20 ఏళ్ళ క్రితమే నరేంద్ర మోడీ అమెరికా యాత్ర..
భారత ప్రధాని నరేంద్రమోడీ అమెరికా ఆహ్వానం మీద అమెరికా పర్యటనకు వెళ్ళిన విషయం తెలిసిందే. అంతకుముందు గోధ్రా అల్లర్ల నేపథ్యంలో మోడీకి వీసా నిరాకరించిన అమెరికా ఇప్పుడు మోడీని తమ దేశానికి ప్రత్యేకంగా ఆహ్వానించిన సంగతి తెలిసిందే. కాగా, నరేంద్రమోడీ అమెరికా వెళ్ళడం ఇది మొదటిసారి కాదు. 20 సంవత్సరాల క్రితం అమెరికా ఆహ్వానం మీద అక్కడికి వెళ్ళిన మోడీ అక్కడ 30 రోజులు గడిపారు. అమెరికాలోని అభివృద్ధిని పరిశీలించి ఒక అవగాహనకి వచ్చారు. భారతదేశం నుంచి ఆరుగురు ప్రతినిధులను అమెరికాలో పర్యటించాలని అప్పట్లో ఆదేశం అందినప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి ముగ్గురు ప్రతినిధులు అమెరికా వెళ్ళారు. వారిలో నరేంద్రమోడీ, ఇప్పటి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఇప్పటి కేంద్ర మంత్రి అనంత్ కుమార్ కూడా వున్నారు. ఇప్పుడు మాదిరిగానే అప్పుడు కూడా గడ్డం పెంచుకుని వుండే నరేంద్ర మోడీ, కిషన్ రెడ్డి అద్వాని సూచన మేరకు నీట్గా షేవ్ చేసుకుని అమెరికా పర్యటనకు వెళ్ళారట.