మరో అవార్డు సొంతం చేసుకున్న మథర్ థెరిస్సాకు
posted on Apr 11, 2016 @ 2:50PM
40 సంవత్సరాలపాటు తన జీవితాన్ని సేవకు అంకింత చేసిన నోబుల్ బహుమతి గ్రహీత మథర్ థెరిస్సాకు పారిస్ సెయింట్ హుడ్ హోదాను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మరో అవార్డును సొంతం చేసుకున్నారు మథర్ థెరిస్సా. ఆమెక ప్రఖ్యాత ఫౌండర్స్ అవార్డ్ లభించింది. సాధారణంగా ఈ అవార్డును అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తూ.. విజయాలను సాధించిన వారికి అందజేస్తారు. దాదాపు 2010 నుండి ఈ అవార్డులను ఇవ్వడం ప్రారంభించిన పాల్ సాగు అనే వ్యాపారవేత్త ఈ ఏడాది కూడా ఈ అవార్డులను అందజేయనున్నారు. మొత్తం 14 విభాగాల్లో ఈ అవార్డులను ప్రధానం చేస్తారు. థెరిస్సాకు దూరపు బంధువైన ఆమె మేనకొడలు అగి బొజాజియు ఈ అవార్డును అందుకోవటానికి ఇటలీ నుంచి శుక్రవారం లండన్ చేరుకున్నారు.