పార్లమెంట్ టు రాష్ట్రపతి భవన్
దేశంలో పెరిగిపోతున్న మత అసహనంపై ఏఐసీసీ అధ్యక్షురాలు ఆందోళన వ్యక్తంచేశారు, ఇదే అంశంపై సోమవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి మోడీ ప్రభుత్వంపై ఫిర్యాదు చేసిన సోనియాగాంధీ... కాంగ్రెస్ ఎంపీలు, నాయకులు, కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు, పార్లమెంట్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకూ జరిగిన ర్యాలీలో సోనియా, రాహుల్ గాంధీతోపాటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ ఎంపీలు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు, అనంతరం రాష్ట్రపతి ప్రణబ్ ను కలిసిన కాంగ్రెస్ నేతలు.... దేశంలో నెలకొన్న అసహనాన్ని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు.