గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్.. మరో వివాదం

తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్  కు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య సంబంధాల గురించి  ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.  ఇది అందరికీ తెలిసిన విషయం. ఇక ముఖ్యమంత్రి, గవర్నర్  సంబంధాల విషయం అయితే చెప్పనే అక్కర లేదు. ఉప్పు నిప్పు అంటే బాగుంటుందేమో , ఆ ఇదరి మధ్య మాటలు లేవు. మాట్లాడుకోవడాలు లేవు.  వివాదాలకు మాత్రమే ఉన్నాయి. అధికార పరిధి మొదలు ప్రోటోకాల్ ఉల్లంఘనల  వరకు ఒకటని కాదు రెండు కీలక రాజ్యాంగ వ్యవస్థల నడుమ వివాదాలకు కొదవ లేదు.  అనేక వివాదాల  చుట్టూ దుమారం రేగుతోంది.  ఇప్పటికే అనేక పర్యాయాలు ఇదే విషయంగా చాలా చాలా చర్చ జరిగింది. జరుగుతూనే వుంది. అనివార్యం అయితే తప్ప  ముఖ్యమంత్రి  మంత్రులు మాత్రమే కాదు, సీఎస్, డీజీపీ సహా ఇతర అధికారులు  ఎవరూ..  రాజ్ భవన్ వైపు చూడడమే మానేశారు.  అదలా ఉంటే ఇప్పుడు మరో సారి మరో వివాదం తెరపై కొచ్చింది. ఇటీవల మలక్ పేట ప్రభుత్వాసుపత్రిలో  డెలీవరీ కోసం  అడ్మిట్  అయిన  ఇద్దరు మహిళలు  మృతి చెందారు. మరి కొందరు తీవ్ర  అనారోగ్యానికి గురయ్యారు. ఈ దుర్ఘటనపై గవర్నర్ స్పందించారు.  స్పందనలోనే సందేహాలు వ్యక్త పరిచారు. మలక్ పేట ప్రభుత్వాసుపత్రిలో బాలింతల మృతి చెందడంపై  తనకు  అనేక అనుమానాలున్నాయని  గవర్నర్ చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. రాజ్ భవన్ లో  ఆదివారం (జనవరి 15) నిర్వహించిన సంక్రాంతి సంబరాలలో గవర్నర్ పాల్గొన్నారు.  ఈ  సందర్భంగా మీడియాతో మాట్లడుతూ మలక్ పేట ఆసుపత్రిలో ఇద్దరు బాలింతలు మరణించడం బాధాకరమన్నారు. బాలింతల మరణాలపై  ఓ గైనకాలజిస్ట్ గా తనకు ఎన్నో అనుమానాలు,  ఉన్నాయని అన్నారు. గవర్నర్  గా మాత్రమే కాకుండా ఒక డాక్టర్ గా కొన్ని అనుమానాలున్నాయని అన్నారు. నిజానికి, ఆసుపత్రికి వెళ్లాలని అనుకున్నా కానీ, పండుగ  కారణంగా  వెళ్లలేకపోయానని అన్నారు.  గతంలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల సమయంలోనూ నలుగురు మరణించిన విషయాన్ని గవర్నర్ గుర్తు  చేశారు. రాష్ట్రంలో జనాభాకు అనుగుణంగా వైద్య రంగంలో వసతులు మెరుగుపరచ వలసిన అవసరం ఉందని గవర్నర్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఉన్న సౌకర్యాలను  మరింతగా  మెరుగు పరచాల్సిన అవసరాన్ని  గవర్నర్ నొక్కి చెప్పారు.  ఆ దిశగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆమె కోరారు. అలాగే  రాష్ట్ర శాసన సభ ఆమోదం తెలిపిన కీలక బిల్లులకు సంబదించి, గవర్నర్ ప్రభుత్వ బిల్లులు పెండింగ్ లో లేవని, తన పరిశీలనలో  ఉన్నాయని    తెలిపారు.   వర్సిటీ నియామకాల బిల్లులో  అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవలసిన అవసరం ఉందన్నారు. యూనివర్సిటి నియామకాల బిల్లు వివాదాలతో  ఆలస్యం కారాదన్నదే  తన అభిమతమని గవర్నర్ వివరించారు. ఈ తరహా విధానాలను గతంలో న్యాయస్థానాలు అభ్యంతరం వ్యక్తం చేసినట్టుగా గవర్నర్ గుర్తు చేశారు.   యూనివర్సిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలని  గవర్నర్  కోరారు. అయితే సాధారణ పరిస్థితులలో అయితే ఇలాంటి వ్యాఖ్యలకు అంతగా ప్రాధాన్యత ఉండక పోవచ్చును కానీ  ఒక్క తెలంగాణలోనే కాకుండా ఇరుగు పొరుగు రాష్త్రాలలోనూ గవర్నర్లకు, రాష్ట్ర ప్రభుత్వాలకు నడుమ దూరం పెరిగిన నేపధ్యంలో, గవర్నర్ చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి దారి తీయవచ్చని అంటున్నారు .

బీఆర్ఎస్ ఎంట్రీతో ఏపీలో పొలిటికల్ క్లారిటీ?

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వాతావరణం ఇటీవలి కాలం వరకూ అత్యంత సంక్లిష్టంగా ఉండేది. ఔను అభివృద్ధీ నినాదానికీ.. సంక్షుమం ప్రలోభాలకూ మధ్య హోరాహోరీ పోరు తప్పదన్న భావన ఉండేది. అన్ని ఫ్రీ.. అంతా ఫ్రీ విధానానికీ.. కష్టపడదాం, పని చేద్దాం సంపద పెంచుదాం అన్న విజన్ కూ మధ్య పోటీ అన్న వాతావరణం ఉండేది. అయితే ఇప్పుడు ఒక్క సారిగా రాజకీయ ముఖ చిత్రం మారిపోయింది. తెరాస బీఆర్ఎస్ గా పేరు మార్చుకుని ఏపీ గడ్డపై అడుగుపెట్టడంతో ఇక ఫ్రీ విధానానికి చెల్లు చీటీ పడిపోయింది. నిన్న మొన్నటి వరకూ అభివృద్ధి లేమి, పరిశ్రమలు పరార్ అంటూ ఏపీని చూపి తెలంగాణలో ఓట్లు దండుకున్న తెరాస ఇప్పుడు అదే అభివృద్ధి నినాదంతో ఏపీలో అడుగు పెట్టేసింది. ఏపీలో అడుగు పెట్టడానికి తెరవెనుక రాజకీయం మరేదో ఉందన్న అనుమానాలను పక్కన పెడితే.. ఆత్మగౌరవం, అభివృద్ధి అజెండాను బీఆర్ఎస్ తెరపైకి తీసుకు వచ్చింది. అదే సమయంలో గతంలో అంటే 2014, 2019 ఎన్నికల సమయంలో అప్పట్లో తెరాసగా ఉన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆంధ్రప్రాంతాన్ని, ఆంధ్రప్రజలను తూలనాడిన వ్యక్తి ఇప్పుడు ఏపీలో రాజకీయం చేస్తానంటూ ముందుకు రావడంతో.. ఆయనకు చెక్ పెట్టేందుకు ఏపీ జనం సమాయత్తమౌతున్నారు.  బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడి నియామకం తరువాత రాష్ట్రంలో గతంలో ఏపీ లక్ష్యంగా, తెలంగాణలో స్థిరపడిన ఆంధ్రులు టార్గెట్ గా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపైనే విస్తృతంగా చర్చ జరుగుతోంది.  అంత మాత్రాన  బీఆర్ఎస్ ప్రభావం ఏపీ రాజకీయాలపై ఏ మాత్రం ఉండదా అంటే కచ్చితంగా ఉంటుంది. నిజానికి, ఒక్కఎపీలోనే కాదు దేశంలో ఏ ఒక్క ఒక రాష్ట్రం నుంచి పేరున్న పార్టీలు ,వ్యక్తులు ఎవరు కూడా కేసేఆర్ తో చేతులు కలిపేందుకు, సిద్ధంగా లేరు.  అయినా, ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు. చిన్నా చితక పార్టీలు, ప్రజాసంఘాలను కూడగట్టి జాతీయ రాజకీయాల్లో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు.  సో.. బీఆర్ఎస్ ప్రభావం ఏపీ పై అసలే ఉందని చెప్పలేము, కానీ ఆ ప్రభావం ఎలా ఉంటుందనేది విషయంలో మాత్రం దాదాపు ఏకాభిప్రాయమే వ్యక్తమౌతోంది. ఆయన ఏపీలో నిలదొక్కుకోవడం అంత వీజీ కాదనేదే. అన్నిటికీ మించి బీఆర్ఎస్ ఏపీలో ఎంట్రీ.. ఎవరు ఔనన్నా కాదన్నా దెబ్బకొట్టేది.. వైసీపీ ప్రయోజనాలనే అన్న అభిప్రాయం గట్టిగా వినిపిస్తోంది.  కొవిడ్ సమయంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఏపీ కొవిడ్ రోగులను సరిహద్దుల వద్దే అడ్డుకున్న కేసేఆర్, అదే సరిహద్దు దాటి ఏపీలో ఎంటర్ అవుతానంటే, ఎలా అనుమతిస్తామని జనం అంటున్నారు? తెలంగాణ ఉద్యమ సమయంలో కేసేఆర్ ఆంధ్రులను అవమానించిన తీరును ఎలా మరచిపోగలమంటున్నారు? నిన్నగాక మొన్న తెలంగాణ శాసన సభలో ఏపీపై విషం చిమ్మిన కేసీఆర్ కు  రెడ్ కార్పెట్  వేసి స్వాగతం ఎందుకు పలుకుతారని ప్రశ్నిస్తున్నారు.   కేసీఆర్, నేను మరిపోయాను నమ్మడానికి సిద్ధంగా లేమని తెగేసి చెబుతున్నారు. కేసీఆర్ పట్ల వ్యతిరేకతే ఆయన పార్టీని రెడ్ కార్పెట్ వేసి మరీ స్వాగతిస్తున్న వైపీపీపైనా పడక తప్పదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   నిజానికి ప్రాంతీయ వాదం పునాదిగా, రాజకీయంగా ఎదిగిన తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు ఆయన అవసరాల కోసం    తెలంగాణ సెంటిమెంట్ అస్త్రాన్ని, పక్కన పెట్టి జాతీయ నినాదాన్ని అందుకున్నారు. అందు కోసం  ఆయన దసరా పండగ రోజున తెలంగాణ భవన్ వేదికగా, తెరాస పార్టీ పేరును మార్చారు. భారతీయ రాష్ట్ర సమితిగా నామకరణం చేశారు. ఒక విధంగా చెప్పాలంటే, జాతీయ రాజకీయాల్లో ఎంట్రీకి అడ్డుగా ఉన్న ‘తెలంగాణ’ అనే పదాన్ని తెసీసి ‘భారతీయ’ అనే పదాన్ని చేర్చారు.   ప్రొఫెసర్ కోదండ రామ్’  చెప్పినట్లుగా తెరాస పేరు మార్పు వెనక ఉన్న మూల సూత్రం మాత్రం తెలంగాణలో అధికారాన్ని, కుటుంబ పాలనను నిలుపుకోవడం. ఇదొక్కటే ఇప్పుడు కేసీఅర్ ముందున్న లక్ష్యం. ఇదొక్కటే ఆయన ముందున్న సవాలు. తెలంగాణ సెంటిమెంట్ ను అడ్డు పెట్టుకుని 1200 యువకుల బలిదానాల బాటలో అధికార పీఠాన్ని అందుకున్న కేసేఆర్, వారి త్యాగాలన్నిటినీ విస్మరించి, ఇప్పుడు కొత్త దారిని ఎంచుకున్నారు. ఈ కొత్త దారికి అడ్డుపడేది ఏదైనా ఉంటే అది తెలంగాణ పదమే అన్న నిర్ణయానికి వచ్చి పార్టీలోని తెలంగాణ పేరును తుడిచేసి భారత్ అని చేర్చారు. ఈ మార్పు  తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను  ఎలా ప్రభావితం చేస్తుంది.  జాతీయ రాజకీయాలపై బీఆర్ఎస్ ప్రభావం ఎలా ఉంటుంది అన్నది పక్కన పెడితే,   ఆంధ్ర ప్రదేశ్  రాజకీయాలను ఏ మేరకుప్రభావితం చేస్తుంది? అంటే.. ఏపీ జనులు మాత్రం బీఆర్ఎస్ కు ఇక్కడ స్థానం లేదని అంటున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. ఆ పార్టీని భుజానికి ఎత్తుకుంటున్న వైకాపాను తిరస్కరించడానికి కూడా జనం సిద్ధంగా ఉన్నారని చెబుతున్నారు.   

జగన్ సినీ రాజకీయ మాయ.. ఈ సారి కనిపించదా?

