ఉక్రెయిన్లో భారతీయ విద్యార్థుల దారుణహత్య
ఆస్ట్రేలియా, అమెరికా , జర్మనీ, బ్రిటన్ ఇలా దేశమేదైనా భారతీయులపై ప్రతిరోజు వివిధ దేశాల్లో దాడులు జరగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ జాబితాలోకి ఉక్రెయిన్ వచ్చి చేరింది. ఉక్రెయిన్లో ఇద్దరు భారతీయ విద్యార్ధులు దారుణ హత్యకు గురికాగా, మరోకరు తీవ్రంగా గాయపడ్డాడు. భారత్కు చెందిన ప్రణవ్ శాండిల్య, అంకుర్ సింగ్, ఇంద్రజిత్ చౌహన్లు ఉక్రెయిన్లోని ఉజ్గొరొడ్ మెడికల్ కాలేజీలో చదువుకుంటున్నారు. నిన్న ఉక్రెయిన్ జాతీయులు భారతీయ విద్యార్ధులపై కత్తులతో దాడి చేసారు. ఈ దాడిలో ప్రణవ్, అంకుర్ సింగ్లు అక్కడికక్కడే దుర్మరణం పాలవ్వగా..ఇంద్రజిత్ తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వీరి మరణాన్ని భారత విదేశాంగ శాఖ ధ్రువీకరించింది. అయితే ఈ దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది.