మనిషికి పొటాషియం పెరిగితే ఏమవుతుంది?

పొటాషియం మన శరీరానికి అత్యవసరమైన అల్కలైట్ అదే సోడియం పొటాషియం  ఎలక్ట్రో లైట్స్ ఎక్కువైనా ఇబ్బందే తక్కువైనా ఇబ్బందే అని అంటున్నారు నిపుణులు.ఒక కేస్ స్టడీ లో శరీరం లో చోటుచేసుకున్న పరిణామాల వల్ల ఒక్కో సారి పొటాషియం ఎక్కువైతే పాక్షవాతం,లేదా గుండె పోటు కు కూడా దారి తీయవచ్చు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందుకు ఉదాహరణగా ఒక కేసును కిమ్స్ ఆసుపత్రికి చెందిన ప్రముఖ జనరల్ ఫిజీషియన్ డాక్టర్ ఎన్ పాపారావు మాట్లాడుతూ ఒక రోగి ఆసుపత్రికి వచ్చాడని కాళ్ళు కదపలేని స్థితిలో ఉన్నాడని అసలు కాలు కదపడం లేదంటే ఏదైనా న్యూరో సమస్య ఉండి ఉండవచ్చని భావించి ఎం అర్ ఐ స్పైన్ బ్రెయిన్ స్కాన్  పరీక్షలు  చేయించా మని అక్కడ ఏ రకమైన సమస్య బయట పడలేదని అయితే  ఇక మిగిలింది రక్త పరీక్ష చేయించగా రక్తం లో పొటాషియం శాతం ఎక్కువగా ఉందని గమనించి నట్లు డాక్టర్ పాపారావు వివరించారు.   ముఖ్యంగా పొటాషియం పెరగడాన్ని వైద్యులు హైపెర్ కలేమియా గా నిర్ధారించా మని తెలిపారు.కాగా పొటాషియం లెవెల్స్ రక్త్గం లో  పెరగడం వల్ల అది కార్డియో వాస్క్యులర్ అంటే గుండె రక్తనాళా లలో సమస్యలు వస్తాయని డాక్టర్ పాపారావుపేర్కొన్నారు.ఒక్కో సారి పొటాషియం ప్రతి వ్యక్తికి 4,7౦౦ ఎం  జి తీసుకోవాల్సి ఉంటుందని పాపారావు వివరించారు.ప్రతి గంటకు పొటాషియం శాతం మానీటర్ చేస్తూ పొటాషియం పెరగడం వల్ల వచ్చే ఇతర సమస్యలు రాకుండా నిత్యం నిపుణులైన విద్యుల పర్య వేక్షణలో ఉండాలని సూచించారు.పొటాషియం పెరగడం వల్ల కిడ్నీ ఫెయిల్ యుర్ కు దారి తీసే అవకాశం ఉందని హెచ్చరించారుహై పర్ కేల్మియా వల్ల కిడ్నీ పనుచేయదని కిడ్నీ సరిగా పనిచేయకుంటే శరీరం నుండి పొటాషియం తొలగించలేదని అన్నారు కాగా హైపర్ కెల్మియా చాలా సహజమైన సమస్య అని అన్నారు వాస్తవానికి కిడ్నీ పొటాషియం ను నియంత్రిస్తుంది.అలాగే శరీరాన్ని పొటాషియం ను సమతౌ లయం గా ఉంచుతుంది. కిడ్నీ సరిగా పనిచేయానట్లితే అదనపు పొటాషియం ఫిల్టర్ చేయాలేదు.రక్తం లో చేరిన పొటాషియం తొలగించలేదు.కిడ్నీ లోని ఆల్టో స్టేరాన్ ఎప్పుడు పొటాషియం ను తొలగించాలో చెబుతుంది.ఒక వేళ ఆల్టో స్టేరాన్ ఉత్పత్తి తగ్గితే అడిసన్స్, వ్యాధి సోకే అవకాశం ఉందని.అది హైపర్ కేల్మియా కు దారి తీస్తుందని నిపుణులు స్పష్టం చేసారు. హైపెర్ కీల్మియా సమస్యలు... *రక్త కణాలు పనిచేయకుండా పోవడం.హేమోలసిస్.అని అంటారు. *కండరాలు కణాలు రబ్బో మయోసిస్ వంటి సమస్య వస్తుంది. *కాళ్ళలో మంటలు కణాలు ప్రమాదం బారిన పడతాయి. *డయాబెటీస్ నియంత్రణ సాధ్యం కాదని నిపుణులు పేర్కొన్నారు.        రక్తనాళా లలో పొటాషియం శాతం పెరిగితే మూత్ర నాళం ద్వారా బయటికి పోతుందని అయితే పొటాషియం పెరగడం వల్ల అలసట నాజియా గుండె హృదయ స్పందనలో హెచ్చు తగ్గులు ఉంటాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.కాగా పొటాషియం వల్ల కండరాలలో నొప్పులు అలాగే పాక్షవాతానికి దారి తీస్తుందని డాక్టర్ పాపారావు వెల్లడించారు.కాగా కాళ్ళు వేళ్ళు స్పర్స కోల్పోవడం,పొట్టలో పట్టి నట్లు గా ఉండడం.విరేచనాలు,కళ్ళు తిరగడం వంటి సమస్యలు తలేత్తుతాయాని పొటాషియం సమస్యను సకాలం లో గుర్తించ కుంటే రోగులు కోమాలోకి చేరతారని ఈ విషయాన్ని పూర్తిగా గమనించాలని తగిన విధమైన చికిత్స సకాలం లో అందిస్తే రోగిని తీవ్రత నుండి కాపాడ వచ్చని డాక్టర్ పాపారావు స్పష్టం చేసారు. ఆహారం లో పొటాషియం తగ్గడం వల్ల మరిన్ని సమస్యలు వస్తాయని తెలిపారు.ఒక్కో సారి కిడ్నీద్వారా ఫిల్టర్ కావాల్సిన రక్తం  పనిచేయకుంటే డయాలసిస్ చేయాల్సి ఉంటుందని. నిపుణులు పేర్కొన్నారుఅదనంగా వచ్చి చేరిన పొటాషియం తగ్గించాలంటే .పొటాషియం బైన్ డర్స్ వినియోగించాల్సి ఉంటుందని తెలిపారు.లేదా బీటా బ్లాకర్స్ వాడాల్సి ఉంటుంది. శరీరానికి కావాల్సిన పొటాషియంఅంటే సమతౌల్యం గా ఉండాలంటే. అవకాడో, టమాటా, ఆలు, కొత్తిమీర,పాలకూర కివి పళ్ళు,అరటి పళ్ళు,వంటివి మన శరీరంలో పొటాషియం  ను సమతౌల్యం లో ఉంచుతాయి.                                           

పసుపు పాలు ఎవరు ఎలా తాగాలి? ఎలా తాగితే మంచి బెనిఫిట్స్ ఉంటాయంటే..

పసుపు పాలు రోజూ తాగడం వల్ల శరీరానికి బలం చేకూరుతుందని పెద్దలు చెప్పడం మీరు వినే ఉంటారు. పసుపును ఆయుర్వేదంలో ఔషధంగా ఉపయోగిస్తారు. ఇది సహజ యాంటీబయాటిక్గా పరిగణించబడుతుంది. అయితే కాల్షియం, ప్రోటీన్ తో సహా  అనేక విటమిన్లు పాలలో ఉంటాయి. పసిపిల్లల నుండి వృద్దుల వరకు పాలు తాగడం ఎంతో అవసరమని వైద్యులు ఎన్నో ఏళ్ళ నుండి చెబుతూనే ఉన్నారు. ఇలా ఔషద గుణం కలిసిన పసుపు, ఆరోగ్యం చేకూర్చే పాలు రెండింటిని కలిపి తాగడం వల్ల ఆరోగ్యానికి డబుల్ ప్రయోజనాలు పొందవచ్చని సాధారణంగా చెబుతూనే ఉంటారు. ముఖ్యంగా పసుపు పాలు తాగితే ఇమ్యూనిటీ పెరుగుతుందనే నమ్మకం ఉంది. అది నిజం కూడా.. కానీ రోజూ  రాత్రి పడుకునే ముందు పసుపు పాలు తాగితే ఇమ్యూనిటి మాత్రమే కాదు ఇంకా బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలిస్తే ఈ రోజు నుండే రాత్రి పూట పసుపుపాలు తాగడం మొదలెట్టేస్తారు. పసుపు పాలను గోల్డెన్ మిల్క్ అని పిలుస్తారంటే దాని రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.  ఏ సమస్య ఉన్నవారు పసుపు పాలను ఎలా తయారుచేసుకోవాలో.. పసుపుపాలు కేవలం ఇమ్యూనిటికే కాకుండా ఇంకా ఏ ప్రయోజనాలు చేకూరుస్తుందో తెలుసుకుంటే.. రాత్రిపూట నిద్ర సంబంధ సమస్యలతో బాధపడేవారు పసుపు పాలు తాగాలని కొందరు సలహా ఇస్తారు.  ప్రశాంతంగా నిద్రపోవాలనుకుంటే, రోజూ రాత్రిపూట ఒక గ్లాసు పసుపు పాలు తాగాలి. ఇది  బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.  పసుపు రోగనిరోధక శక్తిని పెంచుతుందనే విషయం అందరికీ తెలిసిందే. రాత్రి పూట పసుపు పాలు తాగడం  ద్వారా దగ్గు, జలుబు , జ్వరం వంటి సమస్యలు  నివారించవచ్చు. బోలెడు వ్యాధుల నుండి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.  సీజన్ ఏదైనా  తప్పనిసరిగా పసుపు పాలు తాగడం మంచిది. పసుపులో శక్తివంతమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. కీళ్ల నొప్పులతో బాధపడే వారికి పసుపు పాలు దివ్యౌషధం. ఇది వాపు,  నొప్పి నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. అందుకే ప్రతిరోజు పసుపు పాలు తాగుతుంటే కీళ్ళు, ఎముకల సమస్యలు మెల్లిగా తగ్గుతాయి. పసుపును వందల ఏళ్ళ నుండి  చర్మ సంరక్షణలో  ఉపయోగిస్తున్నారు. ఇది చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.  హానికరమైన బ్యాక్టీరియాను తొలగిస్తుంది. పసుపు పాలు తీసుకోవడం వల్ల  చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా మారుతుంది. ఏ సమస్య ఉన్నవారు పసుపు పాలు ఎలా తాగాలంటే.. సాధారణంగా ఇమ్యునిటీ కోసం తాగాలని అనుకుంటే ముందుగా పాలు మరిగించాలి. రుచికి చిటికెడు పసుపు, పంచదార లేదా బెల్లం  జోడించాలి. అసలు తీపి జోడించకపోయినా పర్లేదు. పడుకునే ముందు వేడిగా లేదా గోరువెచ్చగా తాగాలి.  మధుమేహం, గుండె జబ్బులు, కీళ్ల నొప్పులు ఉన్నవారు పసుపు పాలలో  చిటికెడు జాజికాయ కూడా  కలిపి తాగవచ్చు. ఇది చక్కగా పనిచేస్తుంది. థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు  పసుపు పాలు తయారుచేసేటప్పుడు  కొన్ని జీడిపప్పులను కూడా కలుపుకోవచ్చు. లేదంటే జీడిపప్పు పొడిగా చేసి పాలు మరిగేటప్పుడు కొద్దగా జోడించవచ్చు. పసుపు పాలలో చిటికెడు నల్ల మిరియాల పొడి వేసి మరిగించి తాగితే   గొంతు నొప్పి,  ఇన్ఫెక్షన్‌లు తగ్గుతాయి.                                                *నిశ్శబ్ద.

షుగర్ వ్యాధిగ్రస్తులకు గుమ్మడి గింజల మేలు తెలుసా...