ఏపీ రాజకీయ సమీకరణాల్లో స్పష్టత వస్తున్న కొద్దీ 2024 ఎన్నికలలో వార్ వన్ సైడ్ అయిపోతుందన్న భావన సర్వత్రా కలుగుతోంది. స్వయంగా అధికార పార్టీయే ఆ నిర్ణయానికీ, నిర్ధారణకూ వచ్చేసిందనిపించేలా ఆ పార్టీ నేతల మాటలు ఉంటున్నాయి. ఔను నిజమే.. 2019 ఎన్నికల సమయంలో వైసీపీకి అన్నీ మంచి శకునములే.. అధికార లాభ సూచనలే అన్నట్లుగా పరిస్థితులు కలిసి వచ్చాయి.  అన్నిటికన్నా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో సినిమా గ్లామర్ కు ఎంత ప్రాధాన్యత ఉందో తెలియనిది కాదు.  ఆ  సినిమా గ్లామర్ అండ అప్పటి ఎన్నికలలో వైసీపీకి పుష్కలంగా లభించింది. ఔను అప్పట్లో సినీ పరిశ్రమ దాదాపుగా వైసీపీ వెనుక నిలబడిందని చెప్పవచ్చు. అప్పట్లో మంచి ఫామ్ లో ఉన్న థర్టీ ఇయర్ ఇండస్ట్రీ  పృధ్వీ రాజ్, కమోడియన్ కమ్ హీరో అలీ, రైటర్, కమ్ యాక్టర్ పోసాని కృష్ణ మురళి వీళ్లు ముగ్గురూ బహిరంగంగా వైసీపీ తరఫున ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వీరే కాకుండా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా వైసీపీకీ, జగన్ కు మద్దతుగా నిలిచారు. రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేశారు. వీరే కాకుండా తెరవెనుక మద్దతు ఇచ్చిన సినీ పరిశ్రమకు చెందిన వారింకెంత మందో అన్నారు. 2019 ఎన్నికలకు మందు వైసీపీలో ఓ వెలుగు వెలగడమే కాకుండా.. వైసీపీ అండతో  తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టార్గెట్  ఇష్టారీతిన విమర్శలు గుప్పించి జగన్ దృష్టిలో పడిన థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీరాజ్, సినీ పరిశ్రమలో పనవ్ కల్యాణ్ కు సన్నిహిత స్నేహితుడిగా గుర్తింపు పొంది, కేవలం జగన్ పంచన చేరడం కోసం ఆయనకు దూరంగా జరిగిన అలీ, మొదటి నుంచీ చిరంజీవికీ, పవన్ కల్యాణ్ కూ దగ్గరి వాడుగా గుర్తింపు పొందిన పోసాని కృష్ణ మురళి.. వీళ్లంతా.. తమ శక్తికి మించి, పరిశ్రమలో తమ స్థానం ఏమౌతుందన్న బెరుకు కూడా వదిలేసి వైసీపీ కోసం పాటుపడ్డారు. కష్టపడ్డారు.   వీళ్లందరిలో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ.. పృధ్వీరాజ్ రెండు ఆకులు ఎక్కువ తిన్నారు.  నోరున్నదే విమర్శించడానికి అన్నట్లుగా ఆయన చెలరేగిపోయారు. ఆయన చెలరేగిపోతున్న సమయంలో.. ఇప్పుడైతే బూతుల నేతలుగా పేరొందిన కొడాలి నాని వంటి వారు కూడా ఆయన ముందు దిగదుడుపు అన్నట్లుగా అప్పట్లో పృధ్వీ విమర్శలు ఉండేవి. సరే  ఆ తరువాత వైసీపీ విజయం సాధించి జగన్ ముఖ్యమంత్రి అయ్యారు.  అన్ని వదిలేసి తన కోసం ప్రత్యర్థులను విమర్శించడమే పనిగా పెట్టుకున్న పృధ్వికి   ఎస్వీబీసీ ఛైర్మన్‌ పదవి కట్టబెట్టారు. సినీ పరిశ్రమ నుంచి వైసీపీ కోసం కష్టపడి పని చేసిన వారెందరో ఉన్నప్పటికీ..   జగన్ కు ఇష్టమైన భాషా ప్రయోగం చేసిన పృధ్వికి మాత్రమే ఆయన పదవి కట్టబెట్టారు. మిగిలిన వారికి తరువాత చూద్దాం అంటూ బజ్జగింపుతో సరిపెట్టారు. పదవి దక్కడంతో పృద్వీ మరింతగా రెచ్చిపోయారు. ప్రతి పక్ష పార్టీల నాయకులను ఎంత ఎక్కువగా దూషిస్తే అంతగా ముఖ్యమంత్రి గుడ్ లుక్స్ లో ఉంటానని భావించారో ఏమో ఎస్వీబీసీ ఛైర్మన్‌ పదవిని అడ్డు పెట్టుకుని ప్రతిపక్షాలపై విమర్శలతో విరుచుకు పడ్డారు. చివరకు, అమరావతి రైతుల ఆందోళలోనూ వేలు పెట్టారు. సినిమా కూతలు కూశారు. అమరావతి రైతుల ఉద్యమంపై  పృథ్వీ చేసిన డర్టీ వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైయ్యాయి. అయినా అయన ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ప్రతిపక్షాలపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. అయితే, పృధ్వి ఎస్వీబీసే వైభోగం మూడు నాళ్ళ ముచ్చటగా ముగిసి పోయింది.  ఒక మహిళా ఉద్యోగితో అసభ్యంగా మాట్లాడిన వాయిస్ రికార్డులు బయటకు రావటంతో ఎస్వీబీసీ ఛైర్మన్‌ బాధ్యతల నుండి తప్పించారు. ఇక అంతే ఆ తరువాత వైసీపీలో పృధ్విని పట్టించుకున్న వారే లేరు.  ఇలాంటి అసభ్య వాయిస్ రికార్డులతో దొరికిన ఇతర వైపీపీ నాయకులపై ఎలాంటి చర్యా తీసుకోని జగన్ పృధ్వి విజయంలో మాత్రం ఉద్వాసన చెప్పడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. పదవి నుంచి పీకి పారేశారు.  మరో వంక   వెనకా ముందు చూసుకోకుండా, నోరు పారేసుకున్న  ఆయన్ని ఇండస్ట్రీ కూడా వదిలేసింది. దీంతో పృద్వీ రెంటికీ చెడ్డ రేవడిలా రోడ్డున పడ్డారు.    ఇక ఆ తరువాత ప్రముఖ కమేడియన్ అలీ విషయానికి వస్తే.. మూడేళ్ల పాటు అదిగో ఇదిగో అంటూ ఊరించి.. రాజ్యసభ సభ్యత్వం నుంచి వక్ఫ్ బోర్డు చైర్మన్ వరకూ  పెద్ద పెద్ద పదవుల ఆశ చూపి.. చివరకు ఓ సలహాదారు పోస్టుతో సరిపెట్టారు.  అలాగే  అయినదానికీ కానిదానికీ కూడా జగన్ ను భుజాన వేసుకుని మోసే   పోసాని కృష్ణ మురళీకి కూడా నామినేటెడ్ పోస్టు పారేశారు. అలాగే ఎప్పుడో జగన్ ప్రచారానికి ఓ పాట పాడిన మంగ్లీకి కూడా ఓ సలహాదారు పోస్టు ఇచ్చేశారు. అయితే..  మోహన్ బాబు ఫ్యామిలీని ఇసుమంతైనా పట్టించుకోలేదు. ఇవన్నీ కాసేపు పక్కన పెడితే..జగన్ మూడున్నరేళ్ల పాలనలో సినీ పరిశ్రమను అష్ట కష్టాల పాల్జేశారు. రాజకీయంగా తనతో విభేదిస్తున్న ఒకరిద్దరిని దృష్టిలో ఉంచుకుని మొత్తం పరిశ్రమనే ఇబ్బందుల్లోకి నెట్టేశారు. ఈ నేపథ్యంలోనే 2024 ఎన్నికల సమయంలో జగన్ కు మద్దతుగా నిలబడేందుకు సినీ పరిశ్రమ నుంచి ఎవరూ ముందుకు రాని పరిస్థితి నెలకొంది. పదవులు ఇచ్చాం వీళ్లు మాతోనే ఉంటారు అని భావిస్తున్న అలీ, పోసానిలు కూడా ఈ సారి చురుకుగా వైసీపీ తరఫున నిలుస్తారన్న నమ్మకం అయితే లేదు. ఎందుకంటే.. వారికిచ్చిన సలహాదారు పోస్టులు ఉత్సవ విగ్రహాల్లాంటివే.. తమ స్టేచర్ కు, పడిన కష్టానికి అవి తగిన పదవులని వారు భావించడం లేదు. దీంతో ఈ సారి ఎన్నికలలో గతంలో అండగా నిలిచిన సినీ గ్లామర్ ఈ సారి వైసీపీకి ఉండదని చెబుతున్నారు. 

బావిలో పడిన సూది దొరుకుతుందా?.. ఢిల్లీ లిక్కర్ స్కాం తేలుతుందా?

చిన్న పిల్లలకు తాతయ్యలు, అమ్మమ్మలు, బామ్మలూ తరచుగా చెప్పే కథ  ఒకటుంది.. అనగనగా ఓ ముసలవ్వ నూతి గట్టుపై కూర్చుని బొంత కుట్టుకుంటుంటే..సూది బావిలో పడిపోయింది.. ఏం చేస్తే ఆ  సూది బయటకు వస్తుంది అని. పిల్లల్లో ఊహాశక్తిని పెంచేందుకు ఈ కథ చెబుతారు. అయితే రాజకీయ నాయకులు మాత్రం ప్రజలలో నిరాసక్తత, నిర్లిప్తతను నింపేయడానికి దాదాపు ఆ కథనే స్ఫూర్తిగా తీసుకుంటున్నారు. ఔను  నిజమే.. దేశంలో జరగుతున్న కుంభ కోణాలు, వాటి దర్యాప్తుల విషయంలో జనం ఈ దర్యాప్తు కొలిక్కి వస్తుందా? రాదా? అని ప్రశ్నించే అవసరం లేకుండా కొనసాగుతుంది అన్న జవాబును వారికి ముందే చెప్పేస్తున్నారు. అసలు దర్యాప్తులకు రాజకీయాలకు, ప్రభుత్వాలకూ సంబంధం ఏమిటంటారా?  ఆ  సంబంధం ఏమిటో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టంగా చెప్పేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థల రిమోట్ కేంద్ర ప్రభుత్వం వద్ద ఉంటుందనీ, అలాగే రాష్ట్రాల దర్యాప్తు సంస్థల రిమోట్ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుందని. నిజమే.. ఎమ్మెల్యేల కొనుగోలు బేర సారాల కేసును సిట్ కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్న సమయంలో ఆయన ‘ మీ చేతిలో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఉంటే.. మా దర్యాప్తు సంస్థలు మాకున్నాయి అని కేంద్రానికి తేల్చి చెప్పారు. ఆ సందర్భంగానే ఆయన ఈ మాటలు ఎందుకన్నారో అందరికీ తేటతెల్లమైపోయింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో తెలంగాణ ఎమ్మెల్సీ, స్వయంగా తన కుమార్తె కల్వకుంట్ల కవితపై ఆరోపణలు రావడం, ఆమెను ఈడీ, సీబీఐ విచారించడం నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు.   అంటే చట్టం, న్యాయం, ధర్మం కంటే కేసులు దర్యాప్తుల విషయంలో రాజకీయానిదే కీలక పాత్ర అని ఆయన స్వయంగా చెప్పేశారన్నమాట.  ఓ వంక ఢిల్లీ లిక్కర్ స్కాంలో సూత్రదారులు, పాత్ర దారులు ఎంతమంది ఉన్నా, తెలంగాణకు సంబంధించినంతవరకు, ఫోకస్ మొత్తం, ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత చుట్టూనే తిరుగుతోంది. కవిత కేంద్రంగానే  సిబిఐ, ఈడీ విచారణ జరుపుతున్నాయి. నిజానికి, ఈ స్కాంలో కవిత పేరు చాలా కాలంగా వినిపిస్తున్నా డిసెంబర్ మొదటి వారం వరకు ఆమె ప్రమేయం గురించి, ఈ కేసును విచారిస్తున్న సిబిఐ, ఈడీ ఎక్కడా అధికారికంగా ప్రస్తావించలేదు. అయితే ఆ తర్వాత, కదలిక మొదలైంది. ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి మనీ లాండరింగ్ ఆరోపణలపై అమిత్ అరోరాని ఈడీ అరెస్ట్ చేసింది. అరోరా రిమాండ్ రిపోర్టులో ఎమ్మెల్సీ కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పేర్లు ఉన్నట్లు వెల్లడైంది. సౌత్ గ్రూప్ నుంచి చెల్లించిన రూ.100 కోట్లకు కంట్రోలర్ గా శరత్ చంద్ర, కె.కవిత, మాగుంట సహా పలువురు ఉన్నారని రిమాండ్ రిపోర్టులో ఈడీ పేర్కొంది. ఈ నివేదిక ఆధారంగా డిసెంబర్  ఫస్ట్ వీక్ లో   సిబిఐ  కవితకు 160 సీఆర్పీసీ కింద నోటీస్ ఇచ్చింది. డిసెంబర్ 11,12 తేదీల్లో సిబిఐ అధికారులు కవితను ఆమె నివాసంలోనే విచారించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబందించిన వివరాలను సేకరించారు.  ఆ తర్వాత మళ్ళీ స్వల్ప విరామం తరువాత మళ్ళీ  ఇంకోసారి విచారణకు హజరుకావాలని 91 సీఆర్పీసీ కింద సీబీఐ అధికారులు నోటీసులు పంపించారు. ఐతే ఈసారి కవిత నివాసంలో కాకుండా.. తాము చెప్పిన చోటుకు వచ్చి.. విచారణకు హాజరవ్వాలని స్పష్టం చేశారు. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పడంతో పాటు తాము అడిగిన పత్రాలను సమర్పించాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఎవరు నోటీసులు అందుకుంటే వాళ్లు మాత్రమే హాజరుకావాలని వెల్లడించారు. కేసుకు సంబంధించి మరిన్ని డాక్యుమెంట్లకు సంబంధించి సమాచారం కావాలని.. కావాల్సిన పత్రాలు, సాక్షాలు ఇవ్వాలని కోరారు. విచారణ తేదీ, స్థలాన్ని త్వరలోనే మెయిల్ చేస్తామని సీబీఐ అధికారులు నోటీసులో పేర్కొన్నారు. అయితే ఈ నోటీసు వచ్చి నెల రోజులు దాటి పోయింది.  అయినా ఇంతవరకు అటు నుంచి గానీ, ఇటు నుంచి గానీ ఉలుకూ పలుకూ లేదు. ఇంతలోనే ఎమ్మెల్యేల బేరసారాల  (ఫార్మ్ హౌస్) కేసు తెరపై కొచ్చింది ఈ కేసుకు సమందించి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ కు  విచారణార్హత లేదని హై కోర్టు తేల్చేసింది. కేసును సిబిఐకి బదిలీ చేయాలని హై కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సిట్  విచారణపై  అనుమానాలు వ్యక్త చేసింది..ముఖ్యంగా ఈ వ్యవహారం ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేల బేరసారాల వ్యవహారం వెలుగు చూసిన తరువాత ముఖ్యమంత్రి  కేసీఆర్ మీడియా సమావేశంలో ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను వెల్లడించడాన్ని ప్రస్తావించిన హైకోర్టు..సీఎం కేసీఆర్‌కు సాక్ష్యాలు ఎవరు ఇచ్చారో చెప్పడంలో సిట్ విఫలమైందని పేర్కొంది. సో ... ఎమ్మెల్యేల బేరసరాల కేసు అటుతిరిగి ఇటు తిరిగి  ప్రగతి  భవన్ కు చేరుకుందని అనుకుంటున్నారు. సరే  హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం అప్పీలు చేసిందనుకోండి అది వేరే విషయం.  కానీ కవిత కు లిక్కర్  కేసులో ఇచ్చిన నోటీసుల విషయం ఏమిటి? ఆమెను నోటీసులుఇచ్చి నెలరోజులైనా విచారణకు ఎందుకు పిలవలేదు?      కవిత లిక్కర్ కేసుకు సంబందించి, సిబిఐ,ఈడీ మౌనం వెనుక ఉన్న మతలబు ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానం మళ్లీ బావిలో పడిన సూది కథలాగా మారుతుంది.  రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్న కేసుల విషయంలో ఇవన్నీ మామూలే అని చెబుతున్నారు.  అయితే అటు లిక్కర్ కేసు, ఇటు ఎమ్మెల్యేల బేరసారాల కేసులలో రాజకీయ ప్రమేయం ఉన్న నేపధ్యంలో ఈ కేసులు ముందుకు సాగడం, సాగకపోవడం అన్నది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందంటున్నారు. 

