సిద్ధిపేట విజేతలు వీరే

సిద్ధిపేట మున్సిపాలిటికి జరిగిన ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి విజయం సాధించింది. 28 వార్డులకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ 16 వార్డులను కైవసం చేసుకుంది. మిగిలిన వారిలో స్వతంత్రులు 7, కాంగ్రెస్ 2, బీజేపీ 2, ఎంఐఎం 1 వార్డుల్లో విజయం సాధించగా టీడీపీ ఖాతా తెరవలేదు. 34 వార్డులున్నసిద్ధిపేట మున్సిపాలిటిలో ఆరు వార్డుల్లో టీఆర్ఎస్ అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీల వారీగా విజేతల వివరాలు. టీఆర్‌ఎస్ అభ్యర్థులు:  1వ వార్డు- మల్లికార్జున్  2వ వార్డు- లలిత  7వ వార్డు- ప్రశాంత్ 8వ వార్డు- నర్సయ్య 9వ వార్డు- ఉమారాణి 10వ వార్డు- వేణుగోపాల్‌రెడ్డి 11వ వార్డు- రవీందర్ 12వ వార్డు- అక్తర్ పటేల్ 15వ వార్డు- భవానీ 20వ వార్డు- జావేద్ 23వ వార్డు- లక్ష్మీ 26వ వార్డు- శ్రీనివాస్ 28వ వార్డు- లక్ష్మీ 29వ వార్డు- ఉమారాణి 31వ వార్డు- కవిత 32వ వార్డు- ప్రభాకర్. మిగతా గెలుపొందిన ఆరుగురు అభ్యర్థుల వివరాలు తెలియాల్సి ఉంది. కాంగ్రెస్:  6వ వార్డు- బాలలక్ష్మి 30వ వార్డు- వజీర్ బీజేపీ:  17వ వార్డు- వెంకట్ 14వ వార్డు- శ్రీకాంత్ స్వతంత్ర అభ్యర్థులు: 3వ వార్డు- సంధ్య 4వ వార్డు- దీప్తి 5వ వార్డు- స్వప్న 22వ వార్డు- ప్రవీణ్ 25వ వార్డు- ప్రమీల 27వ వార్డు- విజయరాణి 34వ వార్డు- మంజుల ఎంఐఎం : 33వ వార్డు- అబ్దుల్‌ మొయిజ్‌

2019 ఎన్నికల్లో పోటీ చేస్తా.. పవన్ కళ్యాణ్

  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంకా రెండు మూడు సినిమాల్లోనే నటిస్తారని.. ఆ తరువాత ఆయన రాజకీయాలపై దృష్టి పెట్టి.. 2019 ఎన్నికల బరిలో దిగుతున్నారని ఎప్పటినుండో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి ఆవార్తలు మరింత బలపడేలా ఉన్నాయి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వింటుంటే. పవన్ కళ్యాణ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. అయితే సినిమాలు మాత్రం ఎప్పుడు మానేస్తానో చెప్పలేనని.. తనకు ఎప్పుడు ఏం చేయాలో తెలుసని.. అన్నింటికి ప్రణాళికలు వేసుకుంటున్నానని అన్నారు. విత్తనం వేయగానే పళ్లు, కాయలు రావు అలాగే రాజకీయాల్లో కూడా ఫలితాలు వెంటనే రావు.. ప్రజల కోసం పోరాడుతాను.. విజయం సాధించేది.. లేనిది తరువాత ముందు ప్రయత్నిస్తాను.. శాయశక్తులా పోరాటం మాత్రం చేస్తానని ఆయన చెప్పారు.

ఐపిఎల్ 2016 : 98 పరుగులకే ఢిల్లీ డేర్ డెవిల్స్ ఆలౌట్..!