గుమ్మడి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ గుమ్మడి గింజల వల్ల కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా?  పరిమాణంలో చిన్నవే అయినప్పటికీ, ఈ చిన్న గింజల్లో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు చాలా పెద్దవి. సాధారణంగా మనమందరం గుమ్మడికాయను సాంబారుకు వాడేటపుడు గింజలను పక్కన పెట్టి చెత్తబుట్టలో వేస్తాం! కానీ గుమ్మడి గింజల్లో ఉండే విటమిన్లు, ప్రొటిన్లు, మినరల్స్ గురించి తెలుస్తే...గింజలను తప్పకుండా డైట్ లో చేర్చుకుంటారు. ముఖ్యంగా మధుమేహవ్యాధిగ్రస్తులు, అధిక బీపీతో బాధపడేవారికి గుమ్మడి గింజలు ఎంతో మేలు చేస్తాయి.  గుమ్మడి గింజలను తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో చూద్దాం... అధిక బీపీ:   ఈ రోజుల్లో, రక్తపోటు వ్యాధి సాధారణంగా 30 సంవత్సరాల వయస్సు ఉన్నవారిలో కనిపిస్తుంది. ఒక్కసారి ఈ వ్యాధి వచ్చిందంటే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ప్రధానంగా శరీరంలోని ప్రధాన అవయవాలు ప్రభావితమవుతాయి. అన్నింటికీ మించి, గుండె కొట్టుకునే పని సామర్థ్యంలో కూడా హెచ్చుతగ్గులు ఉంటాయి. కాలేయం ప్రభావం చూపుతుంది. రక్తపోటు వల్ల మన శరీరంలోని కిడ్నీలు కూడా దెబ్బతింటాయి. అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్న వారు డాక్టర్ సూచించిన మాత్రలు వేసుకోవడంతో పాటు గుమ్మడి గింజలను క్రమం తప్పకుండా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. రక్తపోటు అదుపులో ఉంటే గుండె ఆరోగ్యం కూడా బాగుంటుంది. మధుమేహం ఉన్నవారికి: రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి గుమ్మడికాయ గింజలు సహాయపడతాయి! డయాబెటిస్‌తో బాధపడుతున్న చాలా మందికి భోజనం లేదా అల్పాహారం తర్వాత అకస్మాత్తుగా చక్కెర స్థాయి పెరగడం సమస్యగా మారుతుంది. ఈ సమస్య ఉన్నవారు గుమ్మడి గింజలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం మంచిది. ఈ చిన్న గింజల్లో ఉండే ఆరోగ్యకరమైన మూలకాలు మనం తినే ఆహారంలో చక్కెర కంటెంట్, అధిక మొత్తంలో కార్బోహైడ్రేట్లను ప్రాసెస్ చేస్తాయి. శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రణలో ఉంచుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. గుండెకు మంచిది: ఈ చిన్న గింజల్లో వెజిటబుల్ ప్రొటీన్, మెగ్నీషియం, జింక్,  ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ప్రధానంగా శరీర రక్తంలో మంచి కొలెస్ట్రాల్‌ను పెంచే మోనోశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్‌లు కూడా అధిక స్థాయిలో ఉంటాయి. ఈ కారకాలన్నీ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడతాయి. మరీ ముఖ్యంగా, గుమ్మడికాయ గింజల్లో నైట్రిక్ ఆక్సైడ్ పుష్కలంగా ఉన్నందున, ఇది హృదయ స్పందన పనితీరుతో ఎటువంటి సమస్యలు లేవని నిర్ధారిస్తుంది. గుమ్మడికాయ గింజలను ఎలా తినాలి? వేయించిన గుమ్మడి గింజలను తినడం నిజంగా ఆరోగ్యకరమైనది. అయితే దీనికి ఉప్పును కలపకూడదు. ఎందుకంటే ఉప్పు గుండె ఆరోగ్యానికి మంచిది కాదు. మీరు సాయంత్రం స్నాక్స్ సమయంలో కొన్ని వేయించిన గుమ్మడి గింజలను తినడం అలవాటు చేసుకుంటే, అది చాలా మంచిది

విటమిన్ బి 12 క్యాన్సర్ ముప్పు?

విటమిన్ బి 12 అధికంగా వాడడం వల్ల ఊపిరి తిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని పరిశోదనలు వెల్లడిస్తున్నాయి. 1 )విటమిన్ బి సహజంగా జంతువుల ఉత్పత్తుల నుండే లభిస్తుంది. ఎవరైతే సప్లిమెంత్స్ వాడుతున్నారో వారికి ఆశ్చర్యాన్ని కలిగించి ఉండవచ్చు. ఇది మనం కళ్ళు తెరవాల్సిన విషయం శాస్త్రజ్ఞులు 7౦,౦౦౦ మంది పై చేసిన పరిశోదనలో విటమినలో విటమిన్ బి వల్ల ఊపిరి తిత్తుల క్యాన్సర్ కు ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. 2)విటమిన్ బి గురించి చేసిన పరిశోదన ఏం చెపుతోంది? విటమిన్ బి పై చేసిన పరిశోదన క్లినికల్ ఆంకాలజీ లో ప్రచురించారు.విటమిన్ బి6 విటమిన్12 సప్లిమెంట్ ను వాడడం.మల్టి విటమిన్ ౩౦% నుండి 4౦%ఊపిరి తిత్తుల క్యాన్సర్ పురుషులకు వస్తుందని.బి6 బి12 వాడకం ఫోలేట్ లంగ్ క్యాన్సర్ రిస్క్ స్త్రీలలో ఉంటుందని అంటున్నారు. ౩) 2౦2౦ లో    లంగ్ క్యాన్సర్ 2 మిలియన్ల ప్రజల ప్రాణాలను హరించింది... ప్రపంచ ఆరోగ్య సంస్థ అందించిన వివరాల ప్రకారం 2౦2౦ లో 2 మిలియన్ల ప్రజలు ఊపిరి తిత్తుల క్యాన్సర్ తో మరణించారని. గణాంకాలు వెల్లడించింది.ఆ సంవత్సరం లో క్యాన్సర్ తో మరణించిన వారి సాంఖ్య అధికంగా ఉందని అదే సంవత్సరం లో 2.21 మిలియన్లు గా ఉందని అది బ్రస్ట్ క్యాన్సర్ తో మరణించారని.భారత్ లో లంగ్ క్యాన్సర్ సంఖ్య ఎక్కువే అని 59% అన్నిరకాల క్యాన్సర్స్ కాగా 8.1%క్యాన్సర్ మరణాలు జరిగాయని ఇది ఆందోళన కరమని డబ్ల్యు హెచ్ ఓ అభిప్రాయ పడింది. 4)విటమిన్B1 ఎంత కావాలి? శరీరానికి విటమిన్ బి1ఎంత మోతాదులో వాడాలి అన్నది మరో ప్రశ్న. విటమిన్ బి1- 1.5 ఎం జి. విటమిన్ బి2 -1.7 ఎం జి వాడాలని సూచించారు. 5)గుర్తుంచుకోవాల్సిన అంశాలు... పరిశోదనలో పాల్గొన్న చాలామంది యు ఎస్ సూచించిన దానికన్నా విటమిన్ బి1 అధికంగా వాడారని. విటమున్ బి12 వాడిన వారిలో డి ఎన్ ఏ యు ఎస్ లో మార్పులు జీన్స్ లో మార్పులు నిలకడగా లేవని కార్సినో జనసిస్ నిలకడగా లేకపోవడాన్ని గమనించినట్లు గమనించా మని శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. ముఖ్యంగా పొగ తాగే వాళ్ళు,విటమిన్ బి ,విటమున్ బి12 వల్ల ఊపిరి తిత్తుల క్యాన్సర్  పెరుగుతుందని పరిశోదనలో వెల్లడించారు. 

కడుపు ఉబ్బరానికి అసలు కారణాలు ఇవే...

ఈకాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య ఏదైనా ఉందంటే అది జీర్ణానికి సంబంధించినదే ఎక్కువ. చాలామంది తమకు తిన్న ఆహారం జీర్ణం కావడం లేదని, కడుపు ఉబ్బరంగా ఉంటుందని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అయితే ఇలాంటి సమస్య ఎందుకు వస్తుంది?? ఇలాంటి సమస్య ఉన్నవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి వంటి విషయాలు తెలుసుకుంటే ఈ సమస్యను అధిగమించడం పెద్ద సమస్య ఏమి కాదు.  మొదటగా కడుపు ఉబ్బరం సమస్య ఎందుకు వస్తుందో తెలుసుకుందాం. కడుపు ఉబ్బరం రావడానికి గల కారణాలు:-  మలబద్దకం సాధారణంగా మలబద్దకం సమస్య ఉన్నవారిలో కడుపు ఉబ్బరం వచ్చే అవకాశాలు ఎక్కువ. మలవిసర్జన అనేది సరిగా జరగకపోతే అది కడుపులో పేగుల మధ్య గట్టిగా మారిపోయి జీర్ణవ్యవస్థను గందరగోళం చేస్తుంది. తిన్న ఆహారం తింటూనే ఉంటే ఒకవైపు మలవిసర్జన కూడా దానికి తగ్గట్టు జరిగిపోతుండాలి. లేకపోతే కడుపులో వాయువులు, వ్యర్థాలు పెరిగి అది ఉబ్బరానికి దారితీస్తుంది. వేగంగా తినేవారికి ఆహారాన్ని మెల్లగా బాగా నమిలి తినాలి. అలా చేస్తే ఆహారం చాలావరకు పిండి పదార్థంగా మారి జీర్ణశయంలోకి వెళుతుంది. అప్పుడు జీర్ణ రసాలు తగినంత ఉత్పత్తి అయ్యి ఎంతో సులువుగా జీర్ణక్రియ జరుగుతుంది. కానీ చాలామంది పరిగెత్తాలనే తొందర ఉన్నట్టు వేగంగా తింటారు. దీనివల్ల ఆకుకూరలు, కూరగాయలు, పప్పు దినుసులు సరైన విధంగా జీర్ణక్రియకు అనువుగా ఉండవు. ఫలితంగా కడుపు ఉబ్బరం చోటుచేసుకుంటుంది. దంత సమస్యలు ఉన్నవారిలో దంతాల సమస్యకు కడుపు ఉబ్బరానికి సంబంధం ఏమిటి అని చాలా మంది అనుకుంటారు. అయితే దంతాల సమస్య ఉన్నవారిలో  రక్తం కారుతూ ఉంటుంది. ఇది బాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల కలిగే సమస్య. ఇలా దంతాల వద్ద రక్తం కారడం జరిగినప్పుడు సహజంగా  తినే పదార్థాలతో, తాగే ద్రవాలతో కలసి జీర్ణశయం చేరుతాయి. దీనివల్ల కడుపు ఉబ్బరం సమస్య వస్తుంది. ఆహార వేళలు ఆహారం తీసుకోవడమే కాదు, ఆహార వేళలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి. అస్తవ్యస్తమైన ఆహార వేళలు పాటించడం వల్ల జీర్ణశయం తీరు సరిగా ఉండదు. ఈ కారణం వల్ల కడుపు ఉబ్బరం వస్తుంది. నోటి శుభ్రత జీర్ణాశయనికి సంబంధించి ఏ సమస్యకు అయినా ఎక్కువ శాతం నోటి శుభ్రత ప్రధాన పాత్ర పోషిస్తుంది. నోరు సరిగా శుభ్రం చేసుకోకుండా తినడం, తాగడం చేస్తే నోటిలో ఏర్పడ్డ బాక్టీరియా జీర్ణ వ్యవస్థ మీద ప్రభావం చూపిస్తుంది.  పై కారణాల వల్ల కడుపు ఉబ్బరం వచ్చే అవకాశం ఉంది. కడుపు ఉబ్బరం పరిష్కారానికి తీసుకోవలసిన జాగ్రత్తలు.. ఆహారం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా నమిలి తినాలి. దీనివల్ల ఆహారం జీర్ణం అవడంలో ఎలాంటి సమస్యా ఉండదు.  కడుపు ఉబ్బరం సమస్య వేధిస్తున్నప్పుడు గ్లాసుడు మజ్జిగలో కొద్దిగా నిమ్మరసం కలిపి తాగాలి. రోజులో రెండు నుండి మూడు సార్లు ఇలా చేస్తుంటే సమస్య తగ్గిపోతుంది.  దంతాల సమస్యలు ఉన్నవారిలో ఆహారం నమలడం కాస్త ఇబ్బందిగా ఉంటుంది. దీనివల్ల ఆహారాన్ని పూర్తిగా నమలకుండా మింగేస్తుంటారు. కాబట్టి ఆ సమస్యలకు వైద్యులను సంప్రదించి సమస్యను పరిష్కరించుకోవాలి. నోటి శుభ్రత లేకుండా ఆహారం తీసుకోకూడదు. పండ్లు, భోజనం, బేకరీ పదార్థాలు అన్ని కలిపి ఒక్కసారి తీసుకోకూడదు. కొన్ని పదార్థాలు చాలా సులాభంగానూ, మరికొన్ని అలస్యంగానూ జీర్ణమయ్యే వాటిని కలిపి తీసుకుంటే జీర్ణవ్యవస్థ అస్తవ్యస్తం అవుతుంది.  కడుపు ఉబ్బరానికి పైన చెప్పుకున్న జాగ్రత్తసలు పాటించినా సమస్య  తగ్గకపోతే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.                                      ◆నిశ్శబ్ద.

అలసట,ఒళ్ళు నొప్పులు నివారణ!!

