమ ఉంటే, వాళ్ళకి దూరంగా ఉండండి. ముఖ్యంగా, బయట అంతా తిరిగి ఇంట్లో ముసలి వారిని బలి చేయకండి. ఇంటికి రాగానే బట్టలు డెట్టాల్ లో నానబెట్టండి. ఫ్రెష్ గా స్నానం చేసి తరువాత ఇంట్లో మిగతా వారిని కలవండి. బయట నుండి ఇంట్లోకి వచ్చిన పది నిమిషాల్లో మీ స్నానం అయిపోవాలి. దయచేసి ఎవరిదో పెళ్లి అనో, చూద్దాం అనో, చాలా రోజులు అయిందనో పోయి కలవ వద్దు. కావాలంటే, ఫోను contact list చూసి, ప్రతి ఒక్కరితో మాట్లాడండి. నీ ఫోన్లో ఉన్న ప్రతి ఒక్క నంబరుకీ ఈ సమాచారం పంపించు. కరోనా గురించి మాట్లాడు. నీకు తెలిసిన సమాచారం వారికి తెలియ జేయండి. ఇండియా వాళ్ళకి ఇమ్యూనిటీ ఎక్కువ, మాకు ఎండలు ఎక్కువ, వైరస్ చస్తుంది. ఇవన్నీ నిజాలు కావు. అది ఏ temperature లో అయిన వ్యాపిస్తుంది. 1918 లో ఇలానే ఫ్లూ వస్తే భారతదేశంలో 1 కోటి మంది చచ్చి పోయారు. అప్పుడు, రవాణా సదు పాయాలు, ప్రజల కదలిక ఇంత లేదు. అయినా కూడా అంతా వ్యాపించింది. india లో 470 కేసులు మాత్రమే ఉన్నాయి. తక్కువ తీవ్రత అని అనుకోకండి. 1 వారంలోనే ఇటలీ, ఇరాన్ లలో 300 నుంచి 6000-7000 వరకు, 2 వారాలు లో 20,000 కు పెరిగి పోయాయి. ఇప్పుడు రోజుకు వందల మంది చని పోతున్నారు. చేతులు శుభ్రంగా సబ్బు తో కడుక్కోండి. కనీసం 20 సెకన్లు పాటు కడగాలి. ఊరికే మొహం, ముక్కు, నోరు, కళ్ళు, తాకవద్దు. వీలయి నంత ఇంట్లోనే ఉండండి. దగ్గు, జలుబు ఉంటే అస్సలు ఎవరినీ తాకవద్దు. ఏ ఇబ్బంది ఉన్నా, వెంట నే గవర్న మెంట్ ఆసుపత్రికి వెళ్లి పరీక్ష చేయించు కోండి. మాస్క్ వేసుకొని, చేతులు కడుక్కుంటే. కరోనా రాదు అనే భ్రమ లో ఉండకండి. ఫుల్ బాడీ సూటులు వేసు కుని, అన్ని జాగ్రత్తలు పాటిస్తున్న డాక్టర్లకు కూడా ఇది వ్యాపించింది. మనుషు లందరూ ఒకరికొకరు, వీలయి నంత దూరంగా ఉండటం చాలా ముఖ్యం. ఇంట్లో, పని ప్రదేశంలో అందరూ ఒకరి కొకరు, వీలయి నంత దూరంగా ఉండండి. మీకు వైరస్ సోకిందన్న విషయం, మొదటి పది రోజులు మీకు కూడా తెలియదు (incubation period) కానీ, ప్రక్క వారికి వ్యాప్తి చేస్తారు. ఎదుటి వారి ఫేస్ టు ఫేస్, మొహం వంక చూస్తూ మాట్లాడ కండి. వీలయి నంత దూరంగా ఉండి, తల వంచు కొని మాట్లాడండి. కంటికి కనపడ కుండా, ఒకరి నోటి తుంపర్లు వేరొకరి మొహం మీదా. బట్టల మీద పడతాయి. తద్వారా, మీకూ వైరస్ సంక్రమిస్తుంది.

నిశ్శ‌బ్దంగా అన్నీ కుప్ప‌కూలి పోతున్నాయి...!

ఎక్క‌డో చైనాలో వ‌చ్చింది. మ‌న‌కేం కాదులే అనుకున్నాం. చైనా వాళ్లు ఏం చేసినా ఓవ‌ర్ అనుకున్నాం. త‌మ దేశానికే గోడ క‌ట్టుకున్న మొండివాళ్లు, వైర‌స్‌ని కూడా అంతే మొండిగా త‌రిమేశారు. అది కాస్త ప్ర‌పంచం మీదికి వ‌చ్చి ప‌డింది. ఎక్క‌డో ఉంద‌న‌కుంటే , మ‌న ఊరికి కూడా వ‌చ్చేసింది. అమెరికాలోని జాక్స‌న్‌విల్లీలో క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ఆ ఊరికి మ‌న‌కు ఏ సంబంధం లేదు ఒక‌ప్పుడు.  కానీ ఇప్పుడు మా పిల్ల‌లు అక్క‌డే చ‌దువుతున్నారు. విన్న‌ప్ప‌టి నుంచి టెన్ష‌న్‌. ఇది  ప్ర‌పంచ‌మంత‌టి బాధ‌. న్యూయార్క్‌లో ఆంక్ష‌లు పెడితే నూజివీడులోని వంద‌లాది మంది త‌ల్లిదండ్రులు నిద్ర‌పోరు. కాలిఫోర్నియాలో క‌రోనా వ‌స్తే క‌రీంన‌గ‌ర్‌లోని ఒక త‌ల్లి దుక్కిస్తుంది. ప్ర‌పంచం చిన్న‌దై పోయింద‌ని సంతోష ప‌డ్డాం, ప్ర‌పంచంలో ఎక్క‌డేం జ‌రిగినా దుక్కించాల్సిందే. ప్ర‌పంచంలోనే అన్ని రాజ‌కీయాలు ప‌క్క‌కెళ్లిపోయాయి. అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల గురించి ఎవ‌రికీ ఆలోచ‌న లేదు. సిరియా సంక్షోభంపైన వార్త‌లు లేవు. ఇరాన్ రాజ‌కీయాలు మానేసి ప్ర‌జ‌ల్ని ఎలా కాపాడుకోవాలా అని ఆలోచిస్తూ ఉంది. జిహాద్ అని అరిచేవాళ్లు కూడా ఈ కొత్త శ‌త్రువుకి భ‌య‌ప‌డుతున్నారు. పాకిస్తాన్‌కి ఇపుడిపుడే అర్థ‌మ‌వుతూ ఉంది. తాలిబ‌న్లు కూడా చ‌ర్చ‌లు గురించి మాట్లాడ‌డం లేదు. దేశాల‌కి దేశాలే ఐసోలేష‌న్‌లో వెళ్లిపోవ‌డం ఎప్పుడూ జ‌ర‌గ‌లేదు. పార్కుల్లో మ‌నుషులు లేరు, ఆల‌యాలు ఖాళీ, థియేట‌ర్లు లేవు. మ‌నుషులంద‌రినీ క‌లిపే సంబ‌రాలు, ఉత్స‌వాలు లేనేలేవు. ఈ క‌రోనా మ‌నుషుల్ని ఆర్థికంగా నాశ‌నం చేయ‌డం ప్రారంభించింది. కోళ్ల రైతు దివాళా ద‌శ‌లో ఉన్నాడు. కొనే వాళ్లు లేరు. ఊళ్ల‌లో ఊరికే ఇచ్చినా తీసుకునే వాళ్లు లేరు. దీని మీద ఆధార‌ప‌డిన ల‌క్ష‌లాది మంది బ‌తుకులు ధ్వంస‌మై పోతున్నాయి. క‌రోనా వైర‌స్ ఒక‌రి నుంచి ఇంకొక‌రికి అంటుకున్న‌ట్టు , ఆర్థిక మాంద్యం కూడా అంటువ్యాధే. రోడ్డు మీద చికెన్ ప‌కోడి అమ్మేవాడి ద‌గ్గ‌రి నుంచి రెస్టారెంట్లో చికెన్ బిర్యానీ అమ్మేవాడి వ‌ర‌కు బాధితులే. కోళ్ల‌దాణాకి డిమాండ్ లేక‌పోవ‌డంతో మొక్క‌జొన్న రైతు క‌ష్టాల్లో ఉన్నాడు. షూటింగ్‌లు ఆగిపోయే స‌రికి దేశ వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ కార్మికులు రోడ్డున‌ప‌డ్డారు. రోడ్డు మీద మ‌నుషులు లేక‌పోయే స‌రికి ఆటో డ్రైవ‌ర్ పెళ్లాం పిల్ల‌లు ప‌స్తులుంటున్నారు. కిరాయి క‌ట్ట‌క‌పోతే ఇల్లు ఖాళీ చేయిస్తారు. కిస్తు క‌ట్ట‌క‌పోతే ఆటో లాక్కుంటారు. ఆక‌లి ఆత్మ‌హ‌త్య‌ల్ని పెంచుతుంది. నేర‌స్తుల్ని చేస్తుంది. వ్యాపారాలు లేక‌పోతే జీఎస్టీ ఆదాయం రాదు. డ‌బ్బులు లేక‌పోతే ప్ర‌భుత్వాలు స‌రిగ్గా న‌డ‌వ‌వు. ఆ భారం ఉద్యోగులు మోయాలి. క‌రోనా దెబ్బ‌తినే ప్ర‌ధాన రంగం మీడియా. అస‌లే అంతంత మాత్రంగానే ఉన్న మీడియాకి యాడ్ రెవెన్యూ త‌గ్గిపోతుంది. అర‌కొర జీతాల‌కి బ‌దులు పూర్తిగా ఇవ్వ‌డం మానేస్తారు. బెంగ‌ళూరులో ప‌నులు దొర‌క్క కొన్ని వేల మంది రాయ‌ల‌సీమ వ‌ల‌స కూలీలు తిరిగి ప‌ల్లెలు చేరుకుంటున్నారు. క‌రోనా ప్ర‌భావం ఇంకొద్ది రోజులు కొన‌సాగినా హైద‌రాబాద్‌లో ఉన్న వేలాది మంది ఒరిస్సా , యూపీ కార్మికులు ఇళ్ల‌కు వెళ్లిపోతారు. ఈ విధ్వంసం సూక్ష్మంగా జ‌రిగిపోతూ ఉంది. ఆయుధాల‌తో అంద‌రినీ వ‌ణికించే అమెరికా కూడా క‌రోనాకి వ‌ణికిపోతూ ఉంది. ఎందుకంటే అది సూక్ష్మ‌జీవి. ఎంత పెద్ద‌వాళ్లైనా దానికి లెక్క‌లేదు. ట్రంప్ కూడా రోజుకి ప‌దిసార్లు చేతులు క‌డుక్కుని ముఖం ద‌గ్గ‌రికి చేతులు రాకుండా చూసుకుంటూ ఉన్నాడట‌. త‌నంత‌ట వాడు లేడు అనుకున్నప్పుడు, మ‌నిషికి తానేంటో ప్ర‌కృతి చూపిస్తూ ఉంటుంది. మ‌నం బాగుండాలి, కానీ మ‌నం మాత్ర‌మే బాగుండాలి అంటే ప్ర‌కృతి ఒప్పుకోదు. ఈ భూమి అంద‌రిదీ. మ‌నిషి రాత‌కోత‌లు నేర్చుకుని త‌న‌ది అని రిజిస్ట‌ర్ చేయించుకుంటున్నాడు.  గూడు ఎక్క‌డ క‌ట్టుకోవాలో తెలియ‌క , పిచ్చిదానిలా తిరిగే ఒక పిచ్చుక‌కి కూడా ఈ భూమ్మీద హ‌క్కుంది. దానికి రియ‌ల్ ఎస్టేట్ తెలియ‌క‌పోవ‌చ్చు. మ‌నం రోడ్ల కోసం చెట్లు న‌రుకుతున్న‌ప్పుడు వేలాది ప‌క్షి పిల్ల‌లు గొంతు ఎండేలా ఏడ్చి చ‌చ్చిపోయి ఉంటాయి. ఒక ఉడ‌త‌ని కూడా దాని బ‌తుకు దాన్ని బ‌త‌క‌నివ్వాలి. లేక‌పోతే మ‌న‌ల్ని బ‌త‌క‌నివ్వ‌ని జీవులు అదే క‌రోనా వైర‌స్ లాంటి సూక్ష్మ‌జీవులు  భూమ్మీద పుడుతాయి. ఇప్పటికైనా కులాల పట్ల, మతాల పట్ల, ప్రాంతం, భాష  అనే వివక్ష లేకుండా బ్రతుకుదాం.

కాపాడాల్సిన దేవుడే త‌లుపుచాటున దాక్కున్నాడు!

అత్యవసర పరిస్థితుల్లో దైవం తలుపులు మూతపడ్డాయి.  వైద్యశాల తలుపులు తెరవబడ్డాయి. దేవుళ్ళు కేవలం కల్పితాలే అని ఓ సూక్ష్మజీవి నిరూపించింది. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదా! సృష్టిలో ప్రతి జీవి దైవజ్ఞ తోనే బ్రతుకుతుంది చస్తుంది అంటారు .మరి ఈ covid:19 ఎందుకు సృష్టించినట్లు?  ఎందుకు అంతమొందించడం లేదు.  పాపం! సర్వశక్తి మంతుడైన దేవుడు  కూడా కంటికి క‌నిపించ‌ని వైర‌స్ దెబ్బ‌కు తలుపులు మూసుకున్నాడు. ఇంకా ఎవరిని రక్షించమని కోరేది....? కరోనా వస్తుందట.. గుడికి వెళ్లొద్దట అనగానే ఇంట్ల కూర్చుంటున్న వారికి కనీస ఆలోచనే రాదు. "అఫ్ట్రాల్ ఒక వైరస్ ను అడ్డుకోలేని దేవుడు మనల్ని ఎలా కాపాడతాడు సామీ..?" అని పూజారిని అడగలేరు. "కంటికి కనిపించని పురుగును చూసి మసీదు తలుపుల చాటున అల్లా ఎందుకు దాక్కున్నాడ"ని ఇమాంసాబ్ ను అడగలేరు. "అందరినీ స్వస్థతపరిచే గుడారాలు అస్వస్థతకుగురౌతుంటే లోక రక్షకుడు ఎటు పోయాడ"ని పాస్టర్లను అడగలేరు.  కనీసం.. కనీసం.. తమ మనసులను కూడా అడగలేరు. ఈ కరోనా ప్రభావం తగ్గనివ్వండి.. మళ్లీ ఆలయాల్లో మంత్రాలు మార్మోగుతుంటాయి.  చర్చీలు పభువు పాటలతో, మసీదులు నమాజులతో సందడి చేస్తుంటాయి.  ఇప్పటికైనా కళ్ళు తెరిచి నిజం తెలుసుకోండి  దేవుడు మనిషిని సృష్టించలేదు. మనిషి యే దేవుని సృష్టించాడంటున్నారు హేతువాదులు. మా దేవుడు గొప్పా, మా దేవుడు గొప్పా అని... లగాంచి అంటారు కదా? చెప్పండ్రా కరోనా పాజీటీవ్ వచ్చిన వారిని ఏగుడికి, ఏ మసీద్కి, ఏం చర్చీకి పంపాలో ప్రయాణ ఖర్చులు భారత నాస్తిక సమాజం భరిస్తుంది కాస్త మీ దేవుళ్ళ జాడ చెపండ్రా అంటూ హేతువాదులు ఛాలెంజ్ విసురుతున్నారు. ఇప్పుడు ఏ బాబా గానీ, ఏ జ్యోతిష్కుడు గానీ, మేమున్నాం అని వాళ్ళ మహిమలు చూపడానికి రారు. ఎవడు " నా తాయెత్తు కట్టుకో తగ్గిపోతుంది " అని చెప్పడు. ఏ ఫాస్టర్ కూడా మహిమ జలమో లేక తైలమో ఇచ్చి ఈ ప్రపంచాన్ని ఆదుకుంటామని ఎవడూ రానే రాడు.  మీరొకటి గమనించారా !!! కొన్ని వారాలుగా జగద్వదరుబోతులైన జగ్గీ , రవిశంకర్ ,రామ్ దేవ్ etc.. etc... అడ్రెస్సులు లేవు. ఇప్పుడు నీకు నాకు ఈ ప్రపంచానికి కుల, మత, వర్గ, జాతి, లింగ, ధనిక, పేద వంటి తేడా లేకుండా ఈ మహమ్మారి నుండి కాపాడేది ఒక్క వైద్యుడే. ఆయన శాస్త్రవేత్త గా మారి అహర్నిశలు కష్టపడుతూ కొంత మంది ప్రాణాలు సైతం పోగొట్టుకున్నారు.  మతాలన్నీ మరియూ వాళ్ళ వాళ్ళ దేవుళ్ళన్నీ తోకముడిచిన వేళ, సైన్సే ముందుకు దూసుకు వచ్చింది ప్రపంచ మానవాళిని కాపాడటానికి నడుం బిగించింది. అద్భుత మహిమలు ఉన్నవారని చెప్పినవాళ్లంతా చేతులెత్తేస్తే మీరు కనీసం వారి వైపు ఊహ కూడా మళ్ళించని శాస్త్రవేత్తలు మేమున్నామని అభయమిస్తున్నారు.  ఏ కాలంలోనైనా నిజమైన మానవ శ్రేయస్సు కోరేది కేవలం విజ్ఞానమే.  మనిషిని కాపాడేది సైన్స్ సహాయంతో, సాటి మనిషే.. అంతేగాని మతమో లేదా దాని వెనుక దాగి ఉన్న దేవుడో కానే కాదు.. ! ఇప్పటికైనాకొత్త ఆలయాలు, విగ్రహాలు, ప్రార్థన స్థలాలు కట్టడం అపి హాస్పిటల్స్ సైన్స్ ల్యాబ్స్ మాత్రమే కట్టే దిశగా మతాలు ముందుకు రావాలి.

జంతువుల్లా జీవించ‌డం కాదు, మనుషుల్లా మానవత్వాన్ని చూపండి! అక్తర్

  ఈ క‌ష్ట స‌మ‌యంలోనైనా క‌నీసం  ఒకరికొకరు సాయం చేసుకుంటూ ముందుకు సాగడం ఒక్కటే మార్గం అని పాకిస్తాన్‌ మాజీ పేసర్ షోయబ్‌ అక్తర్‌ సూచించాడు. మనం జంతువుల్లా జీవిస్తున్నాం, మనుషుల్లా మానవత్వాన్ని చూపే సమయం ఇది అని పేర్కొన్నాడు. క‌రోనా మూడు నెలల తర్వాతైనా అదుపులోకి వస్తుందనే గ్యారంటీ లేదు. ఏ రోజుకు ఆరోజు బ్రతికే వారి గురించి అంతా ఆలోచించాలి. ఇక్కడ హిందూ, ముస్లిం అనే తేడా ఉండకూడదు. మనిషి మనిషిలాగా ఉండి కనీసం తమ వంతు సాయం చేయాలి' అని అక్తర్ పేర్కొన్నాడు. 'ఆర్థిక పరిస్థితి బాగున్నవారికి ప్ర‌స్తుత ప‌రిస్థితులు పెద్ద సమస్యగా క‌నిపించ‌డం లేదు.  ఇక్కడ ఇబ్బంది పడుతున్నది పేద ప్రజలు మాత్రమే. మనం మనుషుల్లా బ్రతుకుదామా.. లేక జంతువుల్లా ఉందామా. కనీసం తినడానికి తిండి లేనివాడికి సాయం చేయడానికి ప్రయత్నించండి. నిల్వలు పెట్టుకునే మాటే వద్దు. ఒకరికోసం ఒకరు అన్నట్లే ఉండాలి. అవతలి వాడి గురించి మనకెందుకు అనే ధోరణి వద్దు. మనుషులగా ఉండి తోటి వారిని రక్షించుకుందా' అని అక్తర్ పిలుపునిచ్చాడు. కరోనా వైరస్ ఒక ప్రపంచ సంక్షోభం. మనం దానిని ఎదుర్కోవడానికి ఒక ప్రపంచ శక్తిగా ఆలోచించాలి. ప్రపంచమంతా లాక్‌డౌన్‌లో ఉంది. ఇందుకు అందరూ సహకరించాలి. అంతేకాని.. గుంపులుగా ఉండడం, మీటింగ్స్ పెట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు' అని అక్తర్ అన్నాడు.  రోడ్డుపై ప్రజలు నిర్లక్ష్యంగా ప్రయాణించడాన్ని గమనించా. ఓ బైక్‌పై నలుగురు యువకులు వెళ్తున్నారు. సెలవు కావడంతో వారు విహారయాత్రకి వెళ్తున్నారట. రోడ్డుపైనే కొంత మంది భోజనాలు చేయడాన్ని చూసా.  కరోనా ఎక్కువగా మనుషుల కాంటాక్ట్ ద్వారానే వస్తుంది. ప్ర‌జ‌ల‌ నిర్లక్ష్యం కారణంగానే ఎవరూ ఇళ్లలో ఉండటం లేదని అక్తర్ ఆందోళన వ్యక్తం చేశాడు.

భారత్ లో 10కి చేరిన కరోనా మరణాలు

ఇండియాలో కూడా క‌రోనా వైర‌స్ దెబ్బ‌కు 10 మంది మ‌ర‌ణించారు.  హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రాలో 68 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. పరీక్షల్లో అతనికి కోవిడ్-19 పాజిటివ్ తేలింది. అతను సోమ‌వారం మృత్యువాత పడ్డాడు. అతను టిబెట్ సంతతికి చెందినవాడు. మార్చి 15వ తేదీన అమెరికా నుండి ఢిల్లీకి వచ్చాడు. పరీక్షల్లో పాజిటివ్ తేలడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.మహారాష్ట్ర - ఢిల్లీ - పశ్చిమ బెంగాల్ - కర్ణాటకలలో పలువురు మృత్యువాత పడ్డారు. ఇటలీ నుండి ఇటీవలే వచ్చిన 55 ఏళ్ళ వ్యక్తి కోల్ కతాలో సోమ‌వారంనాడే మృతి చెందాడు.  కరోనా కేసులు మార్చి 23 నాటికి 468కి చేరుకున్నాయి. కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.  అయినా జ‌నం భ‌యం బుధ్ది లేకుండా  గుంపులు గుంపులుగా రోడ్డు మీదకు వస్తున్నారు. ప్ర‌జ‌ల్లో మార్పు రాక‌పోతే  మ‌రో ఇట‌లీగా ఇండియా మారిపోతుంద‌ని వైద్యులు ఆందోళన వ్య‌క్తం చేస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావొద్దని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్ - జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ వైర‌స్ తో ఇప్ప‌ట్టి వరకు 15 వేల 189 మంది చనిపోయారని అంచనా వేస్తున్నారు. ఇందులో యూరప్ కి చెందిన వారు అధికంగా ఉన్నారు. 9 వేల 197 మంది చనిపోయారు.

హైదరాబాద్‌లో ఒక్క రోజే 3 వేల వాహనాలను సీజ్ చేశారు.

లాక్‌డౌన్‌ నేపథ్యంలో కఠిన నిబంధనలు ఉన్నప్పటికీ కొంత మంది వాటిని ఖాతరు చేయకుండా ఇష్టారీతిన రోడ్లపైకి వచ్చేస్తున్నారు. అలాంటి వారిపై పోలీసులు కొరడా ఝళిపించారు. హైదరాబాద్‌లో సోమ‌వారం రోజు దాదాపు 3 వేల  వాహనాలను సీజ్ చేసి, కేసులు నమోదు చేసిన‌ట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. నగరంలోని అన్ని మార్గాల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరం చేశారు. నగరంలోని 25 ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో 75 చెక్‌పోస్టులను ఏర్పాటుచేసినట్లు పోలీసులు తెలిపారు.   లాక్‌డౌన్‌పై తెలంగాణ ప్రభుత్వం మరింత సవివరంగా ఉత్తర్వులు జారీ చేసింది. విపత్తు నిర్వహణ చట్టం-2005, అంటువ్యాధుల (నియంత్రణ) చట్టం-1897 కింద ఈ లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లుగా ఉత్తర్వులో పేర్కొన్నారు.   ప్రత్యేకంగా  ప్రజలు, అధికారులందరికీ అర్థమయ్యేలా  ఈ ఉత్తర్వు మాత్రం తెలుగులో విడుదల చేశారు.

ర‌ష్యా, ఉత్త‌ర‌కొరియాపై ఈ వైర‌స్ ప్ర‌భావం ఎందుకులేదు?

