The Fiery Red Eye!

The red eye is one such syndrome that may affect one or both the eye, the eye appears scarily red due to the dilation of the blood vessels caused by infection or irritation. The bloodshot eyes, these include subconjunctival hemorrhage i.e. breakdown of one more blood vessel in the sclera, blepharitis  it is the inflamed eyelids, a red bump over the eyelids called stye. Most common causes of red eye are: allergies, corneal ulceration, foreign body in eye, dry eye syndrome-decreased production of tears, corneal herpetic infection, outwardly turned eyelid-Ectropion, Entropion-inwardly turned eyelid, Blepharitis-inflammation of eyelids, or any infection of eye constituents and sometimes  even because of contact lenses. In short any insult to eye will present as red eye. The treatment varies depending on the cause of the red eye. It may be as simple as cold compresses and rest, refraining from the use of contact lenses if it triggered the red eye, eye drops, antibiotics and rarely surgical intervention. However certain measures it taken can reduce the incidence of red eye: Avoid frequent rubbing of eyes, hand act as vehicles of transport. While using contact lenses, hygiene plays an important role as contacts act as breeding ground for germs if left uncared for. At times it may be due to over-stressing of eye at the computer screen, in such case take a break and follow the 20-20-20 rule: look away from your computer every 20 minutes and gaze at a distant object 20 feet away for at least 20 seconds. Know your allergies and take appropriate medications. Schedule an eye exam every 6 to 8 months for medical guidance.   -Koya Satyasri

Fatty liver – A Disease of the Modern Age!

Fatty liver is the disease of the new age its victims have enormously risen in the past decade, all raising the finger at the lifestyle changes. In a normal healthy individual there is some amount of fat, but it is labeled as fatty liver when more than 10%of the organ weight is due to fat deposits. There are two types of Fatty liver diseases: Alcoholic Fatty Liver Disease (ALD): As the name suggests it is caused by heavy drinking. The symptoms may show up even due to Hepatitis C, over loading of Iron, obesity or the genes.  Non-Alcoholic Fatty Liver Disease (NALD): It is a tricky entity as there no explanations why some people suffer from fatty liver disease while others do not. The possible cause will be; the genetic factors, overweight, insulin resistance due to which the cells become hostile to the action of the hormone, high blood sugar or hyperglycemia indicating diabetes type 2 and abnormal lipid profile i.e. high cholesterol levels. There is limited understanding of why some fatty livers develop inflammation that progresses to cirrhosis, scarring of the liver. Other rare conditions that cause fatty liver are: Malnutrition, autoimmune diseases, medications and crash diets. The treatment is not well defined; well it is a multi-dimensional approach diet control and physical activity form the main pillars of the treatment. The additives include vaccination against Hepatitis A and Hepatitis B, in certain advanced conditions liver transplant is only hope!    - Koya Satyasri

Cooling down Hot Flashes!

Hot flashes are one of the most common and annoying vasomotor symptoms of menopause in women. This are caused due to the disruption of normal regulation of blood vessels resulting production of intense heat and perspiration. The duration and frequency changes from person to person, when they occur during night they are labeled as night sweats. The hot flashes presentation too varies from person to person. They may show up as sudden and intense feeling of heat all over the body. Irregular and rapid heartbeat and pulse and may also present with palpitations. Mild to profuse sweating is most annoying symptom. Flushing is evident in fair-skinned individuals. Rarely sleep disturbances, nausea and dizziness may also show up. During menopause Low levels of estrogen confuse the hypothalamus, causing it to inaccurately sense that the body is overheating. This provokes an internal chain of reactions that women experience as "hot flashes". While other causes listed are: infection, anxiety, obesity, cancer, diabetes and thyroid disorders. Sometimes medications also provoke hot flashes, certain osteoporotic and those fighting breast cancer drugs. By some simple measures the symptoms can be downgraded, keeping away from warm environments considering air conditioners and fans, avoiding stress and anxiety which will quickly raise the temperature, Avoiding hot and spicy foods, keeping cold water or any other beverage handy but avoiding caffeinated drinks, taking a cool shower before bed and using cotton sheet rather than silk and synthetics.   -Koya Satyasri

Cleaning our Gut – Colon Cleansing!

Colon cleansing is one of the ancient methods of detoxification. The natural method of cleansing dates back to ancient Greece. Recently there has been resurgence in the use of teas, enzymes or colon irrigation for detox. The natural way of colon cleansing is done in two ways: Cleansing with powdered or liquid supplements, some of which are taken through mouth or per rectally, which help colon in expelling the impurities along with its contents. Enemas, laxatives-stimulants or non-stimulants, herbal teas, enzymes or magnesium. Cleansing with colon irrigation under the supervision of medical practitioners like colonic hygienists or colon hydro-therapist. This procedure is quite similar to enema, the only difference being the absence of personal effort and discomfort caused by the supplements. This process involves a low pressure pump or gravity based reservoir flushes out several gallons of water through a tube which injects water into the intestines. Then the therapist may give an abdominal massage, following which the water is passed as regular bowel movements flushing out toxins, this process is repeated. Water at different temperature, with enzymes, herbs or probiotics. This natural way of colon cleansing was discovered due to the belief that undigested meat and other foods cause mucus buildup in colon produces toxins which might escape into the circulation and poison the body. Fatigue, headache, weight gain and lethargy are the symptoms of intoxication.   -Koya Satyasri

Fatty liver – A Disease of the Modern Age!

  Fatty liver is the disease of the new age its victims have enormously risen in the past decade, all raising the finger at the lifestyle changes. In a normal healthy individual there is some amount of fat, but it is labeled as fatty liver when more than 10%of the organ weight is due to fat deposits. There are two types of Fatty liver diseases:   Alcoholic Fatty Liver Disease (ALD): As the name suggests it is caused by heavy drinking. The symptoms may show up even due to Hepatitis C, over loading of Iron, obesity or the genes.   Non-Alcoholic Fatty Liver Disease (NALD): It is a tricky entity as there no explanations why some people suffer from fatty liver disease while others do not. The possible cause will be; the genetic factors, overweight, insulin resistance due to which the cells become hostile to the action of the hormone, high blood sugar or hyperglycemia indicating diabetes type 2 and abnormal lipid profile i.e. high cholesterol levels.   There is limited understanding of why some fatty livers develop inflammation that progresses to cirrhosis, scarring of the liver. Other rare conditions that cause fatty liver are: Malnutrition, autoimmune diseases, medications and crash diets.   The treatment is not well defined; well it is a multi-dimensional approach diet control and physical activity form the main pillars of the treatment. The additives include vaccination against Hepatitis A and Hepatitis B, in certain advanced conditions liver transplant is only hope!