  శరీరం లో స్వల్పకాలిక, దీర్ఘ కాలిక ఒళ్ళు నొప్పులకు, అలసటకు అందుబాటులో ఉన్న ఇంటి చికిత్స మేలైనదని నిపుణులు చేసిన పరిశోదనలో వెల్లడించారు. శరీరంలో ప్రతి రోజూ నొప్పి వస్తుంది. అలసట మిమ్మల్ని  వేదిస్తుంటే వెంటనే సహజంగా ఇంట్లో లభించే నివారణా మార్గాలు ఉన్నాయని నిపుణులు నిపుణులు తమ పరిశోదనలో వెల్లడించారు.యూరిక్ యాసిడ్ లేదా పోషక ఆహార లోపాలు ఉండవచ్చు. ఆయా సందర్భాలాలో కండరాల్ నొప్పులు అలసట వంటి సమస్యలు సహజంగానే ఉన్నట్లు చెబుతూ ఉంటారు. అయితే ఒంటి నొప్పుల నుండి ఉపసమనం కోసం వాడే మందులు తాత్కాలికంగా ఉపసమనం మాత్రమే అని అంటున్నారు నిపుణులు. నొప్పులకోసం వాడే పెయిన్ కిల్లర్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని నిపుణులు పేర్కొన్నారు. సైడ్ ఎఫెక్ట్స్ లో భాగం గా కడుపులో తిప్పినట్లుగా ఉండడం. లేదా కడుపులో వికారం గా కూడా ఉండడం వంటివి గమనించవచ్చు. మనలను సహజంగా వేదించే ఒళ్ళు నొప్పులు అలసట కు ఇంట్లో అందుబాటులో ఉండే సహజ నివారణ ఉపాయాల ద్వారా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ తో బయట పడవచ్చని ఒక పరిశోదనలో తేలింది. ఈ పరిశోదన ద్వారా శారీరకంగా వచ్చే అలసట లేదా శరీరం సహకరించక పోవడం వల్ల వచ్చే సమస్యలకు ఉపాయాలాను నిపుణులు సూచించారు. సహజంగా ఇంట్లో లభ్యమయ్యే నివారణా ఉపాయాలు నోప్పిని నివారిస్తాయా? అంటే ఆశ్చర్యం కలిగిస్తుంది. అసలు మన శరీరం ఎదుర్కునే సమస్యలు... ఆర్తరైటిస్. బర్ సైటిస్ టిండి సైటిస్. కండరాలను అధికంగా వినియోగించడం. ఫ్లూ,లేదా ఇతర అనారోగ్యం. ఫైబ్రో మైలేజియా. ఇలాంటి సమాస్యలకు మనకు ఇంట్లో లభ్య మయ్యే నివారణ ఉపాయాలను మీరు వాడి చూడండి. ఎవరైనా సరే శరీరం సరిగా సహకరించని వారు సైతం మీకు మంచి ఫలితాలు ఇస్తాయని నిపుణులు అంటున్నారు.  పసుపు... సహజంగా మన ఇళ్ళలో ఎవరి ఇంట్లో అయినా వంటింట్లో పూజా మందిరంలో వంట గదిలో ఉండేది పసుపు. ఇంట్లో వాడే పసుపు భారాతీయుల ప్రతి వంటలలో తప్పనిసరిగా వినియోగించే స్పైస్ పసుపు. మంచి సువాసన రుచికి రుచి మంచి వైద్య మూలికకూడా. పసుపులో ఉండే కుర్కు మిన్ అనే పదార్ధం ఉన్నట్లు శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. నొప్పి నివార కల్పించడం లో పసుపు దోహదం చేస్తుంది. పసుపును టీ లో సప్లిమెంట్ గా వాడుతున్నారు. మనం అయాకాలాలలో పసుపు పొడిని కొనవచ్చు. నొప్పినివా రణలో నల్ల మిరియాలు,పసుపు వాడితే చాలా ప్రభావ వంత్గంగా పనిచేస్తుంది.  హాట్ వాటర్ ప్యాక్స్... సహజంగా ఒళ్ళు నొప్పులు ఉన్న వారిలో సాంప్రదాయంగా హాట్ వాటర్ బ్యాగ్స్, వాడడం కొన్ని ఏళ్లుగా వస్తున్న ప్రత్యామ్నాయా మార్గాలలో అదీ ఒకటి. ఇప్పుడు హాట్ వాటర్ బాటిల్స్, హీటింగ్ ప్యాడ్స్, పోత్తపైన పెట్టుకుంటే అత్యంత ప్రభావ వంతంగా పనిచేస్తుందని ముఖ్యం గా ప్రీ మెన్స్ టోరి యల్ సిండ్రోం కు హాట్ వాటర్ ప్యాడ్స్ ఉపకరిస్తాయి. ఐస్ తెరఫీ... నొప్పి నివారణకు మరో చక్కని ఉపసమన మార్గం ఐస్ క్యుబ్స్ తో ముఖ్యంగా పోస్ట్ సర్జరీ తరువాత శరీరంలో వచ్చే నొప్పులకు ఐస్ బ్యాగ్స్ లేదా ఐస్ ప్యాక్ లు వాడడం వల్ల నొప్పి నివారణకు దోహదం చేస్తుంది. ముఖ్యంగా ప్రతి ఇంట్లో నేడు ఫ్రిజ్ లేని ఇల్లి అంటూ ఉండదు. ఖర్చులేకుండా ఇంట్లోనే దొరికే ఐస్ ముక్కలతో ఐస్ బ్యాగ్ ను ఉపయోగించి వేడి చల్ల తనం నొప్పి ఉన్న ప్రాంతం లో ఐస్ బ్యాగ్ వాడడం వల్ల నోప్పులు ప్రభావ వంత మైన చికిత్స గా పేర్కొన్నారు. నిపుణులు.ముఖ్యం గా నొప్పి ఉన్న ప్రాంతం లో కదల కుండా ఉన్న శరీర భాగాల పై 2౦ నిమిషాల పాటు ఐస్ ముక్కలు పెడితే నొప్పులు తగ్గుతాయి.అని ప్రత్యామ్నాయ నివారణా పద్దతిని ఆచరించి మంచి ఫలితాలు పొందవచ్చు అంటున్నారు నిపుణులు. శరీరంలో నోప్పులు అలసట తగ్గాలంటే ఏం చేయాలి?... శరీరంలో నొప్పులు పెరగడానికి చాలా కారణాలు ఉండచ్చు. కాని శరీరానికి కావాల్సిన స్వల్ప వ్యాయామం చేయాలి చేతులు పైకి చాచడం లేదా స్ట్రెచ్ చేయడం. లేదా ద్వారా శరీరంలో నొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చు. నడవడం ఈత కొట్టడం వల్ల ప్రత్యేక లాభాలు ఉన్నాయని. ముఖ్యంగా వెన్నునొప్పి కీళ్ళ నొప్పులకు ఉపయోగ పడుతుందని అంటున్నారు నిపుణులు. ముంచేతులు భుజాలను చుట్టూ తిప్పడం వంటి వ్యాయామ ప్రక్రియ సహాయ పడతాయి. వాటి వల్ల భుజాల నొప్పులు తగ్గుతాయి. ప్రత్యామ్నాయం గా ఐస్,హీట్ తెరఫీ లు సత్వరం ఉపసమనం కలిగిస్తాయి. అలాగే జాయింట్ పెయిన్స్ జాయింట్ల లో నొప్పులు ఉన్నప్పుడు వేడి నీళ్ళ స్నానం వల్ల సత్వరం వెన్నునొప్పి పోతుంది అని సూచిస్తున్నారు నిపుణులు. అలసట నీరసం నుండి ఉపసమనం పొందాలంటే... అలసట, నీరసం శరీరంలో రావడం సహజం. దీనికి చాలా రకాల కారణాలు ఉండవచ్చు. నిద్ర లేమి, గుండె సమస్యలు, దీర్ఘ కాలంగా అలిసిపోయే ఫ్యాటి గో సిండ్రోం. అలసట కు కారణం కండరాల బలహీనత మీ శరీరాన్ని మీరే స్వీయ రక్షణ చేసుకోవాలి. అలసట నుండి బయట పడడానికి సహజమైన ఇంటి చిట్కామీ మెదడుకు శక్తి నిస్తుంది.మీ మూడ్ స్వీయరక్షణ పద్దతులు అమలు చేయాలి. *ప్రతిరోజూ వ్యాయామం చేయాలి. *ప్రతిరోజూ మంచి నిద్ర పోవడానికి అలవాటు చేసుకోవాలి. * రాత్రి పూట మందు అంటే ఆల్కాహాల్ కు దూరంగా ఉండాలి. *పౌష్టిక ఆహారం తీసుకోవాలి. *హైడ్రేడ్ కాకుండా చూసుకోవాలి. *యోగా,మెడిటేషన్ ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవాలి. కండరాల నొప్పులు అలసటకు పోష్టిక ఆహారం...పళ్ళ రసాలు.. ఇతరాలు వాటి వల్ల ఉపయోగాలు... బెర్రీ జ్యూస్... బెర్రీ జ్యూస్ లో అంతోసియానిన్స్ నీటి శాతం ఇంఫ్లా మేషన్ ను తొలగించే పదార్ధాలు ఉంటాయి.  కాఫీ... కాఫీ లో కెఫీన్ ఉంటుంది. అలసటను తాతకాలికం గా నివారిస్తుంది. కాఫీ త్వరగా సేవించడం వల్ల నిద్ర లేమి నివారించ వచ్చు. కాఫీ గుండె సమాస్యల నివారణకు కాఫీ సహకరిస్తుంది. గుడ్లు... నీరసాన్ని అలసటను తగ్గించడం లో ప్రోటీన్ ను అందించేది ఆరోగ్య కర మైన ఫ్యాట్స్ లియో సిన్,ఏమ్యినో యాసిడ్ వల్ల కండరాలలో వచ్చే క్రామ్స్ నీరసం నుండి త్వరగా కోలు కుంటాయి. నీరు... శరీరం లోని కండరాలకు నీరు అత్యవసరం. మీ శరీరం కండరాలు పైన చర్మం మాంసము తో కప్పబడి ఉంటుంది. సరైన హై డ్రేషన్ అవసరం నీటివల్లశరీరానికి ఎలక్ట్రో లైట్స్ సమం గా ఉంటాయి. కండరాలలో వచ్చే క్రామ్స్ ను నీరసాన్ని తగ్గిస్తుంది.  అరటి పండు... అరటి పండులో పొటాషియం ఎలక్ట్రో లైట్స్, మినరల్స్, పొటాషియంమీ నరాలు, కండరాలు సరిగా పనిచేసేందుకు సహక రిస్తాయి.ఇవి సరైన పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల అలసటను కొంత మేర నివారించవచ్చు అన్నది నిపుణుల సూచన ఆచరించండి ఆరోగ్యంగా ఉండండి. డాక్టర్ ను ఎప్పుడు సంప్రదించాలి?... మీ శరీరం గురించి మీకు బాగా తెలుసు ఒళ్ళు నొప్పులు త్వరాగా తగ్గవు. రోజూ దీర్ఘకాలంగా వేదిస్తునే ఉంటాయి.అప్పుడు మీరు సంప్రదించడం అవసరం. నెప్పి తీవ్రంగా ఉంటుంది. సాధారణంగా ఇంటి చికిత్సకు లొంగ కుంటే ఉపసమనం ఇవ్వకుంటే. డాక్టర్ ను సంప్రదించాలి. నిర్ధారణా పరీక్షల లోనూ బయట పడకుంటే అనీమియా రక్త హీనత డయాబెటిస్, వల్ల అలిసి పోతారు. రోజూ అలసట గా ఉండడం అంటే మీరు తీసుకున్న మందులు కూడా కావచ్చు. అప్పుడు మీ డాక్టర్ ప్రాత్యంనాయ మండులనూ సూచించవచ్చు. స్వల్పంగా ఉండే నొప్పులకు ఇంటి లో లభించే నివారణను ఉపయోగించండి మండులపై ఎల్లప్పుడూఆధార పడకండి.

ఎసిడిటీ సమస్య ఎందుకు వస్తుంది?? దీనికి జాగ్రత్తలు, నివారణలు ఏంటంటే..

ఎసిడిటీ.. దీన్ని అసిడిటీ.. ఎసిడిటీ అని సంబోస్తూ ఉంటారు. ఇది సాధారణ కడుపు సమస్యలలో ఒకటి. పేరుకు తగ్గట్టుగానే ఇది కడుపులో అధిక యాసిడ్ ఉత్పత్తి కావడం వల్ల కలిగే సమస్య. ఈ ఆమ్లం కడుపులోని గ్రంధుల ద్వారా ఉత్పత్తి అవుతుంది. ఎసిడిటీ వల్ల కడుపులో అల్సర్, గ్యాస్ట్రిక్ ఇన్ఫ్లమేషన్, అజీర్ణం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే అసిడిటీ ఎందుకు వస్తుంది? సాధారణంగా వేళతప్పిన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, మద్యపానం, ధూమపానం, ఒత్తిడి, చెడు ఆహారపు అలవాట్ల వల్ల అసిడిటీ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా మాంసాహారం, మసాలా, నూనె ఎక్కువగా ఉండే ఆహారం కూడా ఎసిడిటీని కలిగిస్తుంది. కడుపులోని గ్యాస్ట్రిక్ గ్రంధులు అదనపు యాసిడ్‌ను ఉత్పత్తి చేయడం ప్రారంభించినప్పుడు ఆమ్లత్వం ఏర్పడుతుంది. ఆహారం జీర్ణం కావడానికి యాసిడ్ అవసరం అవుతుంది. అందుకోసమే ఇది కడుపులో ఈ వ్యవస్థ కూడా ఉంది. కడుపులో ఆమ్లాకు ఎక్కువైనప్పుడు అది  సాధారణంగా మూత్రపిండాల ద్వారా శరీరం నుండి తొలగించబడుతుంది. అయితే మరీ అధికంగా ఆమ్లాలు ఉత్పత్తి అయినప్పుడు అనేక ఉదర సంబంధ సమస్యలు ఏర్పడతాయి. అసిడిటీ మందులతో నయమవుతుంది, మరీ ముఖ్యంగా దీన్ని తగ్గించుకోవడానికి ఇంటి చిట్కాలు ఎంతగానో ఉపయోగపడతాయి.  అసిడిటీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? కొన్ని సాధారణ విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే అసిడిటీని అరికట్టవచ్చు. ఈ టిప్స్ పాటించడం ఎంతో ముఖ్యం. యాసిడ్ రిఫ్లక్స్‌కు కారణమయ్యే ఆహారాలను మానేయాలి.. మసాలా, కాఫీ, కార్బోనేటేడ్ పానీయాలు, ఆమ్లాలు, కొవ్వు పదార్ధాలను నివారించాలి. ఒత్తిడి, ఆమ్లాల ఉత్పత్తిని బ్యాలెన్స్ చేసుకోవడానికి భోజనాన్ని 4-5 చిన్న భాగాలుగా విభజించి 2-3 గంటల వ్యవధిలో తినాలి.  తిన్న వెంటనే పడుకోకూడదు.. తిన్న తర్వాత పడుకోవడం చాలామంది అలవాటు. అయితే ఈ అలవాటు వల్ల ఎసిడిటీ వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి పడుకోవడానికి కనీసం 2 గంటల ముందు తినేయాలి. బరువు తగ్గడం.. అధిక కొవ్వు పొత్తికడుపు అవయవాలపై ఒత్తిడి తెస్తుంది, దీనివల్ల గ్యాస్ట్రిక్ రసాలు అన్నవాహికలోకి ప్రవహిస్తాయి. అధిక బరువు ఉన్నవారిలో ఎసిడిటీ ఎక్కువగా ఉంటుంది. సొంతంగా మందులు వాడొద్దు.. కొన్ని OTC మందులు కూడా అసిడిటీని కలిగిస్తాయి, ప్రతి డాక్టర్ రోగి పరిస్థితిని బట్టి మందులు రాసాడు. కానీ సొంత అవగాహనతో మందులు వాడితే అవి అసిడిటీ పెరగడానికి కారణం అవుతాయి. కాబట్టి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు తీసుకోకండి. కొన్ని ఇంటి చిట్కాలు.. అసిడిటీ అనిపిస్తే కింది ఇంటి చిట్కాలు ఫాలో అవ్వచ్చు.. అరటి, యాపిల్.. అరటిపండ్లు సహజంగా యాంటాసిడ్‌లను కలిగి ఉంటాయి, ఇవి అసిడిటీతో పోరాడుతాయి. పడుకునే ముందు కొన్ని ఆపిల్ ముక్కలను తినడం వల్ల గుండెల్లో మంట లేదా రిఫ్లక్స్ నుండి ఉపశమనం లభిస్తుంది. కొబ్బరి నీరు.. కొబ్బరి నీరు శరీరానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. దీన్ని తాగడం వల్ల శరీరంలోని pH స్థాయి ఆల్కలీన్‌గా మారుతుంది. కడుపులో శ్లేష్మం ఉత్పత్తి అవుతుంది. శ్లేష్మం అధిక యాసిడ్ ఉత్పత్తి తీవ్రమైన ప్రభావాల నుండి కడుపుని రక్షిస్తుంది. ఇది కాకుండా, కొబ్బరి నీళ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది కడుపుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.  ఇది కాకుండా, రోజూ తగినంత నిద్రపోవాలి.. కనీసం 7-8 గంటల నిద్ర అన్నివిధాల ఆరోగ్యం.                                  ◆నిశ్శబ్ద.

