తెలంగాణ హైకోర్టులో సీఎం రేవంత్ కు ఊరట

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది.  ప్రజాప్రతినిధుల కోర్టులో తనపై నమోదైన కేసు విచారణను నిలుపదల చేయాలని కోరుతూ రేవంత్ ను క్వాష్ చేయాలంటూ రేవంత్ దాఖలు చేసుకున్న పిటిషన్  విచారించిన తెలంగాణ హైకోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు వెలువరించింది.  ఇంతకీ కేసేంటంటే..  గత ఏడాది జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగంపై బీజేపీ నాయకుడు కాసం వెంకటేశ్వర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు బీజేపీ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉన్నాయని ఆరోపిస్తూ ఆయన నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో పరువు నష్టం దావా వేశారు. బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందని రేవంత్ రెడ్డి ఆ సభలో అన్నారని వెంకటేశ్వర్లు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ప్రజాప్రతినిధుల కోర్టు, కేసు విచారణను కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే కొందరు సాక్షుల వాంగ్మూలాలను కూడా నమోదు చేసింది. రేవంత్ రెడ్డి ప్రసంగానికి సంబంధించిన ఆడియో, వీడియో క్లిప్పింగులను కూడా కాసం వెంకటేశ్వర్లు కోర్టుకు సమర్పించారు. ఈ దశలో ప్రజాప్రతినిధుల కోర్టులో కొనసాగుతున్న విచారణను నిలిపివేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, ఆయనకు అనుకూలంగా నేడు తీర్పు వెలువడింది.

లైంగిక దాడి కేసులో దోషిగా మాజీ ఎంపీ

  అత్యాచారం కేసులో జనతాదళ్ సెక్యులర్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను దోషిగా పేర్కొంటూ బెంగళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. రేపు శిక్షణను ఖరారు చేస్తామని వెల్లడించింది. రేవణ్ణ మైసూరులోని తన ఇంట్లో పని చేస్తున్న మహిళను రేప్ చేసి వీడియో తీశారని కేసు నమోదైంది. డిసెంబర్ 31 2024 నుంచి దర్యాప్త్య మొదలైంది.  హసన్ జిల్లా హోలినరసిపుర రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఆయనపై దాఖలైన ఫిర్యాదుకు సంబంధించిన కేసులో కోర్టు ఈ తీర్పునిచ్చింది. జూలై 18న ఈ కేసులో విచారణ పూర్తి కాగా.. తీర్పును రిజర్వ్ చేశారు. తాజాగా ప్రత్యేక కోర్టు తీర్పును వెలువరించింది. శిక్షాకాలాన్ని ఆగస్టు 2న ప్రకటించనుంది. పలువురు మహిళలపై ప్రజ్వల్ లైంగిక దాడులకు పాల్పడినట్టు చూపిస్తూ 2,000కు పైగా వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో వెలుగుచూడటం సంచలనమైంది.  దీనిపై 2024లో ఆయనపై నాలుగు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ప్రజ్వల్ ఫ్యామిలీకి చెందిన ఫామ్ హౌస్‌లో పనిచేసే మహిళ 2024 ఏప్రిల్‌లో మొదటగా ఆయనపై ఫిర్యాదు చేసింది. 2021 నుంచి పదేపదే తనపై లైంగిక దాడి చేశారని, బయటకు చెబితే వీడియోలు విడుదల చేస్తామని బెదిరిస్తూ బ్లాక్‌మెయిల్ చేశారని ఆమె తన ఫిర్యాదులో ఆరోపించింది.  

కాళేశ్వ‌రానికి.. ఫిరాయింపు నిరోధ‌క చ‌ట్టానికి లింకు వేస్తున్నారా? సార్

బేసిగ్గా కేసీఆర్ ఐడియాలు మీర‌ది చేస్తే..  మేమిది చేస్తాం అన్న‌ట్టుగా ఉంటాయి. ఆయన పొలిటికల్ స్టైల్ కూడా అలాగే ఉంటుంది.  ఉదాహ‌ర‌ణ‌కు మీరు మా క‌విత‌ను లిక్క‌ర్ కేసులో అరెస్టు చేస్తే.. మేం ఏకంగా తెలంగాణ రాష్ట్ర స‌మితిని కాస్తా భార‌త రాష్ట్ర స‌మితిగా మార్చి.. దాన్ని ఢిల్లీ స్థాయిలో విస్త‌రింప  చేసి.. ఆపై మీ కంట్లో న‌లుసుగా మారుతాం. బీజేపీ చేసే దానికి బీఆర్ఎస్ చేసేదానికి - బీఆర్ఎస్ చెల్లుకు చెల్లు అన్న‌ట్టుగా గతంలో ఆయన వ్యవహరించిన తీరు చెప్పుకోవచ్చు.   ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత ఆయ‌న‌తో పాటు కేటీఆర్, హ‌రీష్‌, క‌విత త‌దిత‌రులు ఏదో ఒక కేసులో చిక్కి నానా క‌ష్టాలు ప‌డుతున్నారు. ఈ స‌మ‌యంలో వారికి కాంగ్రెస్ ని క‌ల‌వ‌ర పెట్ట‌డానికి క‌ల‌సి వ‌చ్చిన ఏకైక అస్త్రం పార్టీ ఫిరాయింపులు.  నిజానికి ఈ పార్టీ ఫిరాయింపులు ఇప్ప‌టిక‌న్నా బీఆర్ఎస్ హ‌యాంలోనే ఎక్కువ‌గా జరిగాయి. అయితే అక్క‌డ చేసింది ఇక్క‌డ చేయ‌లేనిదీ ఒక‌టే. అక్క‌డ ఏకంగా పార్టీలోని మెజార్టీ ఎమ్మెల్యేలు ఇటు క‌ల‌సి పోవ‌డం వ‌ల్ల పార్టీయే మెర్జ్ అయిన ప‌రిస్థితి కనిపించింది. అదే ఇప్ప‌డు గెలిచిన వాళ్ల‌లో కేవ‌లం ప‌ది మందే వెళ్లి క‌లిసారు. వీరు కాంగ్రెస్ కి అద‌నం అవుతారు త‌ప్పించి.. వీరు లేకపోతే వారికి వచ్చే నష్టమంటూ ఏదీ లేదు.   ఒక వేళ ఉప ఎన్నిక‌లు వ‌చ్చినా స‌గానికి స‌గం మంది  గెలిచే ఛాన్సుంది కాబ‌ట్టి కాంగ్రెస్ బేఫిక‌ర్. ఇక్క‌డ మ‌రో లింకు ఏంటంటే స్పీక‌ర్ కి అధికారం ఇవ్వ‌డం. దీంతో స్పీక‌ర్ వ‌ర్సెస్ న్యాయ‌మూర్తి అనే స‌మ‌స్య త‌లెత్తుతుంది.  ఇప్ప‌టి వ‌ర‌కూ ఈ చ‌ట్టానికి న్యాయానికి మ‌ధ్య‌ జ‌రిగిన స‌మ‌రంలో అన్ని వేళ‌లా స్పీక‌రే గెలిచారు. స్పీక‌ర్ ప్ర‌త్య‌క్షంగా ప్ర‌జ‌ల చేత ఎన్నుకోబ‌డిన న్యాయ‌మూర్తి. అదే కోర్టు న్యాయ‌మూర్తిది ప‌రోక్ష ఎంపిక‌. దీంతో ఈ విష‌యంలోనూ బీఆర్ఎస్ ప‌ప్పులు ఉడికేలా లేవు. గ‌తంలో సుప్రీంకోర్టుకెక్కిన రోజా.. అసెంబ్లీకి త‌నను రానివ్వాలంటూ తీర్పు తెచ్చుకున్నారు. కానీ ఆనాటి స్పీక‌ర్ కోడెల ఆ జ‌డ్జికంటే మోస్ట్ ప‌వ‌ర్ఫుల్ ఈ జ‌డ్జి..  అంటే స్పీక‌ర్ అంటూ ఆ తీర్పును అమ‌లు చేయ‌లేదు. ఇలాంటి ప‌రిస్థితుల్లో బీఆర్ఎస్ అనుకున్న విధంగా కాంగ్రెస్ ను ఇరుకున పెట్ట‌డం సాధ్య‌మ‌య్యేలా క‌నిపించ‌డం లేదు. సో బీఆర్ఎస్ పెట్టిన చెక్  నుంచి త‌ప్పించుకోడానికి కాంగ్రెస్ ముందు చాలానే దారులున్న‌ట్టుగా క‌నిపిస్తోంది.  బీఆర్ఎస్ వ‌ర్సెస్ కాంగ్రెస్ గేమ్ లో.. త‌ర్వాతి  స్టెప్ ఎలా ఉంటుందో వెయిట్ అండ్ సీ.