ప్రపంచ ఆర్థిక సదస్సుకు జగన్ కు నో ఇన్విటేషన్.. అసలు ఏపీని పట్టించుకోలేదు!

ఏటా దావోస్ లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సు ఈ ఏడాది కూడా  దావోస్ లో జరుగుతోంది. అయితే ఈ సదస్సుకు నిర్వాహకులు ఏపీ సీఎంను పట్టించుకోలేదు.  పేరుకు యాక్టివ్ భాగస్వాములు అని అంటారు కానీ.. అన్నిరాష్ట్రాల ప్రభుత్వాలకూ ఆహ్వానం పంపుతారు. ఏటా ఇది జరిగేదే..కానీ ఈ  సారి మాత్రం ఏపీకి ఆహ్వానం దక్కలేదు.   సాటి తెలుగు రాష్ట్రం అయిన  తెలంగాణ ప్రభుత్వానికి ఆహ్వానం అందింది.    తెలంగాణను అగ్రగామి టెక్నాలజీ పవర్‌హౌస్‌గా మార్చడంలో మీ నాయకత్వం ఎంతో కీలకమైంది’ అని  కేటీఆర్ కు అందిన ఆహ్వానంలో ప్రపంచ ఆర్థిక సదస్సు అధ్యక్షుడు పేర్కొన్నారు. గత ఏడాది జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సుకు ఏపీ సీఎం జగన్ కు  అందింది.  ఈ కారణంగా సీఎం జగన్ కూడా తన ప్రతినిధి బృందంతో దావోస్ వెళ్లారు. అయితే ఈ సారి దావోస్ కు ఏపీకి ఆహ్వానమూ అందలేదు.. ఏపీ నుంచి ప్రతినిధి బృందమూ వెళ్ల లేదు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ప్రతీ ఏడాది ఏపీ నుంచి  ప్రతినిధి బృందం వెళ్లేది. ఏపీని గొప్పగా ప్రమోట్ చేసేవారు.  కానీ ఇప్పుడు మాత్రం ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో సెంటిమెంట్ దెబ్బతిన్నది.. దీంతో ఏపీ వైపు పెట్టుబడిదారులు చూడటం లేదు.  అయినా దావోస్ నుంచి ఆహ్వానం అందినా, జగన్ పెద్ద ప్రతినిథి బృందాన్ని వెంటపెట్టుకుని వెళ్లినా పెద్దగా ఒరిగేదేం లేదని గత ఏడాది ఆయన దావోస్ పర్యటన ద్వారా తేలిపోయింది. అందుకే ఈ సారి దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సును జగన్ సర్కార్ లైట్ గా తీసుకుంది. ఎందుకంటే ఇప్పుడు ఆహ్వానం వచ్చినా.. ఆయన వెళ్లాలన్నా మళ్లీ కోర్టు అనుమతి తీసుకోవలసి ఉంటుంది. అలా తీసుకుని వెళ్లినా ఏపీలో పరిస్థితులు తెలిసిన పారిశ్రామిక వేత్తలెవరూ ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే అవకాశం లేదు. గత ఏడాది జగన్ ఆర్భాటంగా దావోస్ వెళ్లినప్పటికీ ఆయన పర్యటన మొత్తం వివాదాస్పదంగానే మారింది. భార్యతో విహార యాత్రకు వెళ్లిన చందంగా ఆయన దావోస్ పర్యటన ఉందన్న విమర్శలు వెళ్లువెత్తాయి. ఆయన దావోస్ పర్యటనకు బయలు దేరడానికి ముందే అప్పట్లో మంత్రులు ఈ పర్యటనతో రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయన్న భ్రమలు వద్దని చెప్పేశారు. పెట్టుబడులు వస్తాయన్న ఆశలు లేనప్పుడు దావోస్ వెళ్లడమెందుకని అప్పట్లోనే విమర్శలు వెళ్లు వెత్తాయి.  

పవన్ కల్యాణ్ క్లారిటీతో వైసీపీ నేతల్లో గాభరా

పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చేశారు.   అధికారంలో ఉన్న వైసీపీని గద్దె దించేందుకు తన గౌరవానికి భంగం కలగనంతవరకూ పొత్తులతోనే ముందుకు వెళతానన్న స్పష్టత ఇచ్చేశారు. అంటే తెలుగుదేశం, జనసేనలు వచ్చే ఎన్నికలలో కలిసే వెళతారన్నది స్పష్టమైపోయింది. ఇక ఆంద్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆ ప్రయత్నాలన్నీ దింపుడు కళ్లెం ఆశతోనే అని ఆయనకు ఎంత వరకూ అర్ధమైందో తెలియదు కానీ.. ఆయన పార్టీలోని నాయకులకు మాత్రం స్పష్టంగా అర్ధమైంది. అందుకే జగన్ పార్టీ కార్యకర్తలతో వరుస సమావేశాలు, సమీక్షలు నిర్వహిస్తున్నా, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాలకు 175 సీట్లు గెలవాలని, గెలుస్తామనీ పార్టీ నేతల్లో, క్యాడర్ లో ఉత్సాహాన్ని నింపే యత్నాలు చేస్తున్న.. మనసులో ఆందోళన ఉన్న పైకి అతి విశ్వాసం ప్రదర్శిస్తున్నా..  పార్టీ నేతల్లో, క్యాడర్ లో ఎలాంటి కదలికా రావడం లేదు. ఎమ్మెల్యేలను గడప గడపకు వెళ్లి, ప్రతి ఫ్యామిలీకి చేసిన మేళ్లను చెప్పుకోవాలని, తరుము తున్నారు.  నిజంగా ప్రతి గాడకు మేలు జరిగిందే నిజం అయితే, గడపగడపలో ఇంత వ్యతిరేకత ఎందుకు ఉంటుంది? అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తుంటే.. నిజంగా మనం మేలు చేస్తే ఇంతలా హైరాన పాడడం ఎందుకు? అంటూ పార్టీ నేతలూ, కార్యకర్తలు గొణుక్కుంటున్నారు.  ఎన్నికల మేనిఫెస్టోలో 98 శాతానికి పైగా హామీలను నెరవేర్చామని, చేసిన పనులను గడపగడపకు ప్రజల వద్దకు తీసుకెళ్లడి చాలు అంటూ కార్యకర్తలలో విశ్వాసం కలిగించేందుకు చాలా చాలా శ్రమిస్తున్నారు. కుప్పం స్థానిక సంస్థల ఎన్నికల్లో సాధించిన విజయాన్ని భూతద్దంలో చూపించి, తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు సొంత నియోజక వర్గం  కుప్పంలోనే గెలిచి నప్పుడు, మిగిలిన  నియోజక వర్గాల్లో గెలవడం ఎంత పని, 175కు 175 నియోజక వర్గాల్లోనూ గెలుస్తాం  గెలుస్తున్నాం .. అంటూ మైండ్ గేమ్ ఆడుతున్నారు. అయితే, జగన్ రెడ్డి కుప్పం గెలుపును ప్రజాస్వామ్య విజయంగా చెప్పుకోవడం, అది చూసి తనకు మరో అవకాశం ఇవ్వాలని కోరుకోవడం, తల్లి తండ్రులను హత్య చేసిన హంతకుడు, తల్లి తండ్రులు లేని అనాధను కరుణించి కాపాడండని న్యాయస్థానాన్ని వేడుకున్నట్లు ఉందని అంటున్నారు. నిజమే అద్దాల మేడలో కూర్చుని జగన్మోహన్ రెడ్డి పగటి కళలు కంటే కనవచ్చును, కానీ, వైసీపీ నాయకులు, కార్యకర్తల్లో మాత్రం  భరోసా కనిపించడం లేదు. గతంలో,  అభ్యర్ధి ఎవరైనా,  `అన్నకు ఓటేయండి.. అన్నను అధికారంలోకి తీసుకువద్దాం!  అని  అన్ని నియోజక వర్గాల్లో జగన్ రెడ్డే, వైసీపీ అభ్యర్ధి అన్నట్ల్గు  ప్రచారం చేసిన కార్యకర్తలు, ఇప్పుడు మౌనంగా ఉంది పోతున్నారు. జగన్ రెడ్డి ఏమి చేశారంటే, చెప్పేందుకు సమాధానం లేక గడపగడప కర్యక్రమానికి దూరంగా ఉంటున్నారు. అంతేకాదు, 2019 ఎన్నికల్లో వ్యక్తిగత ప్రయోజనాలను ఆశించి వైసీపే వెంట నడిచిన  కార్యకర్తఃలు చాలా వరకూ ఇప్పుడు దూరంగా ఉంటున్నారు.  98 శాతం వరకు ఇచ్చిన హమీలను నేరవేర్చామని చెప్పుకోవడం, అమ్మకు అన్నం పెట్టనోడు, పిన్నమ్మకు వడ్డానం చేయించానన్నట్లు ఉందని  సొంత పార్టీ అధినేతపైనే సెటైర్లు వేస్తున్నారు. ప్రజల సంగతి తర్వాత, కార్యకర్తలకు ఇచ్చిన హమీలకే దిక్కు లేదని, నేతలను నడిరోడ్డు మెదే నిలదీస్తున్నారు.  అలాగే, కులం, మతం ఇతర కారణాలతో ఇంకా వైసీపీని మోస్తున్న కార్యకర్తఃలు అయితే, ఇక ఇప్పడు చేయగలిగించి ఎమీ లేదని, జరగాల్సిన నష్టం జరిగిపోయిందని వాపోతున్నారు. ఇక ఇప్పుడు ఏం చేసినా చేతులు కాలాకా ఆకులు పట్టుకోవడమేనని అంటున్నారు. కార్యకర్తల పరిస్థితి ఇలా ఉంటే..  పార్టీ నాయకుల్లోనూ అసంతృప్తి జ్వలిస్తోంది. ఇంత కాలం అణచిపెట్టుకున్న అసంతృప్తి ఇప్పుడు   భగ్గుమంటోంది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో తుపాకిలో తూటా దూసుకోస్తోంది. ప్రతి జిల్లా, ప్రతి నియోజక వర్గంలోనూ కనీసం ఇద్దరు ముగ్గురు నాయకులు అసంతృప్తితో రగిలిపోతున్నారు.  ఉమ్మడి కృష్ణాను తీసుకుంటే.. జగ్గయ్యపేట ఎమ్మెల్యే ఉదయభాను, గుంటూరులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరులో కోటంరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి మానుగుంట మహీధర్రెడ్డి,  గుంటూరులో ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత తాడికొండ ఉండవల్లి శ్రీదేవిచ  కర్నూలు ఎస్వీ మోహన్రెడ్డి (మాజీ ఎమ్మెల్యే) రాజంపేట మేడా మల్లికార్జున రెడ్డి రాయచోటి శ్రీకాంత్రెడ్డి గిద్దలూరు అన్నా రాంబాబు బాపట్ల కోన శశిధర్ శ్రీకాకుళం కిల్లి కృపారాణి పేరాడ తిలక్.. ఇలా.. కీలక నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. వీరంతా కూడా ఒకరిద్దరు మినహా అందరూ కూడా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వెంట నడిచిన వారే, అయన విజయం  కోసం కష్టపడిన వారే. ఆయన కోసం.. ఆర్థిక సమస్యలు కొనితెచ్చుకున్నవారే.అప్పులు చేసి మరీ ఖర్చు చేసిన వారే. అయితే.. ఇప్పుడు వీరికిప్రాధాన్యం లేకుండా పోవడం.. జూనియర్లకు మంత్రి పదవులు ఇవ్వడం.. వారు ఆధిపత్య ధోరణితో ముందుకు సాగడం వంటివి ఇప్పుడు వారికి మనోవేదనను కలిగిస్తున్నాయి. దీనికి తోడు.. నియోజకవర్గాల్లో అభివృద్ధి లేక పోవడం కూడా.. వారిని తీవ్ర సంకట స్థితికి చేర్చింది. దీంతో ఎక్కడికక్కడ నిరసనలు పెరుగుతున్నాయి.నిజానికి,  జగన్ రెడ్డి మాటలకు, క్షేత్ర స్థాయి పరిస్థితులకు పొంతన లేదనే విషయాన్ని వైసీపీ నాయకులూ కార్యకర్తలే బహిరంగంగా అంగీకరిస్తున్నారు.  నిజానికి ఇప్పటికే చాల వరాకు జిల్లాల్లో అసంతృప్తి కర్యకలాపాలు ఊపందుకున్నాయి... ఎన్నికలు దగరయ్యే కొద్దీ పార్టీలో కింది నుంచి పైవరకు ఉన్న అసంతృప్తి భగ్గుమంటుందని, వైసీపీ ముఖ్య నేతలే   అంగీకరిస్తున్నారు. అయితే, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లేందుకు   వెనకాడుతున్నారు. ఒక వేళ తీసుకెళ్లినా ప్రయోజనం ఏముంది అని మిన్నకుంటున్నారు. 