అమెరికా ఆర్థిక వ్యవస్థల‌ను కూల్చ‌డానికే చైనా వైర‌స్‌ను వ‌దిలిందా? చైనా మిత్ర‌దేశాల‌పై ఈ వైర‌స్ ప్ర‌భావం ఎందుకు లేదు. రష్యా మ‌రియు ఉత్తర కొరియా క‌రోనా బారి నుండి పూర్తిగా ఎలా బ‌య‌ట‌ప‌డ్డారు? ఎందుకంటే వారు చైనాకు బలమైన మిత్రులు. ఈ 2 దేశాల నుండి ఒక్క కేసు కూడా బ‌య‌ట‌ప‌డ‌లేదు. మరోవైపు దక్షిణ కొరియా / యునైటెడ్ కింగ్‌డమ్ / ఇటలీ / స్పెయిన్ మరియు ఆసియా తీవ్రంగా దెబ్బతింటున్నాయి. వుహాన్ న‌గ‌రం అకస్మాత్తుగా ఘోరమైన వైరస్ నుండి ఎలా విముక్తి పొందింది? చైనా వారు తీసుకున్న ప్రారంభ చర్యలు చాలా కఠినమైనవి మరియు ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందడానికి వుహాన్ న‌గ‌రాన్ని పూర్తిగా దిగ్భంధం చేసిన‌ట్లు చైనా చెబుతుంది. అయితే బీజింగ్ పై ఎందుకు ప్ర‌భావం ప‌డ‌లేదు? వుహాన్ మాత్రమే ఎందుకు? ఆలోచించటానికి ఆసక్తికరంగా వుంది. వుహాన్ చైనాలో ప్ర‌ముఖ వ్యాపార న‌గ‌రం. అమెరికా మరియు పైన పేర్కొన్న అన్ని దేశాలు ఆర్థికంగా నాశనమయ్యాయి. చైనా ప్రణాళిక ప్రకారం త్వరలో అమెరికా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోతుంది. యుఎస్ఎ ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశంగా ఉన్నందున చైనాకు అమెరికాను సైనికపరంగా ఓడించలేమని తెలుసు. కాబట్టి వైరస్ ను ఉపయోగించి ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసింది. ఆర్థిక విధ్వంసం సృష్టించి అమెరికా దేశాన్ని, దాని రక్షణ సామర్థ్యాలను స్తంభింపజేయడానికి ఏకైక మార్గంగా భావించివుండ‌వ‌చ్చు. కొన్నేళ్లుగా ఆర్థిక మాంద్యంలోకి జారుకుంటున్న చైనా తమ దేశంలో విస్తరిస్తున్న విదేశీ పెట్టుబడిదారుల్ని ఎలా పంపించేయాలో తెలియక ఈ వైరస్‌ని సృష్టించి వుండ‌వ‌చ్చ‌ని తాజా పరిణామాల్ని గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతుందంటున్నారు విశ్లేష‌కులు. చైనాలో ఇప్పుడెందుకు కొత్త కేసులు నమోదు కావట్లేదని వారు ప్రశ్నిస్తున్నారు. చైనాలో కొత్తగా ఎవరూ మరణించకపోవడానికి కూడా కారణం చైనా మందును ముందుగా తయారుచేయడమే అంటున్నారు. అంతా ప్లాన్ ప్రకారం చేస్తోందని విమర్శి వుంది. చైనాలో అమెరికా, యూరప్ దేశాలకు చెందిన చాలా విదేశీ పెట్టుబడిదారులు పెద్ద మొత్తంలో స్థానిక కంపెనీల్లో వాటాలు కొనేసి... లాభాలు సంపాదిస్తూ, స్థానిక పారిశ్రామిక వేత్తలకు సమస్యగా మారుతున్నాయి. ప్రపంచీకరణ కారణంగా... చైనా తమ దేశంలో విదేశీ పెట్టుబడిదారుల్ని బలవంతంగా పంపలేదు. ఇలాంటి వైరస్‌ని సృష్టిస్తే... ఆటోమేటిక్‌గా ఆయా పెట్టుబడిదారులు తమ వాటాల్ని వెనక్కి తీసుకుంటారనే ఉద్దేశంతోనే చైనా ఈ కుట్ర పన్నిందనే వాదనపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. తన ప్లాన్‌లో భాగంగా చైనా వుహాన్ నగరాన్ని ఎంచుకుందని. అక్కడైతే... అన్ని దేశాల ప్రజలూ ఉద్యోగాలు చేస్తున్నారు, చదువు కుంటున్నారు కాబట్టి... అక్కడ వైరస్‌ని వ్యాపింపజేస్తే... తమ వ్యూహం ఫలిస్తుందని చైనా ఈ స్కెచ్ వేసిందనే ఆరోపణలు భగ్గుమంటున్నాయి.ఆరోపణలకు తగ్గట్టే... చైనాలోని స్థానిక కంపెనీల్లో తమ వాటాల్ని విదేశీ పెట్టుబడిదారులు అమ్ముకున్నారు. చైనా నుంచి బయటకు వెళ్లిపోయారు. ఫలితంగా రెండు రోజుల్లోనే చైనా ఆర్థిక వ్యవస్థలో రూ.1.50లక్షల కోట్ల రూపాయ‌ల స్వదేశీ సంపద వచ్చింది. తీవ్రమైన ఎకనామిక్ కోలాప్స్ అంచున ఉన్న దేశాల నుండి ఇప్పుడు స్టాక్లను కొనుగోలు చేయడం ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నియంత్రించడం చైనా దృష్టి పెట్టింది. వైర‌స్‌ను నాశనం చేయడానికి వారి వైద్య పరిశోధకులు నివారణను కనుగొన్నట్లు తరువాత చైనా ప్రకటించనుంది. ఇప్పుడు చైనా తమ ఆయుధాగారంలో ఇతర దేశాలకు స‌రిపోయే నిల్వలను కలిగి ఉంది. ఈ దేశాలు త్వరలో చైనాపై ఆధార‌ప‌డాల్సిందే. చైనా.ఇటలీ - వుహాన్ కనెక్షన్ చైనాలోని వుహాన్‌లో ఉద్భవించిన కరోనా వైరస్ ఇటలీ వంటి సుదూర, ఇతర ఖండ దేశాలలో ఎందుకు విస్తృతంగా వ్యాపించింది? సమాధానం ఏమిటంటే ఇటలీకి చైనాతో బలమైన వస్త్ర పరిశ్రమ వాణిజ్య సంబంధం ఉంది, ముఖ్యంగా చైనాలోని వుహాన్ ప్రావిన్స్‌తో. ఒక‌ లక్ష మంది చైనీస్ కార్మికులు ఉత్తర ఇటలీలోని వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్నారు. ఇటలీకి వుహాన్ నుండి ప్రత్యక్ష విమానాలు కూడా ఉన్నాయి. ఉత్తర ఇటలీలో భారీ చైనా వలస జనాభా ఉంది, వీరిలో చాలామంది వుహాన్ నుండి ప్రయాణించారు. ఈ వ్యక్తులను పరీక్షించడానికి మరియు పరిమితం చేయడానికి బదులుగా, ఇటాలియన్ అధికారులు ఫిబ్రవరిలో ‘హగ్ ఎ చైనీస్’ ప్రచారాన్ని ప్రారంభించారు. వారు ఇప్పుడు దాని ధరను చెల్లిస్తున్నారు. "నేను వైరస్ కాదు, నేను మానవుడిని. పక్షపాతాన్ని నిర్మూలించండి." కరోనావైరస్ కు వ్యతిరేకంగా పోరాటంలో ప్రోత్సహించడానికి చైనా ప్రజలను కౌగిలించుకోవాలని ఇటాలియన్లను విజ్ఞప్తి చేస్తూ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉత్తర ఇటలీలో విడుదల చేసిన వీడియోల సందేశం ఇది. అంతేకాకుండా, చైనీస్ న్యూ ఇయర్ 2020 ను జనవరి 25 నుండి ఫిబ్రవరి 8, 2020 వరకు జరుపుకున్నారు. కాబట్టి ఈ చైనా వలసదారులలో చాలామంది ఇటలీ నుండి వుహాన్ ఇంటికి వెళ్లి వారి కుటుంబాలతో నూతన సంవత్సరాన్ని జరుపుకున్నారు. వారు సెలవు తర్వాత తిరిగి వచ్చినప్పుడు, ఇటలీ విమానాశ్రయాలలో వాటిని పరీక్షించలేదు. ఇప్పుడు దాని ఫ‌లితం వారు అనుభ‌విస్తున్నారు.

