దక్షిణాది పై పట్టు కోసం ..  కమల దళం కొత్త వ్యూహం

భారతీయ జనతా పార్టీ, 2024 ఎన్నికలలో ముచ్చటగా మూడవసారి విజయం సాధించి, హ్యాట్రిక్ సొంతం చేసుకునేందుకు, ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. ఒకప్పుడు కేవలం ఉత్తరాది రాష్ట్రాలకే పరిమితమైన పార్టీ, ఇప్పుడు ఇక్కడ  అక్కడ  అని కాకుండా, దేశం అంతటా ప్రాబల్యం పెంచుకు నేందుకు గట్టి ప్రయత్నాలు సాగిస్తోంది. ముఖ్యంగా 2024 ఎన్నికల నాటికి  దక్షిణాదిలో పాగా వేసేందుకు, వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఇందుకోసంగా, ‘బీజేపీ సౌత్ మిషన్’ పేరిట బ్లూ ప్రింట్‌ను సిద్ధం చేసిందని పార్టీ అంతర్గత వర్గాల సమాచారం. ఇందు భాగంగానే, కమల దళం ఉభయ తెలుగు రాష్ట్రాలపై  ప్రత్యేక దృష్టి ని కేంద్రీకరించింది.  నిజానికి, అమిత్ షా 2014లో పార్టీ అధ్యక్ష పదవి చేపట్టినప్పుడే ఇప్పటి వరకు పార్టీ ఒకసారి  కూడా అధికా రంలోకి రాలేని దక్షిణ, తూర్పు రాష్ట్రాలలో అధికారం చేపట్టడమే పార్టీ ముందున్న ప్రధాన లక్ష్యంగా ప్రక టించారు. ఆ తర్వాత అస్సాంతో సహా  పలు  ఈశాన్య రాష్ట్రాలలో బీజేపీ జెండా ఎగరేసింది. కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పడింది. పశ్చిమ బెంగాల్, ఒడిశాలో ప్రధాన ప్రతిపక్షంగా సమీప భవిష్యత్తులో అధికారం లోకి రాగలమనే ధీమాతో ఉన్నారు.   అయితే, మిగిలిన దక్షిణాది రాష్ట్రాలలో ఆ వ్యూహాలు ఫలించలేదు.  ఇతర పార్టీల నుండి పేరొందిన నాయకులను దిగుమతి చేసుకోవడం, ఇతర రాష్ట్రాల నుండి సొంత నాయకులను తీసుకురావడం, ప్రముఖ సినీ తారలను ఆకట్టుకోవడం, ప్రాంతీయ  పార్టీలలో చీలికలను ప్రోత్సహించడం వంటి అనేక ప్రణాళికలు చెప్పుకోదగిన ఫలితాలు ఇవ్వలేదు. గతంలోని కొన్ని వ్యూహాలు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవడంతో పార్టీ ఇప్పుడు దక్షిణాదిని విస్తరిం చేందుకు, 2024 ఎన్నికలలో కొత్త ఎన్నికల విజయాలను సాధించేందుకు కొన్ని కీలక మార్పులతో సరికొత్త ప్రణాళికతో సిద్ధమవుతున్నారు. దక్షిణాది రాజకీయాలు ఉత్తరాదికన్నా భిన్నమైనవని పార్టీ నాయకత్వం గ్రహించింది.  ఉత్తరాదిలో మంచి ఫలితాలు ఇస్తున్న హిందుత్వ రాజకీయాలకు భిన్నమైన రీతిలో, సైద్ధాంతిక అంశాలకు, సంక్షేమ కార్యక్రమాలకు  మధ్య గల సరిహద్దులను అధిగమించి దక్షిణాది ప్రజలకు ఆమోదయోగ్యమైన పార్టీగా నిలబడే కృషి ప్రారం భించారు. ఐదు దక్షిణాది రాష్ట్రాలలో మూడింటిలో ప్రాంతీయ పార్టీలు రాజకీయ రంగంలో ఆధిపత్యం చెలాయిస్తు న్నం దున,ఈ ప్రాంతీయ పార్టీలను ఎదుర్కోవడానికి బిజెపి వారసత్వ రాజకీయాలపై పోరాటం ఆయు ధాన్ని ఎంచుకొంటున్నది.  కాంగ్రెస్-ముక్త్ భారత్, అవినీతి రహిత భారతదేశం 2014 నుండి ప్రముఖ బీజే పీ నినాదాలు. అయితే 2024లో `వారసత్వ ముక్త - భారత్’ నినాదాన్ని జోడింపనున్నది. తద్వారా యువత ను ఆకట్టుకోవచ్చని భావిస్తున్నది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన బీజేపీ 42వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా పార్టీ కేడర్‌ను ఉద్దే శించి చేసిన ప్రసంగంతో ప్రారంభించి ప్రధాని మోడీ తరచూ కుటుంబ రాజకీయాలను లక్ష్యంగా చేసుకుంటూ ప్రసంగిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో మోడీ , బీజేపీకి కుటుంబ పాలన వ్యతిరేక సెంటిమెంట్  రాజకీయం గా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది.   అంతేకాకుండా, ఎన్నికలలో ఇప్పటికీ ప్రాబల్యం చూపించలేక  పోతున్న  రాష్ట్రాల్లో పార్టీ సరికొత్త విధా నాన్ని ఆవలంభించ వలసిన అవసరాన్ని గుర్తించింది. పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలో తప్ప మిగి లిన రాష్ట్రాలలో క్షేత్రస్థాయిలో బీజేపీ పటిష్టంగా లేదన్నది వాస్తవం. కాబట్టి పార్టీ మొత్తం రాష్ట్రంపై దృష్టి పెట్టకుండా, కొన్ని నియోజకవర్గాలను కైవసం కోవడంపై దృష్టి సారిస్తూ, ఆ బాధ్యతలను కేంద్ర మంత్రు లకు  అప్పచెప్పి, సంక్షేమ కార్యక్రమాల ద్వారా అక్కడ పట్టు సాధించే ప్రయత్నం చేపట్టనుంది. ఉదాహరణకు, గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు సాపేక్షంగా మెరుగైన పనితీరు కనబరిచిన కేరళలోని లోక్‌సభ నియోజకవర్గాలకు కేంద్ర మంత్రులు ఎస్ జైశంకర్, అశ్విని కుమార్ చౌబే, శోభా కరంద్లాజేలను ఇన్‌ఛార్జ్‌లుగా నియమించారు. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషికి తెలంగాణలో నియోజక వర్గాల ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు అప్పగించారు. తమిళనాడులో, రాష్ట్రంలోని ఉత్తరాది ప్రాంతాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో ఆ సామాజికవర్గ ప్రభావాన్ని ఉపయోగించుకునేలా, ఆధిపత్య వన్నియార్లను ఆకర్షించడానికి పార్టీ తన ప్రయత్నాలను కొనసాగి స్తుంది. దాదాపు 150 బలహీన నియోజకవర్గాలను లక్ష్యంగా చేసుకుని ‘ప్రవాస్’ ప్రచారంతో పాటు రూపొందించిన కొత్త వ్యూహం, ఈ దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని విస్తరించి, ఎక్కువ సీట్లు గెలుచుకోవాలనే పట్టుదలను వెల్లడి చేస్తుంది. ఇప్పటి వరకు దక్షిణాదిన చేస్తున్న ప్రయత్నాలు తగు ఫలితాలు ఇవ్వకపోవడం గ్రహించి,  సరికొత్త వ్యూ హాలతో బిజెపి సరికొత్త సౌత్ మిషన్‌ను సిద్ధం చేశారు. ఉదాహరణకు, తమిళనాడులో, రజనీకాంత్ వంటి ప్రముఖ స్టార్‌ను ఆకట్టుకోవడం కోసం ప్రయత్నించి విఫలమైంది.   ఏఐఏడీఎంకేతో పొత్తు కూడా ఆశిం చిన ప్రయోజనం చేకూర్చలేక పోయింది. అదేవిధంగా, కేరళలో, భరత్ ధర్మ జనసేన  (బిడిజెఎస్)  ద్వా రా ఓబిసి ఈజ్వా కమ్యూనిటీని ప్రభావితం చేయడానికి చేసిన ప్రయత్నాలు ఆశించిన ఫలితం ఇవ్వ లేదు. అయితే తెలంగాణలో టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మాజీ నమ్మకస్తుడైన ఈటెల రాజేందర్‌ ను పోటీకి దింపి హుజూరాబాద్‌ అసెంబ్లీ సీటును బీజేపీ గెలుచుకో గలిగింది.   ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడులలోని కొన్ని నియోజకవర్గాలపై బీజేపీ ప్రధానంగా దృష్టి సారిస్తుం డగా, తెలంగాణ మాత్రం బీజేపీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడానికి బలమైన అవకాశం ఉందని భావిస్తు న్నారు. ప్రముఖ క్రీడాకారిణి పి టి ఉష (కేరళ), సంగీత మాంత్రికుడు ఇళయరాజా (తమిళనాడు), వితరణశీలి వీరేంద్ర హెగ్డే, సినీ రచయిత కె వి విజయేంద్ర ప్రసాద్ (ఆంధ్రప్రదేశ్)లను రాజ్యసభకు నామినేట్ చేయ డానికి ప్రభుత్వం ఇటీవల తీసుకున్న చర్య దక్షిణాది రాష్ట్రాలపై దాని కొత్త జోరులో భాగమే.   పైగా, తెలంగాణ నుండి డా. లక్ష్మణ్ కు, కర్ణాటక నుండి యడ్డ్యూరప్పకు పార్టీ పార్లమెంటరీ బోర్డు, ఎన్ని కల కమిటీలలో స్థానం కల్పించారు. డా. లక్ష్మణ్ కు రాజ్యసభ సభ్యత్వం కూడా ఇచ్చారు. సంస్థాగత వ్యవహారాలలో నిపుణుడైన సునీల్ బన్సల్ ను తెలంగాణతో పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్ లలో పార్టీ సంస్థాగత వ్యవ హారాల ఇన్ ఛార్జ్ గా పంపారు. ఏ మూడు రాష్ట్రాలలో అడిహకారంలోకి రావడంకోసం కృషి చేస్తుండడం తెలిసిందే. నిజానికి, 2024లో తిరిగి అధికారాన్ని నిలుపుకోవడంతో పాటుగా, ప్రాంతీయ పార్టీ ల ప్రాబల్యా న్ని కట్టడి చేసేందుకు, బీజేపీ దీర్ఘకాల ప్రణాళికతో ముందుకు వస్తోందని, పార్టీ వర్గాల సమా చారంగా ఉందని, అంటున్నారు.   

ఎక్క‌వ‌ద్దు... మీ మ‌మ్మీ న‌న్నుకొడుతుంది! 

పిల్ల‌ల‌కి పాక‌డం రావ‌డం ఆల‌స్యం ఇల్లంతా తిరిగేస్తుంటారు. వారికి అదో ఆట‌. ఇల్లంతా క‌లియ తిర‌గ డానికి ప్ర‌య‌త్నిస్తుంటా. కానీ అంత శుభ్రంగా ఉందీ లేనిదీ త‌ల్లిదండ్రుల‌కు తెలుసు కాబ‌ట్టి పిల్ల‌ల్ని అలా ఇల్లంతా పాక‌నీయ‌రు. ఓ క్షణం త‌ర్వాత ఎత్తుకుంటారు. కానీ కొత్త‌గా నేర్చిన ఆట ఎప్పుడూ ప‌సం దుగానే ఉంటుంది.. పిల్ల‌ల‌కీ అంతే. మాట‌లు రావు గ‌నుక చేత్తుల‌తో ఎత్తుకున్న‌వారి మొహాన్ని కొడుతూ కింద‌కి వ‌ద‌ల‌మంటారు. త‌ల్లిందండ్రులకు, ఇంట్లో పెద్ద‌వారికి అదో ఆనందం. దానికి అంతే ఉండ‌దు.  కానీ ఇలా అమితోత్సాహంతో పిల్ల‌లు మేడ మెట్లు ఎక్క‌డానికీ ప్ర‌య‌త్నిస్తుంటారు. ఇది ప్ర‌మాద‌క‌రం. అందుకే వెన‌కాలే తిరుగుతూ మెట్ల వేపు వెళ్ల‌కుండా జాగ్ర‌త్త‌ప‌డుతుంటారు, జాగ్ర‌త్త‌ప‌డాలి. న‌డ‌క వ‌స్తే ప‌ట్టుకోవడం మ‌రీక‌ష్టం. ఇంట్లో పిల్ల‌ల‌తో పాటు కుక్క‌పిల్ల‌నీ అంతే  ప్రేమ‌గా చూసుకునేవారు చాలా మందే ఉన్నారు. అది కూడా అలా పాకుతూనో, న‌డ‌క‌నేర్చి రెండు అడుగులు వేసే పిల్ల‌ల‌తోనో తిరుగు తూనే ఉంటుంది. దానికి పెద్ద‌వాళ్ల త‌ర్వా త ఇంట్లో హ‌ఠాత్తుగా ఈ రాజు, రాకుమారి ఎవ‌రా అని ఆశ్చ‌ర్యం.  మెల్ల‌గా ఇంట్లోవారు పిల్ల‌నో, పిల్లాడినో ఎలా చూస్తున్నార‌న్న‌ది కుక్క‌పిల్లా గ‌మ‌నిస్తుంది. అదీ అంతే జాగ్ర త్త‌లు తీసుకుంటుంది. వేగంగా వెళు తుంటే అడ్డుకోవ‌డం, మెట్లు ఎక్క‌బోతే వారించ‌డ‌మే చేస్తుంది. పిల్ల లు కోప‌గించి దాన్ని కొడ‌తారు. దానికి  దెబ్బే త‌గ‌ల‌దు కానీ,  అడ్డుకోవ‌డం మాత్రం మాన‌దు. ప‌డ‌తార‌న్న భ‌యం త‌ల్లిదండ్రుల‌కు ఎలా ఉంటుందో తోడుగా తిరిగే కుక్క‌పిల్ల‌కీ ఉంటుందేమో!  మీరు చూస్తున్న ఫోటోలో సీన్ అదే. ఆ ప‌సికూన మెట్లెక్క‌డానికి విశ్వ‌య‌త్నం చేస్తోంది. స‌సెమీరా అంగీ క‌రించ‌ని కుక్క అడ్డుకుంటోంది. పిల్ల‌డు ఎక్కి ప‌డితే త‌ల్లిదండ్రులు ఓదార్చి ముద్దెడ‌తారు. కానీ త‌న్ను లు మాత్రం త‌న‌కు త‌ప్ప‌వుక‌దా!  అదీ కార‌ణం కావ‌చ్చు.. అందుకునే అడ్డుకుంటోంది! ఇది ఎక్క‌డ‌ద‌ని కాదు.. ప్ర‌తీ ప్రాంతంలో దాదాపు కుక్క‌లున్న ప్ర‌తీ ఇంట్లో సీన్ ఇలానే ఉంటుంది. కుక్క‌లు య‌జ‌మాని భ‌క్తులు. తిండిపెట్టి పెంచుతున్నారు గ‌నుక‌, దెబ్బ‌లు తిన‌కూడ‌దుగ‌దా! అందుకునే ఈ ర‌క్ష‌ణకు పూనుకుంటుంది!

సోరెన్ కో న్యాయం , జగన్ కో న్యాయం .. ఇదెక్కడి అన్యాయం ?

చట్టం ముందు అందరూ సమానమే, కానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం దృష్టిలో కొందరు ఎక్కువ సమానం.అవును,ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్’ అధికార దుర్వినియోగానికి పాల్ప డ్డారనే ఆరోపణపై, కేంద్ర ఎన్నికల సంఘం ఆయన పై కొరడా ఝుళిపించింది. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951 ప్రకారం, ఆయన శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని, ఆయన ఎమ్మెల్యే పదవిపై అనర్హత వేటు వేయాలని ఎన్నికల సంఘం సిఫార్సు చేసింది.  అయితే, ఇంతకీ సోరెన్ చేసిన నేరం ఏమిటి? ఎన్నికల సంఘం ఆయనపై వేటుకు ఎందుకు సిఫార్సు చేసింది? అంటే, ముఖ్యమంత్రి సోరెన్ తనకు తానే మైనింగ్‌ కేటాయించుకుని,అధికార దుర్వినియో గానికి పాల్పడ్డారనే ఆరోపణపై ఎన్నికల సంఘం విచారణ జరిపింది. ఆరోపణలు నిజమని తేలడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. అందుకే  ఆయనపై అనర్హత వేటు వేయాలని ఈసీ ఆ రాష్ట్ర  గవర్నర్’ కు సూచించింది. గవర్నర్ సోరెన్ ఎమ్మెల్యే అభ్యర్థిత్వాన్ని రద్దు చేశారు.  ఇంతవరకు అంతా బాగుంది. కానీ, సోరెన్’కు వర్తించే చట్టం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు వర్తించదు అనేదే, ఇప్పుడు అందరిముందున్న ప్రశ్న. నిజానికి, జగన్ రెడ్డి, ముఖ్య మంత్రిగా కాదు, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో  ముఖ్యమంత్రి కుమారుడి హోదాలోనే అనేక అక్రమాలకు పాల్పడ్డానే ఆరోపణలున్నాయి. పదికి పైగా అక్రమాస్తుల కేసుల్లో ఆయన ‘ఎ వన్’ గా ఉన్నారు. అరెస్టయ్యారు. పదహారు నెలలు జైల్లో ఉన్నారు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జగన్ రెడ్డి ఆస్తులు కొన్నింటిని జప్తు చేసింది. ఈరోజుకు కూడా ఆయన బైలు మీదనే ఉన్నారు. ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావలసి ఉన్నా, ఏదో ఒక సాకున వ్యక్తిగత హజరు నుంచి మినహాయింపు పొదుతు న్నారు.  అదెలా ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి, సోరెన్ బాటలోనే పయనిస్తున్నారు. నిజానికి, సోరెన్ బాటలో జగన్ కాదు జగన్ బాటలోనే సోరెన్ తప్పటడుగులు వేస్తున్నారు. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన మూడు సంవత్సరాల కాలంలో, జగన్ రెడ్డి ఫ్యామిలీ వ్యాపారాలకు ప్రభుత్వ నిధుల కేటాయిం పులు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయన పత్రిక సాక్షికి.. నేటికీ నెలకు రూ. ముఫ్పై కోట్ల వరకూ ప్రజాధనం ప్రకటనల రూపంలో పంపిణీ అవుతూ ఉంటుంది. పల్నాడులో ఇంత వరకూ కట్టని సరస్వతి పవర్ పరిశ్రమకు పెద్ద ఎత్తున గనుల కేటాయింపులు చేసుకున్నారు. నీటి కేటాయింపులు కూడా చేసుకున్నారు. ఇక ప్రభుత్వం తరపున కొంటున్న సిమెంట్‌ లో అత్యధికం భారతీ సిమెంట్‌దే. ఇలా చెప్పుకుంటూ పోతే..జార్ఖండ్ సీఎం సోరెన్ చేసింది చాలా చిన్న తప్పు.  అందుకే, ఒక్క తప్పు చేసిన సోరెన్ అనర్హుడు అయితే, జగన్ ఎలా అర్హుడవుతారు? సోరెన్’కు ఒక రూలు జగన్ రెడ్డికి మరో రూలు, ఏమిటి? ఇదెలా న్యాయం అని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. జగన్ రెడ్డి ప్రధాని మోడీ ప్రభుత్వానికి అడుగులకు మడుగులోట్టు తున్నారు, కాబట్టి ఆయన జోలికి రావడం లేదని, సోరెన్ విపక్ష శిబిరంలో ఉన్నారు కాబట్టే ఈసీ,ఆయన మెడ మీద కట్టి పెట్టిందని అంటున్నారు.

అడ్డుక‌ట్ట‌లేని పోలీసుల జులుం.. టీడీపీయే ల‌క్ష్యం

ఏపీలో అధికార‌గ‌ణానికి పోలీసులు వ‌త్తాసు ప‌లుకుతున్నార‌న్న ఆరోప‌ణ‌లు మ‌రింత రుజువ‌వుతున్నా యి. ఇటీవ‌లికాలంలో పోలీసులు ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రిస్తూ, విచ‌క్ష‌ ణార‌హితంగా విప‌క్ష టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌ మీదా దాడులు చేస్తున్నార‌ని తీవ్ర ఆరోప‌ణ‌లు ఉన్నాయి. చూడ‌ బోతే ప్ర‌భుత్వ యం త్రాంగం పోలీసు ల‌కు మ‌ద్ద‌తునిస్తున్న‌ద‌న్న ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతు న్నాయి.  కుప్పం నియోజకవర్గంలో టీడీపీ నేతలు, కార్యకర్తల అరెస్ట్‌లు మొదలయ్యాయి.  ఎమ్మెల్సీ గౌనివారి శ్రీని వాసులు మరో ఇద్దరు నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే  రామకుప్పం మండలం మాజీ జడ్పీటీసీ సభ్యుడు మునుస్వామిని అరెస్ట్ చేశారు. టీడీపీ నేతల అక్రమ అరెస్ట్ లను పార్టీ అధినేత చంద్ర బాబు తీవ్రంగా ఖండించారు. అక్రమ అరెస్టులకు నిరసనగా టీడీపీ శ్రేణులు ఆందోళనలకు సిద్ధ మవుతు న్నాయి. తెలుగుదేశం కార్య‌క‌ర్త‌లమీద  లాఠీలు విసిరి, కేసులు పెట్టి, దూకుడుగా వెళ్లడమే లక్ష్యంగా పెట్టుకుంద‌ని టీడీపీ ఆరోపిస్తున్న‌ది.  రాష్ట్రంలో జరుగుతున్న వరుస సంఘటనలను చూస్తే అవున‌నే అనే సమాధాన మే లభిస్తోంది. వైసీపీ ఆడుతున్న రాజకీయ చదరంగంలో పోలీసులు పావులుగా మారారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.   కుప్పం నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే గేమ్ మొదలు పెట్టిందనే టాక్ బలంగా నడు స్తోంది. ఇప్పటికే అరాచకంతో కుప్పంలో ప్రశాంత వాతావరణాన్ని మార్చేసి ఆ ప్రాంతాన్ని వైసీపీ కార్య కర్తలు రణరంగంగా మార్చారు. పోలీసులు సైతం వీరికి అండగా నిలిచారని టీడీపీ విమర్శిస్తోంది. తాజాగా టీడీపీ కార్యకర్తల అరెస్ట్‌కు వైసీపీ పెద్దలు పోలీసులను ఉసిగొల్పుతున్నారని బాహాటంగానే విమ ర్శలు వినవస్తు న్నాయి. 

జగన్ వేట.. టీడీపీ నేతలకు గాలం..?

వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాల వేటలో వైసీసీ అధినేత వైఎస్ జగన్ ఉన్నారట.. వివిధ సర్వే నివేది కలను సమీక్షించిన తర్వాత ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యేల్లోని అధిక శాతం మందికి టిక్కెట్లు ఇచ్చే ఛాన్స్ లేదని ఇప్పటికే జగన్ డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలో వ్యక్తిగత ఇమేజ్ ఉన్న టీడీపీ నేతలకు గాలం వేయడానికి జగన్ స్కెచ్ వేశారట. తన ఇమేజ్ తోనే ఏపీలో మరోసారి అధికారంలోకి రావాలని కలలు గన్న జగన్ ఇలా ఎందుకు టీడీపీ నేతల వైపు చూస్తున్నారనేదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్. ఫ్యాన్ గాలికి తిరుగే లేదని ఇంతకాలం ఊహల్లో విహరించిన జగన్.. ఇప్పుడు వాస్తవ పరిస్థితిని గుర్తించక తప్పలేదంటున్నారు. ‘నేనే రాజు.. నేనే మంత్రి’ అనే రీతిలో కళ్లు ఆకాశం వైపు చూసిన వైసీపీ అధి నేతకు ఇప్పుడు బొమ్మ కనిపించి.. దిమ్మదిరిగి.. అవే కళ్లు బైర్లు కమ్మి.. టీడీపీ నేతలకు ఎర వేయడానికి రెడీ అయ్యారంటున్నారు. ఏపీలోని 13 ఉమ్మడి జిల్లాల నుంచి జనంలో మంచి పట్టు, పలుకుబడి ఉన్న టీడీపీ నేతలను జిల్లాకు ముగ్గురు, నలుగురు చొప్పున వైసీపీలో చేర్చుకోవాలని జగన్ తహతహలాడుతున్నారని చెబుతున్నారు. 2024 ఎన్నికల్లో తమ పార్టీ తరఫున బరిలో దిగితే.. వారికి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చయినా.. తాను చూసుకుంటానని తన పార్టీలో చేరితే చాలని టీడీపీ నేతలకు జగన్ బంపర్ ఆఫర్ ఇస్తున్నట్లు సమా చారం. అయితే.. ఈ పనికి చేసేందుకు వైసీపీ నేతలను కాకుండా తనకు వ్యక్తిగత పరిచయాలున్న ఇతర నేతలను జగన్ ప్రయోగిస్తుండడం గమనార్హం. ఏమాత్రం ఈ సమాచారం లీకైనా స్థానిక వైసీపీ ఎమ్మెల్యేలు జంప్ చేసే అవకాశాలు ఉన్నాయని.. జగన్ తానే స్వయంగా ఈ పని చేసుకుంటున్నారట. జగన్ చేయించుకున్న సర్వేలో వైసీపీ మునిగిపోతున్నదని, ఇప్పుడున్న సీట్లలో సుమారు వందకు పైనే అడ్రస్ గల్లంతవుతాయని నివేదికల సారాంశంగా ఉందంటున్నారు. వైసీపీ అభ్యర్థులను మార్చేటపుడు స్థానికంగా తప్పకుండా గెలిచే టీడీపీ నేతలను తెచ్చుకోవాలని ప్రశాంత్ కిశోర్ టీమ్ జగన్ కు సలహా ఇచ్చిందట. అందుకోసం జగనే స్వయంగా టీడీపీ నుంచి నేతల ఆకర్ష్ ప్రారంభించారట. జగన్ నేరుగా రంగంలోకి దిగి, ‘క్యాష్ ఫ్రీ టిక్కెట్ పక్కా’ అంటూ హామీలు ఇస్తున్నారని సమాచారం. కరోనా అనంతరం జగన్ బండారాన్బి ఎండగడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు ఒక పక్క.. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరో పక్కన చేస్తున్న కార్యక్రమాలు జనంలోకి బాగా వెళ్లడంతో జగన్ కు ఓటమి భయం పట్టుకుంది. అందుకే సొంత పార్టీ నేతలకు తెలియకుండా తానే స్వయంగా గెలుపు గుర్రాలుగా భావిస్తున్న టీడీపీ నేతలను నేరుగా ఆహ్వానిస్తున్నారని తెలిసింది. ఈ క్రమంలో ఈ మధ్యనే కొందరు రాయలసీమ టీడీపీ నేతలను జగన్ టచ్ చేశారని సమాచారం. నిజానికి రాయలసీమ ప్రాంతతో పాటు ప్రకాశంజిల్లా వరకు వైసీపీకి మంచి పట్టే ఉంది. అయితే ఇక్కడ చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు, ద్వితీయశ్రేణి నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆ విషయం పసిగట్టిన జగన్ ముందు రాయలసీమలో, ప్రకాశంజిల్లాల్లో చక్కదిద్దితే ఆ ఎఫెక్ట్ రాష్ట్రమంతా పడుతుం దని స్కెచ్ వేశారట. అయితే జగన్ ప్రతిపాదనపై కొందరు టీడీపీ నేతలు సరిగా స్పందించ లేదట. దీంతో ఆ టీడీపీ నేతల వారసుల నుండి వత్తిడి తెచ్చే ప్రయత్నం జగన్ చేస్తున్నారని తెలుస్తోంది. పాలనపై దృష్టి సారించకుండా ఇలా విపక్షంలోని నేతల కోసం పరుగులు తీయడాన్ని చూస్తుంటే.. జగన్ కు ఓటమి భయం పట్టుకుందనే అంచనాలు వస్తున్నాయి.

రాహుల్‌కు ప్ర‌త్యామ్నాయం లేరు... ఖ‌ర్గే

కాంగ్రెస్ పార్టీ నుంచి  సీనియ‌ర్ నేత గులామ్‌న‌బీ అజాద్ బ‌య‌ట‌ప‌డిన త‌ర్వాత పార్టీలో అంతా గంద‌ర గోళం నెల‌కొన్న‌ది. ముఖ్యంగా రాహుల్ గాంధీ నాయ‌క‌త్వాన్ని ఆయ‌న వ్య‌తిరేకించ‌డం, ఆ ప‌ద‌వికి ఆయ‌న త‌గ‌డ‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేయ‌డం వివాదాస్ప‌దంగా మారింది. ఈ  ప‌రిస్థితుల్లో పార్టీని ముందుకు న‌డిపించ‌గ‌ల నేత రాహుల్ గాంధీ మాత్ర‌ మే అంటూ రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే  పార్టీ అధ్యక్షపదవిని మళ్లీ స్వీకరించాలని తాము ఆయనను ఒప్పిస్తామని అన్నారు.  ఖర్గే శ‌నివారం మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని ఎవరు చేపట్టినా, వారికి దేశవ్యాప్తంగా మద్దతు లభించాలన్నారు. కన్యాకుమారి నుంచి కశ్మీరు వరకు పశ్చిమ బెంగాల్ నుంచి గుజరాత్ వరకు అందరూ మద్దతివ్వాలన్నారు. యావత్తు కాంగ్రెస్ పార్టీకి ఆ నేత ఆమోదయోగ్యుడై ఉండాలని  అటువంటి నేత రాహుల్ గాంధీ మినహా మరొకరు లేరని అన్నారు.  కాంగ్రెస్లో చేరి, పార్టీ కోసం పని చేయాలని సోనియా గాంధీపై సీనియర్ నేతలంతా గతంలో ఒత్తిడి తీసు కొచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అదేవిధంగా రాహుల్ కూడా వచ్చి, పోరాడాలని అన్నారు. రాహుల్ గాంధీకి ప్రత్యామ్నాయ నేత వేరొకరు ఉన్నారా? అని ప్రశ్నించారు.  కాంగ్రెస్ సారథ్య బాధ్యతలను చేపట్టడానికి రాహుల్ ఇష్టపడటం లేదని జరుగుతున్న ప్రచారంపై మాట్లా డుతూ, పార్టీ కోసం, దేశం కోసం బాధ్యతలు చేపట్టాలని ఆయనను కోరుతామని చెప్పారు. ఆరెస్సె స్ , బీజే పీ లపై పోరాడుతూ, దేశాన్ని సమైక్యంగా ఉంచడానికి పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టాలని విజ్ఞప్తి చేస్తామని తెలిపారు.  ఇదిలావుండగా, కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికల షెడ్యూలును ఆమోదించవలసి ఉంది. ఆ పార్టీ వర్కిం గ్ కమిటీ  సమావేశం వర్చువల్ విధానంలో ఆదివారం జరుగుతుంది. ఈ సమావేశంలో ఈ ఎన్ని కల షెడ్యూలును ఆమోదించే అవకాశం ఉంది. ఈ సమావేశానికి ఆ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ   అధ్యక్షత వహిస్తారు. 

సీజేఐగా జ‌స్టిస్ ల‌లిత్ ప్ర‌మాణ‌స్వీకారం

భారత సుప్రీంకోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తిగా (సీజేఐ) జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్  శనివారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు.రాష్ట్రపతి భవన్ లో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది మూర్ము జస్టిస్ యు.యు.లలిత్తో ప్రమాణ స్వీకారం చేయించారు. \ఈ  ప్రమాణ స్వీకారోత్సవంలో ఉప రాష్ట్రపతి జగదీప్ ధంకర్,  ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.సీజేఐగా జస్టిస్ ఎన్.వి. రమణ పదవీ విరమణ చేయడంతో జస్టిస్ యు.యు.లలిత్ కొత్త సీజేఐగా బాధ్యతలు స్వీకరిం చారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్.వి. రమణ కూడా పాల్గొన్నారు.

వ‌రంగ‌ల్‌లో ఫెక్సీల ర‌గ‌డ‌.. హ‌న్మ‌కొండ‌లో బండి సమావేశం

వరంగల్ జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీఆర్ఎస్, బీజేపీల మధ్య ఫ్లెక్సీల రగడ మళ్లీ మొద లైంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు స్వాగతం పలుకుతూ బీజేపీ కార్యకర్తలు భారీగా ఫ్లెక్సీ లు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చించివేశారు. ఈ క్రమంలో బీజేపీ కార్యకర్తలు సంఘటనా స్థలంలో ఆందోళన చేస్తున్నారు. ఫ్లెక్సీల చించివేత టీఆర్ఎస్ పనేనంటూ బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. దీంతో వరంగల్ లో హై టెన్షన్ వాతావరణం నెల కొంది. ఆందోళన చేస్తున్న పలువురు బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ మూడ‌వ విడ‌త ప్ర‌జాసంగ్రామ యాత్ర ముగింపు సంద‌ర్భంగా హ‌న్మ‌కొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌లో ప్ర‌త్యేక స‌భ జ‌ర‌గ‌నుంది. దీనికి బీజేపీజాతీయ అద్య‌క్షుడు న‌డ్డాతో పాటు ముఖ్య‌నేత‌లు హాజ‌రుకానున్నారు.  జనగామ జిల్లా పాంనూర్‌ వద్ద బండి సంజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ప్రజాసంగ్రామ యాత్రకు తాత్కాలికంగా బ్రేక్‌ పడిన విషయం తెలిసిందే. మూడు రోజుల విరామం తర్వాత హైకోర్టు అనుమతితో యాత్ర ఆగిన చోట నుంచే తిరిగి మొదలైంది.  ఈ క్రమంలోనే వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలో బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలను నిషేధిస్తూ సీపీ తరుణ్‌జోషి ఉత్తర్వులను జారీ చేయడం, ఆర్ట్స్‌ కళాశాలలో సభ నిర్వహణకు ప్రిన్సిపాల్‌ అనుమతి నిరాకరించడంతో.. బీజేపీ బహిరంగ సభ నిర్వహణపైనా అనిశ్చితి నెలకొన్నది. అయితే, బీజేపీ నేతలు హై కోర్టును ఆశ్రయించి.. సభకు అనుమతి సాధించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేసిన కోర్టు.. కళాశాల విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సభా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవా లని సూచించింది. దీంతో బీజేపీ నాయకత్వం రెట్టించిన ఉత్సాహంతో ఏర్పాట్లు చేస్తోంది. ప్రతిష్ఠాత్మ కంగా సభహనుమకొండలో నిర్వహించనున్న బహిరంగ సభకు బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈనెల 21న  కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పర్యటించి రాష్ట్రంలో రాజకీయ అలజడికి తెరలేపగా, తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో జేపీ నడ్డా ఎలాంటి కీలక సందేశం పార్టీ శ్రేణులకు ఇవ్వబోతున్నార న్నది ఆసక్తికరంగా మారింది.   ఉత్తర తెలంగాణలోని ఆరు జిల్లాల ముఖ్యనేతలతోపాటు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌, జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లు, పలువురు సీనియర్‌ నాయకులతో సమావేశాలు నిర్వహించారు. రాష్ట్ర పార్టీ సంస్థాగత ఇన్‌చార్జిగా నియమితులైన సునీల్‌ బన్సల్‌ శుక్రవారమే వరంగల్‌ చేరుకున్నారు. బన్సల్‌తో పాటు పార్టీ రాష్ట్ర మరో ఇన్‌చార్జి తరుణ్‌ఛుగ్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్‌ తదితర సీనియర్‌ నేతలు ఈ బహిరంగసభలో పాల్గొననున్నారు

స‌భ‌కు రాకుంటే జ‌రిమానా!.. టీఆర్ ఎస్ హెచ్చ‌రిక‌

బ‌డికి రాక‌పోతే కొడ‌తానంటా రు టీచ‌ర్లు, ప‌నికి స‌రిగా రాక‌ పోతే తీసేస్తామంటారు అధికా రులు, మాట వినకుంటే తంతానంటాడు తండ్రి. . వీట‌ న్నింటికంటే చిత్ర‌మైంది టీఆర్ఎస్ వారి వాట్స‌ప్ మెసేజ్‌!  రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ ప్రారంభోత్సవానికి రాకపోతే జరిమానా కట్టాల్సి ఉంటుం దని, సీఎం కేసీఆర్‌ సభకు హాజరు కాని వాళ్లకు భవిష్యత్తులో లోన్లు ఇవ్వరని బడంగ్‌పేట్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని డ్వాక్రా సంఘాల మహిళలకు వాట్స్‌ప్‌లో సందేశాలు పంపేరు.  ఇప్పుడు ఇది పెద్ద వివాద‌మైంది.  పంపడం వివాదాస్పదమైంది.  రేపు కొంగర దగ్గర కలెక్టర్‌ ఆఫీస్‌ ఓపెనింగ్‌ ఉంది. డ్వాక్రా మహిళలందరూ కేసీఆర్‌కు స్వాగతం పలకాలి. ఉదయం 11 గంటలకల్లా మునిసిపల్‌ ఆఫీసు దగ్గరికి రావాలి. రాని వారి పేర్లు నమోదు చేసుకొంటాం. వాళ్లకు భవిష్యత్తులో లోన్లు, ఎన్నికల సమయంలో డబ్బు ఇవ్వరు’ అని బుధవారం డ్వాక్రా మహిళలకు సందేశాలు వెళ్లాయి. సభకు రాలేని వాళ్లు రూ.500 ఫైన్‌ కట్టాలని మరో మెసేజ్‌ పంపారు. సమావేశానికి వెళ్లలేని కొందరు మహి ళలు తమ గ్రూప్‌ లీడర్లకు ఫైన్‌ కట్టినట్లు సమాచారం. దీనిపై బీజేపీ శ్రేణులు భగ్గుమన్నాయి. ఈ వ్యవహా రంపై విచారణ జరిపించి కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశాయి. ఈ మేరకు బీజేపీ మహిళా మోర్చా ప్రతినిధులు, బీజేపీ మహిళా కార్పొరేటర్లు శుక్రవారం బడంగ్‌పేట్‌ మునిసిపల్‌ కమిష నర్‌కు వినతి పత్రం అందజేశారు. టీఆర్‌ఎస్‌ నాయకులు, డ్వాక్రా సంఘాల లీడర్లు ఇలా బెదిరి స్తూ సందేశాలు పంపారని ఆరోపించారు

అస‌లే టెన్ష‌న్ టెన్ష‌న్‌.. మ‌రో వంక కేటీఆర్ 

హైద‌రాబాద్ పాత‌బ‌స్తీలో ప‌రిస్థితులు ఆందోళ‌న‌క‌రంగా ఉన్నాయి. మ‌రీ ముఖ్యంగా బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌ను అరెస్టు చేయ‌డం ఆయ‌న‌పై పీడీ యాక్టు విధించ‌డంతో ప‌రిస్థితులు అదుపుత‌ప్పాయి. భ‌జ‌రంగ ద‌ళ్ వీహెచ్‌పీ కార్య‌క‌ర్త‌లు మండిప‌డుతున్నారు. దీంతో చాంద్రాయ‌ణ‌గుట్ట ప్రాంతం హైటెన్ష‌న్ చోటు చేసుకుంది. ఈ ప‌రిస్థితుల్లో కేటీఆర్ చాంద్రాయ‌ణ‌గుట్ట ఫ్లైఓవ‌ర్ ప్రారంభోత్స‌వానికి పూను కున్నారు.  ఈనెల 23న ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం కావాల్సి ఉండగా బీజేపీ నేతల ఆందోళనలతో వాయిదా పడింది. రాజాసింగ్ అరెస్టు అనంతరం ఓల్డ్ సిటీలో ఘర్షణలతో చాంద్రాయణ గుట్టలో పోలీసులు హై అలర్ట్ ప్రక టించారు. భజరంగ్‌దళ్, వీహెచ్‌పీ కార్యకర్తలు అడ్డుకుంటారనే సమాచారంతో భారీగా పోలీసులు మోహ రించారు. గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పోలీసులు పీడీయాక్ట్ నమోదు చేసి మంగళహాట్ పోలీసులు కోర్టుకు తరలించిన తర్వాత పీడీయాక్ట్ నమోదు చేసిన విషయాన్ని ప్రకటించారు. అంతకు ముందు రెండు పాత కేసుల్లో ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఓ వర్గం మత మనోభావాలను కించ పరిచేలా ఆయన ఓ వీడియో ను యూట్యూబ్‌లో అప్ లోడ్ చేయడంతో వివాదం ప్రారంభమయింది. ఈ కేసులో ఆయనను అరెస్ట్ చేసినప్పటికీ.. నిబంధనల ప్రకారం నోటీసులు ఇవ్వలేదన్న కారణంతో న్యాయమూర్తి బెయిల్ ఇచ్చారు. దీంతో  పాతబస్తీలో ఉద్రిక్తత ఏర్పడింది. చివరికి పోలీసులు పీడీయాక్ట్ కింద అరెస్ట్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రాజాసింగ్‌ది పూర్తిగా వివాదాస్పదమైన చరిత్ర. రాజకీయ కారణాలతో ఆయన  ఓ వర్గాన్ని  తీవ్రంగా ద్వేషిస్తూ వ్యాఖ్యలు చేస్తూంటారు. ఈ క్రమంలో  పలు కేసులు నమోదయ్యాయి.  సాధారణంగా రిమాండ్ ఖైదీలను చంచల్ గూడ జైలుకు తరలిస్తారు. అయితే చంచల్ గూడ కూడా పాతబస్తీ పరిధిలోనే ఉండటంతో భద్రతా కారణాలతో ఆయనను చర్లపల్లి తరలించాలని నిర్ణయిం చారు.  