కేసీఆర్ ఆయుధాలు అయిపోయాయా?.. బీఆర్ఎస్ జోరు చూపేనా?

తెలంగాణ రాష్ట్ర సమితి.. బీఆర్ఎస్ పార్టీగా రూపాంతరం చెందింది. దీంతో ఇప్పటి వరకు తెలంగాణలో షికారు చేసిన  పార్టీని ఇకపై దేశవ్యాప్తంగా షికారు చేయించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అయితే... ఆ పార్టీ  తెలంగాణ  కనబరిచిన జోరు దేశవ్యాప్తంగా ఉంటుందా? అంటే సందేహమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.   తాజాగా బీఆర్ఎస్ పార్టీగా టీఆర్ఎస్ మారడం వల్ల.. తెలంగాణ అనే పదం స్థానంలో భారత్ అనే పదం వచ్చి చేరడం వల్ల.. ఇది తెలంగాణ ప్రజలను ఇకపై అంతగా ప్రభావితం చేయలేదని వారు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే 2014 నుంచి అంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి రాష్ట్రంలో జరిగిన ఏ ఎన్నికలు జరిగినా... ఆంధ్ర అనే పదాన్ని ఎంతగా వాడుకోవాలో అంతగా వాడుకొంటూ.. కారు పార్టీ నాయకత్వం తెలంగాణ గడ్డపై షికారు చేసింది. అందుకు ఉప ఎన్నికలు, జీహెచ్‌ఎంసీ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు అన్న తేడా లేకుండా ఏకపక్షంగా ఆ పార్టీ గెలిచిందని రాజకీయ విశ్లేషకులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకొందని... దీంతో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే... మళ్లీ చంద్రబాబు తెలంగాణ గడ్డపై నుంచి రాజ్యమేలతాడంటూ.. తెలంగాణ ప్రజల్లో ప్రచారం చేసి విజయం సాధించడంలో కేసీఆర్   100కి వంద శాతం సఫలీకృతమయ్యారనీ అలా తెలంగాణ సెంటిమెంటుతో కేసీఆర్ ఇప్పటి వరకూ ఎన్నికలలో గెలుస్తూ వస్తున్నారనీ, ఇక పార్టీలో తెలంగాణ ఆత్మను తీసేసిన తరువాత ఆ సెంటిమెంట్ ను మళ్లీ వర్కౌట్ చేయడం కష్టమనీ అంటున్నారు.      గతంలో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సైతం కేసీఆర్ ఫ్యామిలీ ఇదే రీతిగా వ్యవహరించిందనడంలో ఎటువంటి సందేహం లేదని వారు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగణ గెడ్డపై తెలుగుదేశం పార్టీలో కేడర్ ఎంత బలంగా ఉన్నా.. సైకిల్ పార్టీ క్రియాశీలకంగా వ్యవహరించడంలో వెనకబడిపోయిందని వారు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా  పాండవులు... జమ్మి చెట్టుపై ఉన్న తమ ఆయుధాలను దించినట్లు.. తెలంగాణ అనే పదాన్ని కేసీఆర్  లీ ఓ ఆయుధంగా అవసరమైనప్పుడు వాడుకొంటూ.. ఎన్నికల రణక్షేత్రానికి వెళ్లేవారని అంటున్నారు.  కానీ బీఆర్ఎస్ పార్టీగా మారిన తర్వాత.. తెలంగాణ అనే సెంటిమెంట్.. ఎక్సపైయర్ అయిన అయిమెంట్‌లాగా అయిపోయిందని.. దీంతో పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు.. తెలంగాణ గడ్డపైనే కేసీఆర్ నాయకత్వంలోని పార్టీ  స్థిరమైన నాయకత్వాన్ని కోల్పోబోతున్నదని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.   దీంతో తెలంగాణ గడ్డ మీదే.. కేసీఆర్‌కు ఓట్లు పడడం కష్టమని చెబుతున్నారు. మరోవైపు గతంలో తెలంగాణ గడ్డపై కేసీఆర్ పార్టీ ఉన్నంత బలంగా ఇతర ప్రతిపక్ష పార్టీలు ఏవీ లేవని.. కానీ ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెస్ పార్టీ, టీడీపీ బలం పుంజుకొంటున్నాయని వారు చెబుతున్నారు. ఇక ముచ్చటగా మూడోసారి తెలంగాణలో అధికార పీఠాన్ని దక్కించుకోవాలని  కేసీఆర్ ఎంతగా ప్రయత్నిస్తున్నారో.. అంతే పోటీగా.. బీజేపీ జెండాని తెలంగణ గడ్డపై రెపరెపలాడించలని ఆ పార్టీ అగ్రనాయకత్వం భావిస్తోందని.. అలాగే రేవంత్ రెడ్డి సారథ్యలోని కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల్లోకి బలంగా దూసుకు వెళ్తోందని.. ఇక టీడీపీ సైతం వచ్చే ఎన్నికల్లో తన సత్తా చాటాలని కృత నిశ్చయంతో ఉందని.. అలాంటి పరిస్థితుల్లో కేసీఆర్.. తెలంగాణలో ముచ్చటగా మూడోసారి అధికారాన్ని నిలుపుకొంటారా? అంటే అనుమానమే అని రాజకీయ విశ్లేషకులు తమదైన శైలిలో అభిప్రాయపడుతున్నారు. ఇంకో వైపు దేశవ్యాప్తంగా రాజకీయం చేస్తుండంతో.. తెలంగాణలో గద్దెనెక్కేందుకు ఉత్ప్రేరకాలుగా ఉపయోగపడిన తెలంగాణ సెంటిమెంట్  ఏమంత ఉపయోగపడదనీ చెబుతున్నారు.  

పీవోకే భారత్ లో కలిసిపోతుందా? ప్రజా ఉద్యమాలకు పాక్ తలొగ్గక తప్పదా?

పాక్ ఆక్రమిత్ కాశ్మీర్ ప్రజలు  భారతదేశంలో కలుస్తామని నినదిస్తున్నారు. పాకిస్తాన్ సర్కార్ కు వ్యతిరేకంగా భారీగా ర్యాలీలు, నిరసనలు తెలుపుతున్నారు. తమ ప్రాంత వనరులను దోపిడీ చేస్తూ పంజాబ్, సింధ్ ప్రావిన్స్ లను అభివృద్ధి చేస్తున్నారంటూ   పాక్ ఆక్రమిత్ కాశ్మీర్(పీఓకే), గిల్గిత్ బాల్టిస్తాన్ ప్రజలు ఆందోళనకు దిగారు.   లక్షలాది మంది జనం రోడ్లపైకి వచ్చి పాకిస్థాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. ఆ ప్రజాందోళనకు సంబంధించిన వీడియోలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి. పాకిస్తాన్ వ్యాప్తంగా గోధుమల కొరతతో జనం అల్లాడిపోతున్నారు. పాకిస్తాన్ లోని పంజాబ్, సింధ్ ప్రాంతాల్లో కిలో గోధుమ పిండి ధర రూ. 150 వరకు ఉంటే   గిల్గిత్-బాల్టిస్తాన్ ప్రాంతంలో రూ. 200 వరకు ఉంటోంది. దీంతో పాక్ ప్రభుత్వం తమపై సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని పీఓకే ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను భారత్ తో కలపాలని, కార్గిల్ రోడ్ ఓపెన్ చేయాలని లక్షల మంది   ర్యాలీలు చేశారు. గత 12 రోజులుగా ఈ ప్రాంతంలో నిరసనలు కొనసాగుతున్నాయి. మరోవైపు భారత్ ఎప్పుడైనా పీఓకే, గిల్గిత్ బాల్టిస్తాన్ పై దాడి చేస్తుందన్న అనుమానం పాకిస్థాన్ లో ఉంది. దీంతో గిల్గిత్-బాల్టిస్తాన్ ప్రాంతంలో పాక్ సైనిక కార్యకలాపాలను పెంచుతోంది. దీంతో అక్కడి స్థానికులను వేరే ప్రాంతానికి తరలిస్తోంది. దీంతో అక్కడి ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుతున్నాయి. గిల్గిట్ – బాల్టిస్తాన్‌లకు స్వాధీనం చేసుకుంటామని గత అక్టోబర్ లో భారత రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటించిన సంగతి విదితమే.అందుకు అనుగుణంగా భారత సైన్యాధికారులు కూడా అటువంటి వ్యాఖ్యలే చేయడంతో  పాకిస్తాన్  ఆందోళన చెందుతోంది. దాదాపుగా ఏడుదశాబ్దాల తరువాత   గిల్గిత్-బాల్టిస్తాన్ ప్రజలు భారత్ లో కలుస్తామని నినదిస్తుండటంతో పాకిస్థాన్ ప్రభుత్వం ఈ ఆందోళనల వెనుక భారత్ ఉందన్న అనుమానం వ్యక్తం చేస్తోంది.  గతంలో భారత్ లో చేరబోమంటూ  ఉద్యమాలు  చేసిన వారే ఇప్పుడు ఇండియాకు అనుకూలంగా ఉద్యమిస్తుండటం గమనార్హం.  భారత్ నుంచి విడిపోయిన దేశాలన్నీ మళ్లీ విలీనం దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తుంది. సరిహద్దుల్లో ఉన్న అనేక దేశాలు  కరువుతో కొట్టుమిట్టాడుతున్నాయి. శ్రీలంక, పాకిస్థాన్, మయన్మార్, కాబూల్ లలో భారత్ పట్ల సానుకూలత వ్యక్తం అవుతోంది. ఆ దేశాలన్నిటిలోనూ ప్రస్తుతం రాజకీయ అస్థిరత నెలకొని ఉంది.  తీవ్ర ఆర్థిక సంక్షోభంతో దివాళా అంచున ఉన్నాయి.  ఈ నేపథ్యంలోనే ఆయా దేశాలలో అక్కడి ప్రభుత్వాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతున్నది. ఆయా దేశాలలో నెలకొన్న పరిస్థితుల కారణంగానే అక్కడి జనం ఇండియాలో విలీనం కోరుకుంటున్నారు. పీవోకేలో అయితే ఏకంగా ఇండియాలో కలుస్తామంటూ ఉద్యామాలు వెల్లువెత్తుతున్నాయి. 

విరాటుడి సెంచరీల వేట.. లంకతో మూడో వన్డేలో చెలరేగిన కోహ్లీ

కోహ్లీ మళ్లీ సెంచరీల వేటలో పడ్డాడు. దాదాపు మూడున్నరేళ్ల పాటు సెంచరీ కోసం ఎదురుచూసిన విరాట్ కోహ్లీ ఇప్పుడు పరుగుల వరద పారిస్తున్నారు. సెంచరీల మీద సెంచరీలు కొట్టేస్తున్నాడు. లంకతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో శతక బాదిన రన్‌ మెషిన్‌ ఆదివారం(జవనరి 15) తిరువనంతపురం వేదికగా మూడో వన్డేలో మరో శతకం బాదాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిన కోహ్లీ అజేయ సెంచరీతో జట్టుకు భారీ స్కోరు అందించాడు. ఆరంభం నుంచే దాటిగా ఆడుతూ విరాట్‌ కేవలం 85 బంతుల్లోనే 100 పరుగులు చేశాడు.  చివరి వరకూ క్రీజ్ లో నిలిచి  మొత్తంమీద 110 బాల్స్‌లోనే ఎనిమిది సిక్స‌ర్లు, ప‌ద‌మూడు ఫోర్ల‌తో 166 ర‌న్స్ చేశాడు. ఈ స్కోరులో ఎనిమిది సిక్స‌ర్లు, ప‌ద‌మూడు ఫోర్లు ఉన్నాయి.   కాగా వన్డే కెరీర్‌లో అతనికిది 46వ సెంచరీ కాగా ఓవరాల్‌గా 74వది. కాగా ఈ సెంచరీతో మాస్టర్‌ బ్లాస్టర్‌ స‌చిన్ టెండూల్కర్‌ రికార్డు బ‌ద్దలు కొట్టాడు కోహ్లీ. స్వదేశంలో అత్యధికంగా 21 సెంచ‌రీలు బాదిన ఆట‌గాడిగా నిలిచాడు. స‌చిన్ 20 సెంచ‌రీల‌తో రెండో స్థానంలో ఉన్నాడు.  సచిన్ స్వదేశంలో చేసిన 20 సెంచరీలను 160 మ్యాచ్ ల్లో పూర్తిచేస్తే, విరాట్ మాత్రం 101 మ్యచ్ ల్లోనే చేరుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆదివారం జ‌రిగిన మూడో వ‌న్డేలో శ్రీలంక‌పై టీమ్ ఇండియా 317 ప‌రుగుల తేడాతో ఘన విజ‌యాన్ని సాధించింది. వ‌న్డే సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది.   ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 390 ప‌రుగులు చేసింది. ల‌క్ష్య ఛేద‌న‌లో విఫ‌ల‌మైన శ్రీలంక 73 ప‌రుగుల‌కే ఆలౌటై దారుణ ప‌రాజ‌యాన్ని మూట గ‌ట్టుకున్న‌ది.ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి, శుభ్‌మ‌న్ గిల్ అద్భుత శ‌త‌కాల‌తో రాణించారు. కోహ్లి, గిల్ మెరుపుల‌తో భార‌త్ 50 ఓవ‌ర్ల‌లో ఐదు వికెట్లు న‌ష్ట‌పోయి 390 ర‌న్స్ చేసింది. రికార్డ్ టార్గెట్‌తో బ‌రిలో దిగిన శ్రీలంక బ్యాట్స్‌మెన్ భార‌త బౌల‌ర్ల‌ను ఏ మాత్రం ప్ర‌తిఘ‌టించ‌లేక‌పోయారు. వ‌రుస‌గా ఒక‌రి త‌ర్వాత మ‌రొక‌రు పెవిలియ‌న్‌కు క్యూ క‌ట్టారు. 22 ఓవ‌ర్ల‌లో 73 ప‌రుగుల‌కు ఆలౌట్ అయ్యింది. శ్రీలంక బ్యాట్స్‌మెన్స్‌లో ముగ్గురు మాత్ర‌మే డ‌బుల్ డిజిట్ స్కోరు చేశారు. 19 ర‌న్స్‌తో ఫెర్నాండో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. ఇండియా బౌల‌ర్ల‌లో సిరాజ్ నాలుగు వికెట్ల‌తో ఆక‌ట్టుకున్నాడు. ష‌మీ, కుల్దీప్ యాద‌వ్‌ల‌కు త‌లో రెండు వికెట్లు ద‌క్కాయి. శ్రీలంక‌తో మ్యాచ్ ద్వారా వ‌న్డే క్రికెట్ చ‌రిత్ర‌లో ప‌రుగులు తేడా ప‌రంగా అతి పెద్ద విజ‌యాన్ని అందుకున్న జ‌ట్టుగా టీమ్ ఇండియా నిలిచింది. గ‌తంలో ఈ రికార్డ్ న్యూజిలాండ్ పేరు మీద‌ ఉంది. ఐర్లాండ్‌పై న్యూజిలాండ్ 290 ప‌రుగుల తేడాతో గెలిచింది. ఆ రికార్డును శ్రీలంక‌తో మ్యాచ్ ద్వారా టీమ్ ఇండియా తిర‌గ‌రాసింది.