చాక్లెట్లు తినకుండా చేసే ఆట

  ‘నీకు ఇష్టమైన ఆహారం ఏమిటి?’ అని ఏ పిల్లవాడినైనా కదిపి చూడండి! ‘చాక్లెట్లు, కేకులు, ఐస్క్రీం, కోక్, పిజ్జా.....’ అంటూ మన మెదడు మొద్దుబారిపోయేలా చాంతాడంత జాబితా చెబుతారు. ఎప్పుడో అడపాదడపా ఇలాంటి చిరుతిళ్ల మీద మనసు పారేసుకోవడం తప్పుకాదు. కానీ ఇవి లేనిదే రోజు గడవని పరిస్థితి వస్తే మాత్రం నష్టపోయేది పిల్లలే! ఆ మాట వారికి చెప్పినా అర్థం చేసుకునే వయసు కాదు.   పిల్లలకీ, చిరుతిళ్లకీ ఉన్న అవినాభావ సంబంధం ఏ ఒక్క దేశానికో పరిమితం కాదు. ఇంగ్లండులోని పిల్లలు కూడా పళ్లు, కూరగాయలు పూర్తిగా పక్కనపెట్టేసి చిరుతిళ్ల మీద పడుతున్నారట. తినాల్సిన మోతాదుకంటే మూడురెట్లు ఎక్కువ తీపిని లాగించేస్తున్నారట. వీటితో ఊబకాయం, డయాబెటిస్ లాంటి సమస్యలు పెరిగిపోతున్నాయి. అందుకనే ఇంగ్లండులోని Exeter అనే విశ్వవిద్యాలయానికి చెందిన సైకాలజిస్టులు దీనికి ఒక పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేశారు. ఒక కంప్యూటర్ గేమ్ని రూపొందించి పిల్లల మీద ప్రయోగించారు.   చాక్లెట్లాంటి పదార్థాలు ఒక రకమైన వ్యసనాన్ని కలగచేస్తాయి. అందుకనే వీటిని చూడగానే... మెదడు ‘కొనేసెయ్, తినేసెయ్’ అంటూ రెచ్చగొడుతుంది. స్వీయనియంత్రణ (self- control) కోల్పోతారు. ఒక చిన్న గేమ్ ద్వారా ఈ స్వభావాన్ని మార్చాలనుకున్నారు సైకాలజిస్టులు. ఈ ఆటలో పిల్లవాడికి కంప్యూటర్ స్క్రీన్ మీద ఒకో ఆహారపదార్థమూ కనిపిస్తుంది. అది ఆరోగ్యానికి మంచిదైతే దాని పక్కన సంతోషంగా ఉండే బొమ్మ కనిపిస్తుంది. ఆరోగ్యానికి అంత మంచిది కాకపోతే విషాదంగా ఉన్న మొహం కనిపిస్తుంది. సంతోషకరమైన మొహాన్ని చూసినప్పుడు పిల్లలు బటన్ నొక్కాల్సి ఉంటుంది. ఆట ముగిసిన తర్వాత పిల్లల్ని వాళ్లకి కావల్సిన ఆహారపదార్థాలు కొనుక్కోమన్నారు. ఆశ్చర్యంగా పిల్లలు ఇదివరకులా కాకుండా మంచి ఆహారం వైపు ఎక్కువగా మొగ్గుచూపారట. అంటే వారు ఆడిన ఆట మెదడు మీద తెలియకుండానే సానుకూల ప్రభావం చూపిందన్నమాట. ఇదే మార్పుని పాఠాల ద్వారా, సెమినార్ల ద్వారా తీసుకురావాలంటే బోలెడు ఖర్చు, సమయం వృధా అవుతాయి. కానీ ఏడంటే ఏడు నిమిషాలలో ముగిసిపోయిన ఆటతో వారిలో అనూహ్యమైన మార్పుని సాధించారు పరిశోధకులు.   ఈ ప్రయోగం కోసం 4 నుంచి 11 ఏళ్ల వయసు ఉన్న 200 మంది పిల్లలను ఎంచుకున్నారు. వీరందరి మీదా ఆట ఒకే తీరున ప్రభావం చూపిందట. అంటే ఇలాంటి వీడియో గేమ్స్తో చిన్నా, పెద్దా... ఎవరి మీదైనా సానుకూల ప్రభావం చూపించవచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి ఆలోచనతో Dr Natalia Lawrence అనే శాస్త్రవేత్త పెద్దలలో చిరుతిళ్ల అలవాట్లు మార్చేందుకు, Food Trainer అనే యాప్ను రూపొందించారు. కావాలంటే గూగుల్ ప్లేలో ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుని చూడండి. - నిర్జర.    

తల్లి ప్రేమతో తెలివితేటలు పెరుగుతాయా!

  తల్లి ప్రేమకి హద్దులు ఉండవు. పోలికలూ దొరకవు. మరి ఆ ప్రభావం ఊరికనే పోతుందా! తల్లి ప్రేమతో మెదడే మారిపోతుందని కొన్ని పరిశోధనలు రుజువుచేస్తున్నాయి. తల్లి ప్రేమని పొందే విద్యార్థులు మిగతావారితో పోలిస్తే చదువులో చురుగ్గా ఉంటారనీ, పరిపక్వతతో వ్యవహరిస్తారనీ తెలుస్తోంది. తల్లి అనురాగాన్ని పొందే పిల్లల మెదడులో కూడా అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయని కూడా కొందరు పరిశోధకులు నిరూపించారు.   పిల్లల మెదడు మీద తల్లి ప్రభావాన్ని తేల్చేందుకు పరిశోధకులు ఓ 92 మంది పిల్లలను ఎన్నుకొన్నారు. వీరంతా కూడా 3 నుంచి 6 ఏళ్ల వయసులోపువారే! ప్రయోగంలో భాగంగా పిల్లవాడిని తల్లితో పాటు ఐదు నిమిషాల పాటు ఒక గదిలో ఉంచారు. ఆ సమయంలో ఏదో ఫారం పూర్తిచేయమని తల్లికి చెప్పారు. పిల్లవాడి కళ్ల ముందర ఓ ఆకర్షణీయమైన కాగితంలో చుట్టిన బహుమతిని ఉంచారు. తల్లి ఫారంని పూర్తిచేసేవారకూ కూడా పిల్లవాడు ఆ కాగితంలో తన కోసం ఏ బహుమతి ఉందో చూడ్డానికి లేదంటూ షరతు విధించారు.   సహజంగానే పిల్లవాడు తన ముందున్న ప్యాకెట్లో ఉన్న బహుమతిని తీసి చూడాలన్న తపనతో ఉంటాడు. ఆ సమయంలో తల్లి ఒక పక్క ఫారంని పూర్తిచేస్తూనే తన కొడుకుని ఏ విధంగా సముదాయించాల్సి వచ్చేది. ఈ సమయంలో వారిని గమనించేందుకు కొందరు సైకాలజిస్టులను నియమించారు. పిల్లవాడితో తల్లి ఎంత ప్రేమగా వ్యవహరిస్తోందో చూసి, దాని బట్టి వారిరువురి మధ్య బంధాన్ని అంచనా వేశారు.   ఓ నాలుగేళ్లు గడచిన తర్వాత ఆనాటి పిల్లలను మళ్లీ ల్యాబ్కు తీసుకువచ్చారు పరిశోధకులు. అక్కడ MRI స్కానింగ్ ద్వారా వారి మెదడులో వచ్చిన మార్పుని అంచనా వేశారు. ప్రేమగా చేసుకునే తల్లులు ఉన్న పిల్లల్లోని హిప్పోకేంపస్ అనే భాగంలో అనూహ్యమైన ఎదుగుదల వచ్చినట్లు గమనించారు. తల్లి అంత ప్రేమగా వ్యవహరించని పిల్లలకంటే వీరి హిప్పోకేంపస్ ఏకంగా పదిశాతం ఎక్కువగా ఎదిగింది. తల్లిప్రేమ పొందిన పిల్లలలో డిప్రెషన్ వంటి లక్షణాలు కూడా తక్కువగా ఉన్నట్లు ఈ ప్రయోగంలో తేలింది.   మనలో నేర్పు, జ్ఞాపకశక్తి, ఒత్తిడిని ఎదుర్కోవడం వంటి లక్షణాలన్నింటినీ హిప్పోకేంపస్ నియంత్రించగలదు. ఈ హిప్పోకేంపస్ బాగుంటే మనిషి అద్భుతాలు సాధించేందుకు సిద్ధంగా ఉంటాడన్న మాట! మరి ఆ అద్భుతాల వెనుక తల్లి ప్రేమ దాగుందన్న విషయం తేలిపోయిందిగా! - నిర్జర.  