  ఐపిఎల్ 2016లో లో స్కోరింగ్ మ్యాచ్ లే దిక్కయ్యేలా కనిపిస్తోంది. సీజన్ ఓపెనర్లో ముంబై 121 పరుగులకే ఆలౌట్ అయింది. ఢిల్లీ, కోల్ కతాకు జరుగుతున్న ఈరోజు మ్యాచ్ లో టాస్ గెలిచి కోల్ కతా బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ 98 పరుగులకే ఆలౌట్ అయింది. క్వింటర్ డి కాక్ కొట్టిన 17 పరుగులే అత్యధిక స్కోరు. ఢిల్లీ ఓవర్సీస్ ఆప్షన్లలో, క్వింటన్ డికాక్ తప్పితే, మిగిలిన ముగ్గర్నీ బౌలింగ్ డిపార్ట్ మెంట్లోనే తీసుకోవడం విశేషం. ఢిల్లీకి రాహుల్ ద్రవిడ్ మెంటార్ గా వ్యవహరిస్తున్నాడు. మరో వైపు కోల్ కతా తరపున గంభీర్ అద్భుతమైన కెప్టెన్సీ చేశాడు. తెలివిగా బౌలర్లను రొటేట్ చేస్తూ, బ్యాట్స్ మెన్ ను కుదరుకోనివ్వకుండా చేశాడు. కోల్ కతా బౌలర్లలో రస్సెల్, హాగ్ లకు చెరో మూడు, హేస్టింగ్స్, చావ్లా లకు చెరో రెండు వికెట్లూ దక్కాయి.

క్రికెట్ కామెంటేటర్ హర్షా భోగ్లేను తొలగించిన బిసిసిఐ..!

క్రికెట్ రెగులర్ గా ఫాలో అయ్యేవారందరికీ హర్షా భోగ్లే అన్న పేరు తెలిసే ఉంటుంది. క్రికెట్ కామెంటరీ చేయడంలో దాదాపు మూడు దశాబ్దాల అనుభవం హర్ష సొంతం. కామెంటరీ చేయడంలో తిరుగులేని అనుభవమున్న హర్షకు బిసిసిఐ ఝలక్ ఇచ్చింది. ఆల్రెడీ ఐపిఎల్ సీజన్ 9 కు ఆయన్ను బుక్ చేసినప్పటికీ, ఆయన్ని తొలగిస్తూ ఆ ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. హర్షా భోగ్లేపై క్రికెటర్ల వద్ద నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని బిసీసీఐ చెబుతున్నప్పటికీ, దీని వెనుక వేరే కారణాలున్నట్లు తెలుస్తోంది.   టి20 వరల్డ్ కప్ సమయంలో, భోగ్లే ఇండియాకు కాకుండా బంగ్లాదేశ్ కు అనుకూలంగా మాట్లాడారంటూ, పేరు చెప్పకుండా ఆయనపై విమర్శలు చేశారు అమితాబ్ బచ్చన్. దానికి ప్రతిగా, తాను వ్యాఖ్యానం చేసే ఛానల్ ఫీడ్ వరల్డ్ వైడ్ వెళ్తుందని, అందుకే తాను అందరి తరపున మాట్లాడాలంటూ హర్షా కూడా ఇన్ డైరెక్ట్ గానే క్లియర్ క్లారిఫికేషన్ ఇచ్చాడు. వరల్డ్ టి20 సమయంలో నాగ్ పూర్ మ్యాచ్ లో హిందీ ఇంగ్లీష్ కామెంటరీ బాక్స్ లకు మధ్యలో విఐపీ బాక్స్ నుంచి దారి ఉండేది. కానీ దాన్ని మూసేయడంతో ఒక కామెంటరీ బాక్స్ మెట్లు దిగి, మరో కామెంటరీ బాక్స్ మెట్లు ఎక్కుతూ కామెంటేటర్స్ చాలా అలిసిపోయేవారట. ఈ విషయమై అక్కడి అధికారితో హర్షా భోగ్లే గొడవపడ్డాడు. ఆ బోర్డ్ బిసిసిఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ కంట్రోల్ లో ఉంది. ఈ కారణంగానే హర్ష పై వేటు పడిందనేది అసలు కారణమంటున్నాయి క్రికెట్ వర్గాలు. ఐపిఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచీ హర్షా భోగ్లే కు ఈ టోర్నీతో అనుబంధముండటం విశేషం.

సచిన్ తో క్రికెట్ ఆడిన బ్రిటన్ రాజదంపతులు..!

భారత పర్యటనలో భాగంగా ముంబైలో పర్యటించిన బ్రిటన్ ప్రిన్స్ విలియం, ఆయన భార్య కేట్ మిడిల్టన్ లు సరదాగా తమ దేశపు ఆట క్రికెట్ ను ఆడారు. ఈరోజు మధ్యాహ్న సమయానికి ముంబై చేరుకున్న రాజదంపతులు, తీరిక లేని షెడ్యూల్ తో బిజీబిజీగా గడిపారు. స్థానికంగా ఉన్న ఓవర్ గ్రౌండ్ లో స్వచ్ఛంద సంస్థల చిన్నారులతో రాజదంపతులు, సచిన్ కలిసి క్రికెట్ ఆడారు. సచిన్ ఫీల్డింగ్ కాస్తుంటే, వెంగ్ సర్కార్ కీపింగ్ చేశారు. ప్రిన్స్ కపుల్ కు స్వచ్ఛంద సంస్థల ప్రతినిథులు ఘన స్వాగతం పలికారు. రాత్రి జరగబోయే పార్టీలో బాలీవుడ్ సూపర్ స్టార్స్ షారుఖ్, ఐశ్వర్యారాయ్, అలియాభట్, కరణ్ జోహార్ లను విలియం దంపతులు కలుస్తారు.

కాల్పుల విరమణ ఒప్పందాన్ని మళీ ఉల్లంఘించిన పాక్..!

  కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్థాన్ ఏనాడూ విలువివ్వలేదు. ఎప్పటికప్పుడు తన వైఖరిని తెలియజేస్తూనే ఉంది. తాజాగా జమ్మూ కశ్వీర్ లో మరోసారి కాల్పులకు తెగబడింది పాక్ సైన్యం. పూంచ్ సెక్టార్ లో పాకిస్థాన్ సైన్యం రెచ్చగొట్టే విధంగా కాల్పులు జరిపింది. ఉదయం నాలుగున్నర సమయంలో పూంచ్ సెక్టార్ లో ఉన్న షాపూర్ ప్రాంతంలో పాక్ సైన్యం కాల్పులు జరిపిందని డిఫెన్స్ స్పోక్స్ పర్సన్ లెఫ్టనెంట్ కల్నల్ మనీష్ మెహతా చెప్పారు. దానికి సమాధానంగా భారతసైన్యం కూడా ఎదురుకాల్పులు జరిపింది. ఇప్పటివరకూ ఎవరూ మృతి చెందలేదు. పాక్ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్ భారత్ పాక్ ల మధ్య శాంతి చర్చలు తాత్కాలికంగా క్యాన్సిల్ అయ్యాయని చెప్పిన కొద్దిరోజులకే ఈ కాల్పులు జరగడం గమనార్హం.

పాకిస్థాన్ లో భూకంపం, ఢిల్లీ లో స్వల్ప ప్రకంపనలు..!

  ఈరోజు 6.6 మాగ్నిట్యూడ్ తో పాకిస్థాన్ ఆప్ఘాన్ బోర్డర్లో భూకంపం సంభవించింది. ఈ భూకంపం తాలూకు ప్రభావం ఉత్తరభారతం మీద కూడా పడింది. ఢిల్లీ, జమ్మూ కశ్మీర్, ఉత్తరాఖండ్, పంజాబ్ రాష్టాల్లో భవనాలు కంపించాయి. ఆఫ్ఘాన్ బోర్డర్లో ఉన్న హిందూ ఖుష్ పర్వత శ్రేణిలో భూకంపమే దీనికి మూలం అని నిపుణులు అంచనా వేస్తున్నారు. భూకంపానికి సంబంధించి ఎటువంటి నష్టం రిపోర్ట్ అవ్వలేదు. ఢిల్లీలో మెట్రో రైలు సర్వీసులను తాత్కాలికంగా నిలిపేవేసినా మధ్యాహ్నం నుంచి మళ్లీ రైళ్లు మొదలయ్యాయి. హిందూకుష్ పర్వతాల కింది భాగంలో, ఇండియన్ టెక్టానిక్ ప్లేట్లు, యూరేషియా ప్లేట్లను ఢీకొట్టడం వలనే ఈ భూకంపం సంభవించిందని నిపుణులు చెబుతున్నారు. 2015 అక్టోబర్లో కూడా 7.5 మాగ్నిట్యూడ్ తో పాకిస్థాన్ ఆఫ్ఘాన్ బోర్డర్లో వచ్చిన భూకంపానికి దాదాపు 400 మంది బలయ్యారు. అక్టోబర్ 2005 లో వచ్చిన భూకంపానికి 75 వేల మంది మరణించారు. దాంతో ఇప్పుడు ఆప్ఘాన్ ప్రజలు భయంతో వణుకుతున్నారు.

కేరళ ఆలయంలో ఘోర ప్రమాదం, 100 మంది మృతి..!

  కేరళ పుట్టింగళ్ దేవి గుడిలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అనూహ్యంగా జరిగిన ఈ సంఘటనలో 102 మంది నిండుప్రాణాలు బలవ్వగా, 200 మందికి పైగా తీవ్రగాయాలపాలయ్యారు. ఆదివారం తెల్లవారుఝామున 3 గంటలకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆలయవేడుకల్లో భాగంగా భక్తులు బాణాసంచా కాలుస్తుండగా, ప్రమాదవశాత్తూ పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. జాగ్రత్తలు తీసుకునేలోపే మంటలు వేగంగా వ్యాపించాయి. మంటల్ని చూసి భయంలో భక్తులు పరుగులు పెట్టడంతో, తొక్కిసలాట జరిగి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ప్రమాద సమయంలో భక్తులు ఎక్కువసంఖ్యలో ఉండటంతో ఇంత ప్రాణనష్టం సంభవించిందని అధికారులు చెబుతున్నారు. పుట్టింగళ్ దేవి గుడిలో మళయాళ నెలల ప్రకారం భరణి నక్షత్రంలో ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. భారీగా బాణాసంచా కాల్చడం ఉత్సవ ఆచారంలో భాగం. బాణాసంచా పేల్చడంలో జరిగిన తప్పు కారణంగా ఈ ఘోరం చోటు చేసుకుంది. ఈ ఘటనపై కేరళ సిఏం ఉమెన్ చాందీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించామని, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

55 ఏళ్ల బామ్మ.. ముగ్గురు శిశువులకు జన్మ

  ఒకే కాన్పులో ఇద్దరు ముగ్గురిని కనడం చూస్తూనే ఉంటాం. ఇప్పుడు ఇంగ్లండ్ లో కూడా ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురికి కాన్పునిచ్చింది. ఇందులో ఆశ్చర్యం ఏముందనుకుంటున్నారా.. ఉంది ఎందుకంటే ఆమెకు 55 ఏళ్లు. ఇంగ్లండ్ లో షరోన్ కట్స్ (55) అనే మహిళ నాటింగ్‌హామ్ యూనివర్శిటీ వైద్యశాలలోకృత్రిమ గర్భధారణ పద్ధతి ద్వారా గర్భం దాల్చి ముగ్గురు శిశువులకు జన్మనిచ్చింది. అంతేకాదు లేటు వయసులో ముగ్గురు శిశువులకు జన్మనిచ్చిన మహిళగా రికార్డు సృష్టించింది. బ్రిటన్ ప్రభుత్వాసుపత్రిలో 42 ఏళ్లలోపు గల వారికే కృత్రిమ గర్భధారణ చికిత్సలు చేస్తారు. దీంతో ప్రైవేట్ ఆస్పత్రిలో ఈ చికిత్స పొందిన ఆ బామ్మ ఇద్దరు మగశిశువులు, ఒక ఆడ శిశువుకు జన్మనిచ్చింది.

కేజ్రీవాల్ పై షూ దాడి..

  ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు ఓ చేదు అనుభవం ఎదురైంది. ఆయన ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో షూ దాడి జరిగింది. ఢిల్లీలో కాలుష్య నివారణకు కేజ్రీవాల్ సరి బేసి విధానాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే ఈనెల 15 నుండి ఢిల్లీలో సరి బేసి సంఖ్య విధానం పునరుద్దరణ చేపట్టనున్న నేపథ్యంలో ఆయన ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ పునరుద్దరణపై కేజ్రీవాల్ వివరిస్తుండగా అనుకోకుండా ఓ వ్యక్తి కేజ్రీవాల్ పై షూ విసిరాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతనిని అదుపులోకి తీసుకున్నారు. కాగా గతంలో కేజ్రీవాల్ పై ఇంకు దాడి జరిగింది. తాజాగా మరోసారి ఆయనపై చెప్పుదాడి జరగడం కలకలం రేపుతోంది.