ఆజాద్ రాజీనామా .. కాంగ్రెస్’లో కొత్త ట్విస్ట్

కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకరు ఇద్దరు కాదు, చాలా మంది  నాయకులు పార్టీని వదిలి బయటకు వెళ్లి పోయారు. ముఖ్యంగా 2019 ఎన్నికల ఓటమి తర్వాత, సీనియర్, జూనియర్ అన్న తేడా లేకుండా డజన్ల కొద్ది నేతలు క్యూకట్టిమరీ పార్టీని వదిలి వెళ్ళిపోయారు. ఇంకా పోతూనే ఉన్నారు.అదే క్రమమలో పార్టీ సీనియర్ నాయకుడు, ఒకప్పుడు ట్రబుల్ షూటర్’గా పార్టీని అనేక విధాల ఆదుకున్న గులాం నబీ ఆజాద్’ కూడా పార్టీకి, పార్టీ పదవులకు రాజీనామా చేశారు. ఐదు పదుల అనుబంధాన్ని తెంచుకుని పార్టీకి  గుడ్’ బై చెప్పారు.   నిజానికి, గులాం నబీ ఆజాద్’ పార్టీని వదిలిపోవడం ఉహించని విషయం కాదు. అనూహ్య పరిణామం అసలే కాదు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్’గా కీలక బాధ్యతలు నిర్వహించిన గులాం నబీ ఆజాద్’ చాలా కాలంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగానే ఉంటున్నారు. అంటీ ముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. అలాగే,పార్టీ అధినాయకత్వం కూడా ఆయన్ని, పరాయి వాడిగానే చూస్తోంది. కొంత దూరంగానే ఉంచుతోంది.  సుమారు రెండేళ్ళ క్రితం 2020లో ఆజాద్ సహా మరో 22 సీనియర్ నాయకులు, జీ 23 పేరిట ఒక వేదిక ఏర్పాటు చేసుకున్నారు. నిజానికి ఆ వేదిక ప్రధాన లక్ష్యం, పార్టీని బతికించు కోవడమే, అందుకే, పార్టీ సంస్థాగతంగా బలపడవలసిన అవసరాన్ని నొక్కి చెపుతూ, పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. సంస్థాగత వ్యవహారాలపై దృష్టి పెట్టాలని కోరారు. పార్టీ అధ్యక్ష ఎన్నికలు నిర్వహించాలని కోరారు.  ఇక అక్కడి నుంచి, పార్టీ సీనియర్ నాయకులకు, పార్టీ అధిష్టానానికి మద్య దూరం పెరుగుతూవచ్చింది. జీ 23కి అసమ్మతి ముద్ర పడింది. అజాద సహా, జీ 23 నాయకులకు పార్టీలో ప్రాధాన్యత లేకుండా పోయింది. అవమనాలు ఎదురయ్యాయి. ఏ నేపధ్యంలోనే, పార్టీ సీనియర్ నాయకుడు కపిల్ సిబల్ పార్టీకి రాజీనామా చేసి, ఎస్పీ మద్దతుతో రాజ్యసభకు ఎనికయ్యారు.మరో వంక  కొద్ది రోజుల క్రితం జమ్మూ కశ్మీర్’ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్’ పదవి పుచ్చుకున్నట్లే పుచ్చుకుని వద్దని వదిలేశారు. ఏఐసీసీ, జమ్మూ కశ్మీర్’ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్’ గా అయన పేరు ప్రకటించిన కొద్ది గంటలకే అయన రాజీనామా చేశారు. ఆయన వెనక, హిమాచల ప్రదేశ్ ప్రచార కమిటీ చైర్మన్ ఆనంద్ శర్మ అదే బాటలో  అడుగేశారు. ఆయన రాజీనామా చేశారు.  అదలా ఉంటే, గులాం నబీ ఆజాద్, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం కంటే, ఆయన తమ రాజీనామా లేఖలో ప్రస్తావించిన అంశాలు ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశాలు అవుతున్న్నాయి. ఆజాద్ ఐదు పేజీల లేఖలో, ప్రధానంగా రాహుల్ గాంధీని టార్గెట్ చేశారు. రాహుల్ గాంధీ అపరిపక్వ రాజకీయాల కారణంగానే కాంగ్రెస్ పార్టీకి ఈ దుర్గతి పట్టిందని, ఆరోపించారు. చివరకు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర పైనా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇప్పుడు రాహుల్ గాంధీ 'చేయాల్సింది భారత జోడో యాత్ర కాదు..కాంగ్రెస్ జోడో యాత్ర అంటూ, నేరుగా రాహుల్ గాంధీ పైనే అస్త్రాలను ఎక్కుపెట్టారు. అంతేకాదు,  కాదు “ఏఐసీసీని నడిపే కోటరీ ఆధ్వర్యంలో పోరాడాలన్న సంకల్పం, సామర్థ్యాన్ని కాంగ్రెస్ కోల్పోయింది. భారత్ జోడో యాత్ర కన్నా ముందు పార్టీ అధినాయకత్వం కాంగ్రెస్ జోడో యాత్రను చేపట్టాల్సింది" అని ఆజాద్ దుయ్యబట్టారు. రాహుల్‌గాంధీ ప్రవేశంతోనే కాంగ్రెస్‌కు కష్టాలు ఆరంభమయ్యానని ఆజాద్‌ ఆరోపించారు. అదే విధంగా 2019 ఎన్నికల ఓటమి తర్వాత రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడాన్ని తప్పుపట్టారు.  రాహుల్‌ ఏఐసీసీ ఉపాధ్యక్షుడు అయ్యాక పార్టీ నాశనమైందని, అనుభవజ్ఞులైన నేతలను రాహుల్‌ పక్కకు పెడుతున్నారంటూ విమర్శించారు ఆజాద్‌. కొత్త కోటరీ ఏర్పాటు చేసుకొని అపరిపక్వ రాజకీయాలు చేశారని విమర్శించారు. పార్టీలోని సంస్థాగత మార్పుల కోసం లేఖ రాసిన 23 మంది నేతలను తీవ్రంగా అవమానించారని అని ఆయన అన్నారు.అలాగే, సోనియా గాంధీ, కేవలం నామమాత్రపు అధ్యక్షురాలిగా మిగిలిపోయారని, నిర్ణయాలు అన్నీ, రాహుల్ గాంధీ ఆయన చుట్టూ చేరిన కోటరీ తీసుకుంటోందని లేఖలో పేర్కొనారు.  నిజానికి, ఆజాద్ ప్రస్తావించిన అంశాలు ఏవీ కొత్తగా వింటున్నవి కాదు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు చాలా కాలంగా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. అనేక మంది సీనియర్ జూనియర్ నాయకులు వ్యక్తిగత సంభాషణల్లో రాహుల్ గాంధీ కారణంగానే పార్టీ, రోజురోజుకు బలహీనమవుతోందని అంటూనే ఉన్నారు. అయితే, పిల్లి మెడడలో  గంట కట్టే ప్రయత్నం ఎవరూ చేయలేదు. నిజానికి, చేయలేదని అనేందుకు కూడా లేదు ఎందుకంటే, జీ 23 లేఖలో సంస్థాగతంగా పార్టీ బలోపేతం కావలసిన అవసరాన్ని, నొక్కి చెప్పారు.అలాగే, పార్టీ సీనియర్ నాయకులు సమయం వచ్చిన ప్రతి సందర్భంలోనూ పార్టీ అధ్యక్ష ఎన్నికల గురించి ఇతరత్రా తీసుకోవలసిన నిర్ణయాల విషయంలో హెచ్చరిస్తూనే ఉన్నారు. అయినా అధిష్టానం పట్టించుకోలేదు. అయితే ఇప్పుడైనా పార్టీ, అధినాయకత్వం వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకుని, అడుగులు వేస్తుందా ? అంటే, అలాంటి సూచనలు కనిపించడం లేదు. అజాద్’ తమ లేఖలో ప్రస్తావించిన అంశాలను పక్కన పెట్టి, ఆయన రాజీనామాకు ఎంచుకున్న సమయం సరింది కాదని  పార్టీ తప్పుపడుతోంది. కాంగ్రెస్ పార్టీ వివిధ అంశాలపై బీజేపీతో పోరాడుతోన్న సమయంలో ఆజాద్ పార్టీని  వీడటం దురదృష్టకరమని పార్టీ అధికార ప్రతినిధి జైరాం రమేశ్ పేర్కొన్నారు. నిజానికి, కాంగ్రెస్ పార్టీ ఆత్మ పరిశీలన చేసుకునేందుకు, ఆజాద్ రాజీనామా ఒక అవకాశం కల్పించింది. కానీ, పార్టీ అందుకు సిద్ధంగా ఉన్న దాఖలాలు అయితే కనిపించడంలేదనే పరిశీలకులు భావిస్తున్నారు. మొత్తానికి అజాద్ రాజీనామాతో కాంగ్రెస్ ప్రస్థానం మరో మలుపు తిరిగింది.. పార్టీ భవిష్యత్ మరింత ప్రశ్నార్ధకంగా మారింది.

రాప్తాడులో వైసీపీ నాయ‌కుల వీరంగం

రాష్ట్రంలో వైసీపీ పార్టీవారి వీరంగం మ‌రింత పెరిగింద‌న్న అభి ప్రాయాలు రాష్ట్ర‌మంత‌టా వెల్లు వెత్తు తు న్నాయి. తాజాగా అనంత‌పురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్ర‌కాశ్ రెడ్డి సోద‌రుడు రెచ్చి పోయా రు. పట్టపగలు అందరూ చూస్తుండగానే టీడీపీ నాయకులపై భౌతిక దాడికి దిగారు. అచ్చం సినిమాల్లో సీన్ త‌ల‌పించేవిధంగా ఉందన్నారు.  శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మేజర్‌ పంచాయతీ ఉప సర్పంచి వైసీపీ నాయకుడు ఎం.రాజారెడ్డి మరికొందరితో కలిసి టీడీపీలోకి చేరేందుకు మాజీ మంత్రి పరిటాల సునీత స్వగ్రామం వెంకటాపురానికి శుక్రవారం (ఆగ‌ష్టు 26 )ఉదయం బయలుదేరారు. వీరివెంట మండలంలోని టీడీపీ నాయకులు కూడా ఉన్నారు. వీరి వాహనాలు కుంటిమద్ది చెరువు కట్ట మీదకు వెళ్లగానే వైసీపీ నాయకులు తమ వాహనాలు అడ్డుగా ఉంచారు.  ఎమ్మెల్యే సోదరుడు రాజశేఖర్‌రెడ్డి, అనుచరులతో అక్కడికి చేరుకున్నారు. ఆయ‌న కూడా  టీడీపీ నాయ కులపై భౌతిక దాడులు చేశారు. మాజీ ఎంపీపీ అంకే అమరేంద్ర, టీడీపీ నాయకులు వడ్డే దుర్గా, అమరేంద్ర రెడ్డి తదితరులపై దాడి చేశారు. ఇష్టం వచ్చినట్లు తిడుతూ, కాళ్లతో తంతూ వీరంగం సృష్టించారు. దీంతో స్థానికులూ ఎంతో భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు.  ఉప సర్పంచి రాజారెడ్డిని కారులో నుంచి బయటకు లాగి, వైసీపీ నేతల వాహనంలోకి తోసి అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు.  విషయం తెలుసుకున్న పరిటాల సునీత, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పరిటాల శ్రీరామ్‌ చెన్నే కొత్తపల్లికి  బయలుదేరారు. వీరిని రామగిరి పోలీసు స్టేషన్‌ వద్ద పోలీసులు అడ్డు కున్నారు. దీంతో పోలీసుల తీరును ఖండిస్తూ, స్టేషన్‌ ఎదుటే వారు బైఠాయించారు. టీడీపీ జిల్లాఅధ్యక్షుడు బీకే పార్థసారథి కూడా అక్కడికి చేరుకుని, నిరసనకు దిగారు. రాప్తాడు, ధర్మ వరం నియోజకవర్గాల నుంచి టీడీపీ శ్రేణులు భారీ ఎత్తున చేరుకోవడంతో రెండు గంటల పాటు తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. దాడి జరిగినట్లు ఆధారాలు చూపిస్తే ఎమ్మెల్యే సోదరుడిని అరెస్టు చేస్తామని, అలా చేయక పోతే తాను ఉద్యోగానికి రాజీనామా చేస్తానని సీఐ చిన్నగౌస్‌ శపథం చేశారు. రెండు వర్గాలూ పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నాయి.