హైద‌రాబాద్‌ కూర‌గాయ‌ల మార్కెట్‌లో దోపిడీ!

అతి ఆశ‌కు పోయిన‌ ఎర్ర‌గ‌డ్డ కూర‌గాయ‌ల మార్కెట్‌ వ్యాపార‌స్థుల‌కు ఘోర‌ప‌రాభ‌వం ఎదురైంది. క‌రోనా నేప‌థ్యంలో నాలుగు డ‌బ్బులు వెన‌కేసుకుందామ‌ని రేట్లు విప‌రీతంగా పెంచితే కొనుగోలు చేయ‌డానికి వ‌చ్చిన క‌స్ట‌మ‌ర్లు ఇష్టం వ‌చ్చిన‌ట్లు త‌మ ద‌గ్గ‌ర వున్న సంచుల్లో ప‌ట్టిన‌న్ని కూర‌గాయ‌లు వేసుకొని వెళ్ళిపోయారాట‌. స‌డ‌న్‌గా జ‌రిగిన ఈ సంఘ‌ట‌న‌తో బిత్త‌ర‌పోయిన వ్యాపార‌స్థులు క‌నీసం త‌మ జేబుల్లో వున్న డ‌బ్బు పోకుండా చూసుకున్నార‌ట‌. ష‌ట్‌డౌన్ నేప‌థ్యంలో ఎర్రగడ్డలో కూరగాయలు మార్కెట్లలో కూరగాయల ధరలు భారీగా పెంచేశారు. పదుల రేట్లలోని కిలో కూరగాయాలు వంద రూపాయలకు పైగా పెంచేయడంతో వినియోగ దారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయ‌డంతో వ్యాపార‌స్థుల‌కు కొనుగోలుదారుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ జ‌రిగింది. ఈ గొడ‌వ పెద్ద‌గా కావ‌డంతో వ్యాపారులపై వినియోగదారులు దాడికి దిగారు. ఇదే అదనుగా భావించి కొనుగోలుదారులు ఎక్కడికక్కడ అందినకాడికి కూరగాయలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనతో వ్యాపారులు షాక్‌కు గురైయ్యారు.

ఆంధ్ర ప్రదేశ్ లో బ్యాంకుల్లో కొత్త ఖాతాలు తెరవరు, రుణాల మంజూరు ఉండదు

కరోనా ప్రభావంతో ఏపీలో బ్యాంకుల పనివేళలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ కుదింపు, ఏపీలో కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో బ్యాంకింగ్ సర్వీసుల్లో మార్పులు, ఏపీలో కరోనా నేపథ్యంలో కొత్తగా ఖాతాలు తెరవడం, రుణాల మంజూరు నిలిపివేసిన బ్యాంకర్లు, ఏపీలో ఏటీఎంలు నిరంతరాయంగా పనిచేస్తాయని బ్యాంకర్ల సమితి ప్రకటన ఏపీలో కరోనా వైరస్ ప్రభావంతో బ్యాంకుల పని వేళల్లోనూ మార్పులు చేస్తున్నారు. బ్యాంకులకు వచ్చే కస్టమర్లను నిరుత్సాహపరిచేలా పలు చర్యలను ఇవాళ బ్యాంకర్ల రాష్ట్ర సమితి  ప్రకటించింది. వీటి ప్రకారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే బ్యాంకులు పనిచేస్తాయి. కొత్త ఖాతాలు తెరవడం, రుణాల మంజూరు ఉండదు.

' లక్ష్మణ రేఖ ' దాటితే, వాహనాలు స్వాధీనం: డి.జి.పి . గౌతమ్ సవాంగ్

 కరొనా వైరస్ వ్యాప్తి, తీవ్రంగా ఉన్నందున్న ప్రజలు స్వీయ నిర్బంధంలో ఉండాలని ఆంధ్ర ప్రదేశ్ డి జి పి గౌతమ్ సవాంగ్ విజ్ఞప్తి చేశారు.  ప్రజా ఆరోగ్యం కోసం ఇవాళ్టి నుంచి 31 మార్చ్ వరకు రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉంటుందనీ,  ప్రైవేట్ వెహికిల్స్ ఎమర్జెన్సీ పనులకు మాత్రమే ఉపయోగించాలనీ ఆయన సూచించారు.  వచ్చే వారం పది రోజులు క్రమశిక్షణతో ఉండాలని విజ్ఞప్తి చేశారు. సమస్యను అరికట్టాలి అంటే ప్రజాలెవరూ రోడ్ల పైకి రావద్దనీ, ప్రజలందరూ పోలీసులకు సహకరించాలనీ కోరారు.  భావి సమాజంకోసం పోలీసులు ఆంక్షల అమలులో ఖచ్చితంగా వ్యవహరిస్తారనీ, అజాగ్రత్తగా ఉంటే తీవ్రమైన పరిణామాలు ఎదురుకోవాల్సి ఉంటుందనీ, ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నామనీ, ప్రతి వాహనాన్ని పోలీసులు పరిశీలిస్తారు..ఎక్కువ సార్లు పోలీసుల దృష్టిలో పడితే వెహికిల్ సీజ్ చేస్తారనీ కూడా డి జి పి గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. సీజ్ చేసిన వాహనాలను వైరస్ తీవ్రత తగ్గిన తరువాత మాత్రమే రిలీజ్ చేస్తామన్నారు.  ప్రైవేట్ వాహనాలను నిత్యావసర వస్తువులు/అత్యవసర సేవలకు మాత్రమే అనుమతిస్తామని కూడా డి జి పి స్పష్టం చేశారు.  ప్రభుత్వ అధికారులు, చట్టాన్ని చాలా కఠినంగా అమలు చేస్తారనీ, అందుకు సహకరించాలని కూడా డి జి పి గౌతమ్ సవాంగ్ విజ్ఞప్తి చేశారు.

తెలంగాణలో 33కు చేరిన కరోనా కేసులు!

ఒక్క రోజే 6 పాజిటివ్ కేసులు బ‌య‌ట‌ప‌డ‌డంతో కరోనా పై తెలంగాణ సర్కార్ ఆందోళ‌న‌లో ప‌డింది. మొన్నటి వరకు విదేశాల నుంచి వచ్చిన వారిలో మాత్రమే కరోనా కనిపించగా.. ఇప్పుడు తెలంగాణ స్థానికులకూ ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు మూడు కాంటాక్ట్ కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా పేషెంట్లకు దగ్గరగా మెలగడం వలన వారికి కరోనా సంక్రమించింది. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. సోమవారం ఒక్కరోజే 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలుగువ‌న్‌కు తెలిపారు. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 33కు చేరింది. వీరిలో ఒకరు కోలుకొని డిశ్చార్జి కాగా.. మరో 32 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని మంత్రి తెలిపారు. అయితే బాధితులు కోలుకుంటున్నారని అందరూ ఆరోగ్యంగానే ఉన్నారని ఆయ‌న వెల్లడించారు. మరో 97 మంది అనుమానితులు బ్ల‌డ్ శాంప్లిస్ రిపోర్టులు పుణె వైరాలజీ ల్యాబ్ నుంచి రావాల్సి ఉందని ఈటల రాజేందర్ చెప్పారు. ఇప్పటివరకు వైరస్ కారణంగా మరణాలు సంభవించలేదని ఆయ‌న పేర్కొన్నారు. ప్రజలు స్వీయ నియంత్రణ వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే కరోనాను ఎదుర్కోవడం కష్టమేమీ కాదని చెప్పారు.

మీటరు దూరం ఉండి ఇంటర్వ్యూలు చేయండి: ప్రధాని మోదీ

* విపత్కర పరిస్థితుల్లో సేవ చేస్తున్న మీడియా ప్రతినిధులకు కృతజ్ఞతలు * కోవిడ్ 19 జీవిత కాల సవాల్ కొవిడ్‌-19 జీవితకాల సవాల్‌ అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. సరికొత్త, సృజనాత్మక పరిష్కారాలతో ఈ మహమ్మారిని కట్టడి చేయాలని మీడియా ప్రతినిధులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పిలుపునిచ్చారు. ఇప్పటికే కరోనా అంటువ్యాధితో దేశంలో ఏడుగురు మరణించారు. సోమవారం మధ్యాహ్నానికి పాజిటివ్‌ కేసుల సంఖ్య 415కు చేరుకుంది. 'పాత్రికేయులు, కెమెరా పర్సన్స్‌, సాంకేతిక నిపుణులు దేశానికి అవిశ్రాంతంగా సేవలందిస్తున్నారు. సానుకూల భావప్రసారంతో నిరాశావాదం, భయాన్ని మీడియా తరిమికొట్టాలి.కొవిడ్‌-19 జీవితకాల సవాల్‌. వినూత్న, సృజనాత్మక పరిష్కారాలతో దానిని తరిమికొట్టాలి' అని మోదీ అన్నారు. కరోనా మహమ్మారి ఎంత ప్రమాదకరమో అర్థంచేసుకొని, ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న మీడియాకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. 'ఒక సుదీర్ఘ యుద్ధం మన ముందుంది. ప్రజలకు అర్థమయ్యే సులభ భాషలో సామాజిక దూరం (సోషల్‌ డిస్టెన్స్‌) ఎంత ముఖ్యమో మీడియా తెలియజేయాలి. కీలక నిర్ణయాలు, తాజా విషయాలను వివరించాలి' అని ప్రధాని అన్నారు. మీడియా ప్రజల అభిప్రాయాలను తెలియజేస్తుందని ఆయన పేర్కొన్నారు. వాటి ఆధారంగానే ప్రభుత్వం పనిచేస్తుందని వెల్లడించారు. మీడియా సంస్థలు పాత్రికేయులకు ప్రత్యేకమైన మైకులు ఇవ్వాలని సూచించారు. ముఖాముఖి చేసేటప్పుడు కనీసం ఒక మీటరు దూరం ఉండి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. శాస్త్రీయ నివేదికలనే మీడియా ప్రసారం చేయాలని మోదీ కోరారు. అవగాహన కలిగిన నిపుణులనే చర్చల్లో భాగస్వాములగా చేసి అసత్యాలు వ్యాపించకుండా చూడాలన్నారు. పౌరులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. వైరస్‌ వ్యాపించకుండా ఉండాలంటే సామాజిక దూరం పాటించడమే శరణ్యమన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రధాని తరచూ జాతినుద్దేశించి ప్రసంగించాలని మీడియా ప్రతినిధులు ఈ సందర్భంగా మోదీని కోరారు. సానుకూల కథనాలు చెప్పాలని, కొవిడ్‌-19 నుంచి కోలుకున్న వారి అభిప్రాయలు పంచుకుంటే బాగుంటుందన్నారు. పాత్రికేయులను పరీక్షించేందుకు 24 గంటలు పనిచేసే వైద్యబృందాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. అసత్యాలను అడ్డుకొనేందుకు వైద్యులు సహకారం అవసరమన్నారు. ప్రసార భారతి రోజుకు రెండు సార్లు సరైన వివరాలు అందజేస్తే అన్ని చానళ్లు వాటినే ప్రసారం చేయగలవని సూచించారు. విలువైన సలహాలు ఇచ్చిన మీడియా ప్రతినిధులకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. కరెన్సీ నోట్ల ద్వారా వైరస్‌ వ్యాపించే ప్రమాదముందని విస్తృతంగా అవగాహన కల్పించాలని కోరారు. డిజిటల్‌ చెల్లింపులు చేసేలా ప్రోత్సహించాలన్నారు. శాస్త్రీయ రిపోర్టింగ్‌ ద్వారా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలన్నారు. ఈ సమావేశంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖా మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌, ఐబీ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు.