కేసీఆర్ గవర్నర్‌ను కలవబోయేది అందుకేనా?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరి కాసేపట్లో గవర్నర్‌ను కలిసే అవకాశముంది. ఉగాది తర్వాత మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపడతారని పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ జోరుగా ప్రచారం జరుగుతున్న తరుణంలో సీఎం గవర్నర్‌ను కలవబోతున్నారు. కేబినెట్‌లో మార్పులు, చేర్పులు చేయాలని భావిస్తున్న కేసీఆర్ పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నవారితో పాటు కొత్తగా టీఆర్‌ఎస్‌లో చేరిన వారికి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత మంత్రుల్లో కొందరి శాఖలు మార్చడంతో పాటు కొందరికి ఉద్వాసన పలికే అవకాశముంది. ఇప్పటికే మంత్రివర్గ కూర్పుపై సన్నిహితులతో చర్చించారని, దీనికి సంబంధించి కసరత్తు పూర్తి చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం మంత్రులుగా కొనసాగుతున్న నాయిని నర్సింహారెడ్డి, జూపల్లి కృష్ణారావు, చందులాల్..తదితరుల శాఖ మార్చడం గాని తొలగించడం గాని జరుగుతుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు కేసీఆర్ కేబినెట్‌లో ఒక్క మహిళ కూడా లేదు. ఈ సారి ఆ అపవాదును కూడా తొలగించుకోవాలని గులాబీ దళపతి స్కెచ్ గీస్తున్నారట. మొత్తం మీద ముఖ్యమంత్రి గవర్నర్‌ను కలిసేది మంత్రివర్గ విస్తరణపైనా లేక మరేదైనా కారణంతోనా అనేది అర్థంకాక గులాబీ కండువాలు జుట్టుపీక్కుంటున్నాయి.   

కోహినూర్ వజ్రంపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీం.. స్పందించిన బ్రిటన్ ప్రధాని

  బ్రిటిష్ పాలకులు భారత దేశం నుండి దోచుకున్న వాటిలో అత్యంత విలువైంది ఏంటంటే కోహినూర్ వజ్రం అని అందరికి తెలిసిందే. అయితే కొన్ని సంవత్సరాల క్రితం దోచుకెళ్లిన ఈ వజ్రాన్ని ఇండియాకు తీసుకురావడానికి కేంద్రం ఇప్పటివరకూ పెద్దగా చర్యలు చేపట్టింది లేదు. అయితే ఇప్పుడు దీనిపై సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఆల్ హ్యుమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ ఫ్రంట్‌కు చెందిన ఓ వ్యక్తి కోహినూర్ ను ఇండియాకి తెప్పించడంపై కేంద్రం స్పందన ఏంటో తెలుసుకుందామని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై విచారించిన న్యాయస్థానం.. కోహినూర్ వజ్రాన్ని ఇండియాకు తీసుకురావడానికి ప్రయత్నించారా అంటూ కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించింది. అయితే సుప్రీం అడిగిన ప్రశ్నకు కేంద్రం సంగతేమో కానీ.. బ్రిటన్ ప్రధాన మంత్రి డేవిడ్ కామెరూన్ మాత్రం స్పందించారు. కోహినూర్ వజ్రం రాణి కిరీటంలో ఉన్నందున దాన్ని తిరిగి ఇవ్వడం సాధ్యం కాదని చెప్పారు. మరి సుప్రీం ప్రశ్నకు బ్రిటన్ ప్రధాని స్పందించారు.. మరి మన కేంద్రం ఎప్పుడు స్పందిస్తుందో చూడాలి.

జికా వైరస్ కు విరుగుడు జికా దోమేనట..

  బ్రెజిల్ నుండి మొదలై ప్రపంచ దేశాల్ని గడగడలాంచిన వైరస్ ఏదంటే టక్కున గుర్తొచ్చే పేరు జికా వైరస్. అయితే ఈ వైరస్ విరుగుడు కనిపెట్టారు పరిశోధకులు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ జికా వైరస్ కు విరుగుడు జికా దోమేనట. అదేలాగో చూద్దాం.. అమెరికాకు చెందిన ఓ సంస్థ జన్యుమార్పిడి దోమను సృష్టించింది. ఇలా సృష్టించిన దోమల్లో ప్రాణాంతకమైన జన్యువును ప్రవేశపెట్టి జీకా వ్యాధికి కారణమవుతున్న దోమల సంతానాన్ని నిరోధిస్తారు. ఈ దోమలను కొంత మొత్తంలో ప్రయోగించి.. ఆడ దోమలు పెట్టే గుడ్లు సంతానవృద్ధికి పనికి రాకుండా కట్టడి చేస్తారు. ఈ దోమలను బ్రెజిల్, పనామా వంటి దేశాల్లో ప్రయోగించి దాదాపు 99 శాతం దోమలను కట్టడి చేసినట్టు తెలుస్తోంది. అయితే జికా వైరస్ నివారణ వ్యాక్సిన్ తయారీకి మాత్రం మరికొన్ని సంవత్సరాలు వేచి చూడాల్సిందే.