భార‌త్ పై 25 శాతం సుంకాల మోత‌.. ఎవ‌రికి లాభం ఎవ‌రికి న‌ష్టం?

ట్రంప్ భారత్ అంటేనే మండి ప‌డుతున్నారు. మ‌రీ ముఖ్యంగా మోడీ అంటేనే ఆయ‌న‌కు అస్స‌లు గిట్ట‌డ్డం లేదు. ఒక స‌మ‌యంలో ట్రంప్ విజయం కోసం ప్ర‌చారం చేసిన మోడీ.. ట్రంప్ రెండో సారి గెలిచాక త‌న త‌ప్పిపోయిన సొంత సోద‌రుడ్ని క‌లిసినంత సంబ‌రంగా ఫీలయ్యారు. అయినా కూడా మోడీ  పొడ ట్రంప్ కు అస్స‌లు న‌చ్చ‌డం లేదు.  ఏమైందో తెలీదుగానీ..  భారత్ పై పాతిక శాతం టారీఫ్ ల‌తో విరుచుకుప‌డ్డం మాత్ర‌మే కాదు.. భార‌తీయులంటేనే ఉద్యోగాలివ్వ‌ద‌ని అంటున్నారు ట్రంప్. పాకిస్థాన్ లో ప్ర‌స్తుతం పెట్రోలు త‌వ్వ‌కాల్లో పెట్టుబ‌డి పెట్టింది అమెరికా.  వ‌చ్చే రోజుల్లో భార‌త్ కే ఇంధ‌నం అమ్మొచ్చ‌ని అంటారు ట్రంప్. మోడీ పాకిస్థాన్ పాల‌సీని ఫాలో కావ‌డం లేదు. కొత్త రూట్ మ్యాప్ ఫాలో అవుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే అమెరికా, చైనాల‌తో పాటు దీటైన దేశంగా అన్ని రంగాల్లో రాణించేదిశగా దూసుకెడుతోంది. ఆయుధ  సంప‌త్తి సైతం పెంచుకుంటోంది.  గ్లోబ్ సౌత్ కి నాయ‌క‌త్వం వ‌హించ‌డానికి మోడీ మొన్న చాలా దేశాల్లో  ప‌ర్య‌టించారు. అంతే కాదు.. బ్రిక్స్ ద్వారా గ్గోబ్ సౌత్ లీడ‌ర్షిప్ కి ప్లానేస్తున్నారు. దీంతో ట్రంప్ కి మోడీ అంటే అస్స‌లు ప‌డడం లేదు అంటున్నారు విశ్లేషకులు. అవ‌స‌ర‌మైతే చైనా, ఆఫ్రికా దేశాల‌తో కొత్త జ‌ట్టు క‌ట్ట‌డానికి కూడా సిద్ధ ప‌డుతున్నారు మోడీ.  దీంతో మోడీ ని చూసి చికాకు ప‌డుతోంది ట్రంప్ నాయ‌క‌త్వంలోని అమెరికా. నిజ‌మే పాతిక  శాతం సుంకాల ద్వారా భార‌త్ లో కొన్ని   రంగాల‌కు తీవ్ర‌మైన ఇబ్బంది క‌ల‌గొచ్చు. ఇందులో పాడి, వ్య‌వ‌సాయ రైతుల‌కు, ఎన్నో చిన్న మ‌ధ్య‌త‌ర‌హా ఎంఎస్ఎంఈల‌కు న‌ష్టం వాటిల్ల వ‌చ్చు.  అంతే కాదు.. ఎంపీ లావు పార్ల‌మెంటులో చెప్పిన‌ట్టు.. ఏపీ ఆక్వాకు భారీ న‌ష్టం కలగొచ్చు. ఎందుకంటే మ‌న స‌ముద్ర ఉత్ప‌త్తుల్లో 33 శాతం అమెరికాకు ఎగుమతి అవుతాయి. ఆ మాట‌కొస్తే మొన్న‌టి మామిడి రైతుల క‌డ‌గండ్ల‌కు కార‌ణం కూడా ఇలాంటి ప‌రిస్థితులే. కొంద‌రేమంటారంటే మోడీ ఒక్క మాట మాట్లాడితే ఇలాంటి స‌మ‌స్య‌లు స‌మ‌సిపోతాయి. పాతిక శాతం కాస్తా 15 నుంచి 20 శాతానికి దిగి వస్తుందంటారు.  బేసిగ్గా ఇప్ప‌టి వ‌ర‌కూ ఇరు ప‌క్షాలు వ‌చ్చే కొన్నేళ్ల‌లో ద్వైపాక్షిక వ్యాపారం 500 బిలియ‌న్ డాల‌ర్ల‌కు పెంచాల‌న్న యోచ‌న‌లో ఉన్నాయి. ఈ క్ర‌మంలో సానుకూలంగా స్పందిస్తే స‌రిపోతుంది. కానీ, మోడీ ఇందుకు స‌మ్మ‌తంగా ఉన్న‌ట్టు లేరు. పైపెచ్చు అమెరికా క‌న్నా చైనాను న‌మ్మ‌డ‌మే మేల‌ని భావిస్తున్నారు. ఈ మ‌ధ్య చైనా టూరిస్టుల‌కు వీసా అనుమ‌తులివ్వ‌డం ఇందులో భాగంగానే భావిస్తున్నారు.  