మెదడు బాగుండాలా? రెండు నిమిషాలు మౌనం పాటించండి!

నిశ్శబ్దానికి ఉన్న విలువ గురించి భారతీయులకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. వేల సంవత్సరాల క్రితమే వారికి మౌనంలో దాగిన జ్ఞానం గురించి అవగాహన ఉంది. అందుకే మనసుని నిశ్చలంగా నిలిపి ఉంచే ధ్యానాన్ని కనిపెట్టారు. ‘ఊరికే అలా రాయిలాగా నిశ్చలంగా కూర్చుంటే ఏంటి ఉపయోగం? అంటూ ఒకప్పుడు గేలి చేసిన పాశ్చత్య ప్రపంచం కూడా ఇప్పుడు మౌనం వల్ల కలిగే అద్భుత ఫలితాల గురించి తెలుసుకుని ఆశ్చర్యపోతున్నారు. మెదడు మరింత చురుగ్గా! ఓ నాలుగు సంవత్సరాల క్రితం నిశ్శబ్దకరమైన వాతావరణంలో ఉంటే, మెదడుకి ఏమన్నా ఉపయోగం ఉందేమో కనుక్కోవాలన్న ఆలోచన వచ్చింది శాస్త్రవేత్తలకి. ఆలోచన వచ్చిందే తడువుగా కొన్ని ఎలుకల మీద ఓ ప్రయోగం చేశారు. రోజుకి రెండు గంటలపాటు ఎలుకలకి ఎలాంటి శబ్దమూ చేరకుండా, ప్రశాంతమైన వాతావరణంలో ఉండనిచ్చారు. దాంతో వాటి మెదడులోని హిప్పోకేంపస్ అనే భాగంలో కొత్త కణాలు ఏర్పడటం చూసి పరిశోధకులు బిత్తరపోయారు. మన జ్ఞాపకాలు, ఉద్వేగాలు, నైపుణ్యాలను నియంత్రించడంలో ఈ హిప్పోకేంపస్‌ది ముఖ్యపాత్ర! అంటే నిశ్శబ్దమైన వాతావరణంలో ఉండటం వల్ల మన మెదడు మరింత చురుగ్గా మారే అవకాశం ఉందన్నమాట. సమస్య మరింత తేలికగా!   నిశ్శబ్దంలో ఉండటం లేదా మనసుని నిశ్చలంగా ఉంచుకోవడం వల్ల... సమస్యలని పరిష్కరించడం కూడా తేలికగా మారిపోతుందని నిపుణులు చెబుతున్నారు. మెదడు అటూఇటూ పోకుండా నేరుగా సమస్య మీదే తన దృష్టిని కేంద్రీకరించేందుకు కావల్సిన స్వేచ్ఛ దొరుకుతుందట. సరికొత్తగా, సృజనాత్మకంగా ఆలోచించే అవకాశమూ దక్కుతుంది. మెదడుని అలా నిశ్చలంగా ఉంచే ప్రయత్నం చేస్తే, అసలు ఆలోచనలే ఉండవు కదా! అన్న అనుమానం రావచ్చు. మెదడు విశ్రాంతిగా ఉన్నప్పుడు కూడా, మనం ఏ సమస్యనైతే మెదడుకి అందించామో.... దాన్ని విశ్లేషిస్తూనే ఉంటుంది. శబ్దంతో ఒత్తిడి   ఇప్పటివరకూ నిశ్శబ్దం గురించి చెప్పుకొన్నాం కాబట్టి, ఇప్పుడు శబ్దం వల్ల ఏర్పడే ఫలితం కూడా ఓసారి చూద్దాం. చుట్టూ అదేపనిగా శబ్దాలు వినిపిస్తూ ఉంటే శరీరం, ఒత్తిడిని కలిగించే రసాయనాలను (stress hormones)ను విడుదల చేస్తుందని తేలింది. గాఢ నిద్రలో ఉన్నా కూడా పక్కనే వినిపించే శబ్దాలకు మెదడు కంగారుపడుతూనే ఉంటుందట. నిరంతరం రణగొణధ్వనుల మధ్య ఉండే పిల్లల్ని గమనించినప్పుడు.... ఆ శబ్దాలు వారి చదువు, ఎదుగుదల, తెలివితేటల మీద తీవ్రమైన ప్రభావం చూపుతున్నట్లు తేలింది. ఆ శబ్దాలకు అలవాటుపడిన పిల్లలు ఆఖరికి ఎదుటివారు ఏం మాట్లాడుతున్నారో కూడా విశ్లేషించే సామర్థ్యాన్ని కోల్పోతున్నారట!   ఏతావాతా... నిశ్శబ్దకరమైన వాతావరణంలో ఉండే ప్రయత్నం చేయడం, మనమూ మౌనంగా ఉండటం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయని తేలిపోయింది! అందుకే రెండు నిమిషాల పాటు మంచి సంగీతాన్ని విన్నప్పుడు కలిగే హాయికంటే, రెండు నిమిషాల పాటు మౌనంగా ఉన్నప్పుడ పొందే ప్రశాంతతే ఎక్కువని తేల్చారు పరిశోధకులు. - నిర్జర

పిల్లల ఆహారంలో విషం

ఇంట్లో పిల్లవాడు ఉంటే గారాబంగా చూసుకుంటాం. వాడి చిన్ని పొట్ట ఆకలితో ఉందన్న అనుమానం రాగానే... కడుపు నిండా ఆహారం పెడతాము. కానీ ఆ ఆహారంలో విషం ఉందని తెలిస్తే! అవును! పిల్లలకి అందించే ఆహారంలో ఆర్సెనిక్ (పాషాణం) అనే ప్రాణాంతక రసాయనం ఉంటోందని చెబుతున్నారు ఐర్లాండ్ పరిశోధకులు.   ఓ అర్నెళ్లు వచ్చిన పిల్లలకి పాలతో పాటుగా ఘనాహారం కూడా పెడుతుంటాము. అందుకోసం గోధుమలు, బియ్యంతో చేసిన బేబీ ఫుడ్స్ దొరుకుతూ ఉంటాయి. ఈ తరహా ఆహారాన్ని ‘ఫార్ములా ఫుడ్స్’ అంటారు. అయితే ఈ ఫార్ములా ఫుడ్స్లో ప్రాణాంతమైన ఆర్సెనిక్ అనే రసాయనం ఉంటోందని ఎప్పటినుంచో ఆరోపణలు వస్తున్నాయి. అందుకే జనవరి 2016లో పిల్లల ఆహారంలో ఆర్సెనిక్ అదుపులో ఉండాలంటూ యూరోపియన్ యూనియన్ హెచ్చరించింది.   యూరోపియన్ యూనియన్ చేసిన హెచ్చరికలు ఎంతవరకు పనిచేస్తున్నాయో చూడాలనుకున్నారు పరిశోధకులు. ఇప్పటికీ ఓ 50 శాతం బేబీ ఫుడ్స్లో ఆర్సెనిక్ మోతాదుకి మించి ఉంటోందని తేలింది. బియ్యంతో చేసిన బేబీ ఫుడ్స్లో అయితే ఈ పరిస్థితి మరీ దారుణంగా కనిపించింది. బియ్యంతో చేసిన ఫార్ములా ఫుడ్స్లో దాదాపు 75 శాతం సందర్భాలలో విచ్చలవిడిగా ఆర్సెనిక్ కనిపించింది. బియ్యంతో చేసిన బేబీ ఫుడ్స్ సురక్షితం అని మన నమ్మకం. అవి పిల్లలకి సులభంగా జీర్ణమవుతాయనీ, ఎలాంటి అలెర్జీలూ రావని, పోషకాలు ఎక్కువగా ఉంటాయని నమ్ముతాము. కానీ అవే బియ్యపు ఆహారంలో ఆర్సెనిక్ శాతం ఎక్కువగా కనిపించడం బాధాకరం.   ఇంతకీ ఈ ఆర్సెనిక్ ఎక్కడి నుంచి వస్తోంది? అంటే స్పష్టమైన కారణం కనిపిస్తుంది. పంటని పండించేటప్పుడు చల్లే పురుగుమందులు, దాన్ని నిల్వ చేసేటప్పుడు వాడే క్రిమిసంహారక మందులు... అన్నింటిలోనూ ఆర్సెనిక్ పుష్కలంగా ఉండే అవకాశం ఉంది. ఇక భూమి, నీరు, గాలి కాలుష్యం కావడం వల్ల కూడా ధాన్యపుకంకుల్లోకి ఆర్సెనిక్ చేరే ప్రమాదం ఉంది.   ఎంతటివారికైనా ఆర్సెనిక్ ప్రమాదకరమే! ఇక పసిపిల్లలకైతే ఇది విషంతో సమానం. ఆర్సెనిక్ వల్ల పిల్లల్లో ఎదుగుదల లోపాలు, తెలివి మందగించడం, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, నరాల బలహీనత.... వంటి సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంది. వారి శరీరంలో భాగాలన్నీ చురుగ్గా ఎదుగుతున్న సందర్భంలో ఆర్సెనిక్ శాపంగా మారవచ్చు. పెద్దల బరువుతో పోల్చుకుంటే పిల్లలు, తాము తినాల్సినదానికంటే ఎక్కువ ఆహారాన్నే తింటారు. కాబట్టి వారి శరీరంలో ఆర్సెనిక్ కూడా ఎక్కువగా చేరుతుందన్నమాట.   దురదృష్టం ఏమిటంటే... బేబీ ఫుడ్స్ని ఉత్పత్తి చేసే సమయంలో చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే, వీటిలోని ఆర్సెనిక్ 85 శాతం తగ్గిపోయే అవకాశం ఉందట. దీన్నిబట్టి బేబీఫుడ్స్ కంపెనీలు ఎంత నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నాయో అర్థమవుతోంది. అందుకని ఇక మీదట హెచ్చరికలు చేసి ఉపయోగం లేదనీ... ప్రతి బేబీఫుడ్ ప్యాకెట్ మీదా అందులో ఆర్సెనిక్ శాతం ఎంత ఉందో తెలిపేలా ఒక చట్టం చేయాలని పరిశోధకులు కోరుతున్నారు. దీనివల్ల వినియోగదారులే జాగ్రత్తపడే అవకాశం ఉంటుంది. - నిర్జర.    

వైన్ తాగితే మెదడుకి మంచిదా!

  దాదాపు పదివేల సంవత్సరాల నుంచి మనిషి వైన్ పుచ్చుకుంటూనే ఉన్నాడు. హద్దులు దాటకుండా వైన్ తాగితే ఆరోగ్యానికి మంచిదన్న వాదనలూ ఉన్నాయి. గుండెజబ్బులు, డయాబెటిస్, పక్షవాతం, పేగు కేన్సర్- ఇలా చాలా సమస్యలు రాకుండా, వచ్చినా ప్రాణాంతకం కాకుండా వైన్ కాపాడుతుందట. ఇప్పుడు వైన్ తాగడం వల్ల ఏకంగా మెదడులోని న్యూరాన్లు ఆరోగ్యంగా ఉంటాయని చెబుతున్నారు పరిశోధకులు.   స్పెయిన్కు చెందిన Institute of Food Science Research పరిశోధకులు మెదడు మీద వైన్ ప్రభావాన్ని అంచనా వేసే ప్రయత్నం చేశారు. ప్రతి ఆహారమూ మన శరీరంలో కొన్ని ప్రత్యేక రసాయనాలను విడుదల చేస్తుంది. అలాగే వైన్ వల్ల కూడా కొన్ని రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. వీటిని wine-derived human gut metabolites అంటారు. వైన్ పుచ్చుకునేవారి జీర్ణాశయం నుంచి పరిశోధకులు ఈ metabolitesను సేకరించారు.   వైన్ తాగేవారి metabolites ప్రభావం న్యూరాన్ల మీద ఎలా పనిచేస్తుందో గమనించే ప్రయత్నం చేశారు. అనారోగ్యం, వృద్ధాప్యం, ఒత్తిడి వంటి పరిస్థితుల్లో ఈ న్యూరాన్లు సరిగా పనిచేయవు. న్యూరాన్ల పనితీరు సవ్యంగా లేకపోతే మెదడు పనితీరు కూడా మందగిస్తుంది. అది మతిమరపు, పార్కిన్సన్స్, అల్జీమర్స్ వంటి వ్యాధులకు దారితీస్తుంది.   వైన్ పుచ్చుకున్నవారిలోని metabolites, న్యూరాన్లని రక్షించే ప్రయత్నం చేయడం చూసి శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. వైన్ నుంచి వెలువడిన రసాయనాలు న్యూరాన్లు నిర్జీవం కాకుండా కాపాడుతున్నాయని గమనించారు. అయితే మోతాదు మించకుండా వైన్ పుచ్చుకుంటేనే ఈ ఉపయోగం ఉంటుందనీ.... హద్దు దాటితే అసలుకే మోసం వస్తుందనీ హెచ్చరిస్తున్నారు. ఒక అంచనా ప్రకారం ఆడవారైతే ఒక గ్లాసు, మగవారు రెండు గ్లాసులను మించకుండా తాగితే మోతాదులో తాగినట్లు లెక్క! మరి అ లెక్కకు మించకుండా చుక్క వేసుకుంటారా లేదా అన్నది అనుమానమే! - నిర్జర.

ఎండాకాలం చల్లటి బీరు తాగితే!