జగన్ మరో షాక్.. మరో ఎమ్మెల్యే టీడీపీలోకి రెడీ..!

  వైసీపీ అధినేత జగన్ కు పార్టీ నేతలు షాకుల మీద షాకులిస్తున్నారు. ఇప్పటికే పార్టీ నుండి జంప్ అయిన ఎమ్మెల్యేల సంఖ్య పదికి చేరింది. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే మరో ఎమ్మెల్యే కూడా జగన్ షాకివ్వనున్నట్టు తెలుస్తోంది. చిత్తూరు జిల్లా మదనపల్లి ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో భేటీ అయ్యారు. ఉదయం విజయవాడ నుంచి బయలుదేరి చిత్తూరు జిల్లాలోని మదనపల్లికి వచ్చిన చంద్రబాబును, తిప్పారెడ్డి కలవడం జరిగింది.  దీంతో ఇప్పుడు తిప్పారెడ్డి, చంద్రబాబు భేటీపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే తిప్పారెడ్డి మాత్రం భేటీ గురించి ఏం చెప్పకపోయినా.. తాను కూడా పార్టీ మారే యోచనలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి చూద్దాం..

అసదుద్దీన్ పీకపై నేను కత్తి పెడతా...

భారత్ మాతా కీ జై వివాదం.. కాస్త పరిస్థితి నెమ్మదిస్తుంది కదా అనే లోపే ఎవరో ఒకరు దీనిని మళ్లీ తెరపైకి తెస్తున్నారు. ఇప్పుడు తాజాగా అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలకు మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) అధినేత రాజ్ ఠాక్రే స్పందించి ఆయనకు సవాల్ విసిరారు. ముంబైలోని శివాజీ పార్క్ సమీపంలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న ఆయన అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ..  ఒవైసీ మహారాష్ట్రకు వస్తే... ఆయన కుత్తుకపై తాను కత్తి పెడతానంటూ రాజ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఒవైసీ సోదరులిద్దరూ బీజేపీ మద్దతుగానే వ్యవహరిస్తున్నారని కూడా ఠాక్రే ఆరోపించారు. మరి రాజ్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారం రేపుతాయో చూడాలి.

బీహార్లో మద్యం నిషేదం.. ఇద్దరు మృతి.. అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ కూడా

బీహార్ లో మద్యం నిషేదించిన సంగతి తెలిసిందే. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బీహార్లో సంపూర్ణ మద్యపాన నిషేదం విధిస్తూ ప్రకటన చేశారు. అయితే మద్యం నిషేదం అనేది కొంతమందికి సంతోషానిచ్చేదే అయినా.. మందుబాబులకు మాత్రం నోట్లో చుక్క పడక.. నానా అవస్థలు పడుతున్నారట. మందులేక వింత వింతగా ప్రవర్తిస్తు ఆస్పత్రుల్లో కూడా చేరుతున్నారట. అంతేకాదు అలా ఇద్దరు చనిపోయారట కూడా. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చనిపోయిన వారిలో పోలీస్ డిపార్ట్ మెంట్ ఉద్యోగి కూడా ఉన్నాడు. అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ రఘునందన్ బెస్రాకి బాగా మందు తాగే అలవాటు ఉండటంతో.. ఒకపక్క మందు దొరక్కపోవడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌ద్యం అల‌వాటును మాన్పించేందుకు ఏర్పాటు చేసిన కేంద్రాల‌ను మందుకు బానిసైన వారు ఉప‌యోగించుకోవాల‌ని అధికారులు సూచిస్తున్నారు.

ఎన్నికల బరిలో ఆరుగురు హిజ్రాలు..