ఇన్ సైడర్ ట్రేడింగ్ గుట్టు విప్పనున్న సి బి ఐ

ఆంధ్ర ప్రదేశ్ లో రాజధాని ప్రాంతం లో జరిగిన భూ అక్రమాల కేసును సి బి ఐ -సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బలవంతపు భూ సేకరణ, ఇన్ సైడర్ ట్రేడింగ్ కి సంబంధించి ఇప్పటి వరకూ సి ఐ డి విచారణ జరిపిన విషయం తెలిసిందే. ఇక మీదట ఆ కేసును, సి బి ఐ విచారిస్తుందని హోమ్ సెక్రెటరీ కుమార్ విశ్వజిత్ ప్రకటించారు. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిషమెంట్ యాక్ట్, 1946 లోని సెక్షన్ 6 కింద ఈ కేసును, సి బి ఐ కు బదలాయిస్తున్నట్టు హోమ్ సెక్రెటరీ పేర్కొన్నారు. క్యాబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక లో ఇంసైడర్ ట్రేడింగ్ జరిగిన విషయం నిర్ధారణ కావటం వల్ల, అలాగే, ఇందులో అప్పటి తెలుగు దేశం ప్రభుత్వం లో ఉన్న మంత్రులు, అధికారుల ప్రమేయం ఉన్నట్టుగా సబ్ కమిటీ నివేదిక ఇచ్చినందువల్ల రాష్ట్ర ప్రభుత్వం తొలుత సి ఐ డి తో ఈ విచారణ ప్రారంభించింది. అయితే, ఈ రోజు తాజా ప్రకటన ద్వారా ఇక మీదట సి బి ఐ , ఇన్ సైడర్ల గుట్టు విప్పనుంది. అమరావతిలో వేల కోట్ల అవినీతి జరిగిందని ఏపీ కేబినెట్ సబ్ కమిటీ నివేదిక వెల్లడించిన విషయం తెలిసిందే . టీడీపీ నేతలు ఇన్ సైడర్ ట్రేడింగ్ తో భూములు కొనుగోలు చేసినట్లు కమిటీ నిర్ధారించినట్టు క్యాబినెట్ సబ్ కమిటీ పేర్కొంది. . ఆధారాలతో సహా ఇన్ సైడర్ ట్రేడింగ్ ను బయటపెట్టిన సబ్ కమిటీ... 4,075 ఎకరాల భూముల టీడీపీ నేతలు కొనుగోలు చేసినట్లు తేల్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు హెరిటేజ్ సంస్థ, లింగమనేని, వేమూరి హరిప్రసాద్‌ భారీ భూ కొనుగోళ్ల వివరాలను కమిటీ తన నివేదికలో పొందు పర్చింది . అప్పటి మంత్రులు పుల్లారావు, నారాయణ, పరిటాల సునీతతో సహా టీడీపీ నేతల అమరావతిలో భూములు కొన్నట్టు నివేదికలో వెల్లడించింది. . సీఆర్డీఏ పరిధిని ఇన్ సైడర్ ట్రేడింగ్ కోసం పలుమార్లు మార్చినట్లు ఆధారాలు గుర్తించిన కేబినెట్ సబ్ కమిటీ... ఎస్సీ, ఎస్టీ నుంచి 900 ఎకరాల అసైన్డ్ భూములను టీడీపీ నేతలు కొనుగోలు చేసినట్లు నివేదికలో స్పష్టం చేసినట్టు తెలిసింది. తెల్ల రేషన్ కార్డుదారులు కూడా కోట్ల విలువైన భూములు కొనుగోలు చేశారని... హైదరాబాద్ లోని తెల్లరేషన్ కార్డుదారులు కూడా అమరావతిలో భూములు కొనుగోలు చేసినట్లు నివేదికలో వెల్లడించినట్టు సమాచారం. ఈ నివేదిక ఆధారంగానే దీనిపై సీబీఐ విచారణను కోరాలని ఏపీ ప్రభుత్వం లోగడే నిర్ణయించింది.

పెంపుడు జంతువులను ముద్దు పెట్టుకోవ‌ద్దు!

పెంపుడు జంతువుల వల్ల క‌రోనా వైరస్ వస్తుందా? ఏమో! హాంగ్ కాంగ్ లో రెండేళ్ల జర్మన్ షెపర్డ్, 17 ఏళ్ల పోమెరేనియన్ కుక్కుల పై కరోనా వైరస్ టెస్టు చేశారు. ఆ టెస్టులో వాటికి పాజిటివ్ అని తేలింది. దాంతో ఆ కుక్కలను నిర్భంధంలో ఉంచారు. ఆ తర్వాత వాటి నిర్భందం నుంచి విడుదల చేసిన రెండు రోజులకే చనిపోయాయి. వారి యజమానులకు కూడా కరోనా వైరస్ టెస్టు చేస్తే పాజిటివ్ అని వచ్చింది. ఈ వైరస్ మానవుల నుండి కుక్కలకు వ్యాపిస్తుందని చెప్పటానికి ఇది ఒక ఉదాహరణ. హాంగ్ కాంగ్ జంతు-సంక్షేమ ఆథారిటీ, పెంపుడు జంతువుల యజమానులకు ఈ సంద‌ర్భంగా కొన్ని సూచనలు చేసింది. పెంపుడు జంతువుల ప‌ట్ల‌ పరిశుభ్రత పద్ధతులను పాటించమని గుర్తు చేసింది మరియు వారి పెంపుడు జంతువులను ముద్దు పెట్టుకోకుండా ఉండమని వారిని కోరింది. అయితే ఇప్పటివరకు పెంపుడు జంతువుల నుంచి మానవులకు వ్యాపిస్తుందని చెప్పటానికి ఖ‌చ్చిత‌మైన ఆధారాలు లేవు. పారిస్ ఆధారిత వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్ ప్రకారం , యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ మరియు వెట్ డయాగ్నొస్టిక్ కంపెనీ ఐడిఎక్స్ఎక్స్ పెంపుడు జంతువుల నుండి కోవిడ్ -19 సంక్రమిస్తుందా అనే విషయం పై వేలాది కుక్కలు మరియు పిల్లులను పరీక్షించింది. కానీ ఈ పరీక్ష ద్వారా పెంపుడు జంతువుల నుండి కోవిడ్ 19 సంక్రమిస్తుందని నిర్ధారించలేదు.