వెన్నునొప్పి నుండి ఉపశమనం లభించాలంటే ఇలా చేయండి..!

వెన్ను నొప్పి ఈ మధ్య కాలంలో చాలా సాధారణ సమస్యగా మారింది.  జీవనశైలి, ఆహారంలో మార్పులు, అధిక శ్రమ లేదా అసలు శ్రమ లేకపోవడం,  ఎక్కువసేపు కూర్చుని పని చేయడం వంటి కారణాల వల్ల వెన్నునొప్పి వస్తుంది.  మరీ ముఖ్యంగా వయసు పెరిగే కొద్ది వెన్ను నొప్పి బారిన పడుతున్నవారు చాలామంది ఉన్నారు. వెన్నునొప్పి నుండి ఉపశమనం లభించాలంటే కొన్ని టిప్స్ చాలా బాగా సహాయపడతాయి. బలాసనం.. బలాసనాన్ని వేయడానికి వజ్రాసనం భంగిమలో కూర్చోవాలి.  మోకాళ్ల మీద నుండి ముందుకు వంగి చేతులను ముందుకు చాపాలి. తలను నేలకు ఆనించి ఈ పొజిషన్ లో 20 సెకెన్లు ఉండాలి. మార్జాలాసనం.. మార్జాలాసనం వేయడం వల్ల వెన్ను నొప్పి తగ్గుతుంది.  చేతులు, మోకాల్ల పై కూర్చోవాలి.  మణికట్టును భుజాల కింద,  మోకాళ్లను తుంటి కింద ఉంచాలి.  వీపును నిటారుగా ఉంచి పిల్లి రిలాక్స్ అయ్యే పొజిషన్లో వీపును కిందకు వంచి తలను పైకెత్తాలి.  ఈ పొజిషన్లో లోతుగా శ్వాస తీసుకోవాలి. సేతు బంధాసనం.. నేలపై వెల్లికిలా పడుకోవాలి.  నడుమును పైకి, కిందకు కదుపాలి.  ఇలా చేస్తే వెన్ను నొప్పి నుండి తొందరగా ఉపశమనం ఉంటుంది.  ఇదే పొజిషన్లో వీపును పైకెత్తి పాదాల మీద శరీరాన్ని బ్యాలెన్స్ చేయాలి.  ఈ సందర్భంలో శరీర బరువు తల మీద కూడా ఉంటుంది.  ఛాతీ నుండి నడుము వరకు శరీరం పైకి లేచి ఉంటుంది.  ఈ పొజిషన్లో 20 సెకెన్లు ఉండాలి.                                      *రూపశ్రీ.

కాళ్లు చేతులలో జలదరింపు, చీమలు పాకిన ఫీలింగ్ ఉందా? ఇదే కారణం..!

  శరీరంలో అనారోగ్యం లేదా ఏదైనా లోపం ఉంటే అది వివిధ రూపాలలో బయట పడుతూ ఉంటుంది.  శరీరంలో ఎక్కడైనా ఉంటే అది ఆ ప్రాంతంలో కనిపిస్తుంది. కానీ శరీరానికి ఎంతో  అవసరమైన విటమిన్లు లోపిస్తే అది శరీరంలో మార్పులు,  లక్షణాల ద్వారా బయట పడుతుంది.  కొందరికి కాళ్లు చేతులు తరచుగా జలదరిస్తుంటాయి.  విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు,  నిద్రపోతున్నప్పుడు ఉన్నట్టుండి కాళ్లు, చేతుల మీద చీమలు పాకినట్టు, చీమలు కుట్టినట్టు, ఏదైనా పిన్నీసు తీసుకుని పొడినట్టు ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది.  ఇదంతా విటమిన్ల లోపం కారణంగా జరుగుతుందని అంటున్నారు పోషకాహార నిపుణులు. ఇంతకూ ఈ సమస్యకు కారణమయ్యే విటమిన్ ఏది? ఆ విటమిన్ ఏ ఆహారాలలో లభ్యమవుతుంది? తెలుసుకుంటే.. విటమిన్-బి12.. శరీరంలో విటమిన్-బి12 అవసరం చాలా  ఉంటుంది.  ఇది నాడీ వ్యవస్థ పనితీరుకు చాలా అవసరం.  విటమిన్-బి12 లోపిస్తే నరాల పనితీరు దెబ్బతింటుంది.  నరాల పనితీరు సరిగా లేకుండా శరీరంలో నాడీ వ్యవస్థ పనితీరు మందగిస్తుంది.  దీని కారణంగానే చేతులు, కాళ్లలో జలదరింపు,  చీమలు పాకిన ఫీలింగ్, తిమ్మిర్లు ఎదురవుతూ ఉంటాయి. విటమిన్-బి12 ఆహారాలు.. విటమిన్-బి12 పుష్కలంగా ఉన్న ఆహారాలను తీసుకోవడం ద్వారా ఈ సమస్యల నుండి బయటపడవచ్చు. మాంసాహారులు.. సాధారణంగా విటమిన్-బి12 మాంసాహారంలో ఎక్కువగా లభ్యమవుతుంది.   చేపల్లో విటమిన్-బి12 పుష్కలంగా ఉంటుంది.  సాల్మన్, సార్టినెస్, ట్రౌట్ వంటి చేపలలో విటమిన్-బి12 సమృద్దిగా ఉంటుంది.  వీటిలో వారంలో కనీసం రెండు సార్లు అయినా తీసుకోవాలి. గుడ్లు కూడా విటమిన్-బి12 ను అందిస్తాయి.  ముఖ్యంగా గుడ్లలో ఉండే పచ్చ సొనలో విటమిన్-బి12 ఉంటుంది.  దీంతోపాటు విటమిన్-బి2 కూడా ఇందులో ఉంటుంది. వారంలో కనీసం 3 లేదా 4 సార్లు  గుడ్లను ఆహారంలో తీసుకోవాలి. మాంసాహారులు విటమిన్-బి12 మెరుగ్గా పొందడానికి చికెన్ మంచి మార్గం.  వారానికి కనీసం ఒక్కసారి అయినా చికెన్ తీసుకుంటే మంచిది. శాకాహారులు.. శాకాహార ఆహారాలలో కూడా విటమిన్-బి12 లభ్యమవుతుంది. పాలలో విటమిన్-బి12 లభిస్తుంది. కేవలం విటమిన్-బి12 మాత్రమే కాకుండా ప్రోటీన్, కాల్షియం, విటమిన్-డి కూడా పాల నుండి లభిస్తాయి. విటమిన్-బి12 లోపాన్ని అధిగమించాలంటే తృణధాన్యాలు బాగా తీసుకోవాలి.  వీటిని తీసుకుంటే శరీరానికి విటమిన్-బి12 బాగా అందుతుంది. పెరుగును ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల విటమిన్-బి12 సమృద్దిగా అందుతుంది. పెరుగులో విటమిన్-బి12 మాత్రమే కాకుండా ప్రోబయోటిక్స్ కూడా ఉంటాయి. ఇవి జీర్ణక్రియకు సహకరిస్తాయి. బీట్రూట్ లో కూడా విటమిన్-బి12 ఉంటుంది.  బీట్రూన్ ను జ్యూస్,  సలాడ్,  స్మూతీ గా మాత్రమే కాకుండా.. కూరలలో కూడా భాగం చేసుకోవచ్చు.                                                          *రూపశ్రీ.  

డయాబెటీస్‌కు పెరటి వైద్యం

డయాబెటిస్ సమస్య చాలా పెద్దసమస్య ప్రతి ఇంట్లో ఎవరికో ఒకరికి చక్కర వ్యాధి సమస్యతో బాధపడుతూనే ఉంటారు.అయితే ఇది మీకు తెలుసా డయాబెటీస్ కు పెరటి వైద్యం తోనియంత్రించ వచ్చు. మన ఇంట్లో లభించే గృహవైద్యం తో అంటే మీ పెరట్లో మీ ఇంటి సమీపం లో లభించే మామిడి ఆకులకషాయం,తులసి ఆకులు తీసుకుంటే డయాబెటీస్ ను నియంత్రించ వచ్చని నిపుణులు పేర్కొన్నారు. ముఖ్యంగా మామిడి చెట్లు మీఇంటికి సమీపంలో లేదా మీపెరట్లో పెంచుకుంటూ ఉంటారు.అలాగే మీ పెరట్లో అత్యంత పవిత్రంగా భావించే తులసి చెట్టును చాలా భక్తి శ్రద్ధలతో మహిళలు పెంచుకుంటూ ఉంటారు.అయితే ఇది మీరు తెలుసుకోవాల్సిందే వాస్తవానికి మామిడి ఆకుల కషాయం, తీసుకుంటే డయాబెటీస్ ను నియంత్రించవచ్చని నిపుణులు అంటునారు. మామిడి ఆకుల్లో ఎంతో సయిడిన్ పేరుతో టైనిన్ అనే పదార్ధం ఉంటుంది.డయాబెటీస్ చికిత్సకు ఇది సహాయ పడుతుంది. మామిడి ఆకులు ఇన్సూలిన్ ను ఉత్పత్తి చేస్తాయి గ్లూకోజ్ ను పంచడం ఇన్సూలిన్ ను సరిగా పనిచేయించడం లో మామిడి ఆకులు ఉపయోగ పడతాయి. మామిడి ఆకులను ఎలా వాడాలి... బ్లడ్ షుగర్ నివారించాలంటే 1౦ నుండి 15 మామిడి ఆకులు తీసుకోండి.ఒక గిన్నెలో నీటిని పోసి బాగా మరిగించండి.మరిగించిన రాత్రి నీటిలో ఆకులను వేయండి. నాన పెట్టిన ఆకుల రసాన్ని మర్నాడు ఉదయం పరగడుపున నీటిని వడకట్టి తాగండి నియమిత పద్దతిలో నీటిని సేవిస్తే బ్లడ్ షుగర్ నియంత్రించ వచ్చు. తులసి ఆకులతో డయాబెటీస్ ను నియంత్రణ... తులసి ఆకుల ప్రభావం సత్వరం ఉంటుంది.మీరు డయాబెటీస్ ను నియంత్రించ వచ్చు.మీరు డయాబెటిస్ తో సతమత మౌతుంటేమనకు అందుబాటులో ఉన్న పెరటి వైద్యం లేదా హెర్బల్ వైద్యం అందించడం ద్వారా మీ డయాబెటిస్ ను నియంత్రించవచ్చు. ప్రాధాన అంశాలు... తులసి ఆకులను తీసుకోవడం ద్వారా డయాబెటీస్ నియంత్రించ వచ్చు.ఉదయానే పరగడుపున తులసి ఆకులను తినడం ద్వారా చాలా లాభాలు ఉన్నాయని హెర్బల్ వైద్యులు పేర్కొన్నారు. మీ పెరట్లో మీకు అందుబాటులో ఉన్నవాటితో చికిత్స... డయాబెటీస్ తీవ్రమైన సమస్య దీనిని అంత సులభంగా తీసుకుని అంటే సామాన్యుడి పరిభాష లో లైట్ తీసుకోకండి.తప్పు చేయకండి.ఎవరైతే డయాబెటీస్ సమస్యతో బాధపడుతున్నారో దానితో సహజీవనం సాగిస్తున్నారో.డయాబెటీస్ కు చికిత్స లేదని అంటున్నారు.దీనిని పూర్తిగా నివారించాలేము.అయితే పైన పేర్కొన్న ప్రాత్యామ్నాయ విధానాలనుఅనుసరించడం ద్వారా డయాబెటిస్ ను నియంత్రించ వచ్చు.అందుకోసం మీరు తీసుకునే ఆహారం విషయం లో కాస్త శ్రద్ధ అవసరం.  ఇంట్లో మీకు అందు బాటులో ఉండేఔషద మొక్కలను వినియోగించడం ద్వారా డయాబెటీస్ ను నివారించవచ్చు. ముఖ్యంగా ప్రతి ఒక్కరి ఇంట్లో లభ్యమయ్యే తులసి ఆకుల ను తీసుకోవడం ద్వారా  డయాబెటీస్ ను నియంత్రించ వచ్చు.  ఆధ్యాత్మిక పరంగా తులసి చెట్టును చాలా పవిత్రం గా భావిస్తారు.ఇంట్లో ఉండే కుండీలలో తప్పనిసరిగా పెంచుతారు.అలాగే ప్రతిరోజూ తులసి కోటకు పూజ చేసి దీపం పెట్టనిదే ఉదయం స్త్రీల కార్యక్రమాలు ప్రారంభం కావు.ప్రతి ఇంట్లో తులసి చెట్టు ఉంచుకోవడం శుభంగా భావిస్తారు.తులసి చెట్టు యొక్క ప్రాధాన్యత వాటి మహాత్మ్యం గురించి మీకు తెలుసా. అలాగే తులసి లో ఉన్న ఔషద గుణాలు ఉన్న మొక్కగా భావిస్తారు.మీకు ఎటువంటి భయంకరమైన అనారోగ్య సమస్య ఉన్న పోరాడ వచ్చు.తులసిలో యాంటి బాయిటిక్ ప్రాపర్టీ ఉటుంది.   ముఖ్యంగా ఉదర సంబందిత సమస్యలకు సంబందించిన తులసి లో పోరాడే తత్వం ఉందని నిపుణులు పేర్కొన్నారు. తులసితో పలు అనారోగ్య సమస్యలు పంచేంద్రియాల లో సమస్యలు,కడుపులో మంట,పి సి ఓడి వంటి సమస్యలు తగ్గించడం లో తులసి సహకరిస్తుంది.దీంతో పాటు మరికొన్ని ఔషద తత్వాలు లభిస్తాయి.ముఖ్యంగా ప్యాంక్రి యాటిక్ బీటా సేల్స్,ఇన్సూలిన్ ప్రక్రియ ప్రారంభ మౌతుంది.ఉదయం లేవగానే పరగడుపున తులసి ఆకులు నమలండి.లేదంటే తులసి ఆకుల రసం కూడా తాగవచ్చు. అలా చేయడం ద్వారా బ్లడ్ షుగర్ స్థాయి తగ్గుతుంది. ఉదయం పరగడుపున తులసి ఆకులు తినడం వల్ల లాభాలు... *ఇమ్యునిటి పెరుగుతుంది. *గుండెకు లాభం. *పంచేంద్రియాలకు లాభం. *జలుబును నివారించడం లో దోహదం చేస్తుంది. *క్యాన్సర్ ను నివారించేందుకు తులసి సహకరిస్తుంది. *జలుబు దగ్గుకు ఉపయోగం. దయాబిటిస్ నియంత్రించడం లో  మామిడి ఆకుల రసం,తులసి ఆకులు దోహదం చేస్తాయని అనడం లో సందేహం లేదు.                                                            

ఉసిరికాయ రసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?

ఉసిరికాయను అమలకి అని కూడా అంటారు. దీన్ని సాధారణంగా వంటలలో వాడుతుంటారు.  పచ్చళ్లు, పానీయాల తయారీలోనూ ఉపయోగిస్తుంటారు.  అయితే ఉసిరికాయ ఆరోగ్యానికి చేకూర్చే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. రోజూ కనీసం ఒక ఉసిరికాయను తింటూ ఉంటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు చేకూరతాయని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.  అయితే ఉసిరికాయ రసంలో తేనె కలిపి తీసుకుంటే చాలా షాకింగ్ ఫలితాలు ఉంటాయి.  అవేంటంటే.. పోషకాలు.. ఉసిరికాయలో విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ సెప్టిక్ వంటి గుణాలు ఉన్నాయి.  ఇందులో పైబర్ కంటెంట్ కూడా ఎక్కువే.. ఇది జీర్ణక్రియను మెరుగ్గా ఉంచి,  మలబద్దకాన్ని నివారిస్తుంది.   రోగనిరోధక శక్తి.. ఉసిరికాయ రసంలో తేనె కలిపి తీసుకుంటే యాంటీ బాడీస్ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. మధుమేహం.. ఉసిరిలో యాంటీ డయాబెటిక్ గుణాలు ఉంటాయి. దీన్ని తేనెతో కలిపి సేవించడం వల్ల మధుమేహం ఉన్నవారికి రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. జీర్ణక్రియ.. ఉసిరిలో ఫైబర్ ఉంటుంది.  ఇది జీర్ణక్రియను నిర్వహించడంలో సహాయపడుతుంది. తేనెలో ఉండే గుణాలు కూడా జీర్ణక్రియను ప్రోత్సహిస్తాయి. తేనె,  ఉసిరి రెండూ కలిపి తీసుకుంటే జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. జుట్టు.. జుట్టు మందంగా,  ఆరోగ్యంగా, నల్లగా పెరగడంలో ఉసిరికాయ సహాయపడుతుంది.  ఉసిరికాయ రసాన్ని, తేనెను కలిపి తీసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యం మెరుగవుతుంది.  జుట్టు సంబంధ సమస్యలు తగ్గుతాయి. చర్మం.. ఉసిరిలో విటమిన్-సి, యాంటీ సెప్టిక్ గుణాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో సహాయపడతాయి. ముఖం మీద మచ్చలు, మొటిమలు రాకుండా చేస్తాయి.                                            *రూపశ్రీ.

బరువు తగ్గడానికి ఆపిల్ సైడర్ వెనిగర్ వాడేవారు ఈ నిజాలు తెలుసుకోవాలి..!

  ఆపిల్ సైడర్ వెనిగర్  ఈ మధ్యకాలంలో చాలా వైరల్ అవుతోంది.  దీన్ని ముఖ్యంగా బరువు తగ్గడానికి  ఉపయోగిస్తారు.  ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరచడం మాత్రమే కాకుండా చర్మం,  జుట్టు ఆరోగ్యాన్ని కూడా మెరుగ్గా ఉంచుతుంది.  హార్మోన్లను బ్యాలెన్స్డ్ గా ఉంచడంలో కూడా ఇది సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటూ గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది.   అయితే ఆపిల్ సైడర్ వెనిగర్ ను వాడేవారు దాన్ని సరైనా పద్ధతిలోనే వాడుతున్నారా లేదా అనేదాన్ని బట్టి పై ప్రయోజనాలు ఉంటాయి. దీన్ని తప్పుగా వాడితే ప్రయోజనాలు చేకూరడానికి బదులు హాని కలుగుతుంది. అసలు ఆపిల్ సైడర్ వెనిగర్ ను ఎలా వాడాలంటే.. ప్రయోజనాలు.. ఆపిల్ సైడర్ వెనిగర్  కొలెస్ట్రాల్ స్థాయిని  నియంత్రిస్తుంది. రోజూ 1 స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ ను గ్లాసుడు వేడి నీటిలో కలిపి తీసుకోవాలి.  ప్రయోజనకరంగా ఉంటుంది. ఆపిల్ సైడర్ వెనిగర్  గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో,  ఇన్ఫెక్షన్ ల నుండి రక్షించడంలో కూడా సహాయపడుతుంది.  ఆపిల్ సైడర్ వెనిగర్ రోజూ తీసుకుంటే  జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.  చర్మం మీద  మచ్చలు లేకుండా ప్రకాశవంతంగా ఉంచుతుంది. మధుమేహం ఉన్నవారికి కూడా ఆపిల్ సైడర్ వెనిగర్ ప్రయోజనకరంగా ఉంటుంది.  ఇది రక్తంలో  చక్కెర స్థాయిని  అదుపులో ఉంచుతుంది. జుట్టు పెరగడం, చుండ్రు,  దురద వంటి సమస్యలను తొలగించడానికి, 2 టీస్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకొని ఒక మగ్ నీటిలో కలపాలి. తలస్నానం చేసేటప్పుడు ఈ నీటిని మీ జుట్టుపై పోసి 10 నిమిషాల తర్వాత సాధారణ నీటితో కడగాలి. ఇలా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఎలా తాగాలి.. 3 నెలల పాటు ప్రతిరోజూ 1 నుండి 2 టీస్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ ఉపయోగించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఈ మొత్తం కంటే ఎక్కువ ఆపిల్ వెనిగర్  జీర్ణవ్యవస్థను పాడు చేస్తుంది.  దంతాలు కూడా పసుపు రంగులోకి మారుతాయి.                                                   *రూపశ్రీ.

ఉదయాన్నే గుడ్లు తినడం వల్ల ఎన్ని లాభాలు ఉంటాయంటే..!

  గుడ్లు సమతుల ఆహారంలో భాగంగా పరిగణిస్తారు. ప్రతి రోజూ ఒక గుడ్డు తింటే పోషకాహార లోపం రాదని కూడా చెప్తారు.  ఓ వయసు వచ్చాక పిల్లలకు గుడ్డు రోజూ ఇవ్వాలని వైద్యులు  చెబుతారు. పిల్లలు, గర్భవతులు, మహిళలు,  వృద్దులు ఇలా అందరికీ పోషకాలను సమకూర్చే పవర్ ఫుల్ ఫుడ్డు.. గుడ్డు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే గుడ్లను ఉదయాన్నే తీసుకుంటే కలిగే లాభాల గురించి తెలిసిన వారు చాలా తక్కువ. ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ లో గుడ్లు తినడం వల్ల కలిగే లాభాలు తెలుసుకుంటే.. గుడ్లు పరిమాణంలో చాలా చిన్నగా ఉన్నా పోషకాల పరంగా ఇవి చాలా బెస్ట్. ఇందులో విటమిన్-ఎ,  బి5,  బి12,  డి,  ఇ, కె, బి6,  ఫూలేట్, ఫాస్పరస్, సెలీనియం, కాల్షియం, జింక్, ప్రోటీన్ తో పాటూ ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఉంటాయి. గుడ్లలో మొత్తం  తొమ్మిది అమైనో ఆమ్లాలు ఉంటాయి.  ఇవి ప్రోటీన్ ను బిల్డింగ్ చేయడంలో సహాయపడతాయి.  శరీరం ప్రోటీన్ ను తయారు చేయలేదు కాబట్టి గుడ్లను తీసుకోవడం వల్ల శరీరానికి ప్రోటీన్ కొరత ఏర్పడదు. ట్రై గ్లిజరిడ్స్ రక్తంలో కనిపించే ఒక రకమైన కొవ్వు పదార్థం. శరీరంలో ట్రైగ్లిజరిడ్స్ ఎక్కువ ఉంటే గుండె జబ్బు ప్రమాదాలు పెరుగుతాయి.  గుడ్లు తినడం వల్ల ఈ ట్రై గ్లిజరిడ్  స్థాయిలు తగ్గుతాయి. రోజూ ఉదయాన్నే వారంలో కనీసం మూడు నుండి నాలుగు సార్లు అయినా గుడ్లు తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం బాగుంటుంది.  గుండె జబ్బుల ప్రమాదాన్ని 75శాతం తగ్గించవచ్చు. గుడ్లను ఉదయాన్నే తీసుకోవడం వల్ల  రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. ఎక్కువ సేపు కడుపు నిండిన ఫీల్ ఇస్తుంది. గుడ్లలో విటమిన్-ఎ,  జింక్, జియాక్సంతిన్  వంటివి కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి.  కార్నియా దెబ్బతినకుండా రక్షించే లక్షణాలు కూడా గుడ్లలో ఉంటాయి. గుడ్లలో విటమిన్-డి పుష్కలంగా ఉంటుంది. ఇది మెదడులోని గ్రే మ్యాటర్ కు ముఖ్యమైనది.  ఇందులో ఉండే కోలిన్ మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. మెదడు పనితీరును ప్రోత్సహిస్తుంది. గుడ్లలో తక్కువ కేలరీలు, నాణ్యమైన ప్రోటీన్లు ఉంటాయి.  ఇవి బరువు తగ్గడంలో సహాయపడతాయి. గుడ్లు తీసుకుంటే ఎక్కువసేపు ఆకలి వేయదు. ఇది జీవక్రియను పెంచుతుంది. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.                                                     *రూపశ్రీ.  

మైండ్ షార్ప్ గా ఉండాలంటే.. ఇలా చేయండి..!

మానవ శరీరంలో మెదడు ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. మెదడు సరిగా పనిచేస్తెనే మనిషి జీవితం మెరుగ్గా ఉంటుంది. లేకపోతే జీవితం అంతా అస్తవ్యస్తంగా ఉంటుంది. ఎప్పుడైనా ఎవరైనా ఎదైన పనిని మర్చిపోయినా, ఏదైనా వస్తువు ఎక్కడైనా పెట్టి గుర్తు లేదని చెప్పినా చాలామంది అప్పుడే మతి మరుపు వచ్చిందా అని.. మెదడు తక్కువ వెధవా అని.. మెదడు మోకాలిలో ఉందా అని అంటుంటారు. అయితే మెదడు చురుగ్గా పని చేయడం మన చేతిలోనే ఉంది. మెదడు చురుగ్గా పని చేయాలంటే కొన్ని టిప్స్ ను పాటించాలి. అవి కూడా ఉదయాన్నే పాటించడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయి.  నీరు.. ఉదయాన్నే గోరువెచ్చని నీరు, లేదా సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న నీటిని తాగాలి. చల్లని నీటిని, ఫ్రిడ్జ్ లో ఉంచిన నీటిని తాగకండి. వెచ్చని నీరు, సాధారణ ఉష్ణోగ్రత నీరు మెదడు పనితీరును మెరుగపరుస్తుంది. అలగే ఇది జీర్ణక్రియను  కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది.  ధ్యానం.. ఉదయాన్నే ధ్యానం చేసేవారి మెదడు పనితీరు సాధారణ వ్యక్తుల కంటే చాలా మెరుగ్గా ఉంటుంది. ధ్యానం మెదడును ఒత్తిడి నుండి బయటకు తెస్తుంది. మెదడు చురుకుగా ఉండేలా చేస్తుంది. జ్ఞాపకశక్తి సామర్థ్యము పెంచుతుంది. అలాగే ధ్యానం లో భాగంగా చేసే శ్వాస వ్యాయామాలు కూడా మెదడును, మానసిక ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతాయి. ధ్యానం వల్ల స్థిరచిత్తం అలవడుతుంది. ఏకాగ్రత కూడా మెరుగవుతుంది.  ఆహారం.. మెదడు ఆరోగ్యం భేషుగ్గా ఉండాలంటే మెదడుకు బూస్టింగ్ ఇచ్చే ఆహారాలను ఉదయాన్నే తీసుకోవాలి. ఉదయం తీసుకునే ఆహారంలో పోషకాలు మెండుగా ఉండాలి. సీజనల్ పండ్లు, కూరగాయలతో పాటు.. ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న ఆహారం తినాలి.  వ్యాయామం.. ఉదయాన్నే యోగా లేదా వ్యాయామం చేస్తే మెదడు కణాలు ఆరోగ్యంగా ఉంటాయి. మెదడు చురుగ్గా మారుతుంది. ఒంట్లో బద్దకం వదిలిపోతుంది. ఇది రోజంతా చురుగ్గా ఉండేలా చేస్తుంది.  సమీక్ష.. ఉదయాన్నే ఆ రోజు ఏమేం పనులు చేయాలో ఒక ప్రణాళిక వేసుకోవాలి. 100శాతం చేయలేకపోయినా, కనీసం దరిదాపుల్లో పనులన్నీ చక్కబెట్టడం వీలవుతుంది. ఇది పని ఒత్తిడిని తగ్గిస్తుంది. వాయిదా అలవాటు లేకుండా చేస్తుంది. దీని వల్ల మెదడు కూడా ఆరోగ్యంగా ఉంటుంది.                                              *రూపశ్రీ.

మూత్రపిండాల క్యాన్సర్ మీకూ ఉందేమో చూసుకోండి!

మానవశరీరంలో అవశ్యకమైన అవయవాలలో గుండె, మెదడు తో పాటు మూత్రపిండాలు ముఖ్యమైనవి.  మెదడు శరీరంలో అవయవాలకు, శరీర వ్యవస్థకు సమాచారాలు అందిస్తుంది.  గుండె రక్తాన్ని  శరీరంలో ఉన్న అన్ని అవయవాలకు సరఫరా అయ్యేలా చేస్తుంది. మూత్రపిండాలు శరీరంలో రక్తాన్ని వడపోసి అందులో ఉన్న మలినాలను, వ్యర్థాలను, వేరుచేసి మూత్రంలా దారి మళ్లిస్తుంది.  ఈ మూడింటిలో ఏది సమర్థవంతంగా లేకపోయినా మనిషి శరీరం స్వాధీనం కోల్పోతుంది.  ముఖ్యంగా మూత్రపిండాల గురించి చెప్పుకుంటే చిన్నప్పుడు సైన్స్ పుస్తకాల్లో చదువుకున్నట్టు చిక్కుడుగింజ ఆకారంలో ఉండే అవయవం మూత్రపిండం. మనిషి శరీరంలో రెండు మూత్రపిండాలు ఉంటాయి. ఇవి నిరంతరం రక్తాన్ని వడపోస్తూనే ఉంటాయి. సుమారు రోజుకు 200 లీటర్ల రక్తాన్ని ఇవి వడపోస్తాయి. ఈ మూత్రపిండాలు డ్యామేజ్ అవడం, ఏదైనా సమస్యకు లోను కావడం జరిగితే రక్తం వడపోతకు అడ్డంకులు ఏర్పడతాయి, రక్తం శుద్ధి కాకపోతే శరీరంలో చెప్పలేని సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా శరీరంలో అధికంగా ఉండే లవణాలు, రక్తంలో వ్యర్థాలు వెళ్లిపోవాల్సిన మార్గమైన మూత్రవిసర్జనకు సమస్య అవుతుంది. మూత్రపిండాలకు పొంచి ఉండే మరొక ప్రమాదం మూత్రపిండ క్యాన్సర్. ఈ క్యాన్సర్ తో బాధపడుతున్న రోగులలో 60%మందికి మూత్రంలో రక్తం పడటమనే ప్రమాదకరమైన సమస్య ఎదురవుతోంది. అయితే ప్రారంభంలో ఇది నొప్పి లేకుండా ఇతర లక్షణాలు ఏవీ బయటపడకుండా ఉండటం వల్ల ఈ మూత్రపిండాల క్యాన్సర్ ను గుర్తించడం కష్టమవుతుంది. 60% మందిలో 50% మందికి అసలు లక్షణాలు ద్వారా నిర్ధారణ జరగలేదనేది విస్తుపోయే అంశం. ఈ కారణాల వల్ల మూత్రపిండాల క్యాన్సర్ గురించి అవగాహన పెంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది. సాధారణంగా ఆరోగ్య పరీక్షలు చేయించుకునేటప్పుడు అందులో భాగంగా మూత్రపిండాల సమస్యలు, వాటి తీవ్రత బయటపడుతుంటాయి. అంటే ప్రారంభంలో ఈ మూత్రపిండాల క్యాన్సర్ ఎటువంటి లక్షణాలను కలిగిఉండదు. మూత్రపిండాల క్యాన్సర్ కొంచెం ముదిరిన తరువాత దాన్ని గుర్తించే అతిముఖ్యమైన అంశం మూత్రంలో రక్తం పడటమే. ఈ లక్షణం ఎవరిలో అయినా కనిపిస్తే వెంటనే మూత్ర పరీక్షలు, రక్త పరీక్షలు చేయించుకోవాలి. మూత్రంలో రక్తం పడటంతో పాటు బరువు తగ్గిపోవడం, ఆకలి లేకపోవడం కూడా గమనించినట్టైతే వైద్యులను సంప్రదించాలి. మూత్రపిండాల క్యాన్సర్ ను గుర్తించి నిర్ధారణ చేయడానికి CT స్కాన్( కంప్యుటేడ్ టోమోగ్రఫీ), MRI స్కాన్(మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ )  లేదా అల్ట్రాసౌండ్ స్కాన్ వంటి పరీక్షలు ఉన్నాయి. ఇవి ఖర్చుతో కూడుకున్నవి అయినా ఖచ్చితమైన నిర్ధారణను అందిస్తాయి. శరీరంలో ఎర్రరక్తకణాలను ఉత్పత్తి చేయడానికి మూత్రపిండాలు మధ్యవర్తిగా వ్యవహరిస్తాయి. అయితే మూత్రపిండాల క్యాన్సర్ వల్ల ఈ పనికి ఆటంకం కలిగి రక్తహీనత ఏర్పడుతుంది.  మూత్రపిండాలు పూర్తిగా పాడైపోతే వాటిని తొలగించడం తప్ప ప్రత్యామ్నాయం ఉండదు. ఎవరైనా కిడ్నీ దానం చేస్తే అవి కూడా సరిపోయినప్పుడు మాత్రమే ప్రాణాలు నిలబడతాయి.  కేవలం ఒక కిడ్నీతో అయినా జీవితాన్ని నెట్టుకొస్తున్నవారు ఉన్నారు. కానీ మద్యపానం, ధూమపానం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, బయటి తిండి వీటివల్ల మూత్రపిండాలు చాలా తొందరగా ప్రమాదంలో పడతాయి కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. ఈ శరీరాన్ని నిలబెట్టుకోవాలంటే మూత్రపిండాలని కాపాడుకోవాలి.                                                ◆నిశ్శబ్ద.  

లివర్ క్యాన్సర్ హెచ్చరిక సంకేతాలు ఇవే...

చాలామంది రెడ్ ఫ్లాగ్ రిబ్బన్ ను గుర్తించరు. అయితే లివర్ క్యాన్సర్ కు కారణం మాత్రం కడుపు నొప్పి లేదా ఇతర సమస్యలు ఉంటాయి. లివర్ క్యాన్సర్ ఎలావస్తుంది ?... మీ శరీరంలో అతి పెద్ద అవయవం లివర్.అసలు లివర్ మీ కోసం ఏమిచేస్తుందో తెలుసా.మీ రక్తాన్ని ఫిల్టర్ చేస్తుంది.ఆహారాన్ని వేరు చేస్తుంది. చాలా కీలక మైన అవయవం లివర్.మీకు లివర్ క్యాన్సర్ వస్తే నియంత్రణ లేకుడా కొన్ని కణాలు పెరుగుతాయి.అవిఒక కణిత లా ఏర్పడుతాయి.దీనికారణంగా మీ లివర్ ఎలా పనిచేస్తుందో  తెలిసిపోతుంది. లివర్ క్యాన్సర్ లక్షణాలు... చాలా మందిలో లివర్ క్యాన్సర్ లక్షణాలు కనపడవు.త్వరగా గుర్తించడం అసాధ్యం.ఈ కింది లక్షణాలు గమనిస్తే తెలుసుకోవచ్చు. *కడుపు నిండి నట్లుగా ఉండడం తినాలన్న ఆశక్తి లేకపోవడం. *మీ ఎడమ వైపు ఉన్న రిబ్స్ కింద గడ్డ కట్టినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. *ఎడమ వైపు పొట్ట, కుడిభుజం నొప్పి గా ఉన్నట్లు భావిస్తారు. *పోట్ట లావు అయిపోయినట్లు అనిపిస్తుంది. *మీ పొట్ట ప్రాంతంలో వాపు ను గమనించవచ్చు. *బలహీనంగా ఉన్నట్లు,అలిసిపోయినట్లు అనిపిస్తుంది. *బరువు తగ్గిపోవడం గమనించవచ్చు. *తెల్లగా పాలిపోవడం ఎర్రటి ముక్కు. *మీ చర్మం పై పసుపు పచ్చ రంగు కళ్ళు తెల్లగా ఉండడం గమనించవచ్చు. మీకు లివర్ వ్యాధి ఉంటె... కొన్ని వ్యాధులు లివర్ వ్యాధులు లివర్ క్యాన్సర్ వచ్చేందుకు కారణం అవుతాయి. *దీర్ఘకాలం పాటు హెపటైటిస్ బి హెపటైటిస్ సి వచ్చి ఉన్నట్లయితే మీ లివర్ డ్యామేజ్ అవ్వచ్చు. *సిరోసిస్ --లివర్ పాడై కొన్ని స్కార్స్ కణాల పై ఉంటాయి.స్కార్స్ కణాలను తొలగించి ఆరోగ్యంగా ఉంచుతుంది. *నాన్ ఆల్కాహాల్ ఫ్యాటీ లివర్ వ్యాధి --మీలివేర్ లో ఫ్యాట్ పేరుకు పోతుంది. *లివర్ వ్యాధులు పుట్టుకతో రావు లేదా మన పూర్వీకుల వారసత్వంగా రావచ్చు.ఉదాహరణకు హీమో క్రోమోటో సిస్ ఎప్పుడై తే శరీరంలో ఐరన్ లివర్ లో ఎక్కువగా పేరుకు పోతుందో లేదా మీశారీరంలోని ఇతర అన్గాలాలోనూ కొవ్వు పేరుకు పోవచ్చు. ఆల్కాహాల్, ఒబెసిటి,డయాబెటిస్... సిరోసిస్ కు ప్రాధాన కారణం---ఎక్కువ మోతాదులో మీరు మందు సేవించడమే.సంవత్సరాలుగా సిరోసిస్ ఉంటె లివర్ క్యాన్సర్ కు దారి తీయవచ్చు.అంటే దానిఆర్ధం అతిగా మందు సేవించడం వల్ల మీరు ఒకవేళ అధిక బరువు ఉన్నట్లయితే డయాబెటిస్ పరిస్థితి ఉన్న మేతాబాలిక్ సిండ్రోం నాన్ అల్కాహాలిక్ ఫ్యాటీ లివర్ వ్యాధి లివర్ క్యాన్సర్ కు దారి తీయ వచ్చు. టాక్సిన్స్ లివర్ క్యాన్సర్ పెంచుతాయా... అఫ్లా టాక్సిన్స్ పా యిజన్స్ విష తుల్యమైన రసాయనాలు కొన్ని మోల్డ్స్ అది పంటలలో పండుతాయి.ముఖ్యంగా కార్న్, మొక్కజొన్న, పల్లీ,లను సరైన పద్దతిలో నిల్వచేయక పోవడం వల్ల  *ఆర్గానిక్ కెమికల్స్ అది కొంతకాలం నీరు సరిగా పెట్టక పోయినా . *దోరియం డై ఆక్సైడ్ ముఖ్యంగా ఎక్స్ రే లలో వాడే కొన్ని రకాల సబ్ స్టేన్స్. *వినయల్ క్లోరైడ్ రసాయనాలు ప్లాస్టిక్ తో తయారు చేసిన రసాయనాలు. చాలా సహజ మైన రకం... హేపటో సెల్యులర్ కార్సినోమా ----మీలివేర్ లో అది ప్రాధాన కణాలలో సోకుతుంది.దీనిని హేపటో సైట్స్ హెచ్ సి సి సహజంగా ట్యూమర్ కు కారణం అవుతుంది.అది కొంత కాలానికి పెద్దది అవుతుంది.ఒకవేళ మీకు సిరోసిస్ లేదా చిన్న ట్యూమర్ లివర్ లో విస్తరిస్తుంది. ఇతరరకాలు... బైల్ డ క్ట్ క్యాన్సర్ బైల్ తీసుకుపోయే ట్యూబ్ లలో ఈ క్యాన్సర్ వస్తుంది.రసాయనం ద్వారా ఆహారాన్ని కిందకు పంపుతుంది.లివర్ బయల్ కి -- ఇది సహజంగా వచ్చే క్యాన్సర్  ఆంజియో సర్కోమా ---హేమాన్జియో సర్కోమా ,క్యాన్సర్ మీ లివర్ రక్త నాళాల లోకి వస్తుంది. అయిత్గే కొన్ని కొన్ని వేరు వేరు కావచ్చు.కేవలం టాక్సిన్స్ వల్ల మాత్రమే హేపటో బ్లాస్టోమా చాలా అరుదుగా వచ్చే క్యాన్సర్.అది కేవలం పిల్లలో అంటే నాలుగు సంవత్సరాల లోపు పిల్లలో వచ్చే క్యాన్సర్. నిర్ధారణ పరీక్షలు... ఒకవేళ మీ డాక్టర్ కు లివర్ క్యాన్సర్ అన్న అనుమానం ఉంటె సూచించే పరీక్షలు ఇవే ---- బయాప్సీ ----లివర్ నుండి చిన్నముక్క క్యాన్సర్ పరీక్షకు పంపిస్తారు. రక్త పరీక్ష --- మీలివర్ ఎలా పనిచేస్తుందో పరీక్షిస్తారు.మీ రక్తం లో క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయో లేదో పరీక్షిస్తారు.ట్యూమర్లు లేదా మార్కర్లు ఉన్నాయోలేదో  చూస్తారు. ఇమేజింగ్ టెస్ట్ ---- అల్ట్రాసౌండ్,సిటి స్కాన్,ఎం అర్ ఐ,ఆంజియో గ్రామ్,ఎక్స్ రే,ద్వారా మీరక్తనాళాలను పరీక్షిస్తారు. లివర్ క్యాన్సర్ స్తేజేస్ ---- లివర్ క్యాన్సర్ స్టేజ్ 1 లో క్యాన్సర్ ఎక్కడికి స్ప్రెడ్ కాకపోవడం  లివర్ క్యాన్సర్ స్టేజ్ 2 లో ట్యూమర్ రక్తనాళాల లోకి విస్తరిస్తుంది.క్యాన్సర్ చిన్న చిన్నగా రెండు ఇంచుల గా పెరగవచ్చు. లివర్ క్యాన్సర్ స్టేజ్ ౩ లో మరో ట్యూమర్ రక్త నాళాల లోకి దగ్గరలోని ఇతర అవయవాలకు విస్తరిస్తుంది. లివర్ క్యాన్సర్ స్టేజ్ 4 లో శరీరంలోని అన్ని అవయవాలకి విస్తరిస్తుంది. లివర్ క్యాన్సర్ ఉన్నవాళ్ళలో లివర్ పాడై పోతుంది.మీ లివర్ క్యాన్సర్ ఉన్న స్టేజి ని బట్టి మీలివేర్ ఎలా ఉందొ తెలుసుకుంటారు. మీ లివర్ క్యాన్సర్ నిలువరించేందుకు బి సి ఎల్ సి బార్సిలోనా క్లినికల్ లో పరీక్షల ఆధారంగా లివర్ క్యాన్సర్ ను ఓ ఏ బి సి మరియు డి ,సిడి వంటి గ్రేడ్ లు క్యూర్ కావు,అయితే లక్షణాలను నివారించేందుకు చికిత్స చేయవచ్చని నిపుణులు పేర్కొన్నారు. లివర్ క్యాన్సర్ చికిత్స లేదా సర్జరీ ట్రాన్స్ ప్లాంట్... లివర్ క్యాన్సర్ చికిత్స క్యాన్సర్ స్టేజి వయస్సును బట్టి ఆధారపడిఉంటుంది.వారి ఆరోగ్య పరిస్థితి మీలివేర్ ఆరోగ్యం,క్యాన్సర్ విస్తరించనట్లయితే  లేదా ఇతర లివర్ సమస్యలు లేకుంటే మీ ట్యూమర్ ను సర్జరీ ద్వారా తొలగించ వచ్చు.లివర్ ను దాత నుండి సేకరించి ఇంప్లాంట్ చేయవచ్చు ఇది సహజంగా జరగదు. ఎబిలేషణ్ తెరఫీ... ఆల్కాహాల్ *మీ ట్యూమర్ పై చాలా ప్యూర్ ఆల్కహాల్ పోయడం ద్వారా ట్యూమర్ ను నాశనం చేస్తారు. ఫ్రీజింగ్ *మీ డాక్టర్ పల్చగా ఉన్న,లేదా గట్టిగా ఉన్న ఒకపరికరం ద్వారా ఆ ట్యూమర్ ను ఫ్రీజ్ చేయడం ద్వారా క్యాన్సర్ కణాలను చంపేస్తారు. హీట్ మైక్రో వేవ్స్ --- హీట్ మైక్రో వేవ్ ద్వారా క్యాన్సర్ కణాలను కణితలను నాశనం చేస్తారు. ఎలక్ట్రికల్ పల్సెస్ *బర్న్ ఆఫ్ ఎలెక్ట్రి సిటి ద్వారా క్యాన్సర్ కణాలను చంపేసే పద్దతి పై ఇంకాపరిశోదనలు కొనసాగుతున్నాయి. మరిన్ని క్యాన్సర్ నివారణ చికిత్సలు అందుబాటులోకి వస్తాయని ఆశిద్దాం క్యాన్సర్ బాధితులకు అవగాహన కల్పిద్దాం. క్యాన్సర్ పై పోరాటం సాగిద్దాం మరెందరికో స్పూర్తిగ్గా నిలుద్దాం అదే తెలుగు వన్ హెల్త్ లక్ష్యం.                                                                               

ఈ నాలుగు సింపుల్ పనులు చేస్తే చాలు.. పొట్ట భాగంలో కొవ్వు ఐస్ లా కరిగిపోతుంది!!

  అందంగా ఆకర్షణీయంగా కనబడాలంటే శరీర సౌష్టవం చక్కగా ఉండాలి. పొట్ట భాగం ముందుకు చొచ్చుకుని వచ్చి రూపాన్నంతా పాడుచేస్తుంది. చాలామంది పొట్ట కనిపించకుండా కవర్ చేయడానికి దుస్తుల ఎంపిక మీద ఆధారపడతారు. అయితే ఇలా దుస్తుల మీద ఆధారపడటం కంటే పొట్ట తగ్గించుకుని శరీరాన్ని ఫిట్ గా మార్చుకోవడం మంచిది. పొట్ట తగ్గించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం ఉండటం లేదని నిరాశ పడేవారు చాలామంది ఉంటారు. కానీ కేవలం నాలుగు సింపుల్ పనులు చేయడం ద్వారా పొట్టలో కొవ్వును ఐస్ లా కరిగించేయచ్చు. ఇవి అందరూ చేయదగ్గవే. ఆ సింపుల్ పనులేంటో తెలుసుకుంటే.. పొట్టభాగంలో కొవ్వు వల్ల ఉబకాయం క్రమంగా పెరుగుతుంది. దీన్ని వదిలించుకోవడం అంత ఈజీ ఏమీ కాదు. దీనికి ప్రధాన కారణం వ్యాయామం లేకపోవడం, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం, శీతలపానీయాలు, బేకరీ ఫుడ్స్ వంటివి తినడం. జంక్ ఫుడ్ లో చెడు కొలెస్ఠ్రాల్ ఉంటుంది. దీన్ని శరీరం ఉపయోగించుకోలేదు. ఎక్కువసేపు కూర్చుని పనిచేసేవారు ఒకే పొజిషన్ లో గంటల తరబడి కూర్చోవడం వల్ల ఆ భాగంలో ఫ్యాట్ చేరుతుంది. ఇది పొట్ట భాగమైనా, పిరుదుల భాగం అయినా, తొడలు, నడుము ఇలా ఏ భాగంలో అయినా   పేరుకుపోతుంది. దీన్ని తొలగించుకోవాలంటే మొదట ఈ జంక్ ఫుడ్స్ తినడం ఆపేయాలి. బర్గర్లు, సమోసా, మైదాతో చేసే పదార్థాలు, స్వీట్లు,  డీప్ ఫ్రై ఫుడ్స్, ప్యాక్డ్  ఫుడ్స్ మొదలైనవి వదిలేయాలి. ఈ పని పెద్ద కష్టమేమీ కాదు. జిహ్వచాపల్యం వదులుకుంటేనే బరువు తగ్గగలరు. మద్యపానం, ధూమపానం, పొగాకు ఉత్పత్తులు తీసుకునే అలవాటు ఉంటే ఈ అలవాటును తక్షణమే మానేయండి. ఇవి శరీరంలో కణాలలోకి చొచ్చుకువెళ్ళి కణాలను, హార్మోన్లను అస్తవ్యస్తం చేస్తాయి. హార్మోన్ల అసమతుల్యత కారణంగా ఆకలి ఎక్కువ కావడం, జంక్ ఫుడ్ తినాలని అనిపించడం జరుగుతుంది. పైబర్ ఆహారాలు బరువు తగ్గడంలో తోడ్పడతాయి. కరిగే ఫైబర్ ఆహారాలు తీసుకున్నప్పుడు అవి శరీరంలో నీటిని గ్రహించి జెల్ లాగా మారతాయి. ఇవి కడుపులో నిండుగా ఉన్న అనుభూతి ఇస్తాయి. ఎక్కవు సేపు ఆకలి కాకుండా నిరోధిస్తాయి. ఓట్స్ ఫైబర్ కు మంచి మూలం. ఓట్స్ ను ఆహారంలో భాగం చేసుకోవాలి. ఉదయం అల్పాహారంగానో, లేక రాత్రి సమయంలో ఓట్స్ తో దోశ, ఇడ్లీ, కిచిడి లాంటివి తీసుకోవాలి. రాత్రి 8గంటలలోపు భోజనం ముగించాలి. భోజనం తరువాత కనీసం ఓ 10నిమిషాల తేలికపాటి నడక అలవాటు చేసుకోవాలి.   బరువు తగ్గాలని అనుకునేవారు  ఫైబర్ అధికంగా ఉన్న పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. ఇవి మాత్రమే కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్కటైనా సిట్రస్ పండు తీసుకోవాలి. నిమ్మ, బత్తాయి, నారింజ ఇలా ఏదో ఒకటి తినాలి. వీటితో  పాటు మంచినీరు శరీరానికి కావలసినంత తాగాలి.                                                           *నిశ్శబ్ద.  

ఈ తల నొప్పి ఏంట్రా బాబు..

