ఏపీ సర్కార్ మత వివక్ష నిజమేనా? టీటీడీని అభాసుపాలు చేస్తున్నది అందుకేనా?
ఒక్క తెలుగు వారు మాత్రమే కాదు, ఒక్క హిందువులు మాత్రమే కాదు.. ఒక్క భారతీయులు మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కోట్ల కోట్ల మంది భక్తులు తిరుమల దేవుడు, వెంకటేశ్వర స్వామిని కుల వేలుపుగా కొలుస్తారు. పరమ పవిత్రంగా ఆరాధిస్తారు. ఎక్కడెక్కడి నుంచో భక్తులు గోవిందనామ స్మరణతో వెంకన్నను చేరుకుంటారు. దర్శించుకుంటారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా కొలుస్తారు. వడ్డి కాసుల వాడికి, కానుకలు సమర్పించుకుంటారు. తిరుమల కొండలను ఆ దేవదేవుని ప్రతిరూపంగా, పవిత్రంగా భావిస్తారు. భక్తీ భావంతో వెనుతిరుగుతారు.
కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, టీటీడీ పాలక మండలి మాత్రం, వడ్డీ కాసుల వాడిని , వట్టి కాసుల వాడిగానే చూస్తున్నాయని, అనుకోవలసి వస్తోంది. ఇంకా చెప్పాలంటే, ముఖ్యమంత్రి జగన్మోహాన్ రెడ్డి ప్రభుత్వం తిరుమల కొండను బంగారు బాతుగా, వెంకన్న దేవుని, భక్తుల భక్తి బావాన్ని, ఒక వ్యాపర వస్తువుగా చూస్తోందనే సందేహాలకు తవిచ్చేలా, ఇటు ప్రభుత్వం, అటు టీటీడీ నిర్ణయాలు, ప్రవర్తన ఉన్నాయి, అంటే కాదనే పరిస్థితి లేదు. ఓ వంక వెంకన్నా దేవుని ఆస్తులను అమ్మి సోమ్ముచేసుకునే కుట్రలు సాగిస్తూనే మరో వంక పవిత్ర పుణ్య క్షేత్రాన్ని వ్యాపార కేంద్రంగా మార్చి, వివాదాలకు నిలయంగా మార్చింది.
ఇప్పుడే కాదు, జగన్మోహాన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన క్షణం నుంచి టీటీడీ వివాదాలకు నిలయంగామారి పోయింది. పరోక్షంగానే కావచ్చును అన్యమత ప్రచారాన్నిప్రోత్సహిస్తోందనే ఆరోపణలూ ఉన్నాయి. టీటీడీలో కొలువు తీరిన అన్యమతస్తుల ఏరివేతకు ప్రయత్నించడమే పాపమన్నట్లుగా అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుభ్రమణ్యంను జగన్ రెడ్డి ప్రభుత్వం రాత్రికి రాత్రి బదిలీ చేసింది. నిజానికి, ఈ రెండున్నర సంవత్సరాలలో జగన్ రెడ్డి ప్రభుత్వం హయాంలో హిదువుల మనోభావాలు దెబ్బతినే సంఘటలు, టీటీడీలోనే కాదు రాష్ట్రం అంతటా సాగుతూనే ఉన్నాయి. విగ్రహాల ద్వంస రచన మొదలు, అన్యమత ప్రచారానికి, అండదండలు అందించడం వరకు జగన్ రెడ్డి ప్రభుత్వం మత వివక్ష, విద్వేషాలకు తావిచ్చేల పరిపాలన సాగిస్తోందనే విధంగానే ప్రభుత్వ పాలనా సాగుతోంది.
టీటీడీవిషయంలోనూ ముఖ్యమంత్రి సొంత బాబాయి వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ చైర్మన్ నియమించిండం మొదలు, ప్రతి విషయంలోనూ భక్తుల మనోభావాలను దెబ్బతీసీ విధంగానే, వ్యవహారం నడుస్తోందనే విమర్శలున్నాయి. ఒక దశలో టీటీడీఆస్తుల విక్రయానికి జగన్ రెడ్డి ప్రభుత్వం సిద్దమైంది. అయితే, భక్తుల నుంచి తీవ్ర ప్రతిఘటన రావడంతో వెన కడుగు వేసింది.అయితే, అప్పుడు ప్రభుత్వం భక్తులు తిరగబడతారనే భయంతో వెనకడుగు వేసినా, ప్రభుత్వం దృక్పధంలో మాత్రం మార్పులేదు. అందుకే, ఇప్పడు మళ్ళీ, సంప్రదాయ భోజనం పేరిట కొండమీద మరో దుకాణాన్ని తెరిచింది. రసాయన ఎరువులు వాడకుండా, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటలతో 14 రకాల వంటలు భక్తులకు విక్రయించే దుకాణం దుకాణం తెరిచారు.అయితే, కొండ మీద అన్నం అమ్మడమా, అది కూడా టీటీడీ.. అంటూ భక్తుల నుంచి విమర్శలు రావడంతో మళ్ళీ మరోమారు వెనకడుగు అయితే వేసింది, కానీ, వెనకటి గుణం మాత్రం మారలేదు. సంప్రదాయ భోజన విధానం నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బా రెడ్డి ప్రకటించారు. పాలకమండలి పదవీ కాలం ముగిసిన సమయంలో అధికారులు ఆ నిర్ణయం తీసుకున్నారని, అయితే దానిపై తాను చర్చించి నిర్ణయం ఉపసంహరించుకున్నట్లు ఆయన తెలిపారు. తిరుమల కొండపై భక్తులకు స్వామివారి ప్రసాదంగానే భోజనం అందించాలని, అన్నప్రసాదానికి డబ్బులు తీసుకోకూడదని అధికారులకు సూచించామని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. వైవీ తెలివిగా నేరాన్ని, అధికారులపైకి నెట్టేశారు, కానీ, యథారాజా తథా ప్రజా అన్నట్లుగా, జగన్ రెడ్డి అడుగుజదాల్లోనే అధికారులు నడుస్తున్నారు అనేది వైవీ కూడా కాదనలేని నిజం.
అందుకు ఉదాహరణ, సంప్రదాయ భోజనం వివాదం ముగియక ముందే, అదే టీటీడీ పలక మండలి, ఉభయ తెలుగ రాష్ట్రాల్లోని 177 కళ్యాణ మండపాల నిర్వహణను హిందూ సంస్థలు, ఆలయాలు, మఠాలు, ట్రస్ట్ లు, హిందూ మతానికి చెందిన వ్యక్తులకు 5 సంవత్సరాల పాటు లీజుకు ఇవ్వాలని నిర్ణయించింది. అయితే, ఇందులో ఇంకేదో మతలబు ఉందని, దేవాలయాలలోనే ప్రభుత్వ పెద్దల సహకారంతో అన్యమతస్తులు అధికారం చెలాయిస్తున్నప్పుడు,కళ్యాణ మండపాల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు లీజుకు ఇవ్వడం అంటే, దొడ్డిదారిన అన్యమతస్తులకు అవకాశం కలిపించడం కాదా, అన్న అనుమానాలు విన వస్తున్నాయి. అయితే, చరిత్ర చెపుతునండి ఏమంటే, వెంకన్న జోలికి వచ్చిన వారెవ్వరూ బాగుపడింది లేదు, బావుకున్నదీ లేదు.