ఇక ఫైన‌ల్ గా ర‌ష్యాను వ‌దులుకోవ‌డం. ఎందుకంటే ప్ర‌పంచ‌మంతా ఉక్రెయిన్ లోన మార‌ణ‌కాండ ఆపాల‌ని ఎదురు చూస్తుంటే..  మోడీ,  భార‌త్ మాత్రం ర‌ష్యా నుంచి చ‌మురుతో స‌హా ఎన్నో ఆయుధ స‌హాయ స‌హ‌కారాల‌ను పొందుతున్నార‌ని ఆరోపిస్తారు ట్రంప్. నిజ‌మే ఇదే ర‌ష్యా నుంచి భార‌త్ చ‌మురు కొన‌కుంటే జ‌రిగే విప‌త్తు ప్ర‌పంచ వ్యాప్తంగా ఆయ‌ల్ బ్యార‌ళ్ల ధ‌ర‌లు అమాంతం పెరుగుతాయి. మొన్న ఆప‌రేష‌న్ సిందూర్ లో ర‌ష్యాన్ ఎస్ 400 ద్వారా మ‌న‌మెంతో విజ‌యం సాధించాం. అదే అమెరికాను దాని ఎఫ్ 16ల‌ను న‌మ్ముకున్న పాక్ ప‌రిస్థితి ఎలా ఉందో చూశాం. చైనా ఇచ్చిన పీఎల్ 15లు, ఇత‌ర వాయు ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌లు పూర్తిగా నిర్వీర్య‌మైన ప‌రిస్థితులు. మ‌నం కూడా అలాంటి ఫలితాల‌నే పొంద‌డానికి సిద్ధంగా లేమంటారు మోడీ ఆయ‌న ప‌రివారం. కాబ‌ట్టి ట్రంప్ ని ఫాలో కావ‌డం అయ్యే ప‌ని కాదని తెగేసి చెబుతారు. ఒక వేళ మోడీ మ‌న వాళ్ల‌కు ఉద్యోగాలివ్వొద్దంటే న‌ష్ట‌పోయేది అమెరికాయే. కార‌ణం మ‌న మేధ‌స్సు అక్క‌డ ట్రిలియ‌న్ డాల‌ర్ల వృద్ధి చూపుతోంది. త‌ద్వారా అమెరికాకు ఎంతో మేలు జ‌రుగుతోంది. ఎన్నో ఉద్యోగ ఉపాధి అవ‌కాశాల‌ను క‌ల్పిస్తోంది. ఆ మాట‌కొస్తే మ‌స్క్ ని కూడా ఇలాగే దూరం చేసుకుంటున్నారు ట్రంప్. ఆయ‌న వ‌ల్ల ఎంతో ల‌బ్ధి చేకూరుతున్నా.. కావాల‌ని మ‌స్క్ ఆదాయ వ‌న‌రుల‌ను గండి కొట్టేలా బిగ్ బిల్ వంటి బిల్లులు పాస్ చేయిస్తున్నారు. దీని వ‌ల్ల అంతిమ న‌ష్టం అమెరికాకే అన్న‌ది నిపుణుల అంచ‌నా.  ఇప్ప‌టికే ప‌క్క‌నే ఉన్న మెక్సికో, కెనాడా వంటి  దేశాలతో స‌ఖ్యంగా లేక పోవ‌డం వ‌ల్ల‌.. కెన‌డియ‌న్లు అమెరిక‌న్ టూర్ లు  మానేస్తున్నారు. దీని వ‌ల్ల ఎంతో లాస్. ఎందుకంటే ఒక కెన‌డియ‌న్ అలా యూఎస్ టూర్ వ‌స్తే పెట్టే ఖ‌ర్చు మినిమంలో మినిమం 4 వేల డాల‌ర్లు. ఇక‌ మెక్సిక‌న్లు అమెరికాలోకి చొర‌బ‌డకుంటే అక్క‌డ పాచిప‌ని, వంటప‌ని, మ్యూజిక్ వంటి రంగాల్లో ఆ వెలితి తీర్చ‌లేనిది. ఇక భార‌త్ ని కాద‌నుకుంటే స్పేస్, మెడిసిన్, లా, సాఫ్ట్ వేర్ రంగాల్లో భారీ వెలితి ఏర్ప‌డుతుంది. చైనాను కాద‌నుకుంటే ఏకంగా అన్ని చౌక వ‌స్తువుల‌ను అత్య‌ధిక ధ‌ర‌లు వెచ్చించి కొనాల్సి వ‌స్తుంది. ఎటు నుంచి ఎటు చూసినా ఈ సుంకాల వ్యూహంలో చిక్కింది అమెరికాయే త‌ప్ప‌.. భార‌త్, చైనా కాదంటారు  వాణిజ్య‌ నిపుణులు.  మ‌రి  చూడాలి.. ట్రంప్ తెంప‌రి త‌నం ఇక్క‌డితో ఆగుతుందా? లేక ఆయ‌న ఒంటి చేత్తో కొత్త ప్ర‌పంచం సృష్టిస్తారా.. కాల‌మే స‌మాధానం చెప్పాల్సి ఉంది.