ఆ మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీకి అగ్నిపరీక్షే

ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, నాగాలాండ్‌ మేఘాలయల్లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కి   అగ్నిపరీక్ష అనే చెప్పాలి. ఎన్నికల కమిషన్‌ ఇంకా ఎన్నికల తేదీ లను ప్రకటించలేదు కానీ, ఎన్నికలు ఫిబ్రవరి లేదా, మార్చిలో జరిగే అవకాశం ఉంది. త్రిపురలో బీజేపీ రాష్ట్ర శాఖలో కొద్ది రోజులుగా వర్గ విభేదాలు చోటు చేసుకుంటున్నాయి. ఫలితంగా ముఖ్యమంత్రి బిప్లవ్‌ దేబ్‌   పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ రాష్ట్రంలో బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న ఆదివాసీ ఐ.పీ.ఎఫ్‌.టీ అలక పాన్పు ఎక్కింది. ఈ రెండు పార్టీలు కొంత కాలంగా ఎడమొహం పెడమొహంగా ఉంటున్నాయి. ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకుని, ప్రద్యోత్‌ కిషోర్‌ దేబ్‌ బర్మ నాయకత్వంలోని తిప్రా మోతా   బలం పుంజు కుంటోంది. ఈ పార్టీ అక్కడ ప్రత్యేక ఆదివాసీ రాష్ట్రం కోసం  పోరాటం సాగిస్తోంది. ఈ రాష్ట్రంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తే తేనె తుట్టెను కదల్చినట్టవు తుందని బీజేపీ పాలకులు ఈ విషయంలో నిర్ణయం తీసుకోవడానికి వెనుకాడుతు న్నారు. విచిత్రమేమింటే, ఈ రాష్ట్రంలో బీజేపీతో పొత్తు లేకుండా ఐ.పీ.ఎఫ్‌.టీ కూడా విజయం సాధించే అవకాశం లేదు. ఇది ఇలా ఉండగా, చాలాకాలం ఇక్కడ అధికారంలో ఉన్న సీ.పీ.ఐ(ఎం) కూడా మళ్లీ అధికారంలోకి రావడానికి  వేగంగా పావులు కదుపుతోంది. కాంగ్రెస్‌, తిప్రా మోతీ పార్టీలతో పొత్తు కుదర్చుకో వడానికి తాము సిద్ధంగా ఉన్నట్టు మార్క్సిస్టు పార్టీ ఇప్పటికే ప్రకటించింది. అంతే కాదు, 2021 శాసన సభ ఎన్నికల్లో ఘన విజ యం సాధించినప్పటి నుంచి త్రిపుర మీద కన్నేసిన తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇక్కడ మొత్తం 60 స్థానాలలోనూ ఒంటరిగా పోటీ చేయడానికి అభ్యర్థుల జాబితా సిద్ధం చేస్తోంది. దీని వల్ల ప్రతిపక్షాల ఐక్యత దెబ్బతినే అవకాశం ఉన్నా ఆ పార్టీ లెక్క చేయడం లేదు. ఈ రాజకీయ పరి ణామాలు రానున్న ఎన్నికల్లో బీజేపీకి పెద్ద సవాలుగా పరిణమించనున్నాయి. ఈ పార్టీలను ఎదుర్కోవడం బీజేపీకి ఆషామాషీ వ్యవహారం కాదు కానీ, ఓట్లు చీలకుండా నివారించడానికి ఆ పార్టీ ఎత్తులు వేయక తప్పకపోవచ్చు.  ఇక మేఘాలయ విషయానికి వస్తే, ఈ రాష్ట్రంలో బీజేపీకి ఎన్‌.పీ.పీ అనే స్థానిక పార్టీతో పొత్తు ఉంది. అయితే, ఇక్కడి ఎన్‌.పీ.పీ ముఖ్యమంత్రి కాన్రాడ్‌ సంగ్మా తాము ఇక ఏ మిత్రపక్షంతోనూ సంబంధం లేకుండా ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించేశారు. ఈ  రాష్ట్రంలో యూనిఫామ్‌ సివిల్‌ కోడ్‌ను ప్రవేశ పెట్టడానికి ఆయన పూర్తి విముఖంగా ఉన్నారు. అంతే కాక, పొరుగున ఉన్న అస్సాం రాష్ట్రంతో ఈ రాష్ట్రానికి సరిహద్దు సమస్యలున్నాయి. అస్సాంలో బీజేపీ అధికారంలో ఉంది. గత నవంబర్‌లో అస్సాంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం కూడా ఈ రెండు రాష్ట్రాల మధ్య పొరపచ్చాలకు కారణమైంది. ఈ స్పర్ధల నుంచి బయటప డడానికి, మళ్లీ పొత్తును సాధించడానికి ఢిల్లీలోని బీజేపీ పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నారు.  నాగాలాండ్‌ పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. అస్సాంతో నాగా లాండ్‌కు కూడా సరిహద్దు సమస్యలు, సరిహద్దుల్లో ఉద్రిక్తతలు వంటివి ఉన్నాయి. నాగాలాండ్‌లో బీజేపీ, నేషనలిస్ట్‌ డెమోక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌ పేరుతో కూటమిని ఏర్పాటు చేశాయి. ఈస్టర్న్‌ నాగాలాండ్‌ పీపుల్స్‌ ఆర్గనైజేషన్‌ అనే సంస్థ ఫ్రాంటియర్‌ నాగాలాండ్‌ పేర తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తోంది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకు ని ఇప్పుడు ఈ సంస్థ తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తోంది. నిజానికి ప్రత్యేక రాష్ట్రం విషయం లో ఎన్‌.ఎస్‌.సీ.ఎన్‌-ఐఎం అనే పార్టీతో చాలా కాలం బీజేపీ చర్చలు జరిపింది కానీ, ప్రస్తుతం ఆ చర్చ ల్లో ప్రతిష్టంభన ఏర్పడింది. నాగాలకు ప్రత్యేక పతాకం, ప్రత్యేక రాజ్యాంగం కావాలని ఎన్‌.ఎస్‌. సీ.ఎన్‌- ఐఎం కూడా డిమాండ్‌ చేస్తోంది. ఏతావతా, ఈ మూడు రాష్ట్రాలలో ఈసారి జరగబోయే ఎన్నికలు బీజేపీకి అగ్నిపరీక్షగా మారాయి. అయితే బీజేపీతో పొత్తు లేకుండా ఈ రాష్ట్రాలలో ఏ పార్టీ కూడా అధికారానికి వచ్చే అవకాశాలు లేవనే చెప్పాలి. అయినప్పటికీ, ఆ పార్టీలు బీజేపీని ఇరకాటంలో పెట్టి పబ్బం గడుపుకునే ఆలోచనల్లో ఉన్నాయి. ఇంతవరకూ ప్రస్తావించని అంశాలను కూడా ప్రచారానికి ఉపయోగించుకుంటున్నాయి. ఈ పార్టీల్లో కొందరు నాయకులు ఢిల్లీ స్థాయిలో బీజేపీ సీనియర్‌ నాయకులతో సంబంధాలు పెట్టుకుని ఉన్నారు. వారితో రహస్య మంతనాలు సాగిస్తున్నట్టు కూడా స్థానిక పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఈ చిన్నా చితకా సమస్య లను పరిష్కరించుకుని, ఈ మూడు రాష్ట్రాల్లో పాగా వేయడానికి బీజేపీ నాయకులు   ప్రయత్నాలు సాగిస్తున్నారు.  

ఆల్ ఈజ్ నాట్ వెల్ ఇన్ బీజేపీ?!

హిందుత్వ అజెండాను పూర్తిగా హైజాక్ చేసిన భజరంగ్ దళ్ ఆర్ఎస్ఎస్ కు చెక్ పెట్టి  భవిష్యత్తులో మరింత దూకుడుగా వ్యవహరించేందుకు పకడ్బందీ ప్లాన్ రెడీ చేసుకుంది. ప్రస్తుతం ఆర్ఎస్ఎస్ చీఫ్ గా ఉన్న మోహన్ భాగవత్ పనితీరుపై భజరంగ్ దళ్ లోని కొందరు బాహాటంగానే అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. అందుకే మోహన్ భగవత్ ఆమధ్య కొందరు ముస్లిం నేతలతో కలిసినప్పుడు, ఓ మసీదుకు వెళ్లినప్పుడు భారీగా ఆయనపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ సాగింది. ఇందులో భజరంగ్ దళ్ తోపాటు బీజేపీ వాళ్లు కూడా కీలక పాత్ర పోషించారనే విషయం ఒకింత ఆలస్యంగానైనా బయటపడింది. అందుకే బీజేపీయే స్వయంగా భజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ ల మధ్య ఎడాన్ని పెంచుతోందన్న అనుమానాలు వ్యక్త మౌతున్నాయి. అలా ఎందుకు అన్న ప్రశ్నకు.. బీజేపీలో ఆల్ ఈజ్ నాట్ వెల్ అన్న సమాధానం వస్తోంది. ఎందుకంటే.. పార్టీలో తిరుగులేని నాయకుడిగా మోడీ, ఆయనకు గట్టి మద్దతుదారుగా అమిత్ షా ఏకఛత్రాధిపత్యం వహిస్తున్నట్లు పైకి కనబడుతున్నా.. పార్టీలో ఆ పరిస్థితి లేదు. ఇప్పటికే ఆల్ డోర్స్ ఆర్ ఓపెన్ అన్న చందంగా.. సైద్ధాంతిక సారూప్యతతో సంబంధం లేకుండా ఓట్లు, సీట్లు చాలు అన్న చందంగా అన్ని పార్టీల నుంచీ బీజేపీలోకి వలసలను ప్రోత్సహిస్తోంది మోడీషా ద్వయం. దీంతో బీజేపీలో లుకలుకలూ పెరుగుతున్నాయి. అదనంగా గ్రూపుల సంస్కృతీ వచ్చి తోడైంది.   ప్రస్తుతం ఇటు బీజేపీలో   ప్రధాని నరేంద్ర మోడీకి తిరుగులేని గుర్తింపు, ప్రజాదరణ, కరిష్మా, ఇమేజ్ వంటివన్నీ ఉన్నాయి. ఆయనకు పోటీగా ఇటు సొంత పార్టీలో అటు ప్రతిపక్షాల్లో నిలబడ సత్తా ఉన్న నాయకుడు కనిపించటం లేదు. ఈ నేపథ్యంలో ఎన్నికల ఏడాది కాబట్టి ప్రతి అంశాన్ని సంతృప్తి పరిచేలా, అన్ని ప్రాంతాలు, సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకుని ప్రధాని నరేంద్ర మోడీ క్యాబినెట్ ను విస్తరించనున్నారు. వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికలున్న నేపథ్యంలో  న హ్యాట్రిక్ విజయానికి దోహదపడే విధంగా కేబినెట్ విస్తరణకు సన్నాహాలు చేస్తున్నారు. కసరత్తు చేస్తున్నారు.   అయితే  భారతీయ జనతా పార్టీలో  ఏ నేతకు ప్రజాదరణ ఉంది,  ఎవరెవరికి ప్రమోషన్ వస్తుంది. ఎవరికి ఉద్వాసన కలుగుతుంది,  పార్టీ బాధ్యతలు దక్కేదెవరికి, కేంద్ర మంత్రి పదవులు దక్కేదెవరికి, ఏ బీజేపీ సీఎంకు మోడీ-షా అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు లాంటి ఉహాగానాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి. బీజేపీలో మోడీషా ద్వయం కరుణాక్ష కటాక్ష వీక్షణాలు ఎప్పుడు ఏ విధంగా ఎవరి మీద ప్రసరిస్తాయో చెప్పే తార్కిక అంశం ఏదీ ఉండదు. ఆ ద్వయం ఎప్పుడు, ఏ క్షణంలో ఏ నిర్ణయం తీసుకుంటుందో ఎవరికీ అంతుపట్టదు. మోడీషా కన్నుసన్నల్లో మెదులుతూ, వారికి అత్యంత విశ్వాసపాత్రుడిగా పేరొందిన పార్టీ జాతీయ అధ్యక్షుడు ఇప్పడు వారి గుడ్ సెల్వ్స్ లో లేరని పార్టీ వర్గాల్లోనే గట్టిగా వినిపిస్తోంది.  సొంత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ లో వరుసగా రెండవసారి పార్టీని అధికారంలోకి రాకపోవడానికి నడ్డాయే కారణమన్న ముద్ర వేసి ఆయనపై వేటు వేయడానికి మోడీ షా ద్వయం సిద్ధంగా ఉందని గట్టిగా వినిపిస్తోంది. అసలు హిమాచల్ ప్రదేశ్ లో వరుసగా ఒకే పార్టీ రెండు సార్లు అధికారంలోకి వచ్చిన సందర్భం ఎప్పుడూ లేదు. అయినా ఆ రాష్ట్రంలో అధికారం నిలుపుకోవడంలో వైఫల్యానికి నడ్డాను బాధ్యుడిని చేస్తున్నారు.  సొంత రాష్ట్రంలో రెబెల్ లీడర్స్ ను కట్టడి చేయటంలో నడ్డా పూర్తిగా విఫలమయ్యారు. చివరికి  నరేంద్ర మోడీ స్వయంగా రంగంలోకి దిగి అసంతృప్తలను బుజ్జగించాల్సన పరిస్థితి వచ్చిందన్నది బీజేపీలో ఒక వర్గం వారి ఆరోపణ. మరి మోడీ బుజ్జగింపులు కూడా పని చేయలేదా అన్న  ప్రశ్నకు మాత్రం ఎవరూ బదులు చెప్పరు.  నడ్డా పదవీ కాలం ముగియడగానే ఆయన స్థానంలో కొత్త వారికి పార్టీ పగ్గాలు అప్పగించడం ఖాయమని పార్టీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ఈ నెల 30తో   జేపీ నడ్డా పదవీ కాలం ముగియనుంది. ఆయన స్థానంలో పార్టీలో, ప్రభుత్వంలో గట్టిపట్టున్న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు పగ్గాలు అప్పగించే అవకాశాలున్నాయన్న చర్చ జరుగుతోంది.   ఇక జేపీ నడ్డాకు  కేంద్ర మంత్రిగా అవకాశం ఇస్తారని అంటున్నారు.  మోడీ-షా ఇప్పటికే ఇటు ప్రభుత్వాన్ని అటు పార్టీని పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకుని  పార్టీలో  ఓ స్థాయి ఉన్న నేతలనందరినీ పక్కన పెట్టేశారు. పూర్తిగా తమకంటూ ఓ వర్గాన్ని తయారు చేసుకునే క్రమంలో కొత్త వారిని తెరపైకి తెచ్చి, బాధ్యతలు కట్టబెట్టి.. వారితోనే పార్టీని, ప్రభుత్వాన్ని నడుపుతూ.. కొత్త తరం నేతలను తయారు చేస్తున్నామని చెప్పుకుంటున్నారు.      మరో సీనియర్ నేత నితిన్ గడ్కరీ పరిస్థితి కూడా చాలా గందరగోళంగా తయారైంది. కీలకమైన బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి నితిన్ గడ్కరీని తప్పించటం ఆయనను అవమానానికి గురిచేసింది. కానీ ఆర్ఎస్ఎస్ అండదండల కారణంగా ఆయన సైలెంట్ గా ప్రస్తుతం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు గడ్కరీ స్థానంలో మహారాష్ట్ర డిప్యుటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఎదిగినట్టు అనుకునేలా సంఘ్ పరివార్, బీజేపీ ప్రవర్తిస్తోంది. సరే పార్టీని, సంఘ్ పరివార్ నూ పూర్తిగా తమ చెప్పు చేతల్లోకి తెచ్చుకున్న మోడీషా ద్వయానికి ఎన్నికలకు మించి చాలెంజ్ ఏమిటంటే..  మరో 3 ఏళ్లలో ప్రధాని నరేంద్ర మోడీకి  5 ఏళ్ల వయసు వచ్చేస్తుంది. మరి అప్పుడు ఆయన రాజకీయ అస్త్ర సన్యాసం చేస్తారా? అద్వానీ, మురళీ మనోహర్ జోషిల్లా ఆయన కూడా మార్గదర్శక మండలికి పరిమితమైపోతారా? లేకపోతే తమ కోసం  తామే తీసుకు వచ్చిన వయోపరిమితి నిబంధనను మోడీ షా ద్వయం మళ్లీ తమ కోసమే సవరిస్తారా? ప్రస్తుతం మోడీ హ్యాట్రిక్ సాధిస్తారా లేదా అన్న దాని కంటే మూడేళ్ల తరువాత వయోపరిమితి నిబంధనను తనకు వర్తింప చేసుకుంటారా అన్న దానిపైనే ఎక్కువ చర్చ జరుగుతోంది. మొత్తానికి ఇప్పటికిప్పుడు అయితే పైకి అంతా  బానే కనిపిస్తున్నా.. వైసీపీలో ఆల్ ఈజ్ నాట్ వెల్ అన్న వాతావరణమే ఉందని పరిశీలకులు అంటున్నారు. గడ్కరీ, రాజ్ నాథ్ సింగ్, వసుంధరరాజే, శివరాజ్ సింగ్ చౌహాన్, యెడ్డియూరుప్ప వంటి వారంతా ప్రస్తుతానికి మౌనంగానే ఉన్నా మోడీషా ద్వయం వైఖరి పట్ల అసంతృప్తితో రగిలిపోతున్నారన్నదే పరిశీలకుల విశ్లేషణ.