  అదే ఇందులో ట్విస్ట్  కోవిడ్ ముందు కోవిడ్ తరువాత మనకు తల నొప్పులు మరీ ఎక్కువయ్యాయి.ఈ మధ్య కాలం లో కోవిడ్ తరువాత,మూడవ విడత కోవిడ్ లో ముఖ్యంగా కోవిడ్ తీవ్రత పెద్దగ లేక పోయినా శరీరం మొత్తం తీవ్రమైన నొప్పులతో బాధ పడుతున్నారని వైద్యులు చెపుతున్నారు.  కాగా తీవ్రమైన తల నొప్పి బాదిస్తూ ఉండడం తో అది ఒమైక్రాన్ లక్షణమా అని కొందరిలో సందేహం వ్యక్త మౌతోంది. పోస్ట్ కోవిడ్ తరువాత కొందరిలో తీవ్రమైన తల నొప్పితో బాధ పడ్డవారిని పరీక్షించగా కొందరిలో మెదడులో రక్తనాళాలు గడ్డ కట్టా యని దానివల్ల కొందరిలో తలనొప్పి ఉన్నట్లు గుర్తించారు. కాగా ఇంకొందరిలో బ్రెయిన్ లో ఇన్ఫెక్షన్ సోకినట్లు గుర్తించారు ఇలా రక్త నాళాలు చిట్లే ప్రమాదం ఉందని. రక్తం గడ్డ కట్టిన  వాళ్ళ లో ఫిట్స్ వచ్చే ప్రమాదం ఉందని. నిపుణులు తమ పరిశోదనలో వెల్లడించారు. రక్తం గడ్డ కట్టిన వాళ్ళ లో,బి పి, పెరిగితే గుండె పోటు వచ్చే అవకాసం ఉందనిడానికి తోడు పక్షవాతం వస్తే పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తునారు.ఒకవేళ గతం లో మీరు హై బిపి లేదా  మెదడు కు సంబందించిన సమస్యలు ఉంటె అప్రమత్తం గా ఉండాలని హెచ్చరించారు. ముఖ్యంగా చలిగాలులు ఎక్కువగా ఉండే శీతల ప్రాంతాల లో ఉన్న వారిలో రక్త ప్రసారంలో హెచ్చుతగ్గులు ఉంటాయని దీనికారణంగా ఒక్కోసారి రక్త ప్రసారం మెదడుకు అందక పోవడం, కాగా రక్తం చిక్కగా మారడం వల్ల మరిన్ని  సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు సూచించారు.  ఇక ఇటీవలి కాలంలో ఎక్కువమందిలో ఎడమవైపు మాత్రమే తలనొప్పి రావడం గమనించినట్లు  ఒక పరిశోదన వెల్లడించింది. ఎడమ వైపు తల నొప్పి రావడానికి గల కారణాలు చికిత్సలు ఉన్నాయి. చికిత్సల ద్వారా వ్యక్తికి తల నొప్పి రాకుండా కాపాడుకోవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా 5౦% మంది పెద్ద వాళ్ళ లో తల నొప్పి సమస్యలు ఎదుర్కుంటూ ఉంటారు. కొన్ని చిన్న చిన్న తల నొప్పులు ఇంట్లో చిత్కాలా తో పోగొట్టుకోవచ్చు. ఒక వ్యక్తికి అనుకోకుండా తీవ్రమైన తల నొప్పి నీరసం అలసట శరీరంలో ఒకవైపు మాత్రమే ఉందా అన్న విషయం లో గందర గోళానికి గురి అవుతున్నారు రోగులు. ఇందులో తల నొప్పి లక్షణాలు...చికిత్స ... తల నొప్పి కేవలం ఎడమ వైపు మాత్రమే ఉంటె తక్షణ చికిత్స అవసరం ఒక వ్యక్తికి అనుకోకుండా తీవ్రమైన తీవ్రమైన తల నొప్పి అలసట నీరసం శరీరం ఒకవైపు ఉంటె డాక్టర్ ను ఎప్పుడు  సంప్రదించాలో తెలియ చేస్తుంది.  తల నొప్పుల్లో రకాలు... వివిధ కారణాల వల్ల ఎడమవైపు మాత్రమే తల నొప్పి వస్తుంది. అది మైగ్రిన్ కవచ్చు సహజం గా వైద్యులు తల నోప్పిని  ప్రాధమిక స్థాయిలో రెండవ స్థాయి,లేదా తీవ్ర స్తాయ్గా వర్గీకరించారు. ప్రాధమిక స్థాయిలో తల నొప్పి ప్రాధాన లక్షణం రెండవ దశ తల నొప్పి మరో అనారోగ్య సమాస్య కు కారణం కావచ్చు.  1)బ్రెయిన్ ట్యూమర్ లేదా కణిత లు  2) బ్రెయిన్ స్ట్రోక్  3) ఇన్ఫెక్షన్  తల నొప్పి ఎక్కడైనా రావచ్చు. ఎడమవైపు 11 రకాల తల నొప్పులు వచ్చే అవకాశం ఉంది.మైగ్రైన్ ... మై గ్రైన్ సమస్యతో బాధ వారు తీవ్రమైన తల నొప్పి ఎడమ వైపు వస్తుంది. యు కే లో 12%అందులో  స్త్రీలలో 5 % పురుషులు!% మైగ్రైన్ తలనొప్పి ఒకవైపు అదీ తీవ్రంగా రావడం నొప్పి కంటి చుట్టూ రావడం తల మొత్తం వ్యాపించడం గమనించవచ్చు. మైగ్రైన్ వల్ల ప్రభావం...కంటి చూపులో మార్పులు వస్తాయి. వాంతులతో తీవ్ర ఇబ్బందులు పడతారు. తల తిరగడం, ఏ చిన్న శబ్దమైనా వెలుతురు వాసన తగిలిన చేతి వెళ్ళు ముఖం తిమ్మిరిగా ఉండడం. స్పర్స లేకుండా ఉండడం చాలా అరుదుగా వచ్చే మైగ్రైన్ లలో హేమా ప్లిజిక్ మైగ్రైన్ దీనివల్ల అలసట నీరసం శరీరం లో ముఖం ఒక పక్క సత్తువ లేకుండా ఉండడం. మై గ్రైన్ సహజంగా 4 గం నుండి 72 గం ఉంటుంది. ఈ సమయంలో రోగి చీకటి గదిలో రెస్ట్ తీసుకోవాలి. మైగ్రైన్ కు  కారణం ఏమిటి అన్న  ప్రశ్నలకు సరైన కారణాలు అర్ధం కాలేదు.జెన టిక్ ఫ్యాక్టర్ లేదా వాతావరణమే కీలక పాత్ర పోషిస్తుందా అన్నది మరో ప్రశ్న. సహజం గా ఒత్తిడి 8౦% కాగా హార్మోనల్ మార్పులు 65% కరానం కావచ్చునని అంచనా. ఇది కాక మద్యం వెన్న, చాక్లెట్లు వంటి ఆహారం  కారణం కావచ్చు. నిద్ర ఎక్కువైనా నిద్ర పోకపోయినా సమస్యే. వెలుతురు కాస్త లైట్లు కొంచం మినుకు మినుకు మన్న మైగ్రైన్ యిన్  కు కారణాలుగా నిపుణులు పేర్కొన్నారు. క్లస్టర్ హె డెక్స్... క్లస్టర్ హె డెక్స్ కు కారణం తీవ్రమైన నొప్పి. తలకు ఒక పక్క మాత్రమే నొప్పి దీనినే పార్శ్వపు నొప్పి గా పిలుస్తారు. తలకు ఒకవైపు మాత్రమే తీవ్రమైన నొప్పి కంటి చుట్టూ కూడా తరచుగా నొప్పి వస్తూ ఉంటుంది. నొప్పి తీవ్రత అధికంగా ఉంటుంది. చాలా తీవ్రంగా మండి నట్లు. గుచ్చుకున్నట్లు ఉంటుంది. యుఎస్ లో 1% ప్రజలు క్లస్టర్ హెడెక్స్ తల నొప్పి ఒక్కసారి వస్తే 4 నుండి12 వారాలు ఉంటుంది.లేదా చాలా సంవత్సరాలు ఉంటుంది. తరచుగా ఒకే వైపు వస్తూ ఉంటుంది. సహజంగా క్లస్టర్ హె డెక్ లక్షణాలు ఇవే...కంటి లోపల నుండి లేదా నుదుటి వైపు నొప్పి ప్రారంభమై నిద్ర పోనివ్వదు. నొప్పి ప్రారంభ మైతే 1 లేదా 2 గం ఉంటుంది. నొప్పి 5 నుంచి 1౦ నిమిషాలు తీవ్రంగా ఉంటుంది. తీవ్రమైన నొప్పి 3౦ నుండి 6౦నిమిషాలు తక్కువలో తక్కువ 3 గం లు ఉంటుంది. దీనిలక్ష నాళలో ముక్కు కారడం లేదా ఒకవైపు ఒకవైపు మూసుకుపోవడం. కనురెప్పలు వాలి ఉండడం.ఒక కన్ను ఎర్రగా నీరు కారుతూ ఉంటుంది. ముఖం వాచీ ఉంటుంది. చమట పట్టి ఉండడం దీనికి గల ప్రాధాన్ కరానం తేలియా ల్సి ఉంది. నిపుణుల అంచనా లేదా పరిశోదనా అమ్మ్సాలలో భాగం గా మెదడులో ఉన్న హైపో తాలమిన్ నరాలు రక్తనాళాలు మధ్య వచ్చిన మార్పు ఒత్తిడి కారణంగా కన్ను ముఖం పై ప్రభావం చూపుతాయని  అంటున్నారు.  సెర్విగేనిక్ హెడేక్...ఈ రక మైన తల నొప్పికి కారణం మెదడుకు ఏదైనా గాయం అయినప్పుడు అర్తరైటిస్ వెన్నుపూస లేదా వెన్నుపూస పై భాగాలు సమాస్య ఉండవచ్చు. 1 )మెడ పై భాగాన తీవ్రమైన నొప్పి ప్రారంభమై కన్ను ముఖం పై ఒక పక్క తీవ్రమైన నొప్పి ఉంటుంది. 2) మెడ నరాలు పట్టి వేసి అటు ఇటు లేదా ఎటు వైపుకు తిరగ కుండా ఉండిపోతుంది. 3) కంటి చుట్టూ నొప్పి, భుజాలు, చేతులు కంటి చూపు సరిగా లేకపోవడం. అసహనం గా ఉండడం... చిన్న పాటి లైట్కదిలినా. శబ్దం అయినా తీవ్రంగా ఇబ్బంది పడడం. స్తేరాయిడ్స్ ఇంజక్షన్స్, లేదా నాన్ స్తేరాయిడ్ ఇంజక్షన్స్, ఇంఫ్లా మేట రీ మందు ద్వారా నేప్పిని నివారించే ప్రయత్నం చేయవచ్చు. సేర్వికోగేనిక్ హె డెక్ తల నొప్పులు 3 నెలల తగ్గించవచ్చు.మళ్ళీ రావాచ్చు. నొప్పి ఇతర లక్షణాలు పిరియాడిక్ గా వస్తూ ఉంటాయి. వ్యక్తి నుంచి వ్యక్తికి వేరు వేరుగా ఉంటాయి. వాస్కు లైటిస్... దీనిని ఆటు ఇమ్యూన్ ఎటాక్ గా పేర్కొన్నారు. శరీరంలో రక్త నళాలలో ఇతర హానికారక రాసాయానాలు ఉంటె దానిని వస్కు లైటిస్ బ్లడ్ ఇంఫ్లా మేషన్ గా పేర్కొన్నారు. సహజంగా వాస్కు లైటిస్ గిఒనేట్ సెల్ అర్తరైటెంపోటర్ ఆర్తరైటిస్ తల లోని రక్తనాళాలు  పై ప్రభావం చూపుతుంది. 5౦ సంవత్సరాలు పై బడిన వాళ్ళ లో ఉంటుంది. వాస్కు లైటిస్ తల నొప్పికి దగ్గర దగ్గర గా థందర్ క్లాట్ హెడే క్ తీవ్రమైన నొప్పి దీనికి సరైన కారణం అంటూ ఉండదా. ఒక్క నిమిషంలో తీవ్రనోప్పి కి డానికి సరైన అంటూ ఉండదు.ఒక్కోసారి ఈ నొప్పి 5 నిమిషాలు ఉంటుంది. వాస్కు లైటిస్ వల్ల వచ్చే ప్రభావం లో భాగంగా కంటి చూపు కోలోవడం. తలకు ఒక పక్క తల నొప్పి లేదా కాలికి ఒకపక్క నొప్పి నములు తున్నప్పుడు నొప్పి వాస్కు లైటిస్ తో కళ్ళు పోయే ప్రమాదం పొంచి ఉంది.                                                                              

ముక్కు దిబ్బడా..? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి.!

చలికాలంలో దగ్గు, జలుబుతో బాధపడటం సర్వసాధారణం. అయినప్పటికీ, దగ్గు, జలుబు చాలా సమస్యలను కలిగిస్తుంది. జలుబు కారణంగా ముక్కు మూసుకుపోతే.. శ్వాస తీసుకోవడం కూడా కష్టమవుతుంది. మూసుకుపోతే సరిగ్గా నిద్రపట్టదు. ఏ పనిపైనా ద్యాస ఉండదు. అయితే ఈ 5 ఇంటి నివారణలను అనుసరించడం ద్వారా ముక్కు దిబ్బడ నుంచి తక్షణ ఉపశమనం పొందవచ్చు. అవేంటో చూద్దాం. వేడి నీటి ఆవిరి: జలుబు కారణంగా ముక్కు పూర్తిగా మూసుకుపోయి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటే, వేడి నీటిని ఆవిరి పట్టడం వల్ల వెంటనే ఉపశమనం పొందుతుంది. దీని కోసం, ఒక పాత్రలో నీటిని వేడి చేసి, మీ ముఖాన్ని దానిపై ఉంచండి.  ఆవిరిని పీల్చుకోండి. తలను కొంత గుడ్డతో కప్పండి. మీకు కావాలంటే, మీరు నీటిలో కొద్దిగా విక్స్ కూడా జోడించవచ్చు. ఇది మూసుకుపోయిన ముక్కు నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. కొబ్బరి నూనె వాడకం: ముక్కు పూర్తిగా మూసుకుపోయినట్లయితే, మీరు కొబ్బరి నూనెను ఉపయోగించవచ్చు. ఒక చుక్క కొబ్బరి నూనెను మీ వేలికి తీసుకుని, ముక్కులోపలికి రాసుకుంటే వెంటనే ముక్కు తెరుచుకుంటుంది. ముక్కులో కొబ్బరి నూనెను అప్లై చేసిన తర్వాత, లోతైన శ్వాస తీసుకోండి. కొబ్బరి నూనె కాకుండా, మీరు బాదం నూనెను కూడా ఉపయోగించవచ్చు. కర్పూరం: కర్పూరం వాసన బ్లాక్ అయిన ముక్కును తెరవడంలో కూడా ప్రభావవంతంగా ఉంటుంది. ముక్కు పూర్తిగా మూసుకుపోయినట్లయితే కర్పూరం వాసన ముక్కు తెరుచుకుంటుంది. కొబ్బరినూనెలో కర్పూరం కలిపి వాసన చూడొచ్చు. లవంగాల వాసన మూసుకుపోయిన ముక్కును క్లియర్ చేయడంలో కూడా సహాయపడుతుంది. ఈ వ్యాయామం ముక్కును తెరవడంలో సహాయపడుతుంది: మూసిపోయిన ముక్కు నుండి ఉపశమనం పొందడానికి మీరు కూడా ఈ చిన్న వ్యాయామం నుండి ప్రయోజనం పొందవచ్చు. ఇందుకోసం ముందుగా తలను వెనుకకు వంచి ముక్కును మూసుకుని కొద్దిసేపు శ్వాసను ఆపివేయాలి. తరువాత, మీ ముక్కు తెరిచి శ్వాస తీసుకోండి. ఇలా చేయడం వల్ల ముక్కు తెరుచుకుంటుంది. మీరు దీన్ని రెండు మూడు సార్లు చేయవచ్చు. మీ ముక్కును గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి: గోరువెచ్చని నీటితో శుభ్రం చేయడం ద్వారా మీ మూసుకుపోయిన ముక్కును కూడా తెరవవచ్చు. దీని కోసం, ముందుగా తలను వెనుకకు వంచి, డ్రాపర్ సహాయంతో కొన్ని చుక్కల గోరువెచ్చని నీటిని ముక్కులో వేయండి. కొంత సమయం తరువాత, మీ తలను నిఠారుగా చేసి, నీటిని తీసివేయండి. ఇది ముక్కు తెరవడానికి సహాయపడుతుంది.