ఎన్నిక‌ల‌కు జ‌గ‌న్ సిద్ధ‌మా? ... ర‌ఘురామ కృష్ణంరాజు స‌వాలు

జ‌గ‌న్ స‌ర్కార్‌కి వైసీపీ ఎంపీ ర‌ఘురామ కృష్ణంరాజు మ‌ళ్లీ హెచ్చ‌రిక చేశారు. త‌న రాజీనామా కోర‌డం అర్ధ ర‌హిత‌మ‌ని దాని వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు ప్ర‌త్యేకించి చేకూరే ప్ర‌యోజ‌న‌మేమిట‌ని ప్ర‌శ్నించారు. రాజీనామా చేసినా తాను మ‌ళ్లీ పోటీచేసి త‌ప్ప‌కుండా గెల‌వ‌గ‌ల‌న‌న్న ధీమా వ్య‌క్తం చేశారు. ఆయ‌న ఆగ‌ష్టు  26న ఢిల్లీ లో విలే క‌రుల‌తో మాట్లాడుతూ తాను రాజీనామాకు సిద్ధ‌మేన‌ని,  సీఎం జ‌గ‌న్ త‌న ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేసి ఎన్ని క‌ల‌కు వెళ్ల‌డానికి సిద్ధ‌మేనా అని స‌వాలు విసిరారు. జ‌గ‌న్ అందుకు లిఖిత పూర్వ‌క హామీ ఇవ్వాల‌న్నారు.  తనపై ఫిర్యాదు చేస్తానని ఏ2 పేర్కొనడం హాస్యాస్పదమని, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌,  స్టట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అధికారులతో కలిసి గతంలోనే ఎన్నో చేయరాని పనులు చేశారు కదా! అని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ, జగన్‌ను ఢిల్లీకి పిలిపి చీవాట్లు పెట్టారని... రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక అరాచకాలు, అప్పులపై ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేేస్త ముఖ్యమంత్రి బయటికి వచ్చి ఏవో కబుర్లు చెప్పుకొచ్చారని ఎద్దేవా చేశారు.   ప్రస్తుతం టీడీపీకి 18 స్థానాలు ఉన్నాయని, ఆ 75కు 18 కలిపితే 93 స్థానాలే అవుతాయని, తన సర్వే తప్పె లా అవుతుందని ప్రశ్నించారు. కాగా, జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌పై అనర్హత వేటు వేస్తే, ఏపీ సీఎం జగన్‌కు కూడా ఇబ్బందులు తప్పకపోవచ్చునని ఆయన వ్యాఖ్యానించారు.  ప్రభుత్వ ఖజానాను జలగల్లా పీలుస్తున్న జగన్‌ సలహాదారులు పదవుల నుంచి తప్పు కావాలంటూ ఆయన డిమాండ్‌ చేశారు.

ఏపీ ఆర్ధిక ప‌రిస్థితి అస్థ‌వ్య‌స్థం.. జీవీ రెడ్డి

చాక్లెట్ బావుంద‌ని వెన‌క‌టికి ఓ పిల్లాడు చ‌దువు అశ్ర‌ద్ధ‌చేసి చాక్లెట్ల‌కోసం పెద్ద బడి ద‌గ్గ‌ర దుకాణాన్ని మ‌రిగాట్ట‌. అలా ఉంది ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ రెడ్డి వ్య‌వ‌హారం. చాక్లెట్లు అడిగినంత సులువుగా ఆర్‌బీఐ ని అప్పు అడిగేస్తున్నారు. రాష్ట్ర బేవ‌రేజెస్ కార్పొరేష‌న్ ద్వారా కూడా రుణాలు చేస్తున్నారు.  ఏపీ ప్రభుత్వం అప్పుల్లో రికార్డ్‌ సృష్టిస్తోందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి తప్పుబట్టారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఐదు నెలల వ్యవధిలో ఏపీ రూ.46,603 కోట్లు రుణం సమీ కరించిందని, ఏపీ చరిత్రలో ఇది ఆల్ టైమ్ రికార్డ్ అని తెలిపారు. వచ్చే మంగళవారం మరో రూ.2 వేల కోట్లు అప్పుకు ఆర్బీఐ కి  ఏపీ ప్రభుత్వం ఇండెంట్ పెట్టిందని  జీవీ చెప్పారు.  ఇవికాక కార్పొరేషన్‌ ద్వారా తెచ్చిన అప్పులు అదనంగా తెస్తున్నారని జీవీ రెడ్డి పేర్కొన్నారు. ఏపీ ఆర్ధిక పరిస్థితి అస్తవ్యస్తంగా మారుతోందని ఆయ‌న ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ సమస్య లు, విభజన అంశాలపై కేంద్ర ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్‌ ఆధ్వర్యంలోని కమిటీ రాష్ట్ర బృందం తో గురువారం సమావేశమైంది.  రాష్ట్ర మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, సీఎస్‌ సమీర్‌ శర్మ, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ బృం దంలో ఉన్నారు. ప్రధాని కార్యాలయం (పీఎంవో) ఈ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో జరిగిందొకటి.. బయటికొచ్చాక విజయసాయి, బుగ్గన చెప్పింది వేరొకటి కావడం గమనార్హం. వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాలకు రాష్ట్ర ప్రభుత్వ వాటా సమకూర్చకపోవడం, డిస్కమ్‌లు చెల్లించా ల్సిన రుణాలపై నివేదికలు ఇవ్వకపోవడం, రైల్వే ప్రాజెక్టులకు నిధులు, భూములు ఇవ్వకపోవడంపై కూడా చర్చ జరిగినట్లు తెలిసింది.

 హేమంత్ సొరేన్ శాస‌న‌స‌భ స‌భ్య‌త్వం ర‌ద్దు

జార్ఖండ్ ముఖ్యమంత్రి, జేఎంఎం చీఫ్ హేమంత్ సొరేన్ శాసన సభ్యత్వాన్ని గవర్నర్ రమేశ్ బయిస్ శుక్రవారం(ఆగ‌ష్టు 26) రద్దు చేశారు. సొరేన్ అధికార దుర్వినియోగానికి పాల్పడి, తనకు తానే మైనింగ్ లీజును కేటాయించుకున్నారని, ఆయన శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలని బీజేపీ నేత రఘుబర్ దాస్ ఫిర్యాదు చేయడంతో, ఎన్నికల కమిషన్ విచారణ జరిపింది. ఇరు పక్షాల వాదనలను విన్నతర్వాత సొరే న్ శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలని గవర్నర్‌కు ఈసీ సిఫారసు చేసింది. దీంతో గవర్నర్ శుక్రవారం సొరేన్ ఎమ్మెల్యే పదవికి అనర్హుడని ప్రకటించారు.  గ‌నుల విష‌యంలో హేమంత్ సోరెన్‌పై విమ‌ర్శ‌ల వెల్లువెత్తిన క్ర‌మంలో హేమంత్ వ్య‌వ‌హార స‌ర‌ళిపై కేంద్ర ప్ర‌భుత్వానికి గవర్నర్ ఫిర్యాదు చేయ‌డం, ఆ ఫిర్యాదును కేంద్రం ఎన్నిక‌ల సంఘానికి పంపడం, హేమంత్ శాస‌న స‌భ స‌భ్య‌త్వం ర‌ద్దుకు ఈసీ సిఫార‌సు చేయ‌డం, ఈసీ సిఫార‌సు ఆధారంగా హేమంత్ ఎమ్మెల్యే పదవిని ర‌ద్దు చేస్తూ గ‌వ‌ర్న‌ర్ నిర్ణయం తీసుకోవ‌డం వేగంగా జ‌రిగిపోయాయి. ఈ కీల‌క ప‌రిణా మం త‌ర్వాత త‌న ప్ర‌భుత్వాన్ని కాపాడుకునేందుకు హేమంత్ సోరెన్ ఎలాంటి అడుగు వేస్తార‌న్న‌ది ఆస‌క్తి కరంగా మారింది. గనుల లీజు వ్యవహారంలో హేమంత్ సోరెన్ అక్రమాలకు పాల్పడ్డారని.. ఆయనపై అనర్హత వేటు  వేయా లని బీజేపీ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఆయనపై అనర్హుడిగా ప్రకటించాలని గవర్నర్‌ రమేష్ బైస్‌ కి  ఈసీ లేఖ రాసినట్లు రాజ్ భవన్ వర్గాలు పేర్కొన్నాయి. కానీ దీనిపై గవర్నర్ గానీ.. రాజ్‌భవన్ గానీ.. అధికారిక ప్రకటన చేయలేదు. గురువారం (ఆగ‌ష్టు 25) సాయంత్రం ఢిల్లీ నుంచి రాంచీకి వచ్చారు గవర్నర్. ఈ వ్యవహారంపై 26న  కీలక ప్రకటన చేసేరు.  షెల్ కంపెనీలో పెట్టుబడులు పెట్టి భారీగా ఆస్తులు సంపాదించినట్లు సోరెన్ కుటుంబంపై ఇప్పటికే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై బీజేపీ కూడా గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 9A నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపించింది. చట్ట సభ్యుడిగా ఉన్నవారు ప్రభుత్వ కాంట్రాక్ట్‌లు పొందరాదని..దీన్ని ఉల్లంఘిస్తే అనర్హతకు గురవుతారని.. అందువల్ల ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే గవ్నరర్ ఈసీ అభిప్రాయాన్ని కోరగా.. ఈసీ తన స్పందన తెలియజేసింది. అనర్హతకు సిఫారసు చేసినట్లు సమాచారం.

యుఎస్ ఓపెన్‌కు జోకో దూరం.. కార‌ణం ఏమిటంటే..

కరోనా వ్యాక్సిన్‌ వేయించుకోనందుకు సెర్బియా స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌ మరో గ్రాండ్ స్లామ్‌కూ దూరమ య్యాడు. వ్యాక్సిన్‌ తీసుకోని వారికి అమెరికాలో ప్రవేశానికి అనుమతి లేదు.  సోమవారం మొదల య్యే ఈ ఏడాది ఆఖరి గ్రాండ్‌స్లామ్‌ యూఎస్‌ ఓపెన్‌ నుంచి వైదొలగుతున్నట్టు జొకోవిచ్‌ గురువారం ప్రకటిం చాడు. టీకా వేసుకోని జోకోను ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలి యన్‌ ఓపెన్‌ ఆడేందుకు అనుమతించని విషయం తెలిసిందే. వ్యాక్సిన్‌ వేసుకోకుండా ఆస్ట్రేలియా లో అడుగుపెట్టిన నొవాక్‌ను బలవంతంగా ఆ దేశం నుంచి పంపించారు.  ఇప్ప‌టి వ‌ర‌కు మూడు సార్లు చాంపియ‌న్‌గా నిలిచిన నొవాక్ జొకోవిచ్ తాను న్యూయార్క్‌లో జ‌రిగే యూ ఎస్ ఓపెన్‌లో పాల్గొనేందుకు నేను ప్ర‌యాణం చేయ‌లేక పోతున్నాని, ఇది విచార‌క‌రమ‌నీ అన్నాడు.  అయితే త‌న‌కు మద్ద‌తు, ప్రేమ తెలిపిన వారికి ధ‌న్య‌వాదాలు. స‌హ‌చ‌ర ప్లేయ‌ర్ల‌కు గుడ్ ల‌క్` అని ట్వీట్ చేశారు. 35 ఏళ్ల సెర్బియన్‌ ఖాతాలో 21 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లున్నాయి. స్పెయిన్‌ స్టార్‌ రాఫెల్‌ నాదల్‌ (22 టైటి ల్స్‌) కంటే ఒకటి తక్కువ. దీన్ని తాజా గ్రాండ్‌స్లామ్‌లో జొకో సాధిస్తాడని అభిమానులు ఆశించారు. అతను 2011, 2015, 2018లో మూడుసార్లు విజేతగా నిలిచాడు. మరో ఆరుసార్లు రన్నరప్‌గా తృప్తి పడ్డాడు. ఇంతటి ఘన రికార్డు ఉన్న అతనికి న్యూయార్క్‌లో మరో టైటిల్‌ గెలవడం, నాదల్‌ రికార్డును సమం చేయడం కష్టం కాదు. అయితే అమెరికా, కెనడా దేశాల్లో స్వదేశీయులు తప్ప టీకా తీసుకోని విదేశీయులను అనుమ తించడం లేదు  కొవిడ్ ప్రొటోకాల్స్ ప్ర‌కారం అమెరికాకు వెళ్ల‌డానికి జొకోవిచ్. వ్యాక్సినేష‌న్ చేయించుకున్న వారు మాత్ర‌మే అమెరికాకు వెళ్ల‌డానికి నిబంధ‌న‌లు అనుమ‌తినిస్తాయి. ఈ ఏడాది ప్రారంభంలో జ‌రిగిన‌ ఆస్ట్రే లియా ఓపెన్ టెన్నిస్ టోర్నీకి ముందు వెన‌క్కు పంపిన సంగ‌తి తెలిసిందే.  ఇలా ఒక టెన్నిస్ ఓపెన్ చాంపి య‌న్ షిప్‌కు జొకోవిచ్ దూరం కావ‌డం ఇది రెండోసారి. 

చంద్రబాబును ప్రజలే కాపాడుకోవాలి?

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడికి ఎన్ఎస్ జీ భద్రతను భారీగా పెంచారు. ఇప్పటి దాకా 6+6 గా ఉన్న ఆయన భద్రతను 12+12కు ఎన్ఎస్జీ పెంచింది. జడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న చంద్రబాబుకు శుక్రవారం నుంచే ఎన్ఎస్జీ భద్రతను రెట్టింపు చేయడానికి కారణం ఏదో ఉండి ఉంటుందనే సందేహాలు సర్వత్రా   వ్యక్తం అవుతున్నాయి.    ఎన్ఎస్జీ డీఐజీ సమరదీప్ సింగ్ నేతృత్వంలో ఒక బృందం అకస్మాత్తుగా ఢిల్లీ నుంచి వచ్చి గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయం, ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ప్రతి గదికీ వెళ్లి నిశితంగా పరిశీలించడం, మరుసటి రోజే ఆయనకు ఎన్ఎస్జీ భద్రతను రెట్టింపు చేయడం  టీడీపీ నేతలు, శ్రేణులకు ఆందోళన కలిగిస్తోంది. ముందస్తు సమాచారం ఇవ్వకుండానే చంద్రబాబు నాయుడి భద్రత గురించి ఎన్ఎస్జీ  డీఐజీ పరిశీలించడం మరింత ఆందోళనకు కారణమవుతోంది. చంద్రబాబు భద్రతకు ముప్పు ఉందని ఇంటెలిజెన్స్ విభాగం ఇచ్చిన నివేదికల ఆధారంగానే ఎన్ఎస్జీ డీఐజీ ఇలా అకస్మాత్తుగా సమీక్షించారు. ఈ క్రమంలో రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులను కూడా సమరదీప్ సింగ్ కలిసినట్లు సమాచారం. ఏపీలో ఇటీవలి కాలంలో అధికార- విపక్ష టీడీపీ- జనసేన పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. విధానపరమైన విమర్శలు కాకుండా పార్టీల నేతలు వ్యక్తిగత విమర్శలు, తిట్ల దండకాలతో రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటన సందర్భంగా అధికార వైసీపీ, టీడీపీ నేతలు, శ్రేణుల మధ్య ఘర్షణాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి.  ఈ సందర్భంగా జరిగిన అల్లర్లు, హింస వైసీపీ- టీడీపీ మధ్య రచ్చకు మరింత ఆజ్యం పోశాయి. టీడీపీ నేతలు తమ శ్రేణులను చితకబాదారని వైసీపీ ఆరోపిస్తోంది. పోలీసులను వినియోగించి తమ పైనే వైసీపీ దాడి చేయించిందని టీడీపీ శ్రేణులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నాయి. కుప్పంలో దాడులు జరిగిన సందర్భంలో జెడ్ ప్లస్ కేటగిరి భద్రతలో ఉన్న చంద్రబాబు నాయుడి పైన కూడా వైసీపీ మూకలు దాడికి యత్నించడం ఆందోళన కలిగిస్తోంది. చంద్రబాబుకు భద్రత కల్పించడంలో రాష్ట్ర పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందంటున్నారు. వాస్తవానికి కీలకమైన పదవుల్లో ఉన్నవారికి టెర్రరిస్టులు, మావోయిస్టుల నుంచి ముప్పు ఉంటుంది. అలాంటి వీఐపీలకు నేషనల్ సెక్కూరిటీ గ్రూప్ జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పిస్తుంది. జెడ్ ప్లస్ భద్రత కలిగిన చంద్రబాబు పర్యటన సందర్భంగా కుప్పంలో చోటుచేసుకున్న సంఘటనలు ఆయన భద్రతకు ముప్పు ఉందనేందుకు సూచనలంటున్నారు. చంద్రబాబు కాన్వాయ్ పై వైసీపీ శ్రేణులు రాళ్లు విసిరేందుకు యత్నించినట్లు వార్తలు రావడం గమనార్హం. కుప్పం ఘటనలతో ఒక్కసారిగా చంద్రబాబులో ఆగ్రహం పెల్లుబికింది. వైసీపీ శ్రేణులు, నేతల ఆగడాలను నిరోధించకుండా పోలీసులు చోద్యం చూడడంపై విరుచుకుపడ్డారు. 60 వేల మంది ఉన్న పోలీసులపై 60 లక్షల మంది ఉన్న టీడీపీ శ్రేణులు విజృంభిస్తే.. వారి గతి ఏమవుతుందో ఊహించుకోవాలని హెచ్చరించారు. అన్నా క్యాంటీన్ వద్ధ వైసీపీ శ్రేణులు బ్యానర్లు చింపి, అన్నా క్యాంటిన్ ను ధ్వంసం చేసిన ఘటనా స్థలాన్ని పరిశీలించి, అక్కడే రోడ్డుపై బైఠాయించారు. టీడీపీ నేతలపై పోలీసులు లాఠీచార్జి చేయడంపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. మా కార్యకర్తలను కొడితే.. నేను మీ ఇళ్లకు వచ్చి కొడతా’ అని హెచ్చరించారు. ఏపీలో వైసీపీ సర్కార్ వచ్చిన తొలి రోజుల్లోనే చంద్రబాబు ‘ఛలో ఆత్మకూరు’లో పాల్గొనకుండా నిరోధించేందుకు ఆయన ఇంటి గేట్లకు తాళ్లు వేశారు. చంద్రబాబు అమరావతి పర్యటనకు వెళ్లినప్పుడు ఆయన ప్రయాణించే బస్సుపై చెప్పులు, రాళ్లు వేశారు. అప్పటి వైసీపీ ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి జోగి రమేష్ చంద్రబాబు ఇంటిపై దాడికి వచ్చారు. చంద్రబాబును భౌతికంగా ఇబ్బంది పెట్టే యత్నాలు జరుగుతున్నాయన్న ఇంటెలిజెన్స్ నివేదికలతో కేంద్రం ఆయన రక్షణపై దృష్టి సారించిందంటున్నారు. చంద్రబాబు నాయుడు ఇటీవల చేస్తున్న పర్యటనల్లో వైసీపీ శ్రేణులు తరచుగా గొడవలు సృష్టిస్తున్నారు. కొన్ని నెలల క్రితం మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై రాళ్ల దాడి లాంటి పరిణామాలు కూడా చంద్రబాబుకు భద్రత పెంచే విషయంపై కేంద్రం ప్రత్యేకంగా దృష్టి పెట్టిందంటున్నారు. ఏపీలో చంద్రబాబు నాయుడి విషయంలో, టీడీపీ విషయంలో వరుసగా జరుగుతున్న సంఘటనలను చూస్తుంటే.. ఆయనకు ముప్పేదో ఉందనే సంకేతాలు వస్తున్నాయని ఆ పార్టీ నేతలు, శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ చంద్రబాబుకు ఏదైనా ఇబ్బందికర పరిస్థితి ఎదురైతే ప్రజలే ఆయనను కాపాడుకోవాలని వారు అంటున్నారు.

కేసీఆర్ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమే రాజాసింగ్ ఎపిసోడ్ కు ఇంత హైప్?!

గత ఎనిమిదేళ్లుగా.. అంటే తెలంగాణ ఆవిర్బావం నుంచి ఇప్పటి వరకూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ గతంలో ఎన్నడూ ఎదుర్కోనన్ని చిక్కులను ఇటీవలి కాలంలో ఎదుర్కొన వలసి వస్తున్నది. వరుస సమస్యలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న టీఆర్ఎస్ ఆ సమస్యల నుంచి ప్రజల దృష్టిని డైవర్ట్ చేయడానికి అంది వచ్చిన ప్రతి అవకాశాన్నీ ఉపయోగించుకోవాలనుకుంటోంది. అవకాశాలు అంది రాకపోతే సృష్టించుకోవాలని ప్రయత్నిస్తున్నది. అదిగో అలాంటి ప్రయత్నమే రాజాసింగ్ అరెస్టు అని పరిశీలకులు అంటున్నారు. మునావర్ స్టాండప్ కామెడీ షో, దానికి వ్యతిరేకంగా ఘోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆందోళన, ఆ తరువాత మత విద్వేషాలకు దోహదపడే విధంగా వివాదాస్పద వీడియో విడుదల చేసి అది తన కామెడీ షో అనడం ఇవన్నీ కూడా ప్రధాన సమస్యల నుంచి ప్రజల దృష్టిని డైవర్ట్ చేయడానికి టీఆర్ఎస్ సృష్టించుకున్న అవకాశంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.   ఎందుకంటే.. మామూలుగా వంద మంది రాజాసింగ్ లు వివాదాస్పద కామెంట్లు,  చేసినా, వీడియోలు చేసి విడుదల చేసినా హైదరాబాద్ మహానగరంలో మత విద్వేషాలు పెచ్చరిల్లే అవకాశం లేదు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావడానికి ముందు హైదరాబాద్ లో మత కల్లోలాలు జరిగేవి.. ఆయన ముఖ్యమంత్రి అయిన తరువాత తీసుకున్న చర్యలు, చేపట్టిన అభివృద్ధి పనులు, ఆయన తరువాత చంద్రబాబునాయుడు హయాంలో కూడా హిందూ ముస్లింల మధ్య సామరస్యమే కొనసాగింది. హైదరాబాద్ లో సున్నిత అంశాల మధ్య ముస్లిం, హిందువులు సంయమనం పాటిస్తున్నారు. ఎవరో రెచ్చగొట్టారని రెచ్చిపోయే పరిస్థితి లేదు. మత సామరస్యానికి నిలువెత్తు నిదర్శనంగా హైదరాబాద్ విలసిల్లుతోంది. అటువంటి హైదరాబాద్ లో రాజాసింగ్ తీరు మతసామరస్యాన్ని రెచ్చగొడుతోందంటూ టీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను, విమర్శలను ఎవరూ నమ్మే పరిస్థితి లేదు.   మునావర్ కామెడీ షో, దానిని అడ్డుకోవడానికి జరిగిన ప్రయత్నాన్ని భూతద్దంలో చూపి హైదరాబాద్ లో మత కల్లోలాలు జరగబోతున్నాయన్నంతగా హడావుడి చేయడం వెనుక టీఆర్ఎస్ పక్కా వ్యూహం ఉందని పరిశీలకులు అంటున్నారు. కేసీఆర్ కు మొదటి నుంచీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ అలవాటేననీ, ఇప్పుడు కూడా అదే చేస్తున్నారనీ అంటున్నారు. ఒక వైపు కాళేశ్వరం వైఫల్యం, లక్షల కోట్ల వ్యయంతో నిర్మించిన ఆ ప్రాజెక్టు ఒకే ఒక్క వరదకు ఎందుకూ పనికి రాకుండా పోవడం, దానిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతుండటం, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ తనయ కవిత పేరు ప్రముఖంగా బయటకు రావడం, అలాగే కుమారుడు కేసీఆర్ కు సంబంధించినదడిగా చెబుతున్న ఫీనెక్స్ కంపెనీపై ఐటీ దాడులు వంటి అంశాలపై చర్చకు అవకాశం లేకుండా ప్రజల దృష్టిని డైవర్ట్ చేయడానికే రాజాసింగ్ ఇష్యూకు అంత హైప్ ఇచ్చారని విశ్లేషిస్తున్నారు. పాత బస్తీలో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారిందనీ, అల్లర్లు జరుగుతున్నాయనీ టీఆర్ఎస్ సర్కార్ చేస్తున్న ప్రచారం, ఆర్భాటం అన్నీ కూడా ఈ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమేనని అంటున్నారు. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత, పాలనా వైఫల్యాలు, తన కుటుంబ సభ్యులపై అవినీతి ఆరోపణలు ఇలా ముప్పేట దాడిలో ఉక్కిరి బిక్కిరైపోతున్న కేసీఆర్.. రాజా సింగ్ వ్యవహారానికి అవసరానికి మించిన ప్రాధాన్యత ఇచ్చి ప్రజల దృష్టిని మరల్చాలని భావిస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. హైదరాబాద్ లో మత వైషమ్యాలు పెచ్చరిల్లే కుట్ర, శాంతి భద్రతలకు విఘాతం అంటూ టీఆర్ఎస్ సర్కార్ చెబుతున్నట్లుగా హైదరాబాద్ లో పరిస్థితి లేదనీ, నగరంలో మతసామరస్యానికి విఘాతం కలిగించడం ఎవరి వల్లా కాదనీ, ప్రజలలో చైతన్యం వచ్చిందనీ పరిశీలకులు అంటున్నారు.    1984 తరువాత హైదరాబాద్ నగరంలో మత పరమైన ఘర్షణలు తలెత్తిన సంఘటన ఒక్కటీ లేదనీ, మత సామరస్యానికి ప్రతీకగా నాడు ఎన్టీఆర్ హైదరాబాద్ నగరాన్ని తీర్చి దిద్దారని అంటున్నారు. ఈ నేపథ్యంలో రాజా సింగ్ వ్యవహారంలో టీఆర్ఎస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న హడావుడి ప్రచారం అంతా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమేననీ విశ్లేషిస్తున్నారు.

కాంగ్రెస్‌కు  గులాంన‌బీ ఆజాద్ గుడ్ బై  

చాలాకాలం నుంచి అసం తృప్తితో స‌త‌మ‌త‌మ‌వుతున్న గులాంన‌బీ ఆజాద్ ఎట్ట‌కేల‌కు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా ఇచ్చారు. పార్టీ ప్రాధ‌మిక స‌భ్య‌త్వం, ప‌ద‌వులను ఆయ‌న వ‌దులుకున్నారు. ఇటీవ‌లే ఆయ‌న కాంగ్రెస్ క‌మిటీ ఛైర్మ‌న్ ప‌ద‌వికి రాజీనామా చేశారు. అయితే పార్టీ ప్ర‌చార క‌మిటీ ఛైర్మ‌న్ గా నియ‌మిస్తూ పార్టీ ఉత్త‌ర్వులు అందుకున్న కొన్ని గంట‌ల వ్య‌వ‌ధిలోనే ఆజాద్ త‌న నిర్ణ‌యాన్ని లేఖ ద్వారా ప్ర‌క‌టించి పార్టీకి ఊహించ‌ని షాక్ ఇచ్చారు. వాస్త‌వానికి ఆయ‌న చాలాకాలం నుంచి పార్టీ తీరుతెన్నుల ప‌ట్ల‌, అభిప్రాయాల ప‌ట్ల విమ‌ర్శిస్తూనే ఉన్నారు. మొత్తానికి పార్టీతో ఉన్న 50 ఏళ్ల బంధాన్ని తెంచుకుంటూ.. హస్తం పార్టీని వీడారు. ఈ మేరకు కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ కి నాలుగు పేజీల లేఖ రాశారు. ఈ సంద ర్భంగా పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఆజాద్. కాంగ్రెస్‌ పార్టీని  అనుభవం లేని సైకోఫాంటిక్ నాయకుల కొత్త సర్కిల్‌గా ఆయన అభివర్ణించారు. భారత్ జోడి యాత్రను ప్రారంభించే ముందు కాంగ్రెస్ జోడి యాత్ర చేసి ఉండాలని విమర్శించారు. తన రాజీనామా లేఖలో రాహుల్ గాంధీ పైనా  విమర్శలు గుప్పించారు. ఆయనలో రాజకీయ పరిపక్వత లేదని.. ఇంకా చిన్నపిల్లాడిలా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. రెండేళ్ల క్రితం కూడా  కాంగ్రెస్ అధిష్టానంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ సోనియా గాంధీకి లేఖ రాసిన 23 మంది అసమ్మతి వర్గం నేతల్లో గులాం నబీ ఆజాద్ సైతం ఉన్నారు. జీ-23గా పేరున్న సీనియర్ నేతల బృందం.. కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి ఎన్నిక నిర్వహించాలని డిమాండ్ చేశారు. వారు లేఖ రాయడంపై అప్పట్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ అంతర్గత వ్యవహారా లను రచ్చకీడుస్తున్నారని మండిపడ్డారు.అప్పటి నుంచీ గులాం నబీ ఆజాద్ పార్టీతో అంటీ ముట్టనట్లుగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే సంచలన నిర్ణయం తీసుకున్నారు.  కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత గులాం నబీ ఆజాద్  రాజీనామా చేయడంపై కాంగ్రెస్ అధిష్ఠానం ఘాటుగా స్పందించింది. రాజీనామా చేసేందుకు ఇదా సమయం అని ఆ పార్టీ ప్రతినిధి ప్రధాన కార్యదర్శి, జాతీయ ప్రతినిధి జైరాం రమేష్ నిల‌దీశారు. ఆయ‌న  శుక్రవారం (ఆగ‌ష్టు 26) మీడియాతో మాట్లాడుతూ,  ఇది చాలా దురదృష్టకరమని అన్నారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం సహా పలు అంశాలపై బీజేపీతో కాంగ్రెస్ పోరాటం సాగిస్తున్న తరుణంలో ఆజాద్ రాజీనామా చేయడం విచారకరమని అన్నారు. రాహుల్ గాంధీ పార్టీకి తీరని నష్టం చేశారని, రాహుల్‌కు పరిపక్వత లేదని, రిమోట్ కంట్రోల్‌తో పార్టీ నడుస్తోందని గులాంనబీ ఆజాద్ తన సుదీర్ఘ రాజీనామా లేఖలో ఆరోపించారు. కేవలం కీలుబొమ్మ ల్లాంటి ప్రాక్సీ ల పేర్లు పార్టీ అధ్యక్షుడి పదవికి వినిపిస్తున్నాయని ఆరోపించారు. పార్టీలో సంస్కరణలు కోరుతూ 23 మంది నేతలు సంతకాలతో లేఖ రాసిన తర్వాత సీడబ్ల్యూసీ సమావేశాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి తమను చిన్నబుచ్చారని ఆరోపించారు.  కాగా, గులాం నబీ ఆజాద్ తన లేఖలో పేర్కొన్న అంశాలు అవాస్తమని,  ద్రవ్యోల్బణం, పోలరైజైషన్‌కు వ్యతిరేకంగా పార్టీ పోరాటం సాగిస్తున్న తరుణంలో ఆయన రాజీనామా చేయడం సందర్భోచితం కాదని వ్యాఖ్యానించారు.  కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ రాజీనామాపై ఆ పార్టీ సీనియర్ నేత, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీ  ఆజాద్ కు  అన్నీ ఇచ్చిందని, ఆయన ఈరోజు పేరున్న నాయ కుడు అయ్యాడంటే ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ సోనియాగాంధీ కారణమని అన్నారు. పార్టీలో ఆయన ఎన్నోపదవులు కూడా చేపట్టారని, అలాంటి ఆజాద్ రాజీనామా లేఖ రాసారంటే ఏమీ మాట్లాడ లేకుండా ఉన్నామని అన్నారు.  రాజీనామా లేఖ రాస్తారని ఎవరూ ఊహించలేదని అన్నారు. గతంలో ఆయన సోనియా గాంధీ వైద్యపరీక్షల కోసం అమెరికా వెళ్లినప్పుడు కూడా  లేఖ రాశారని అన్నారు.