అనిల్ అంబానీ.. స్వచ్ఛ భారత్ చీపురు...
ప్రధాని మోడీ స్వచ్ఛ భారత్ పిలుపు మేరకు రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనీల్ అంబానీ చీపురు పట్టారు. బుధవారం ఉదయం ముంబాయిలోని చర్చ్ గేట్ స్టేషన్ బయట చీపురు పట్టి శుభ్రం చేశారు. ఆ తర్వాత అనీల్ అంబానీ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనాలని పలువురు సెలెబ్రెటీలకు సవాల్ విసిరారు. మేరీ కోమ్, అమితాబ్, సానియా మీర్జా, శోభా డే, జర్నలిస్ట్ శేఖర్ గుప్తా, పాటల రచయిత ప్రషన్ జోషి, హృతిక్ రోషన్, హీరో నాగార్జునలతో పాటు రన్నర్స్ క్లబ్ ఆఫ్ ఇండియాకి అనిల్ అంబానీ స్వచ్ఛ్ భారత్ సవాల్ విసిరారు. ఈ సందర్భంగా అనీల్ అంబానీ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్రమోడీ పిలుపు ఇచ్చిన స్వచ్ఛ భారత్ అభియాన్ ఉద్యమం విజయవంతం కావడానికి అంకితభావంతో పనిచేస్తానని అన్నారు. అనీల్ అంబానీని స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనడం మంచి ప్రయత్నమని ప్రధాని మోడీ ట్విట్టర్ ద్వారా స్పందించారు.