ట్రంప్ టారిఫ్ ల కొరడా!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను అనుకున్న టారిఫ్‌ల కొరడా ఝులిపించారు. తాజాగా పలు దేశాలపై కొత్త సుంకాలు విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. 70కిపైగా దేశాలపై 10 నుంచి 41 శాతం మధ్య టారిఫ్‌లను విధిస్తూ   ఉత్తర్వులపై సంతకం చేశారు. వాణిజ్య లోటు కారణంగా టారిఫ్‌లు పెంచుతున్నట్టు తెలిపారు. ఇప్పటికే కుదిరిన వాణిజ్య ఒప్పందాల మేరకు కొన్ని దేశాలపై సుంకాల్లో మార్పులు చేసినట్టు వివరించారు. అయితే ఆ దిశగా భారత్‌తో ఏకాభిప్రాయం అంత త్వరగా సాధ్యం కాదని అమెరికా సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. వాణిజ్యంతో పాటు అనేక భౌగోళిక రాజకీయ అంశాలు ఈ చర్చలతో ముడిపడి ఉన్నాయని చెప్పారు. కొత్త టారిఫ్స్‌లో భాగంగా భారత్‌పై ట్రంప్ పాతిక శాతం  సుంకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక కెనడాపై సుంకాన్ని 25 నుంచి 35 శాతానికి పెంచారు. ఔషధాల అక్రమ దందాకు కెనడా అడ్డుకట్టవేయలేకపోవడం, అమెరికాపై ప్రతీకార చర్యలకు దిగడం తదితర కారణాలతో కెనడాపై సుంకాన్ని పెంచినట్టు తెలిపారు. ఆగస్టు 1 నుంచి కొత్త సుంకాలు అమల్లోకి వస్తాయని డొనాల్డ్ ట్రంప్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా సుంకాల పెంపుపై అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేశారు. అయితే.. ఈ పెంపు మరో వారం తరువాత అమల్లోకి రానుంది. ఇక పెంపునకు సంబంధించి అమెరికా ప్రభుత్వం కొన్ని మినహాయింపులు కూడా ఇచ్చింది. ఆగస్టు 7 లోపు వాణిజ్య నౌకల్లోకి చేర్చిన వస్తువులు ఆక్టోబర్ 5లోపు అమెరికాకు చేరితే కొత్త సుంకాల నుంచి మినహాయింపు ఉంటుంది. ఆ తరువాత దిగుమతి అయ్యే వస్తువులపై కొత్త సుంకాలు అమలవుతాయి. అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఒప్పందం ఇంకా కుదరాల్సి ఉంది. అయితే, పూర్తిస్థాయి ఒప్పందానికి కొంత సమయం పడుతుందని, ట్రంప్ ఆమోదముద్ర కూడా వేయాల్సి ఉందని శ్వేతసౌధం వెల్లడించింది. చైనాపై సుంకాల విధింపునకు అమెరికా ఆగస్టు 12వ తేదీని డెడ్‌లైన్‌గా ప్రకటించింది. ఈ వారం స్టాక్‌హోం వేదికగా జరిగిన చర్చల్లో చైనా డిమాండ్స్‌ను అమెరికా గట్టిగా వ్యతిరేకించినట్టు సమాచారం

ఉప రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల

భారత ఉప రాష్ట్రపతి ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘంఈ  ఎన్నికకు షెడ్యూల్ ను శుక్రవారం విడుదల చేసింది. సెప్టెంబర్ 9న ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజున కౌంటింగ్ ప్రక్రియ చేపట్టి విజేతను ప్రకటిస్తారు. ఇక ఈ ఎన్నికకు నోటిఫికేషన్ ఆగస్టు 7న వెలువడుతుంది. అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. నామినేషన్ దాఖలుకు తుది గడువు ఆగస్టు 21.   అదే నెల 22న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు ఆగస్టు 25 కాగా సెప్టెంబర్ 9న  ఉప రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్ జరుగుతుంది. ఉదయం పది గంటల నుంచి 5 గంటల వరకూ పోలింగ్ జరుగుతుంది. అదే రోజు  కౌంటింగ్ నిర్వహించి ఫలితం వెలువరిస్తారు. 

పబ్ లో పార్టీ అంటూ ఎర.. కట్ చేస్తే కిడ్నాప్.. బ్లాక్ మెయిల్!

పబ్బులో పార్టీ చేసుకుందామన్న ఓ కిలేడీ ఎరకు చిక్కుకున్నాడు.   పబ్బులో పార్టీ అనేసరికి ఆ యువకుడు ఎగిరి గంతేశాడు.. పబ్ కు రమ్మని పిలిచింది ఒక బార్లో డాన్సర్ గా పని చేసే లేడీ కావడంతో  ముందు వెనుక ఆలోచించకుండా  రాత్రి సమయంలో పబ్బుకు చేరుకున్నాడు.  అప్పటికే అక్కడ మాటు వేసిన కిలేడీకి చెందిన గ్యాంగ్  మాట్లాడుకుందామని చెప్పి పక్కకు తీసుకెళ్లి కిడ్నాప్ చేశారు. వివరాల్లోకి వెడితే..  సచిన్ దూబే  అనే వ్యక్తి  ఒక జ్యువెలరీ షాపులో పార్ట్నర్ గా ఉన్నాడు.. అతనికి డబ్బు కొదవలేదు. ఇదే అతనిని టార్గెట్ చేయడానికి కారణమైంది. పబ్ లో డ్యాన్సర్ గా పని చేసే యువతి అతడితో పరిచయం పెంచుకుని పబ్ కు ఆహ్వానించింది. ముందు వెనుకలాలోచించకుండా పబ్ కు కెళ్లిన సచిన్ దుబేని ఆ డ్యాన్సర్, ఆమె గ్యాంగ్ కిడ్నాప్ చేశారు.   అతని దగ్గర ఉన్న బంగారు ఆభరణాలను దోచుకున్నారు.. ఆ తర్వాత ఒక వీడియోని చూపారు. ఒక యువతితో సచిన్ సరసాలు ఆడుతున్న సమయంలో తీసిన ఆ వీడియోతో బ్లాక్ మెయిల్ చేశారు.  ఆ వీడియోను  సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదరించారు. తాము అడిగిన 10 లక్షల రూపాయల డబ్బు ఇవ్వకపోతే వీడియోను సామాజిక మాధ్యమంలో  పోస్ట్ చేసి పరువు తీస్తామని బెదిరించారు  వీడియో ను  ఆసరాగా చేసుకొని ఒక బార్ లో డాన్సర్ గా పని చేస్తున్న లేడీ తో సహా పబ్బులో పనిచేసే యువకుడు, మరో ముగ్గురు కలిసి సచిన్ దూబే  కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు. చివరికి విషయం పోలీసుల వద్దకు చేరడంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.  బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 3 లో సచిన్ దూబే  కిడ్నాప్ కేసు లో ఒక యువతి  సహా ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు.  సచిన్ దుబేను కిడ్నాప్ చేసి హింసించడంతో పాటు అతని వస్తువులను లాక్కొని డబ్బులు  డిమాండ్ చేసిన నలుగురిని పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు.   అత్తాపూర్ ప్రాంతానికి చెందిన సచిన్ దూబే బంజారా హిల్స్ లో ఒక జ్యువెలరీ షాప్ లో భాగస్వామి. సచిన్ మత్తులో ఉన్న సమయంలో ఓ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన వీడియో ఐదుగురు సభ్యులు గల ముఠా వద్దకు చేరుకుంది.   ఈ వీడియోలు చూసిన తర్వాత గ్యాంగ్ కి సచిన్ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయాలని ఆశ పుట్టింది.  దీంతోఅతడిని కిడ్నాప్ చేసి 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్   చేశారు. సచిన్ ను కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేయడంతో పాటు   డబ్బులు డిమాండ్ చేసిన కేసులో  బార్ డ్యాన్సర్ డింపుల్ తో పాటు నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. 