  త్వరలో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పురుషులు, మహిళలతో పాటు హిజ్రాలకు కూడా పోటీ చేసే అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి విజయలలితపై దేవి అనే హిజ్రా పోటీకి బరిలో దిగింది. ఇంకా ఈ ఎన్నికల్లో పోటీ చేసే హిజ్రాల సంఖ్య పెరిగింది. మొత్తం ఇప్పటికి ఆరుగురు హిజ్రాలు బరిలో దిగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. డీఎండీకే తరఫున సేలంలో రాధిక అనే హిజ్రా.. రత్ కుమార్ అధ్యక్షుడుగా ఉన్న సమత్తువ మక్కల్ కట్చి నుంచి గతంలో ఎన్నికల బరిలో దిగిన భారతికన్నమ్మ, హిందు మక్కల్ కట్చి తరఫున మదురై సెంట్రల్ నుంచి అనసూయ అనే హిజ్రా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మొత్తానికి  తమిళనాడులోని 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇంతమంది హిజ్రాలకు పోటీ చేసే అవకాశం రావడం అనందించాల్సిన విషయమే. మరి ఇంతమందిలో ఎవరు ఎన్నికల్లో నెగ్గి అధికారం చేపడుతారో తెలియాలంటే ఎన్నికల వరకూ ఆగాల్సిందే. కాగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ పైన కూడా ఓ హిజ్రా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పురుషులు, మహిళలతో పాటు హిజ్రాలకు కూడా పోటీ చేసే అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి విజయలలితపై దేవి అనే హిజ్రా పోటీకి బరిలో దిగింది. ఇంకా ఈ ఎన్నికల్లో పోటీ చేసే హిజ్రాల సంఖ్య పెరిగింది. మొత్తం ఇప్పటికి ఆరుగురు హిజ్రాలు బరిలో దిగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. డీఎండీకే తరఫున సేలంలో రాధిక అనే హిజ్రా.. రత్ కుమార్ అధ్యక్షుడుగా ఉన్న సమత్తువ మక్కల్ కట్చి నుంచి గతంలో ఎన్నికల బరిలో దిగిన భారతికన్నమ్మ, హిందు మక్కల్ కట్చి తరఫున మదురై సెంట్రల్ నుంచి అనసూయ అనే హిజ్రా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మొత్తానికి  తమిళనాడులోని 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇంతమంది హిజ్రాలకు పోటీ చేసే అవకాశం రావడం అనందించాల్సిన విషయమే. మరి ఇంతమందిలో ఎవరు ఎన్నికల్లో నెగ్గి అధికారం చేపడుతారో తెలియాలంటే ఎన్నికల వరకూ ఆగాల్సిందే. కాగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ పైన కూడా ఓ హిజ్రా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

మోడీ టూర్ల వెనుక అసలు సీక్రెట్ ఇదా..!

  ప్రధాని నరేంద్ర మోడీకి విదేశీ పర్యటనలు కొత్తేం కాదు. ఏడాదిలో చాలా దేశాల్లోనే ఆయన పర్యటిస్తారు. అయితే ఈ పర్యటనల్లో మోడీ గురించి తెలిసిన సీక్రెట్ ఏంటంటే.. ఆయన సమయం వృధా కాకుండా ఫ్లైట్ లోనే నిద్రపోతున్నారంట. అంతేకాదు దానివల్ల హోటల్లో ఉండే ఖర్చు కూడా తగ్గుతుంది అంటున్నారు. అసలు సంగతేంటంటే.. ప్రధాని మోడీ రీసెంట్ గా విదేశీ పర్యటన చేసిన సంగతి తెలిసిందే. మార్చి 30 నుంచి ఏప్రిల్ 2 వరకూ బెల్జియం, అమెరికా సౌదీ అరేబియా పర్యటించిన ఆయన ఎక్కవ శాతం రాత్రి ప్రయాణానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారట. అంతేకాదు ఫైట్ లోనే పడుకున్నారట. ఇదిలా ఉండగా ప్రధాని మోదీ కేవలం 97 గంటల్లో అమెరికాకు వెళ్లిరావడం అసాధారణ విషయమైని అధికారులంటున్నారు. ఒకవేళ ప్రధాని విమానాల్లో రాత్రి నిద్రను ప్రిఫర్ చేయకుంటే ఆ పర్యటన కనీసం ఆరు రోజులు సాగేదని ప్రభుత్వాధికారులన్నారు. మొత్తానికి మోడీ సీక్రెట్ అదిరింది..