మకరజ్యోతి దర్శనంతో పులకించిన అయ్యప్ప భక్తులు

లక్షలాదిమంది అయ్యప్ప భక్తులు  శబరిమలలో మకర జ్యోతి దర్శనం చేసుకుని భక్తి పారవశ్యంతో పులకించారు.  శబరిమల గిరులు స్వామియే శరణం అయ్యప్ప అన్న నామస్మరణతో హోరెత్తాయి. ప్రతి ఏటా జనవరి 14వ తేదీ సాయంత్రం మూడు సార్లు మకర జ్యోతి దర్శనం ఇస్తుంది. కరోనా కారణంగా గత రెండేళ్లుగా దర్శనానికి రాని భక్తులు ఈ ఏడాది పోటెత్తడంతో శబరి గిరులు ఈ ఏడాది భక్తుల రద్దీతో కిటకిటలాడాయి. పొన్నాంబళంలోని స్వామి దర్శనానికి అయ్యప్ప మాలధారులు గంటల తరబడి క్యూలైన్లలో వేచిచూడాల్సి వస్తోంది. వణికిస్తున్న చలికి సైతం లెక్కచేయకుండా అయ్యప్ప భక్తులు శబరిమలకు పోటెత్తారు.

నిజాబాబాద్ సభపై తెలుగుదేశం భారీ హోప్స్!

పూర్వ వైభవాన్ని పునర్‌ ప్రతి ష్టించేందుకు తెలుగుదేశం పార్టీ పక్కా రాజకీయ ప్రణాళికలతో అడుగులు వేస్తున్నది. అభివృద్ధి, పేద, బడుగు బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ఉత్తర తెలంగాణలో పాగా  వేసేం దుకు రాజకీయ వ్యూహ రచన చేసింది. ఖమ్మం బహిరంగ సభతో దక్షిణ తెలంగాణలో తెలుగుదేశం సత్తా చాటినట్లే నిజామాబాద్‌ సభతో ఉత్తర తెలంగాణ లో టిడిపి స్థానాన్ని పదిల పర్చుకునేందుకు వ్యూహ రచన చేస్తున్నది. వచ్చే నెల 12, లేదా 13న నిజామాబాద్ లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నది. గతంలో ఉత్తర తెలంగాణలో ఉన్న టిడిపి కమిటీలు, నాయ కుల జాబీతాను టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పరి శీలించి రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ కు సూచనలు చేశారు. ఈ సూచనల మేరకు గతంలో టిడిపి కి కంచుకోటగా ఉన్న ప్రాంతాలు, నాయకులు, త్యాగాలకు సిద్ధంగా ఉన్న శ్రేణుల జాబీతాలను పరిశీలించారు. ఉత్తర తెలంగాణ లో పార్టీలు మారిన నాయకులను తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తూ ఫోన్లు చేస్తున్నట్లు సమాచారం. అసలు తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో గట్టి పట్టు ఉంది. తెలంగాణ సెంటిమెంట్ కారణంగా అనివార్యంగా ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ కు పరిమితమైనట్లుగా కనిపించినా.. ఇప్పుడు కేసీఆర్ జాతీయ రాజకీయాలంటూ తెరాసను బీఆర్ఎస్ గా మార్చేసి తెలంగాణ సెంటిమెంటుకు చెల్లు చీటీ పాడేయడంతో.. తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో పూర్వ వైభవాన్ని సముపార్జించుకునే అవకాశాలు మెరుగయ్యాయి. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ప్రాంతంలో నిజమైన అభివృద్ధి జరిగింది తెలుగుదేశం హయాంలోనే. ఈ  నేపథ్యంలోనే తెలుగుదేశం అధినేత చంద్రబాబు తెలంగాణపై దృష్టి సారించారు. ఖమ్మంలో గత నెల 21న నిర్వహించిన తెలుగుదేశం బహిరంగ సభ సూపర్ సక్సెస్ అయ్యింది.   చంద్ర‌బాబు భారీ కాన్వాయ్ తో హైద‌రాబాద్ నుంచి బ‌య‌లుదేరి రోడ్డు మార్గం ద్వారా ఖ‌మ్మం వెళ్లారు. దారి పొడవునా జనం బ్రహ్మరథం పలికారు. తెలంగాణలో తెలుగుదేశంకు ఉన్న క్రేజ్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఖమ్మం సభ సక్సెస్ తో జోరుమీద ఉన్న తెలుగుదేశం వెంటనే మరో బహిరంగ సభకు ప్రణాళిక రచించింది. నిజామాబాద్ లో ఉంటే ఉత్తరతలెంగాణలో సత్తా చాటేందుకు సిద్ధం అయ్యింది. తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షడు కాసాని జ్ణానేందర్ అందుకు సన్నాహాలు షరూ చేశారు. ఖమ్మం సభతో తెలంగాణలో తెలుగుదేశంపై ఒక్కసారిగా అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే భారాస అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన జాతీయ పార్టీ తొలి బహిరంగ సభకు ఖమ్మంనే వేదిక చేసుకున్నారు.   ఖమ్మంలో శంఖరావం పేరిట తెలుగుదేశం నిర్వహించిన భారీ భారీ బహిరంగ సూపర్ సక్సెస్‌తో.. తెలంగాణలోని తెలుగుదేశం పార్టీలో  నయా జోష్ కొట్టొచ్చినట్లు కనిస్తోంది. అంతే కాదు తెలుగుదేశం పార్టీ ఆంధ్రలోనే బతికి ఉంది.. తెలంగాణలో మాత్రం కనుమరుగైపోయిందంటూ వస్తున్న విమర్శలకు ఈ సభ సక్సెస్‌  ఫుల్‌స్టాప్ పెట్టింది. దీంతో కొత్త ఊపు ఉత్సాహంతో తెలంగాణలో తెలుగుదేశం అడుగుల వేగం పెంచింది. అయితే బారాస అధినేత   కేసీఆర్.. దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తోందంటూ ప్రకటించారు. అలాంటి వేళ.. ఆయన దేశంలో ఎక్కడైనా ఈ సభను నిర్వహించవచ్చు. కానీ అలా కాకుండా.. తెలంగాణలోని అదీ.. ఖమ్మం వేదికగా ఈ సభను ఏర్పాటు చేయడంతో ఖమ్మం తెలుగుదేశం సభ భారాసాలోనూ ప్రకంపనలు సృష్టించిందని అవగతమౌతోంది. అసలే ఖమ్మంలో భారాసాకు ఉన్న పట్టు అంతంత మాత్రమే. అందులోనూ ఇప్పుడు ఆ జిల్లా భారాసాలో అసంతృప్తి జ్వాలలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. పొంగులేటి, తుమ్మలలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ అక్కడే తమ జాతీయ పార్టీ తొలి బహిరంగ సభ ఏర్పాటు చేయడం.. ఇందుకు ఇతర రాష్ట్రాల సీఎంలు, మాజీ సీఎంలను ఆహ్వానించడంతో.. ఒక వేళ ఆ సభకు అనుకున్నంతగా జనం రాకపోతే.. తెలుగుదేశం పార్టీకి భారాసా సభే రెడ్ కార్పెట్ వెల్ కమ్ పలికినట్లౌతుందని పరిశీలకులు అంటున్నారు. 

ఎన్ఐఏ కోర్టుకు జగన్?.. ఎందుకంటే

జాతీయ దర్యాప్తు సంస్థ ప్రత్యేక కోర్టుకు జగన్ హాజరు కావాల్సిందే. అయితే ఆయన ఇంత వరకూ కోర్టు మెట్లు నిందితుడిగా ఎక్కుతూ వస్తున్నారు. ఇప్పుడు ఎన్ఐఏ కోర్టుకు ఆయన బాధితుడిగా హాజరు అవ్వాల్సి వస్తోంది. ఔను బాధితుడిగానే. టెక్నికల్ ఈ బాధితుడిగా హాజరు కావాల్సి వచ్చినా వాస్తవానికి ఈ కేసు కారణంగా ఆయన గత ఎన్నికల్లో లబ్ధి పొందారు. ఔను కోడి కత్తి కేసును జాతీయ దర్యాప్తు సంస్థ టేకప్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణ సందర్భంగా ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఈ కేసులో బాధితుడి స్టేట్ మెంట్ ఎందుకు రికార్డు చేయలేదని ప్రశ్నించింది. బాధితుడిని విచారించకుండా, స్టేట్ మెంట్ రికార్డు చేయకుండా సాక్షులను మాత్రం విచారించి ప్రయోజనం ఏమిటని ప్రశ్నించింది. ఈ కేసులో జగన్  స్టేట్ మెంట్ రికార్డు చేసినట్లుగా ఎన్ఐఏ తరఫున్యాయవాది కోర్టుకు తెలియజేశారు. అయితే చార్జిషీట్ లో  ఆ స్టేట్ మెంట్ ఏదని కోర్టు ప్రశ్నించింది. ఈ కేసులో 56 మందిని విచారిస్తే.. మొదటి 12 మంది స్టేట్ మెంట్లూ చార్జిషీట్ లో లేకపోవడాన్ని కోర్టు తప్పుపట్టింది. ఈ కేసులో కోడికత్తి కేసులో నిందితుడు శ్రీనివాస్ కు బెయిలు నిరాకరించిన ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఈ నెల 31 నుంచి కేసు విచారణ చేపడతామని పేర్కొంది. ఈ కేసు విచారణకు బాధితుడితో సహా అందరూ హాజరు కావాల్సిందేనని ఆదేశించింది. దీంతో కోడి కత్తి కేసులో బాధితుడిగా ఉన్న జగన్ ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఎదుట హాజరు కావాల్సి ఉంది. గత ఎన్నికలకు ముందు విశాఖ విమానాశ్రయంలో జగన్ పై కోడి కత్తితో దాడి జరిగిన సంగతి విదితమే. ఆ దాడి కారణంగా అప్పటి ఎన్నికలలో జగన్ పార్టీకి సానుభూతి లభించి లబ్ధి చేకూరిన సంగతి విదితమే.  నిందితుడిగా సీబీఐ కోర్టుకు హాజరైన సీఎం జగన్ త్వరలో బాధితుడిగా ఎన్ఐఏ కోర్టుకు హాజరు కావాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. జగన్‌పై విశాఖలో జరిగిన కోడికత్తి దాడి ఘటనలో నిందితుడు శ్రీనివాస్ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిగింది. ఈ విచారణలో బెయిల్ పిటిషన్‌ను న్యాయమూర్తి తిరస్కరించారు. నెలాఖరు నుంచి ఈ కేసులో విచారణ ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఎన్ఐఏ దాఖలు చేసిన చార్జిషీటును పరిశీలించారు. ఈ కేసులో ఇంత వరకూ బాధితుడైన జగన్మోహన్ రెడ్డి దగ్గర స్టేట్ మెంట్ తీసుకోలేదని ఎన్ఐఏపై .. శ్రీనివాస్ తరపు లాయర్ ఫిర్యాదు చేశారు. అయితే తాము జగన్ స్టేట్ మెంట్ నమోదు చేశామని ఎన్ఐఏ లాయర్ కోర్టుకు తెలిపారు.. అయితే ఆ స్టేట్ మెంట్.. చార్జిషీటులో ఎందుకు లేదని న్యాయమూర్తి ప్రశ్నించారు. బాధితుడి స్టేట్ మెంట్ నమోదు చేయకుండా ఇతర సాక్షులను విచారిస్తే ఏం ప్రయోజనమని న్యాయమూర్తి ప్రశ్నించారు. నెలాఖరు నుంచి రెగ్యులర్ విచారణను ప్రారంభిస్తున్నందున బాధితుడు కూడా కోర్టుకు హాజరు కావాలని ఎన్ఐఏ కోర్టు ఆదేశించింది. దీంతో బాధితుడైన సీఎం జగన్ కూడా కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది.

వారణాసికి నిధుల వరద!

రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నది పాత సామెత ... మోడీ తలచుకుంటే డబ్బులకు కొదవా అన్నది నేటి సామెత. అవును, ప్రధాన మంత్రి  నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజక వర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూస్తే ఎవరైనా ఇదే అంటారు. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ రాష్ట్రంలో ముఖ్యంగా వారణాసిలో ఎన్ని వందల కోట్ల రూపాయల ప్రాజెక్టులకు మోడీ శంకు స్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారో లెక్క లేదు... అలాగే ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మోడీ స్వరాష్ట్రం గుజరాత్ కు ఇరుగు పొరుగు రాష్రాలు ఈర్ష్య పడేలా నిధుల వరద పారింది. దీనిపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు పలు సందర్భాలలో విమర్శలు చేశారు.  అదలా ఉంటే   ఇప్పడు, ఈ రోజు  ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచంలోనే అతి పొడవైన నదీ విహార యాత్ర రివర్ క్రూయిజ్ఎంవీ గంగా విలాస్ ను వారణాసి లోని టెంట్ సిటీలో  ప్రారంభించారు. అంతే కాదు పనిలో పనిగా వెయ్యి కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన ఇతర అంతర జల మార్గాల ప్రాజెక్టులకు కూడా ఆయన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం జల మార్గాల్లో చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టుల వల్ల రవాణ, వాణిజ్య, పర్యాటకం పెరుగుతుందని అన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల తూర్పు ప్రాంతం దేశానికి వృద్ధి చోధకంగా దోహదపడుతుందని అన్నారు. దీనిని దేశంలో మౌలిక సదుపాయాల పరివర్తన దశాబ్దంగా పేర్కొన్నారు.  గంగా విలాస్ యాత్ర తేలికైన యాత్ర కాదని మన దేశంలో అంతర జల మార్గాల అభివృద్ధికి ఒక ఉదాహారణ అని చెప్పారు. గతంలో అంతర్ జల మార్గాల రంగంలో అసాధారణ  అభివృద్ధి గురించి నరేంద్రమోదీ మాట్లాడుతూ... 2014 లో దేశంలో కేవలం 5 అంతర్ జల మార్గాలు మాత్రమే ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య 111 కు పెరిగిందరీ, జల మార్గాల రవాణా మూడు రెట్లు పెరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా గంగా విలాస్ లో విహార యాత్ర చేస్తున్న స్విట్జర్లాండ్ పర్యాటకులకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలిపారు.  ఎంవీ గంగా విలాస్ – ఈరోజు వారణాసి నుంచి బయలుదేరి 51 రోజుల్లో సుమారు 3 వేల 2 వందల కిలో మీటర్లు ప్రయాణించి, బంగ్లాదేశ్ మీదుగా అస్సాంలోని దిబ్రూఘర్ కు చేరుకుంటుంది. ఈ పడవలో విలాసవంతమైన 18 గదులున్నాయి. 36 మంది పర్యాటకులు విహారం చేయవచ్చు. నేషనల్ పార్కులు, నదీ ఘాట్లు, పాట్నా నగరం, జార్ఖండ్ లోని షాహిబ్ గంజ్, పశ్చిమ బెంగాల్ లోని కోల్ కతా, బంగ్లాదేశ్ లోని ఢాకా, అస్సాంలోని గౌహతిలను ఈ పర్యాటకులు సందర్శించవచ్చు. గంగా నది ఒడ్డున టెంట్ సిటికి కూడా ప్రధానమంత్రి ప్రారంభోత్సవం చేశారు.  ప్రధానమంత్రి పశ్చిమ బెంగాల్ లోని పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేస్తారు. కాగా, ఇంతవరకు దేశంలో ఇలాంటి ప్రయోగం జరగ లేదు, ఇదే తొలి ప్రయత్నం. కాగా, భారతదేశ మొట్ట మొదటి నదీ పర్యాటక నౌక,  గంగా, బ్రహ్మపుత్ర  నదుల మీదుగా 3,200 కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఈ లగ్జరీ నౌకకు మరో ప్రత్యేకత కూడా వుంది. ప్రపంచంలోనే అతిపెద్ద నదీ పర్యటక నౌకగా కూడా ‘ఎంవీ గంగా విలాస్‌’ చరిత్ర సృష్టించింది. ఈ నౌకలో ప్రయాణికుల కోసం అత్యాధునిక సౌకర్యాలతో పాటు సూట్‌ గదులు, స్పా, జిమ్‌ సెంటర్లు, ఫ్రెంచ్ బాల్కనీలు, ఎల్ఈడీ టీవీలు, సేఫ్‌లు, స్మోక్ డిటెక్టర్లు, కన్వర్టిబుల్ బెడ్లు వంటివి కూడా ఉన్నాయి. ఈ రోజే (జనవరి 13) 51 రోజుల తోలి పర్యటనను వారణాసి నుంచి ప్రారంభించనున్న ఎంవీ గంగా విలాస్ .. భారత్‌లోని ఐదు రాష్ట్రాలను, బంగ్లాలోని కొన్ని ప్రాంతాలను కవర్ చేస్తూ మొత్తం 3,200 కి.మీ దూరం ప్రయాణించి దిబ్రూఘర్ చేరుకుంటుంది. అంతేకాక 27 నదీ వ్యవస్థల మీదుగా ఈ నౌక ప్రయాణించనుంది. ఇక ఈ నౌక తన మొదటి పర్యటనలో భాగంగా ప్రపంచ వారసత్వ ప్రదేశాలు, జాతీయ ఉద్యానవనాలు, నదీ ఘాట్‌లు, బీహార్‌లోని పాట్నా, జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్, పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా, బంగ్లాదేశ్‌లోని ఢాకా, అస్సాంలోని గువాహతి వంటి ప్రధాన నగరాలతో సహా 50 పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తుంది. ఎంవీ గంగా విలాస్ తన తొలి ప్రయాణంలో స్విట్జర్లాండ్‌కు చెందిన 32 మంది పర్యాటకులను తీసుకెళ్లనుంది. అయితే,  ఈ నౌక అందరికీ అందుబాటులో ఉండదు ..ఎందుకంటే ..ఒక్కో ప్రయాణికుడికి రోజుకు దాదాపు రూ.25వేలు  చార్జి అవుతుంది. అంటే ఈ యాత్ర మొత్తానికి ఒక్కొక్కరికీ రూ.12.75లక్షల ఖర్చవుతుంది.  అదలా ఉంటే సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ రివర్ క్రూయిజ్ ఏమ్వీ  గంగా విలాస్, వల్ల సామాన్య ప్రజలకు మేలు జరగదని విమర్శించారు.నరేంద్ర మోడీ ప్రభుత్వ ఏకైక ఉద్దేశ్యం మతపరమైన ప్రదేశాలను పర్యాటక ప్రదేశాలుగా మార్చడం ద్వారా డబ్బు సంపాదించడం మాత్రమే అని యాదవ్ అన్నారు. ప్రజలు తమ జీవితపు చివరి దశలో లేదా ఆధ్యాత్మికత కోసం వారణాసిని సందర్శిస్తారు మరియు జ్ఞానాన్ని పొందుతారు. పర్యాటకాన్ని ప్రోత్సహించడం ద్వారా డబ్బు సంపాదించడం కోసం బిజెపి ఈ ఏర్పాటు (అక్కడ) చేస్తోంది" అని యాదవ్ చెప్పినట్లు వార్తా సంస్థ పిటిఐ పేర్కొంది.

వలసల భారతం!

ఏటా లక్షలాది మంది భారతీయులు  విదేశాలకు వలస వెళ్లిపోతుండటం అత్యంత ఆందోళన కలిగిస్తున్న అంశం.  స్వదేశంలో కన్నా విదేశాల్లో స్థిరపడడానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న భారతీయుల సంఖ్య ఏటా పెరిగిపోతుండటానికి కారణమేమిటన్న దానిపై ఇటీవల ఇండోర్ లో జరిగిన భారతీయ ప్రవాసీ దివస్ లో చర్చ జరిగింది.  తాజా గణాంక వివరాల ప్రకారం, ప్రస్తుతం కోటీ 80 లక్షల మంది భారతీయులు విదేశాల్లో నివసిస్తున్నారు. ఇంత పెద్ద సంఖ్యోలో విదేశాలకు వెళ్లిన జనాభా ఉన్న దేశం ప్రపంచంలో భారత్ మాత్రమే. ఎందుకు ఇంత పెద్ద ఎత్తున వలసలు పోతున్నారన్న దానిపైనే   భారతీయ ప్రవాసీ దివస్‌లో  ఆందోళన వ్యక్తమైంది. భారతీయుల్లో అత్యధిక సంఖ్యా కులు విదేశాల్లో తమ భవితవ్యాన్ని, తమ అదృష్టాన్ని వెతుక్కోవడానికి దారి తీస్తున్న కారణాలపై కూడా చర్చ జరిగింది.  భారత్‌ తర్వాత అంత పెద్ద సంఖ్యలో వలసలు పోతున్న జనాభా కలిగిన దేశం మెక్సికో మాత్రమే. అయితే అక్కడి వారు ఎక్కువగా వలస వేళ్లేది అమెరికాకు మాత్రమే. అదే ఇండియన్స్ విషయానికి వస్తే.. వీరు దేశం విడిచి వెళ్లడానికి డెస్టినేషన్ ఒక్క అమెరికా మాత్రమే కాదు.. ప్రపంచంలోని ఏ దేశానికైనా సరే వెళ్లడానికి ఇసుమంతైనా సందేహించకుండా వెళ్లిపోతున్నారు.  ఒక్క గల్ఫ్ దేశాలలోనే దాదాపు 80 లక్సల మంది భారతీయులు ఉద్యోగమో, వృత్తో, వ్యాపారమో చేసుకుంటగూ జీవనం గడుపుతున్నారు.  అలాగూ అమెరికా, ఇంగ్లండ్‌ ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ దేశాలకు వలస వెళ్లిన వారి సంఖ్యా లక్షల్లోనే ఉంటుంది. వీరంతా స్వదేశీ పాస్ పోర్టు స్థానంలో వీరు నివసిస్తున్న దేశం పాస్ పోర్టు కోసం ప్రయత్నాలు చేసి సాధిస్తున్నారు.  తూర్పు ఆఫ్రికా, కరిబ్బియన్‌, మలేషియా, ఫిజి దేశాల్లో కూడా భారతీయులు స్థిర నివాసాలు ఏర్పరచుకున్నారు.  వీరంతా వలస పాలకుల కాలంలోనే భారతదేశం వదిలి ఇక్కడకు కార్మికులుగా చేరుకుని స్థిరపడ్డారు. విదేశాలకు వలస వెళ్లి స్థిరపడిన భారతీయుల్లో కార్మికులూ ఉన్నారు. అధికారులు ఉన్నారు. యజమానులు ఉన్నారు. సంపన్నులూ, పేదవారూ కూడా ఉన్నారు.  అయితే, వీళ్ల భవిష్యత్తు ఎలా ఉండబోతోందన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. ఆయా దేశాలలో  సమస్యలు ఉత్పన్నమైనప్పుడు అక్కడి వారి దృష్టి పడేది ప్రధానంగా ప్రవాసులపైనే.   విశేషమేమిటంటే, చాలా దేశాల్లో భారతీయులు ఘన విజయాలు సాధిస్తున్నారు. ఇక అమెరికాలో అయితే, ఇతర దేశాల సంతతికి చెందినవారిలో భారతీయులే సంపన్న వర్గంగా రికార్డులకెక్కింది. ఇంగ్లండ్‌ పోర్చుగల్‌, ఐర్లాండ మారిషస్‌ ప్రధాన మంత్రులు, గుయానా, సూరినామ్‌, ఇండొనీషియా అ ధ్యక్షులు భారతీయ సంతతికి చెందినవారే. మొత్తం మీద నాలుగు ఖండాల్లోని దేశాలలో భారతీయులే అగ్రస్థానంలో ఉన్నారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కూడా భారతీయ సంతతికి చెందిన వ్యక్తే.  అనేక దేశాల్లో అత్యంత పట్టు, పలుకుబడి కలిగిన వర్గంగా రూపాంతరం చెందిన భారతీయులు భారత్‌కు, ఇతర దేశాలకు మధ్య భౌగోళికంగానే కాక, రాజ కీయంగా, ఆర్థికంగా కూడా ఓ బలమైన వారధిగా పనిచేయడం కద్దు.  ఇలా ఎన్నిసానుకూలతలు ఉన్నా అందే ఆందోళన కర విషయాలు కూడా ఉన్నాయి.  ప్రతి ఏటా కనీసం లక్షమంది భారతీయులు తమ భారతీయ పౌరసత్వాన్ని వదులుకుంటున్నారు. 2022లో మొదటి పది నెలల కాలంలోనే ఈ సంఖ్య లక్షా 83 వేలు దాటింది. హెన్లీ అండ్‌ పార్ట్నర్స్‌ అనే ప్రసిద్ధ కన్సల్టెన్సీ సంస్థ అందజేసిన వివరాల ప్రకారం, గత ఏడాది సుమారు 8,000 మంది భారతీయ కుబేరులు భారతదేశ పౌరస త్వానికి స్వస్తి పలికారు. అంతేకాదు, సంపన్న భారతీయుల్లో ఎక్కువ మంది విదేశాల్లో పెట్టుబడులు పెట్టడం జరుగుతోంది. భారత దేశ ఆర్థిక వ్యవస్థ మీద విశ్వాసం సడలిపోవడమే ఇందుకు ముఖ్యంకారణంగా చెబుతున్నారు.  దేశంలో రాజకీయ పరిస్థితులు, ఆర్ధిక విధానాలు కారణంగానే తాము దేశం విడిచి వెళ్లడానికి కారణమని కూడా అత్యధికులు చెబుతున్నారు. 