పని చేసే వారికే నామినేటెడ్ పదవులు

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలిపారు. పార్టీ ముఖ్య నేతలతో  శుక్రవారం (ఆగస్టు 1) ఉదయం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ లో ఈ విషయం వెల్లడించారు. రాష్ట్రంలో ఈ నెలలో అంటే ఆగస్టులో రెండు కీలకమైన పథకాల అమలుకు శ్రీకారం చుట్టుబోతున్నట్లు తెలిపిన ఆయన రాష్ట్రంలో కష్టించి పని చేసే తెలుగుదేశం కార్యకర్తలకు త్వరలో నామినేటెడ్ పోస్టులు దక్కుతాయని అన్నారు. ఈ నెలలో అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కార్యక్రమాలను ప్రారంభిస్తున్నట్లు చెప్పిన ఆయన ఈ రెండు పథకాల విషయంలో పార్టీ నేతలూ, క్యాడర్ చురుకుగా పాల్గొనాలని ఆదేశించారు. అన్నదాతా సుఖీభవ కార్యక్రమం శనివారం (ఆగస్టు 2) నుంచీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ఈ నెల 15 నుంచీ ప్రారంభం కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. గత వైసీపీ హయాంలో రైతు భరోసా పేరుతో జగన్ రైతులను నిలువునా మోసం చేశారని విమర్శించారు.  అయితే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రైతులకు కేంద్రం ఇచ్చే సొమ్ముతో కలిపి ఏడాదికి మూడు విడతలలో 20 వేల రూపాయలు అందిస్తుందని తెలిపారు.   

యూపీ సీఎం యోగి బయోపిక్ కు సెన్సార్ చిక్కులు.. విడుదల సందిగ్ధం?

ఉత్తర ప్రదేశ్  ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జీవితం ఆధారంగా రూపొందిన సినిమా విడుదల సందిగ్ధంలో పడింది. మాజీ ముఖ్యమత్రి యోగి ఆదిత్యనాథ్ జీవిత కథ  ది మాంక్ హు బికమ్ చీఫ్ మినిస్టర్ అన్న పుస్తకం ఆధారంగా రవీంద్రగౌతమ్ దర్శకత్వంలో రూపొందిన  ది అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ ఏ మాంక్ అన్న సినిమా  రూపొందింది. ఈ సినిమా నిర్మాత రీతు మొంగి. వాస్తవానికి ఆ సినీమా శుక్రవారం ( ఆగస్టు 1)న విడుదల కావాల్సి ఉంది. అయితే ఈ సినిమాకు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇవ్వలేదు. దీంతో విడుదలకు అవాంతరాలు ఎదురయ్యాయి. దీంతో ఈ సినిమా నిర్మాతలు ముంబై కోర్టును ఆశ్రయించారు.  నిర్మాతల పిటిషన్ ను విచారణకు స్వీకరించిన ముంబై హై కోర్టు  సెన్సార్ బోర్డును సర్టిఫికెట్ నిరాకరణకు కారణం చెప్పాలని ఆదేశించింది. యూసీ సీఎం జీవిత కథ ఆధారంగా వచ్చిన ది మాంక్ హు బికమ్ చీఫ్ మినిస్టర్ పుస్తకం గత ఎనిమిదేళ్లుగా ప్రజాక్షేత్రంలో ఉన్నప్పటికీ, ఆ పుస్తకం ఆధారంగా నిర్మించిన చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ నిరాకరించాల్సిన అవసరమేమొచ్చిందని నిలదీసింది.  దీనిపై రెండు రోజుల్లోగా సమాధానమిస్తామని సెన్సీర్ బోర్డు కోర్టును గత వారమే కోరింది. దీంతో యోగి బయోపిక్ పై ముంబై కోర్టు శుక్రవారం (ఆగస్టు 1)న విచారించనుంది.  దీంతో యోగి బయోపిక్ శుక్రవారం (ఆగస్టు1) విడుదల విషయంలో అయోమయం నెలకొంది. 

సూపర్ సిక్స్ హామీల అమలులో సీబీఎన్ స్పీడ్

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరో ముందడుగు వేయడానికి రెడీ అయిపోయారు.  సూపర్‌ సిక్స్‌ హామీల అమలులో భాగంగా అన్నదాత సుఖీభవ  పథకాన్ని శనివారం (ఆగస్టు 2) నుంచి అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 46,85,838 రైతు కుటుంబాలు లబ్ధి పొందుతాయన్నారు. మొదటి విడతలో రాష్ట్ర వాటాగా ఒక్కో రైతుకు రూ.5 వేల చొప్పున మొత్తం రూ.2,342.92 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు. కేంద్ర వాటాతో కలిపి మొత్తం రూ.7వేలు అందిస్తామన్నారు.  అన్నదాత సుఖీభవ  అమలు సన్నద్ధతపై రాష్ట్ర సచివాలయంలో ఆర్థిక, రెవెన్యూ, వ్యవసాయ, జలవనరుశాఖల ఉన్నతాధికారులతో సీఎం గురువారం (జులై 31) సమీక్ష నిర్వహించారు. జిల్లాల కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా  ఈ సమీక్షలో  పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీచేశారు. ఒక్కో రైతు కుటుంబానికి కేంద్రం సాయంతో కలిపి ఏడాదికి రూ.20 వేలు అందిస్తామన్న కూటమి హామీని  అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్‌ తో నెరవేర్చినట్లయిందన్నారు. ఏడాదికి కేంద్రం ఇచ్చే రూ.6 వేల సాయంతో కలిపి, రాష్ట్రప్రభుత్వం మరో రూ.14 వేలు ఇవ్వనుంది. మొదటి, రెండో విడతల్లో రూ.ఐదేసి వేలు చొప్పున, మూడో విడత రూ.4వేలు చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. తొలివిడతలో కేంద్రం రూ.2వేలు చొప్పున రూ.831.51కోట్లు విడుదల చేయనుంది. దీంతో ఆగస్టు 2న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఒక్కో రైతుకు రూ.7వేలు జమ చేస్తాయి. మరోవైపు  అన్నదాత సుభీభవ కు సంబంధించి 59,750 గ్రీవెన్సులు నమోదు కాగా... 58,464 దరఖాస్తులు పరిష్కరించడం జరిగింది. ఈ పథకంపై సందేహాల నివృత్తి కోసం 155251 టోల్‌ఫ్రీ నంబరును అందుబాటులో  ఉంచినట్లు చంద్రబాబు చెప్పారు. రైతులకు హామీ ఇచ్చినట్టుగానే  అన్నదాత సుఖీభవ  పథకం అమలు చేసి చూపిస్తూ, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నామనీ,  చేసిన మంచిని ప్రజలకు చెప్పాలనీ కలెక్టర్లకు సీఎం చంద్రబాబు సూచించారు. అన్నదాత సుఖీభవ అందుకునే రైతుల సెల్‌ఫోన్లకు ఒక రోజు ముందే ‘మనమిత్ర’ ద్వారా సందేశాలు వెళ్లాలని, రైతులు తమ ఖాతాలను యాక్టివేట్‌ చేసుకునేలా వారికి అవగాహన కల్పించాలని నిర్దేశించారు.  భారత్‌పై అమెరికా 25శాతం సుంకాలు విధించిన నేపథ్యంలో వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల్ని దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. బొప్పాయి ధర తగ్గుదలపై సమీక్ష చేసి రైతులకు న్యాయం చేయాలని ఆదేశించారు.