  ఎండాకాలం వస్తే చాలు బార్లన్నీ కిటకిటలాడిపోతాయి. చల్లటి బీరుతో గొంతు తడుపుకోవాలని జనాలంతా ఉత్సాహపడిపోతుంటారు. బీరులో నీటి శాతం ఎక్కువ, ఆల్కహాల్‌ శాతమేమో తక్కువ. కాబట్టి వేసవి తాపాన్ని తీర్చుకునేందుకు బీరుని మించిన దారి లేదని చాలామంది అభిప్రాయం. ఇదెంత వరకు నిజం!   బీర్‌ని పుచ్చుకోవడం జనాలకి కొత్తేమీ కాదు. వేల ఏళ్ల నుంచి ఈ అలవాటు వస్తున్నదే! అయితే ఒకప్పుడు బీర్‌ పుచ్చుకునే ఉద్దేశం వేరు. మంచినీటిలో ఉండే సూక్ష్మజీవులని చంపేందుకు అందులో ఓ నాలుగు చుక్కలు ఆల్కహాల్‌ వేసేవారట. అందులో మహా అయితే .5 శాతం మాత్రమే ఆల్కహాల్ ఉండేది. కానీ ఇప్పడు పరిస్థితి మారిపోయింది. కనీసం 4 నుంచి 5 శాతమన్నా ఆల్కహాల్‌ లేనిదే బీరు తయారవ్వడం లేదు. బీరు తాగే అలవాటు మాత్రం తగ్గలేదు సరికదా... మంచినీళ్లు, టీ తర్వాత మనుషులు ఎక్కువగా తాగేది బీరే!   బీరులో ఉండే ఆల్కహాల్‌ వల్ల లివర్ దెబ్బతింటుందన్న విషయం తెలిసిందే! ఇందులో ఆల్కహాల్ శాతం తక్కువే అయినప్పటికీ, గుండెజబ్బుల వంటి సమస్యలు ఉన్నవారికి ఇది తప్పకుండా చేటు చేస్తుందని చెబుతున్నారు. ఇక ఎండాకాలం బీర్‌ తీసుకోవడం వల్ల డీహేడ్రేషన్‌ రాదన్నది కూడా ఉత్త మాటే!   మన శరీరంలో anti-diuretic (ADH) అనే హార్మోను ఉంటుంది. మనం తీసుకునే నీరు వీలైనంతవరకూ శరీరంలోనే ఉండేలా ఈ హార్మోను రక్షిస్తుంది. బీరు తాగినప్పుడు ఈ ADH పనితీరు దెబ్బతింటుంది. అందుకే ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. ఇదంతా బీరులో ఉన్న నీరు వల్ల అనుకుంటారు. కానీ ADH హార్మోను పనితీరు మందగించడం వల్ల అని గమనించలేరు. 200 ఎం.ఎల్‌ బీరు తాగితే 320 ఎం.ఎల్‌ నీరు శరీరంలోంచి పోతుందని ఓ అంచనా! అంటే శరీరంలోకి వెళ్లే నీటికంటే, బయటకి వచ్చే నీరే ఎక్కువన్నమాట!   ఎండాకాలం చల్లటి బీరుతో మరో ఇబ్బంది కూడా ఉంది. మన శరీరం ఎప్పుడూ ఒకే తరహా ఉష్ణోగ్రతలో ఉండే ప్రయత్నం చేస్తుంది. ఈ body temperature కంటే దిగువన ఉండే చల్లటి పదార్థాలు శరీరంలోకి చేరినప్పుడు, డీహైడ్రేషన్‌ సమస్య మరింతగా పెరుగుతుంది. ఇక జలుబులాంటి ఇతరత్రా సమస్యలు సరేసరి!   ఇక మీదట దాహం తీర్చుకోవాలి అనుకున్నప్పుడు ఏ మంచినీరో, కొబ్బరినీరో పుచ్చుకోవాలి కానీ మద్యం జోలికి పోవద్దన్నది నిపుణుల మాట. కాదూ కూడదూ అంటే అందుకు తగినంత ఆహారం, నీరు తీసుకోమని సూచిస్తున్నారు.   - నిర్జర.

వయసుని మోసం చేయవచ్చు...!

    ప్రతి జీవికి ప్రకృతి ‘ఇంత వయసు వరకూ బతకవచ్చంటూ’ హామీ ఇస్తుంది. అలాగే మనిషికి కూడా నిండు నూరేళ్లు బతకమని దీవించింది. కానీ మనిషి మాత్రం అస్తవ్యస్తమైన జీవనశైలితో తన ఆయుష్షుని తుంచేసుకుంటున్నాడు. కాస్త జాగ్రత్త పడితే ఆ తప్పుని సరిదిద్దుకోవచ్చుననీ సూచిస్తున్నారు పరిశోధకులు.   బ్రిటన్లోని Babraham Instituteకి చెందిన పరిశోధనకులు వయసుని నియంత్రించే ఓ వ్యవస్థను కనుగొన్నారు. DNA methylation అని పేర్కొనే ఈ వ్యవస్థ, జన్యువుల పనితీరుని ప్రభావితం చేస్తుందని తేలింది. ఈ వ్యవస్థ మరీ వేగంగా పనిచేస్తుంటే వృద్ధాప్యం త్వరగా కమ్మేస్తోందని గమనించారు. ఉదాహరణకు- ఫ్యాటీలివర్‌ వంటి సమస్యలు ఉన్నవారిలో ఈ గడియారం త్వరత్వరగా పరిగెడుతోందట. మరోవైపు, సుదీర్ఘమైన ఆయుష్షు కలిగినవారిలో ఇది నిదానంగా పనిచేస్తోందట!   వృద్ధాప్యాన్ని నియంత్రించే గడియారాన్ని కనుగొన్నారు సరే! మరి మన ఆహారపు అలవాట్లు సదరు గడియారం మీద ప్రభావం చూపుతాయా అన్న అనుమానం కలిగింది పరిశోధకులుకి. అనుమానం వచ్చిందే తడవుగా కొన్ని ఎలుకల మీద తమ ప్రయోగాన్ని సాగించారు. సదరు ఎలుకలకి కొవ్వు పదార్థాలని అధికంగా అందించినప్పుడు, ఈ గడియారం వేగం పుంజుకుంటున్నట్లు తేలింది.   ఈ ఆవిష్కరణ తరువాత మనిషి జీవితాన్నీ, ఆయుష్షునీ ప్రభావితం చేసే మరిన్ని పరిశోధనలు జరగనున్నాయి. మనిషిలోని ఈ గడియారం తీరుని గమనించడం ద్వారా రాబోయే ప్రమాదాలను ముందుగానే పసిగట్టవచ్చు. ఈ గడియారాన్ని ప్రభావితం చేస్తున్న రసాయనాలను కనుక ఛేదించగలిగితే, వృద్ధాప్యాన్నే నిలువరించవచ్చు. ఇంకా మాట్లాడితే వృద్ధాప్యాన్ని సైతం వెనక్కి మళ్లించి తిరిగి యవ్వనాన్ని కూడా సాధించవచ్చు. ఆయుష్షునీ పెంచవచ్చు. ఇవన్నీ వినడానికి ఇప్పుడు అతిశయోక్తులుగా తోస్తాయి కానీ, భవిష్యత్తులో తప్పకుండా సాకారం అవుతాయని ఆశిస్తున్నారు శాస్త్రవేత్తలు.   - నిర్జర.  

ఉప్పు తింటే... తింటూ ఉండాల్సిందే!

  ఉప్పు లేని జీవితాన్ని ఊహించడం కష్టం. ఒంట్లో ముఖ్యమైన జీవక్రియలు జరగాలంటే ఉప్పు లోపలకి చేరాల్సిందే. కానీ అవసరం కోసం తినాల్సిన ఉప్పుని మోతాదుకి మించి తీసుకోవడం ఎక్కువైంది. ఫలితం.. ఒంట్లో నానా సమస్యలు మొదలవుతున్నాయి. ఈ సమస్యలన్నీ ఒక ఎత్తయితే... అసలు ఉప్పు తింటే మరింత ఆహారం తీసుకోవాల్సి వస్తుందని తేలడం మరో విచిత్రం!   జర్మనీలోని ఒక సంస్థ, అంతరిక్షంలో ఉండే వ్యోమగాముల శరీరం మీద ఉప్పు ప్రభావం ఎలా ఉంటుందో పరిశీలించే ప్రయత్నం చేసింది. ‘ఉప్పు ఎక్కువ తినడం వల్ల వీలైనన్నిసార్లు మూత్రానికి వెళ్లక తప్పద’న్నది  ఇప్పటివరకూ ఉన్న అభిప్రాయం. శరీరానికి ఎక్కువైన ఉప్పుని బయటకు పంపేందుకు ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లాల్సి వస్తుందని పెద్దలు చెబుతూ ఉంటారు. అంతరిక్షంలో ఇలాంటి పరిస్థితి ఇబ్బంది కలిగిస్తుంది కదా! పైగా అక్కడ నీటి సమస్య కూడా ఉంటుందయ్యే! అందుకే వ్యోమగాములు తినే ఉప్పుకీ, వారి శరీరంలో జరుగుతున్న ప్రక్రియలకీ మధ్య ఉండే సంబంధాన్ని కనుగొనే ప్రయత్నం చేశారు.   పరిశోధనలో భాగంగా ఓ పదిమంది అభ్యర్థులను, వ్యోమనౌకలో ఉండే వాతావరణంలో ఉంచారు. వీరిలో కొందరిని 105 రోజులపాటు, మరికొందరిని 205 రోజులపాటు ఆ తరహా వాతావరణంలో ఉంచారు. వీరికి ఇచ్చే ఆహారంలో ఉప్పు మోతాదుని రెండుమూడు రకాలుగా మార్చిచూశారు. ఆశ్చర్యం! ఉప్పు ఎక్కువగా తినడం వల్ల నీరు ఎక్కువకాదు... తక్కువ తీసుకుంటున్నారని తేలింది. మరో వింత ఏమిటంటే... ఉప్పు ఎక్కువగా తినేవారు తమకు విపరీతంగా ఆకలి వేస్తోందంటూ తెగ తిన్నారట!   ఎక్కువ ఉప్పు తీసుకుంటే తక్కువ మూత్రం రావడం ఏమిటి? విపరీతంగా ఆకలి వేయడం ఏమిటి? అంటూ తలలు పట్టుకున్నారు శాస్త్రవేత్తలు. ఈ విషయాన్ని తేల్చుకునేందుకు ఇదే తరహా పరిశోధనను ఎలుకల మీద చేసి చూశారు. అప్పుడు బయటపడింది రహస్యం! శరీరంలో అధికంగా ఉన్న ఉప్పు మూత్రం ద్వారా బయటకు పోతున్న మాట వాస్తవమే. కానీ నీరు మాత్రం బయటకు వెళ్లకుండా తిరిగి కిడ్నీలలోకి చేరుకుంటోందట. ఒంట్లోని పనికిమాలిన ఉప్పుని ఎప్పటికప్పుడు సేకరించి బయటకు పంపేందుకు... శరీరం వీలైనంత నీటిని దాచుకుంటోంది!   ఉప్పుకీ, నీటికీ మధ్య సంబంధం తేలిపోయింది. మరి ఆకలి ఎక్కువగా వేయడానికి కారణం ఏమిటి? దీనికి ‘యూరియా’నే కారణం అని తేలింది. ఒంట్లోని నీరు మూత్రం ద్వారా బయటకు పోకుండా కిడ్నీలలోనే ఉండిపోయేందుకు యూరియా అవసరం అవుతుందట. ఈ యూరియాని ఉపయోగించుకోవాలంటే చాలా శక్తి అవసరం అవుతుంది. ఇందుకోసం ఎక్కువ తినాల్సి వస్తుంది!   ఉప్పు తింటే నీరు తక్కువగా తాగుతామనీ, తిండి ఎక్కువగా తింటామనీ.... ఈ పరిశోధనతో తేలిపోయింది. ఈ రెండూ కూడా ఒంటికి ఏమంత మంచిది కాదు కదా!!! - నిర్జర.      

చిరుతిళ్ల రహస్యం తెలిసిపోయింది

  పిజ్జా, బర్గర్, శాండ్విచ్... ఇవన్నీ ఒకప్పుటి తరానికి తెలియవు. ఇప్పటి తరానికి మాత్రం ఇవి లేనిదే రోజు గడవదు. కొందరు అడపాదడపా వీటిని రుచిచూసేందుకు సిద్ధపడితే, మరికొందరేమో ఇవి లేకుండా జీవితం వృధా అన్నంత వ్యసనంతో బతికేస్తుంటారు. జంక్ఫుడ్స్ పట్ల కొందరు ఎందుకంత కోరిక పెంచుకుంటారు? ఈ విషయం మీదే షికాగోలోని ఓ విశ్వవిద్యాలయానికి చెందిన నిపుణులు పరిశోధన నిర్వహించారు.   జంక్ఫుడ్స్కీ నిద్రలేమికీ మధ్య సంబంధం ఉందేమో అన్న అనుమానం చాలా రోజుల నుంచీ పరిశోధకులను వేధిస్తోంది. ఈ విషయాన్నే నిరూపించేందుకు నిపుణులు నడుం కట్టారు. ఇందుకోసం వారు ఓ బృందాన్ని ఎన్నుకొన్నారు. వీరిలో కొందరిని రోజులో కేవలం నాలుగు గంటలు మాత్రమే పడుకోమని చెప్పారు. మరికొందరేమో నిరభ్యంతరంగా ఎనిమిదేసి గంటలు పడుకోవచ్చునని సూచించారు. ఇలా నిద్రపోయి లేచిన తరువాత, వారందరికీ రకరకాల వాసనలు చూపించారు. ఆశ్చర్యకరంగా తక్కువసేపు నిద్రపోయిన లేచినవారు... ఘాటైన వాసనలకు త్వరగా ప్రతిస్పందిస్తున్నట్లు తేలింది. కస్టమర్లను ఆకర్షించేందుకు జంక్ఫుడ్స్ని రకరకాల మసాలాలతో ముంచెత్తేస్తారన్న విషయం తెలిసిందే కదా!   నిద్రలేమికీ, జంక్ఫుడ్స్ పట్ల కోరికకీ మధ్య ఉన్న సంబంధం ఈ పరిశోధనతో తేలిపోయింది. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసేవారు ఈ తరహా ఆహారాన్ని ఇష్టపడేందుకు బహుశా ఇదే కారణం కావచ్చు. ఎటూకాని పనివేళలు, సరిగా నిద్రపోనీయని ఒత్తిడి కారణంగా వీరు జంక్ఫుడ్స్ పట్ల మొగ్గు చూపుతారేమో!   నిద్రలేమి వల్ల పనికిమాలిన తిండికి అలవాటు పడటం ఒక ప్రమాదమైతే... అసలు మనం తీసుకునే కొన్ని రకాల ఆహారం ఆ నిద్రలేమికి కారణం కావడం మరో విచిత్రం. కొవ్వు, మాంసకృత్తులు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల సరిగా నిద్రపట్టదని నిపుణులూ హెచ్చరిస్తూ ఉంటారు. కానీ మనం రాత్రిపూట ఇలాంటి ఆహారాన్నే తీసుకోవడం గమనార్హం. అంటే తగిన ఆహారం తీసుకోకపోవడం వల్ల నిద్రపట్టకపోవడం, అలా నిద్రపట్టకపోవడం వల్ల మళ్లీ జంక్ ఫుడ్స్కి మొగ్గుచూపడం... ఇదంతా ఒక విషవలయంలాగా మారిపోతోందన్నమాట!   జంక్ ఫుడ్స్ వల్ల ఊబకాయం, రక్తపోటు, డయాబెటిస్, కొలెస్ట్రాల్, డిప్రెషన్, మలబద్ధకం... వంటి నానారకాల సమస్యలూ తలెత్తుతాయన్న విషయం తెలిసిందే! మరి జిహ్వచాపల్యానికి లొంగిపోయి ఇన్నేసి రోగాలను కోరితెచ్చుకోవడమో, ఆయుష్షు కోసం ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంచుకోవడమో మన చేతుల్లోనే ఉంది. - నిర్జర.    

పెంపుడు జంతువులతో రోగనిరోధకశక్తి పెరుగుతుంది

  ఇంట్లో పెంపుడు జంతువులు ఉంటే ఆ మానసిక ప్రశాంతతే వేరు! కానీ ఇప్పడు పరిస్థితులు అందుకు అనుకూలిస్తున్నట్లు కనిపించడం లేదు. ఒక పక్క ఇరుకు అపార్టుమెంట్లలో జీవనం, మరోపక్క ఉరుకులపరుగుల జీవితం.... వీటితో పెంపుడు జంతువులకి చోటు లేకుండా పోతోంది. ఇక పెంపుడు జంతువుల మీద ఉండే పరాన్నజీవులు, వాటి ధూళితో నానారకాల ఆరోగ్య సమస్యలూ వస్తాయని వినిపిస్తున్న హెచ్చరికలు సరేసరి! కానీ ఇందుకు విరుద్ధమైన పరిశోధన ఒకటి వెలుగులోకి వచ్చింది...   కెనడాకు చెందిన Anita Kozyrskyj అనే పరిశోధకురాలు తన బృందంతో కలిసి పిల్లల రోగనిరోధకశక్తి మీద పెంపుడు జంతువుల ప్రభావాన్ని అంచనా వేశారు. పిల్లలు తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచీ, ఈ లోకంలోకి వచ్చిన మూడు నెలల వరకూ... వారి ఇంట్లో పెంపుడు జంతువులు ఉంటే చాలా ఉపయోగమని గ్రహించారు. ఇలాంటి పిల్లలలో మున్ముందు ఆస్తమా వంటి అలెర్జీ సమస్యలు చాలా తక్కువగా నమోదయ్యాయట.   పెంపుడు జంతువులు ఇంట్లో ఉంటే Ruminococcus and Oscillospira అనే రెండు రకాల ఉపయోగకర సూక్ష్మజీవులు పిల్లలలో పెరగడాన్ని గమనించారు. ఈ రెండు సూక్ష్మజీవులూ కూడా శరీరంలో అలెర్జీలను, ఊబకాయాన్నీ నివారిస్తాయని తేలింది. బహుశా పెంపుడు జంతువుల ఒంటి మీద ఉండే క్రిములని ఎదుర్కొనే సందర్భంలో పిల్లల శరీరం ఇలాంటి సూక్ష్మజీవులను ఉత్పత్తి చేస్తూ ఉండవచ్చని భావిస్తున్నారు.   పసిపిల్లలు ఈ లోకంలోకి వచ్చాక పెంపుడు జంతువుల ప్రభావం ఉండవచ్చుగాక! కడుపులో ఉండగానే అవి ప్రభావం చూపడం ఏమిటి? అన్న అనుమానం రాకమానదు. ఆ సమయంలో తల్లి శరీరంలో ఉత్పత్తి అయ్యే క్రిములు వారి కడుపులో ఉన్న పిల్లలకు కూడా చేరడమే ఇందుకు కారణమని తేల్చారు. సిజేరియన్ ద్వారా బిడ్డ జన్మించినా, పిల్లలకు తల్లిపాలు పట్టకపోయినా కూడా ఈ తరహా రోగనిరోధకశక్తిలో ఎలాంటి మార్పూ కనిపించలేదు.   ఇంతకుముందు తరంలో పిల్లలు పెంపుడు జంతువులతో ఆడుకునేవారు, మట్టిలో దొర్లేవారు, ఏది పడితే అది కడుపు నిండా తినేవారు. కానీ ఇప్పుడు వారికి ఆ అవకాశమే లేదు. ఒకవేళ ఉన్నా... అది ప్రమాదం, ఇది మంచిది కాదు అంటూ నిరంతరం ఏవో ఒక హెచ్చరికలు అడ్డుకొంటూనే ఉన్నాయి. ఫలితం! వారి జీవితం ప్రకృతికి దూరంగా కృత్రిమంగా తయారైపోతోంది. శరీరం తనకు తానుగా రక్షించుకునే శక్తిని కోల్పోతోంది. ఇప్పుడు మళ్లీ ఒకో పరిశోధనా ఆ పాత రోజులే మంచివని గుర్తుచేస్తున్నాయి. కానీ ఈలోగా ఎన్ని విలువైన జీవితాలు వృధాగా మారిపోతున్నాయో కదా! - నిర్జర.  

మందుని అందులో కలిపి తాగితే... ప్రమాదమే!

మద్యపానం ఆరోగ్యానికి హానికరం! అన్న హెచ్చరిక అన్నిచోట్లా కనిపిస్తూనే ఉంటుంది. ఆ హెచ్చరికను ఖాతరు చేయకుండా జనం పీపాల కొద్దీ మద్యాన్ని పట్టిస్తూనే ఉన్నారు. మన హీరోలు సైతం పనిగట్టుకుని ప్రతి సినిమాలోనూ మందు సన్నివేశంలో నటిస్తూనే ఉన్నారు. తాగితే తాగారు... కనీసం మోతాదుని పాటించమనీ, అందులో కలిపే పానీయాల విషయంలో జాగ్రత్త వహించమనీ సూచిస్తున్నారు నిపుణులు.   నీరు, సోడా వంటివాటితో కలిపి మద్యాన్ని పుచ్చుకోవడానికీ... కెఫిన్‌ అధికంగా ఉండే శీతలపానీయాలతో కలిపి పుచ్చుకోవడానికీ చాలా తేడా ఉందంటున్నారు. ఈ విషయంలో నిజానిజాలని నిరూపించేందుకు కెనడాకు చెందిన కొందరు శాస్త్రవేత్తలు నడుం కట్టారు. ఇందుకోసం వారు 1981 నుంచి 2016 వరకు జరిగిన ఓ 13 పరిశోధనల ఫలితాలను పరిశీలించారు.   మద్యం, కెఫిన్‌ రెండూ విరుద్ధమైన ఫలితాలని ఇస్తాయన్న విషయం తెలిసిందే! ఆల్కహాల్‌ మెదడుని మత్తులో ముంచితే, కెఫిన్‌ మనిషిని ఉత్తేజపరుస్తుంది. కానీ ఈమధ్యకాలంలో కెఫిన్‌ అధికంగా ఉండే ‘రెడ్‌బుల్‌’ వంటి ఎనర్జీ డ్రింక్స్ కలిపి మద్యం పుచ్చుకునే అలవాటు ఎక్కువవుతోంది. ఇక మౌంటెన్ డ్యూ వంటి శీతల పానీయాలలోనూ కెఫిన్‌ అధికంగానే ఉంటుంది. కెఫిన్‌కి తోడు వీటిలో చక్కెరలూ అధికంగానే ఉంటాయి. వీటిని మద్యంలో కలిపి తాగడం వల్ల, మనిషి మద్యం మోతాదుని దాటేస్తాడని కెనడా పరిశోధకులు తేల్చారు. ఒక పక్క శరీరం తూగుతున్నా, నిద్రపోకుండానే గడిపేస్తాడట. ఇలాంటి పరిస్థితి వల్ల తాగి గొడవపడటం, వాహనాలని నడపలేకపోవడం... వంటి పరిస్థితులూ తలెత్తే ప్రమాదం ఉంది.   మామూలుగానే కెఫిన్‌ను అధికంగా తీసుకోవద్దని నిపుణులు సూచిస్తుంటారు. కెఫిన్‌ పానీయాల వల్ల ఉద్వేగం ఎక్కువవుతుందనీ, రక్తపోటు పెరిగిపోతుందనీ, గుండె వేగం హెచ్చుతుందనీ హెచ్చరిస్తుంటారు. చిన్నపిల్లలు, గర్భవతులు, పిల్లలకు పాలిచ్చే తల్లులు కెఫిన్‌కి వీలైనంత దూరంగా ఉండాలని చెబుతారు. అలాంటిది కెఫిన్, చక్కెర ఎక్కువగా ఉండే పానీయాలతో కలిపి మద్యాన్ని పుచ్చుకుంటే...   - నిర్జర. 

వేసవితో మనసు చెడిపోతుంది

  వేసవికాలంతో రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలుసు. డీహైడ్రేషన్ వంటి సందర్భాలలో ఈ సమస్యలు మెదడు మీద కూడా ప్రభావం కలిగిస్తాయన్న విషయమూ తెలుసు. కానీ ఎండాకాలం క్రుంగుబాటు, మతిభ్రమణం వంటి మానసిక సమస్యలు తీవ్రతరం అవుతాయని ఎప్పుడన్నా విన్నారా!   వియత్నాంలో మానసిక రుగ్మతలకు చికిత్సను అందించే  Hanoi అనే ఆసుపత్రి ఉంది. ఈ ఆసుపత్రిలో చేరే రోగుల సంఖ్యకీ ఎండలకీ మధ్య ఏమన్నా సంబంధం ఉందేమో అన్న అనుమానం వచ్చింది ఓ పరిశోధకునికి. దాంతో 2008 నుంచి 2012 వరకు ఓ ఐదేళ్ల పాటు అక్కడ చేరిన రోగుల వివరాలను సేకరించాడు. వీటిని విశ్లేషించగా ఆశ్చర్యకరమైన ఫలితాలు తేలాయి. - వేసవిలోని ఒక మూడు నుంచి ఏడు రోజుల వరకూ అధికంగా ఉష్ణోగ్రతలు నమోదైతే... మానసిక సమస్యలతో ఆసుపత్రిలో చేరే రోగుల సంఖ్య కూడా పెరిగిందట. - చలికాలంతో పోలిస్తే వేసవికాలంలో ఆసుపత్రిలో చేరే రోగుల సంఖ్య 24 శాతం ఎక్కువగా ఉంది. - సాధారణంకంటే ఒక్క శాతం ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నా కూడా ఆసుపత్రిలో రెండు శాతం ఎక్కువ రోగులు చేరుతున్నారు. - మూడురోజులకు మించి వడగాలులు వీచినప్పటికంటే వారంపాటు విడవకుండా వడగాలి వీచినప్పుడు రెట్టింపు రోగులు మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. - వృద్ధులు, నగరాలలో ఉండేవారు వేసవితో త్వరగా అనారోగ్యం పాలవుతున్నట్లు తేలింది.   వాతావరణంలోని అధిక ఉష్ణోగ్రతల మన మెదడు మీద ఇంతగా ప్రభావం చూపుతాయని ఎవరూ ఊహించి ఉండరు. కానీ తాజా పరిశోధనతో వేసవిలో కాస్త జాగ్రత్తగా ఉండాలన్న సూచన వినిపిస్తోంది. అంతేకాదు! గ్లోబల్‌ వార్మింగ్‌ వల్ల ప్రపంచవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయనీ... వీటి ప్రభావం మన మెదడు మీద ఉండే అవకాశం ఉందని కూడా పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.   ఈ పరిశోధన వియత్నాంలో జరిగినప్పటికీ మన దేశంలో ఇంతకంటే దారుణమైన ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వియత్నాంలో వేసవికాలం పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలకి మించవు. మరి మన దగ్గరేమో 40కి తగ్గవు. ఇక వడగాడ్పుల గురించి చెప్పేదేముంది!   - నిర్జర.

బి విటమిన్‌తో కాలుష్యం నుంచి రక్షణ

వాయుకాలుష్యం గురించి మళ్లీ చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది. పరిశ్రమలు, వాహనాల కారణంగా గాల్లోకి విపరీతంగా ధూళికణాలు చేరుకుంటున్న విషయం అందరూ మొత్తుకొంటున్నదే! మొహానికి మాస్క్‌ వేసుకోవడం తప్ప ఈ కాలుష్యం నుంచి తప్పించుకునేందుకు మరో మార్గం లేదని అందరూ నమ్మేవారు. కానీ బి విటమిన్‌తో, కాలుష్యం కలిగించే హాని నుంచి తప్పించుకోవచ్చునని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది.   ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం దాదాపు 90 శాతం మంది ప్రజలు పరిమితి మించిన కాలుష్యం ఉన్న ప్రాంతాలలో నివసిస్తున్నారు. ఈ కాలుష్యంలో ఉండే ధూళికణాలని P.M అనే పరిమాణంలో లెక్క వేస్తారు. ఒక ప్రాంతంలోని ధూళి కణాలు 2.5 P.M కంటే తక్కువ ఉంటే... అక్కడి ప్రజలు మృత్యువుతో కలిసి జీవిస్తున్నట్లే! మన వెంట్రుకలో 30వ వంతు ఉండే ఈ ధూళి కణాలు నేరుగా మన ఊపిరితిత్తులలోకి చేరిపోతాయి.   ఊపిరితిత్తులలోకి చేరిన ధూళికణాలు తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులకు దారితీస్తాయి. పసిపిల్లల పాలిట అయితే ప్రాణాంతకంగా మారతాయి. ఈ ధూళికణాలు నేరుగా మెదడులోకి కూడా చేరతాయనే ఈమధ్యే మరో పరిశోధన తేల్చింది. దీంతో మెదడులో ఊహించన మార్పులు జరుగుతాయనీ... మన ఆలోచనా సామర్థ్యం, జ్ఞాపకశక్తి మీద తీవ్ర ప్రభావం చూపుతాయనీ చెబుతున్నారు. ఇక శరీరంలోని చేరిన ధూళికణాలు ఏకంగా మన జన్యువుల పనితీరునే మార్చివేస్తాయన్నది మరో విశ్లేషణ. దీనివల్ల మన రోగనిరోధక శక్తి తీవ్రంగా దెబ్బతిని ఏకంగా కేన్సర్‌ వంటి వ్యాధులు దాడిచేసే ప్రమాదం ఉంది.   ఇదంతా కూడా వాయుకాలుష్యం వల్ల జరిగే అనర్థం. రోజూ పొట్ట చేతపట్టుకుని తిరిగేవారు ఈ అనర్థాల నుంచి తప్పించుకోవడం అసాధ్యం. అయితే బి విటమిన్‌ సప్లిమెంట్లను తీసుకోవడం వల్ల కాలుష్య కోరల నుంచి తప్పించుకోవచ్చునని ఓ పరిశోధన నిరూపిస్తోంది. ఈ విషయాన్నే నిరూపించేందుకు అమెరికాలోని పరిశోధకులు కొంతమందికి ఫోలిక్‌ యాసిడ్‌, B6, B12 ఉన్న మందులను అందించారు. ఆ తరువాత వీరిని 2.5P.M ధూళికణాలు ఉన్న వాతావరణంలోకి పంపించారు. ఆశ్చర్యకరంగా వీరి జన్యువుల మీద ఈ ధూళికణాల ప్రభావం దాదాపు 76 శాతం తగ్గిపోయినట్లు తేలింది.   కాలుష్యాన్ని ఎదుర్కొనేందుకు బీ విటమిన్‌ తోడ్పడుతుందని తేలడం ఇదే తొలిసారి. కాబట్టి ఈ విషయమై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉంటుంది. ఏది ఏమైనా బీ విటమిన్‌ వంటి పోషకాలు అధికంగా ఉండే దంపుడు బియ్యం, పాలు, గుడ్లు, కాయగూరలని తరచూ తీసుకోవడం వల్ల అపరిమితమైన ఆరోగ్యం దక్కుతుందని వేరే చెప్పనవసరం లేదు. ఇక వాటిలోని పోషకాలు ఏకంగా కాలుష్యపు కోరల నుంచి రక్షిస్తాయంటే ఇక చెప్పేదేముంది.   - నిర్జర.