రణస్థలి నినాదం.. ఆఇద్దరి పొత్తు పక్కా !

ఆదర్శాలు ఎన్నున్నా చివరకు రాజకీయాలలో అందరి గమ్యం ఒక్కటే. అందుకు పవన్ కళ్యాణ్ మినహాయింపు కాదు. అవును పవన్ కళ్యాణ్  రాజకీయ అరంగేట్రం చేసి పది సంవత్సరాలు దాటిపోయింది. అయితే  ఈ పదేళ్ళలో ఆయన రాజకీయ ప్రస్థానం ఎంతవరకు వచ్చిందంటే సమాధానం చెప్పడం కష్టమే .. అయ్యవారు ఏమి చేస్తున్నారు అంటే, చేసిన తప్పులు  దిద్దుకుంటున్నారు అన్నట్లుగా ఇంతకాలం ఆయన రాజకీయ ప్రస్థానం సాగింది. అయితే, రణస్థలం యువశక్తి సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు, ఇచ్చిన వివరణలు, సంధించిన అస్త్రాలు,వదిలిన పంచులు,పవన్ కళ్యాణ్ కు  రాజకీయ తత్త్వం బోధపపడిందనేలా ఉందని  రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఒక విధంగా చూస్తే రాజకీయ పరిపక్వత స్పష్టంగా గోచరించిందని ఏపీ పొలిటికల్ రోడ్ మ్యాప్ ను క్లియర్ చేసిందని అంటున్నారు. ముఖ్యంగా టీడీపీతో పొత్తు  విషయంలో పవన్ కళ్యాణ్ పూర్తి క్లారిటీ ఇచ్చారని  అంటున్నారు.  పొత్తుల విషయంలో ఇంతవరకు కొంత మేర అటూ ఇటూ కాకుండా ఉన్న పవన్ కళ్యాణ్, రణస్థలంలో కుండ బద్దలు కొట్టేశారు. ఒంటరిగా పోటీచేసి వీర మరణం పొందవలసిన అవసరం లేదని. అక్కర్లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒంటరిగా గెలుస్తామంటే, పొత్తులు లేకుండానే పోదాం కానీ అది నేల విడిచి సాము చేయడమే అవుతుందని చెప్పకనే చెప్పారు.  మీరు అండగా వుంటానని గ్యారెంటీ ఇస్తారా అని పవన్  జన సైనికులను ప్రశ్నించారు. ఇప్పుడు ఓకే అని చెప్పి ఎన్నికలు అనగానే మా వాడు, మా కులం అని అంటే కుదరదని ఆయన తేల్చిచెప్పారు. తాను జైనసైనికులను కుటుంబం అనుకున్నానని..  తన ఫ్యామిలీయే వదిలేస్తే తాను ఏం చేయాలని ప్రశ్నించారు. కొన్నిసార్లు ప్రత్యర్ధులని కూడా కలుపుకుని పోవాలని ఆయన వ్యాఖ్యానించారు.  ఈ వ్యాఖ్యలు ఆయనలోని పరిపక్వతకు అద్దం పడుతున్నాయని రాజకీయ పండితులు, అంటున్నారు.  నిజానికి రాజకీయాలలో ఆశయాలు, ఆదర్శాలు ఎంత అవసరమో, అవి నెరవేరే మార్గాలను ఎంచుకోవడం కూడా అంతే  అవసరమని అంటున్నారు.  ఈ నేపధ్యంలో  అందరినీ హింసించే ఒక్కడిని ఎదుర్కోవాలంటే అందరూ కలవాలని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్య ఎంతో అలోచించి చేసిన వ్యాఖ్యగా పరిశీలకులు పేర్కొంటున్నారు.  గతంలోను అనేక  సందర్భాలలో దుష్ట సంహారం కోసం రాజకీయ, సైద్ధాంతిక విభేదాలను పక్క పెట్టి రాజకీయ పార్టీలు ఏకం అయిన సందర్భాలున్నాయని పరిశీలకులుఅంటున్నారు. ఇందిరా గాంధీ  అధికార దాహంలో ‘హిట్లరమ్మ’ (నియంత)లా మారి దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో ఉత్తర దక్షిణ దృవాల వంటి పార్టీలు ఏకమై ఇందిరను ఓడించిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నారు. అలాగే  ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని అప్రజాస్వామికంగా కూల్చి వేసినప్పుడు,ఎన్టీఆర్ కు బీజేపీ, వామపక్షాలు కుడి ఎడమన నిలిచి ప్రజాస్వామ్యాన్ని రక్షించారని గుర్తు చేస్తున్నారు. అలాగే ఇప్పడు ఏపీలో సాగుతున్న జగన్ రెడ్డి అరాచక పాలన నుంచి రాష్ట్రాన్ని దేశాన్ని రక్షించేందుకు తెలుగు దేశం పార్టీతో కలిసి పనిచేయాలని జనసేన నిర్ణయం తీసుకుంటే అది తప్పు కాదని, ఒక విధంగా అది ఒక చారిత్రక అవసరమని రాజకీయ పండితులు అంటున్నారు.  అలాగే  ఇటీవల తాను తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుని కలిసిన సంధర్బంలో వైసీపీ నాయకులు వ్యక్త పరిచిన ఉలికి పాటును ప్రస్తావిస్తూ బేరాలు కుదిరిపోయాయని వైసీపీ నేతలు పిచ్చి కూతలు కూస్తున్నారంటూ పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో పోలీసులు తనను వేధిస్తే.. చంద్రబాబు తన కోసం వచ్చి నిలబడ్డారని పవన్ తెలిపారు. అందుకే ఆయన దగ్గరికి వెళ్లి సంఘీభావం ప్రకటించానని ఆయన చెప్పారు. అలాగే, ఆ రెండున్నర గంటల్లో  ఏఏ అంశాలు చర్చించింది, వ్యగ్యం జోడించి వివరించిన పవన్ కళ్యాణ్ సీట్ల గురించి ప్రస్తావించ లేదని చెప్పారు. అదే సమయంలో వైసీపీని ఓడించేందుకు ప్రతిపక్షాలు కలిసి పోటీ చేయక తప్పదని  స్పష్టం చేశారు, ఈ సందర్భంగా గత ఎన్నికల్లో జన సేనకు 6.9 శాతం ఓట్లు పోలయినా, ఒక్క సీటూ రాలేదని, మరో వంక టీడీపీ, జనసేన మధ్య ఓట్ల చీలిక వలన 53 నియోజక వర్గాల్లో వైసీపీ, ‘సాంకేతిక’ విజయం సాధించిందని వివరించారు. ఈసారి  ఆ తప్పు జరగని వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తానని మరో మారు .. స్పష్టం చేశారు. దీంతో టీడీపీ, జనసేన పొత్తును పవన్ కళ్యాన్ పక్కా చేశారని పరిశీలకులు పేర్కొంటున్నారు.

తెలంగాణ సీఎంకు ఏపీ పై ఎందుకంత ప్రేమ ?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనగానే, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన అలుపెరగని పోరాటం గుర్తుకొస్తుంది. ఆయన లేకుంటే తెలంగాణ ఉద్యమం లేదు, అసలు తెలంగాణ లేదు. తెలంగాణ అస్తిత్వ వాదాన్ని ఆయుధంగా చేసుకుని, చావు నోట్లో తల పెట్టి, పోరాడి తెలంగాణ సాధించారు కేసీఆర్. పుష్కర కాలంపైగా సాగిన తెలంగాణ మలిదశ ఆందోళనకు కర్త, కర్మ, క్రియా అన్నీ ఆయనే.(అవును ఆయనే లేకుంటే 1200 మంది యువకుల బలిదానాలు ఉండేవి కాదు, ఆ 1200 బలిదానాలు లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు, తెలంగాణ రాకుంటే లిక్కర్ స్కాములు, వందల వేల కోట్లకు పడగలెత్తిన కుటుంబాలు ఉండేవి కాదని, కొందరు చేస్తున్న వాదనలో నిజం ఉంటే ఉండొచ్చు కానీ అది వేరే విషయం)  అయితే ఇప్పుడు అదే కేసేఆర్, తెలంగాణ పేరు చెప్పుకుని  జాతీయ స్థాయిలో రాజకీయం చేసేందుకు  బాటలు వేసుకుంటున్నారు. ఆ క్రమంలో అప్పట్లో ఆంధ్ర ప్రాంత ప్రజలను ఆంధ్ర ప్రాంత పాలకులను అనేక విధాల దూషించిన ఆయన ఈరోజు తెలంగాణ కంటే ఏపీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. చివరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియామకంలోనూ ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ కుల సమీకరణలు పనిచేశాయని అంటున్నారు. నిజానికి, మూడు రోజుల క్రితం  శాంతికుమారిని  సీఎస్‌గా నియమించిన వెంటనే ఏపీ బీఆర్‌ఎస్‌ నేతలు ప్రగతిభవన్ కు వెళ్లి అభినందించారు.  కేసీఆర్‌తో పాటు కొత్త సీఎస్‌, ఏపీ బీఆర్‌ఎస్‌ నేతలు ఉన్న ఫొటోలను సీఎంవోనే రిలీజ్‌ చేసింది. అప్పటి వరకు తెలంగాణకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు కొత్త సీఎస్‌ను కలువనే లేదు. కానీ ఏపీ నేతలు మాత్రం ఫోటోలు దిగారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  అంతే కాదు  ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్లుగా తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలకే  డైరెక్ట్ ఎంట్రీ లేని ప్రగతి భవన్ లోకి బీఆర్ఎస్ ఆంధ్రా నేతలకు మాత్రం ఎప్పుడంటే అప్పడు వచ్చి పోయే విధంగా బ్లాంకెట్ పర్మిషన్ ఇచ్చారని అంటున్నారు. ఆంధ్రా నాయకులకు ఎప్పుడు అనుకుంటే అప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి  కేసీఆర్‌ అపాయింట్‌మెంట్‌ దొరుకుతుందని అంటున్నారు. నిజానికి  ప్రగతి భవన్ గేట్లు తెరుచుకునేందుకు, ‘ఏపీ బీఆర్ఎస్’ పాస్ వర్డ్ గా  మారిందని అంటున్నారు.   నిజానికి  జాతీయ ఆలోచనలు మొగ్గతొడిగిన నాటి నుంచి కేసీఆర్  కు ప్రాధాన్యతలు మారి పోయాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గడచిన ఎనిమిదేళ్ళలో  ఇంచుమించుగా మూడు వేలకు మందికి పైగా తెలంగాణ రైతులు  అందులో అధిక శాతం కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆయినా అందులో సగం కుటుంబాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం  ఉదారంగా కాదు చట్టపరంగా ఇవ్వవలసిన నష్ట పరిహారం కూడా ఇవ్వలేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.  అయినా, ముఖ్యమంత్రి కేసేఅర్ పంజాబ్, బీహార్, జార్ఖండ్  రాష్ట్రాలలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు ఉదారంగా ఆర్థిక సహాయం అందించి వచ్చారు.  అంత కంటే మరింత ఉదారంగా భాషా భేదం,  ప్రాంతీయ భేదం లేకుండా దేశంలోని జాతీయ, ప్రాంతీయ పత్రికలు అన్నింటిలో  పెద్ద ఎత్తున ప్రకటనలు (అడ్వర్ టైజ్ మెంట్లు) ఇచ్చి ప్రచారం చేసుకున్నారు.  అలాగే  దేశంలో రైతు నాయకులుగా చలామణి అవుతున్న కొందరు రైతు నాయకులను చర్చల పేరిట హైదరాబాద్ కు పిలిచి సన్మానాలు చేసి పంపించారు. కానీ, ఆ చర్చలలో రాష్ట్రానికి చెందిన రైతు నాయకులకు మాత్రం స్థానం కల్పించలేదు. అందుకే ముఖ్యమంత్రి కొత్త అడుగుల విషయంలో పలు అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. ముఖ్యంగా ఏపీ విషయంలో ముఖ్యమంత్రి చూపుతున్న ప్రత్యేక ప్రేమ విషయంలో రకరకాల అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. అలాగే, ముఖ్యమంత్రి అడుగుల వెనక దీర్ఘకాలిక వ్యూహం  ఉందని  అంటున్నారు.