జమ్మలమడుగులో పింఛన్ల పంపిణీ ప్రారంభించిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం (ఆగస్టు 1) ఉదయం కడప జిల్లా జమ్మలమడుగులో  ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ  ప్రారంభించారు.  ఈ కార్యక్రమం అనంతరం   గూడెం చెరువులో ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొంటారు. గండికోటలో ఒబెరాయ్ హోటల్, జార్జ్ వ్యూ పాయింట్, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేస్తారు. అనంతరం స్థానిక  తెలుగుదేశం నేతలో సమావేశం అవుతారు. ఆ తరువాత ప్రజలతో భేటీ అవుతారు. చంద్రబాబు పర్యటన సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  ఇదిలా ఉండగా శుక్రవారం (ఆగస్టు 1)ఉదయం ఏడు గంటల నుంచీ రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పించన్ల పంపిణీ కార్యక్రమం 

హెచ్ సీఏ అధ్యక్షుడుజగన్మోహన్ రావుపై సస్పెన్షన్ వేటు

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఏ) అధ్యక్షుడు జగన్మోహనరావుపై ఆ అసోసియేషన్ అపెక్స్ కౌన్సిల్ సస్పెన్షన్ వేటు వేసింది. హెచ్ సీఏ అవినీతి, అక్రమాలపై సీఐడీ దర్యాప్తు సాగుతుండగా జగన్మోహనరావుపై సస్పెన్షన్ వేటు పడటం ప్రాధాన్యత సంతరించుకుంది. జగన్మోహనరావుతో పాటు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న హెచ్ సీఏ కార్యదర్శి దేవరాజ్, ట్రెజరర్ శ్రీనివాసరావులను కూడా హెచ్ సీఏ అపెక్స్ కౌన్సిల్ సస్పెండ్ చేసింది.   గత నెల 28న జరిగిన హెచ్ సీఏ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు గురువారం (జులై 31) ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో  అపెక్స్ కౌన్సిల్ సభ్యులు తెలిపారు.  హెచ్ సీఏ   విశ్వసనీయతను కాపాడటం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.  నిధుల దుర్వినియోగం, అధికార దుర్వినియోగం, చీటింగ్ కు సంబంధించి  జగన్మోహనరావు, దేవరాజ్, శ్రీనివాసరావులపై సీఐడీ, ఈడీ విచారణ జరుగుతున్న నేపథ్యంలో.. వారు హెచ్ సీఏ పదవులలో కొనసాగడం భావ్యం కాదని భావించి..  హెచ్‌సీఏ నిబంధనలు 41 (6), రూల్‌ 51(4) (డి)  ప్రకారం వారిని సస్పెండ్ చేసినట్లు అపెక్స్ కౌన్సిల్ సభ్యలు తెలిపారు. హెచ్ సీఏ తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రస్తుత ఉపాధ్యక్షుడు   దల్జీత్‌ సింగ్‌ తాత్కాలిక  బాధ్యతలు నిర్వర్తిస్తారని తెలిపారు. 

ప్రధాని మోడీతో చినజీయర్ స్వామి భేటీ.. ఎందుకో తెలుసా?

ప్రధాన మంత్రి నరేంద్రమోడీతో త్రిదండి చినజీయర్ స్వామి భేటీ అయ్యారు. ఢిల్లీలో ప్రధాని నివాసంలో త్రిదండి చినజీయర్ స్వామి గురువారం భేటీ అయ్యారు. ఈ భేటీలో మైహోమ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ రామూరావు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా త్రిదండి చినజీయర్ స్వామి ప్రధాని మోడీని ముచ్చింతల్‌లోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం మూడో వార్షికోత్సవానికి ఆహ్వానించారు. ఈ ఏడాది చివరిలో నిర్వహించే సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం మూడో వార్షికోత్సవం ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా రావాలని చినజీయర్ స్వామి మోడీని కోరారు. ఇందుకు మోడీ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.  ఈ సందర్భంగా సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ప్రాంగణంలో కొలువుదీరిన దేవతామూర్తులకు జరిగే నిత్య కైంకర్యాలను చినజీయర్ స్వామి మోడీకి వివరించారు. వీరి మధ్య భేటీ దాదాపు ముప్పావుగంట సాగింది.   ఈ సందర్భంగా జీయర్  ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తోన్న నేత్ర విద్యాలయం, ఆయుర్వేద, హోమియో కళాశాల పురోగతి గురించి ప్రధాని అడిగి తెలుసుకున్నారు. - ధ్యాత్మిక, దైవిక కార్యక్రమాల ద్వారా సమాజంలో భక్తిభావాన్ని పెంపొందిస్తూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారంటూ అభినందించారు. 

మద్యం కుంభకోణం సొమ్ము పెద్దిరెడ్డి ఖాతాల్లోకి.. లోకేష్

జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన మద్యం కుంభకోణంలో పెద్దారెడ్డి పెద్ద లబ్ధిదారుగా లోకేష్ ఆరోపించారు. ఈ కుంభకోణానికి సంబంధించి పక్కా ఆధారాలున్నాయని అన్నారు.  సింగపూర్ పర్యటన వివరాలను, రాష్ట్రానికి రానున్న పెట్టుబడులను వివరించేందుకు గురువారం (జులై 31)న లోకేష్ మీడియా సమావేశంలో మాట్టాడారు.  రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకోవడానికి వైసీపీయులు ఇప్పటికీ నానా విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారని లోకేష్ ఆరోపించారు. తాము పెట్టుబడుల కోసం సింగపూర్ పర్యటనలో ఉన్న సమయంలోనే ఏపీ నుంచి సింగపూర్ సర్కార్ కు ఓ మెయిల్ వచ్చిందనీ, ఆ మెయిల్ లో త్వరలో ఏపీలో ప్రభుత్వం మారుతుందనీ, అందుకే ఏపీలో పెట్టుబడులకు ముందుకు రావద్దనీ ఉందన్నారు. ఇంతకీ ఆ మెయిల్ ఎక్కడ నుంచి వచ్చిందని ఆరాతీస్తే అది పుంగనూరు పుడింగి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంపెనీలో పని చేసే వ్యక్తిగా తేలిందని లోకేష్ తెలిపారు. పెద్దిరెడ్డి అరాచకాలు అన్నీ ఇన్నీ కావన్న లోకేష్.. మద్యం కుంభకోణానికి సంబంధించిన సంచలన విషయాలను వెల్లడించారు. జగన్ హయాంలో  ఓ డిస్టిలరీ నాలుగు వందల కేజీల బంగారం కొనుగోలు చేసిందన్నారు. మద్యాన్ని బంగారంతో తయారు చేయరు కదా.. మరి ఆ బంగారం ఎక్కడకు చేరిందో బయటకు రావాలని, వస్తుందని చెప్పారు.      పక్కా ఆధారాలతోనే  మద్యం కుంభకోణంపై దర్యాప్తు జరుగుతోందన్న లోకేష్.. జగన్ హయాంలో   మద్యం సరఫరా చేసిన    ఓ డిస్టిలరీ కంపెనీలు నాలుగు వందల కోట్ల రూపాయల విలువైన బంగారం కొనుగోలు చేసిందనీ.. మద్యం సొమ్ము పెద్దిరెడ్డి ఖాతాలకే మళ్లిందని ఆరోపించారు. మద్యం కుంభకోణం సొమ్మ తన ఖాతాలలోకి మళ్లలేదని పెద్దిరెడ్డి చెప్పగలరా? అని సవాల్ విసిరారు. మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే పెద్దిరెడ్డిరామచంద్రారెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి అరెస్టై రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న నేపథ్యంలో లోకేష్ ఆరోపణలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

జగన్ బాధిత పక్షాన కాకుండా నిందితుల పక్షానే ఎందుకుంటారో తెలుసా?

జగన్ నిందితుల పక్షానే ఎందుకుంటారన్న విషయంలో   సమాధానం వెతకాలంటే ఆయన తండ్రి, అంతకన్నా ముందు ఆయన తాత హయాం నుంచి మొదలు పెట్టాల్సి ఉంటుంది. రాజారెడ్డి కన్నా ముందు తరం అంటే రాజారెడ్డి   తండ్రి వెంకటరెడ్డి తరం గురించి ఒక మాట చెబుతారు. వీరు ఆనాడు భూముల కోసం ఆశ పడి సొంత ధర్మాన్ని ధిక్కరించి,  ఆపై క్రిష్టియానిటీ పుచ్చుకున్నారనీ.. ఆ తర్వాత వారు పులివెందులకు వచ్చారనీ.. అక్కడి నుంచి వీరు భూ స్వాములుగా మారారనీ అంటారు. ఆపై రాజారెడ్డి ఫ్యాక్షన్ పాలిటిక్స్ మొదలు పెట్టారనీ.. ఆపై మైనింగ్ యజమానులను బెదిరించి మైనింగ్ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశారని చెబుతారు. ఇక్కడ ఎటు నుంచి ఎటు చూసినా.. జగన్ బ్లడ్ గ్రూప్ నెగిటివ్. ఇక్కడ పాజిటివ్ ఎక్కడైందంటే.. రాజారెడ్డి తన కొడుకు రాజశేఖర్ రెడ్డిని ఎంబీబీఎస్ చేయించడంతో మొదలైంది. దానికి తోడు ఆయన రూపాయ డాక్టర్ కావడంతో.. మొదలైంది అసలు రాజకీయం. అప్పటి వరకూ రాజారెడ్డి అంటే రక్తసిక్త రాజకీయమే గుర్తుకొచ్చేది. అలా అలా తమకున్న రక్తపు మరకలు కడుగుతూ వచ్చిన వైయస్ ఫ్యామిలీ తర్వాతి కాలంలో మహానేత అంటూ కొత్త కలరింగులు ఇచ్చుకోవడం మొదలైంది.  అయితే జగన్ తన తాత రాజారెడ్డి రాజ్యాంగాన్ని  పాటిస్తూ వచ్చారు. అందుకే ఆయన తన పార్టీలో కూడా అలాంటి వారినే ప్రొత్సహిస్తారు. న్యూడ్ విడియోతో రచ్చకెక్కిన ఎంపీ గోరంట్ల మాధవ్, డెడ్ బాడీని డోర్  డెలివరీ  చేసిన ఎమ్మెల్సీ అనంత బాబు, రాసలీలల అంబటి, అవంతి.. ఆపై అవినీతికే దగ్గరుండి ఓనమాలు దిద్దించిన రోజా, రజని. ఇక లిక్కర్ కింగ్స్ చెవిరెడ్డి, మిధున్ రెడ్డి.. క్వార్ట్జ్ కా రాజా కాకాణి, సోదరినే విచక్షణ మరచి మరీ బూతులు తిట్టిన ప్రసన్న కుమార్ రెడ్డి. అలాగే బెట్టింగ్ రాజా అనిల్ కుమార్ యాదవ్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితాకు ఒక అంతంటూ ఉండదు.  ఆయన పార్టీలోని పై  స్థాయి వారే ఇలాగుంటే ఇక తెనాలి గంజాయ్ బ్యాచ్, ఆపై పల్నాడు బెట్టింగ్ రాజులకే విగ్రహాల నిర్మాణం ఇలా ఎటు నుంచి ఎటు చూసినా నెగిటివ్ కేరెక్టర్లే ఎక్కువ కనిపిస్తాయి. అందుకేగా ఆయన పబ్లిక్ గా అంటోంది 'పిలకాయలన్నాక కొట్టుకోరా!' అని. ఆపై  రప్ప రప్ప అంటే తప్పు లేదని అనడం కూడా ఇందులో భాగమేనంటారు. మచ్చుకైనా సరే గుడ్ ఉండదు.. అంతా బ్లడ్డే అన్నది పరిశీలకుల విశ్లేషణ. అసలాయన అడుగు పెడితే తలకాయలైనా మామిడికాయలైనా ఒకటే ఆ జగనన్న రథ చక్రాల కింద కసకస నలగాల్సిందేనంటారు. ఇందుకు జగన్ పల్నాడు పర్యటన సందర్భంగా ఆయన కారు కింద నలిగి మరణించిన సింగయ్య ఉదంతాన్ని ఉదాహరణగా చూపిస్తున్నారు. 

ఏపీ మద్యం కేసులో సిట్ అదుపులో మరొకరు

  ఏపీ మద్యం కుంభ కోణ కేసులో మరొకరిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. A48 సుజన బెహ్రాన్‌ను హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకుని ఆమెను విజయవాడకు తరలించారు. ఇప్పటికే 48కి నిందితుల సంఖ్య చేరింది. లిక్కర్ స్కామ్‌లో సిట్ దూకుడు పెంచింది. అడిషనల్ ఛార్జ్‌షీట్ సిద్దం చేయనున్నట్లు తెలుస్తోంది. సిట్ అధికారులు బుధవారం హైదరాబాద్‌లోని శంషాబాద్, కాచారం ప్రాంతంలో నిర్వహించిన సోదాల్లో రూ. 11 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తాన్ని ఎస్.ఐ.టి కార్యాలయానికి తరలించిన అధికారులు, దీనికి సంబంధించిన మెమోను గురువారం ఏసీబీ కోర్టుకు సమర్పించారు.  ఇప్పటికే రాజ్ కసిరెడ్డి, గోవిందప్ప బాలాజీతో పాటు మాజీ సీఎం వైఎస్ జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డిని అరెస్ట్ చేసి విచారించారు. వారి విచారణ ఆధారంగా బునేటి చాణక్య, వరుణ్, వినయ్ వంటి మరికొంతమందిని కూడా అరెస్ట్ చేశారు. ఈ కుంభకోణంతో సంబంధం ఉన్న కొందరు విదేశాలకు పారిపోయినట్లు సిట్ గుర్తించింది. వారిని తిరిగి దేశానికి రప్పించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ప్రాథమిక దర్యాప్తులో సుమారు రూ. 3500 కోట్ల మేర మద్యం కుంభకోణం జరిగిందని సిట్ అధికారులు అంచనా వేస్తున్నారు.  

మహిళలను కించపరిచే వ్యక్తికి పరామర్శ సిగ్గు చేటు : ప్రశాంతి రెడ్డి

  వైసీపీ  అధినేత జగన్ నెల్లూరు పర్యటనపై కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మండిపడ్డారు. నెల్లూరు నగరం మాగుంట లే ఔట్ లోని నివాసంలో మీడియాతో మాట్లాడుతూ జగన్‌పై  నిప్పులు చెరిగారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి నిజాయతీగా వ్యాపారాలు చేసే ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ని విమర్శిస్తావా అంటూ సూటిగా ప్రశ్నించారు. మహిళలను కించపరుస్తూ సంస్కార రహిత వాఖ్యలు చేసిన ప్రసన్నలాంటి వారిని పరామర్శించి సమాజానికి ఏం సందేశమిస్తున్నారని ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు.  తీర్ధయాత్రలు చూసాం, జైత్రయాత్రలు, విజయయాత్రలు చూసాం, దండయాత్రలు, ఓదార్పు యాత్రలు లాంటివి కూడా చూసాం ఈ జైలు యాత్రాలేంటి ఆమె అన్నారు.మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని  జగన్ మోహన్ రెడ్డి పరామర్శించడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లిని, చెల్లినీ వేధించడం వైసీపీ సంస్కృతిలో భాగమని ఈ సందర్భంగా ఆమె అభివర్ణించారు.  జగన్ జైలు యాత్రలు చూసి ప్రజలు అస్యహించుకుంటున్నారని పేర్కొన్నారు. తప్పు చేసిన వాళ్లని సమర్ధించడం నాయకుడి లక్షణం కాదన్నారు. ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించడం ద్వారా వైఎస్ జగన్ తన స్థాయి దిగజార్చుకున్నారని ఆమె అన్నారు. రూ.500కోట్లతో ఫ్యాక్టరీ పెట్టి గ్రామీణ యువతకి ఉపాధి కల్పించాలన్న నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి  ఆశయానికి కొందరు నీచులు తూట్లు పొడిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు.   వైసీపీ నేతలు అనిల్, ప్రసన్న లాంటి అచ్చోసిన ఆంబోతుల వల్లే జిల్లాలో వైసీపీ పూర్తిగా తుడిచిపెట్టుకు పోయిందన్నారు. అందుకే ప్రజలు   11 సీట్లకి పరిమితం చేసినా, ఆ పార్టీ నేతల బుద్ధి మాత్రం మారడం లేదని వాపోయారు. మీ తల్లో, చెల్లో, ఆవిడో రాజకీయాల్లోకి వస్తే.. వాళ్లపై ప్రత్యర్థులు మీలా నోరుపారేసుకుంటే ఊరుకుంటారా? అంటూ వైసీపీ అగ్రనేతలను ఈ సందర్భంగా ప్రశాంతి రెడ్డి ప్రశ్నించారు.

కాళేశ్వరంపై నివేదిక ప్రభుత్వానికి సమర్పించిన కమిషన్

  మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు, కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాల ఆరోపణలపై  పీసీ ఘోష్ కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. నివేదికను షీల్డ్ కవర్‌లో ప్రభుత్వానికి అందజేశారు. కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్. బీఆర్‌కే భవన్‌కు వెళ్లి.. నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాకు నివేదికను అందజేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలు, అవినీతిపై 15 నెలల పాటు విచారణ జరిపారు. జస్టిస్ పీసీ ఘోష్. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించి పూర్తి విచారణ చేశారు.  కమిషన్ అందించిన నివేదికను రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి అందజేయనున్నారు రాహుల్ బొజ్జా. కమిషన్ తన నివేదికలో ఏం పేర్కొంది.. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఎర్రవల్లిలోని నివాసంలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డితో పాటు పలువురు నేతలు భేటీకి హాజరయ్యారు. కాళేశ్వరం కమిషన్ మేడిగడ్డతో పాటు ఇతర ప్రాజెక్టులో లోపాలకు తామే కారణమని నివేదిక ఇస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఎదురుకోవాలని అంశంపై డిస్కస్ చేశారు. తాజా నివేదికలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం తప్పిదాలను గుర్తించినట్లు తెలుస్తోంది. ఆ వివరాలు నేడే, రేపో బయటకు వచ్చే అవకాశముందని సమాచారం. దీనిపై ప్రభుత్వం తరపున సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది.