శనగపిండిలో ఇవి మూడు కలిపి వాడండి..  ఫలితాలు చూసి షాకవుతారు.. !   ప్రతి ఒక్కరూ ముఖంలో మెరుపును కోరుకుంటారు.  చర్మం మెరిసేలా చేయడానికి రసాయనాలతో కూడిన ఉత్పత్తులు వాడతారు. అయితే  రసాయన ఉత్పత్తులకు బదులుగా  సహజ చిట్కాలు ఉపయోగించినట్లయితే, దాని కంటే మెరుగైనది ఏమి ఉండదు. ఈ రోజుల్లో అనేక సహజ సౌందర్యం మరియు చర్మ సంరక్షణ ఉత్పత్తులలో ఉండే రసాయనాలు  ముఖాన్ని దెబ్బతీస్తాయి. చర్మ సంరక్షణలో చాలా ఏళ్ల నుండి  శనగపిండిని ఉపయోగిస్తున్నారు.  అందుకే ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోవడానికి ఇంట్లోనే  శనగపిండిలో మూడు పదార్థాలను కలపడం వల్ల అద్బుతం చేయవచ్చు.  అందేంటో తెలుసుకుంటే.. శనగపిండి ప్యాక్.. శనగపిండితో చేసిన ప్యాక్‌లను చాలా ఏళ్ల నుంచి ముఖానికి వాడుతూనే ఉన్నారు.   ఇది యాంటీ బాక్టీరియల్,  ఎక్స్‌ఫోలియేటింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది, ఇది రంధ్రాలను శుభ్రపరచడంలో, మొటిమలను నయం చేయడంలో, డెడ్ స్కిన్‌ను క్లియర్ చేయడంలో,  చర్మాన్ని లోతుగా శుభ్రపరచడానికి, చర్మ కాంతిని  మెరుగుపరచడంలో సహాయపడుతుంది. . శనగపిండి ప్యాక్ కావలసిన పదార్థాలు.. శనగ పిండి - 2 స్పూన్లు ముల్తానీ మట్టి - 1 టీస్పూన్ పసుపు - 1/4 టీస్పూన్ పెరుగు - 2-3 స్పూన్లు (  కావాలంటే మీరు ఈ ఫేస్ ప్యాక్‌లో కొన్ని చుక్కల కొబ్బరి నూనెను కూడా జోడించవచ్చు, ఇది ముఖానికి మెరుపును తెస్తుంది. పొడి చర్మం ఉన్నవారికి అదనపు  ప్రయోజనాలు చేకూరుస్తుంది. ) తయారీ విధానం.. ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో శనగపిండి, ముల్తానీ మట్టి, పసుపు, పెరుగు వేసి బాగా కలపాలి. అన్నింటినీ బాగా మిక్స్ చేసి మెత్తని పేస్ట్‌లా తయారు చేసి ఆపై ముఖానికి అప్లై చేయాలి. 10-15 నిమిషాల పాటు  ముఖంపై ప్యాక్ ఉంచాలి.  సమయం ముగిసిన తర్వాత ముఖాన్ని కడగాలి. ముఖం కడుక్కున్న వెంటనే ముఖంలో  గ్లో ఎన్ని రెట్లు పెరగడం కూడా గమనించవచ్చు.  వారానికి రెండుసార్లు ఈ ప్యాక్ ను ఉపయోగించవచ్చు.                                *రూపశ్రీ.

ఈ పువ్వు ఒక్కటి చాలు.. చర్మ సమస్యలు అన్నీ పరార్..!   ఔషధ గుణాలతో నిండిన పూలు మన చుట్టూ ఎన్నో ఉన్నా వాటి అందాన్ని చూసి సంతోషపడుతూ వాటి సువాసన ఆస్వాదిస్తూ గడిపేస్తుంటారు చాలా మంది.  అయితే పువ్వులు చర్మానికి వరం కంటే తక్కువ కాదు. ముఖ్యంగా కొన్ని పువ్వులు చర్మ సమస్యలను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది. ఇప్పట్లో అందరికీ అందుబాటులో ఉంటూ సౌందర్య రక్షణలో విరివిిగా ఉపపయోగిస్తున్న  పువ్వులలో గులాబీ ప్రథమ స్థానంలో ఉంది.  గులాబీ పువ్వును రోజ్ వాటర్ తయారీలో ఉపయోగిస్తారు.  అంతే కాదు.. గులాబీ పువ్వుల నుండి చాలా రకాల సౌందర్య ఉత్పత్తులు తయారు చేస్తారు. ఇది చర్మాన్ని రిపేర్ చేయడంలో చాలా సహాయపడుతుంది. ఇంట్లోనే రోజ్ మాయిశ్చరైజర్ తయారు చేసి వాడితే అన్ని రకాల చర్మ సమస్యలు  తగ్గిపోతాయి. కావలసిన పదార్థాలు.. గులాబీ - 1 నీరు - 5 మి.లీ అలోవెరా - 30 గ్రా అర్గాన్ ఆయిల్ - 4 మి.లీ తయారీ విధానం.. మిక్సర్ జార్‌లో  గులాబీ రేకులు, 5 ml నీరు, 30 గ్రాముల కలబంద,  4 ml ఆర్గాన్ ఆయిల్ వేయాలి.  అన్నింటినీ మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి.  గ్రైండ్ చేసిన తర్వాత, గులాబీ సరిగ్గా గ్రైండ్ చేయబడిందో లేదో చెక్ చేయండి. అవసరమైతే, మరొకసారి గ్రైండ్ చేయాలి. బాగా గ్రైండ్ అయిన తరువాత అద్భుతమైన  మాయిశ్చరైజర్ సిద్ధంగా ఉన్నట్టే. దీన్ని నచ్చిన విధంగా ఉపయోగించుకోవచ్చు, కానీ స్నానం చేయడానికి ఒకటి లేదా రెండు గంటల ముందు ఉపయోగిస్తే మంచి ప్రయోజనాలు లభిస్తాయి. ఒకవేళ  ఇంట్లో ఆర్గాన్ ఆయిల్ లేకపోతే బాదం నూనెను కూడా ఉపయోగించవచ్చు. గులాబీ ఎందుకంటే..  గులాబీ రేకుల సారంలో అధిక ఆంథోసైనిన్, పాలీఫెనాల్స్,  ఫ్లేవనాయిడ్ కంటెంట్ ఉంటాయి. గులాబీ రేకుల సారం కూడా యాంటీఆక్సిడెంట్,  యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది.   సూర్యుని  అతినీలలోహిత కిరణాలకు గురైనప్పుడు  ఎపిడెర్మల్ సెల్ లైన్లలో సైటోకిన్ లను అణిచివేయడం  ద్వారా మన చర్మంపై బలమైన ప్రభావాన్ని చూపుతుంది. మొత్తంమీద గులాబీ చర్మానికి ఔషధంలా పనిచేస్తుంది.                                   *రూపశ్రీ.

దట్టమైన కనురెప్పలు కావాలా...ఇలా చేయండి..!     కవుల నుండి చిత్రాకారుల వరకు అమ్మాయిల కళ్లను ఎన్నిరకాలుగా పొగుడుతూ ఉంటారో  మాటల్లో చెప్పలేం.  కళ్లు అందంగా కనిపించడంలో కనురెప్పల పాత్ర చాలా ఉంటుంది.  కనురెప్పలు ఒత్తుగా, నల్లగా ఉంటే కళ్లు మాములు కంటే ఎక్కువ అందంగా కనిపిస్తాయి.  అయితే చాలామందికి కనురెప్పలు పలుచగా ఉంటాయి. ఈ కారణంగానే ఈ మధ్యకాలంలో కృత్రిమ కనురెప్పలను ఉపయోగిస్తున్నారు. ఇవి చూడటానికి చాలా ఆకర్షణగా ఉంటాయి. అయితే అలా కాకుండా సహజంగానే కనురెప్పలు ఒత్తుగా, అందంగా పెరగాలంటే ఈ కింది చిట్కాలు పాటించాల్సిందే.. కొబ్బరినూనె.. వెంట్రుకలు సహజంగా పొడవుగా మందంగా పెరగడంలో చాలామంది వాడేది కొబ్బరినూనెనే. ప్రతి రోజూ  రాత్రి  పడుకునే ముందు కొబ్బరినూనెను కనురెప్పలకు అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయాలి.  ఇలా చేయడం వల్ల కనురెప్పలు కొన్ని రోజులలోనే మందంగా,  ఒత్తుగా మారతాయి. నెయ్యి.. రోజూ కొన్ని చుక్కల నెయ్యిని ముఖానికి రాస్తుంటే చాలా మంచిదని వింటూనే ఉన్నాం. అయితే నిద్రపోయే ముందు దేశవాళీ నెయ్యిని రెండుమూడు చుక్కల మోతాదులో వేళ్లకు అద్దుకుని దాన్ని కనురెప్పల మీద అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయాలి.  ఇది కనురెప్పలను  పొడుగ్గా,  ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. ముఖానికి రాసుకుంటే ముఖం మెరుస్తుంది. వాసెలిన్.. కనురెప్పలు ఆకర్శణీయంగా మారాలన్నా,  ఒత్తుగా  పెరగాలన్నా వాసెలిన్ ను అప్లై చేయవచ్చు.   చలికాలంలో దీన్ని పెదవులకు కూడా అప్లై చేయడం చూస్తుంటాం. కానీ కనురెప్పలకు వాసెలిన్ అప్లై చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. కొబ్బరి నూనె, విటమిన్-ఇ.. విటమిన్-ఇ క్యాప్సుల్ చర్మానికి బాగా పనిచేస్తాయి.  విటమిన్-ఇ చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో సహాయపడుతుంది.    కొబ్బరినూనెలో విటమిన్-ఇ క్యాప్సూల్ వేసి బాగా మిక్స్ చేయాలి, దీన్ని రోజూ రాత్రి పడుకునే ముందు కనురెప్పల మీద అప్లై చేయాలి.  మంచి ఫలితం ఉంటుంది. ఆలివ్ నూనె.. ఆలివ్ నూనె వంటలకు, జుట్టుకు, చర్మానికి ఇలా.. చాలా రకాలుగా మేలు చేస్తుంది.  ఆలివ్ నూనెలో ఆముదం కొద్దిగా మిక్స్ చేసి ఒక కంటైనర్ లో నిల్వ చేసుకోవాలి.  దీన్ని ప్రతి రోజూ రాత్రి పడుకునేముందు కనురెప్పలకు అప్లై చేస్తుండాలి. కనురెప్పలు ఒత్తుగా, నల్లగా మారతాయి. అలోవెరా జెల్.. అలోవెరా జెల్ అప్లై చేస్తే కూడా కనురెప్పలు పొడవుగా,  మందంగా పెరుగుతాయి. అలోవెరా జెల్ లో విటమిన్-ఇ క్యాప్సూల్ మిక్స్ చేసి  కనురెప్పలకు అప్లై చేసుకోవాలి.  ఇలా చేస్తే కనురెప్పలు ఒత్తుగా పెరుగుతాయి.                                             *రూపశ్రీ.

  ఇంట్లోనే ఈ లిప్ బామ్ తయారు చేసి వాడండి.. పగిలిన పెదవులు ఎంత అందంగా మారతాయంటే..!   పెదవులు.. కవుల కలాలకు అదనపు పనులు చెబుతాయి.  అమ్మాయిల పెదవుల అందం గురించి ఎంత చెప్పినా తక్కువే.  పెదవులు అందంగా ఉంటే  అవి ముఖానికి బోలెడు అదనపు ఆకర్షణ అవుతాయి. కానీ అదే పెదవులు పగిలిపోయి, ఎండిపోయి, నల్లగా ఉండి కళావిహీనంగా ఉంటే మాత్రం ముఖారవిందం మొత్తం పాడయినట్టు అనిపిస్తుంది.  ముఖ్యంగా చలికాలంలో చాలా తొందరగా ప్రభావానికి గురయ్యేది పెదవులే.. పగిలిన పెదాలు ఆరోగ్యంగా మారాలన్నా, అవి మరింత అందంగా కనిపించాలన్నా లిప్ బామ్  వాడుతుంటారు. అయితే ఆరోగ్యకరమైన పద్దతిలో ఇంట్లోనే లిప్ బామ్ ను ఇలా తయారుచేసుకోవచ్చు.  అదెలాగంటే.. కావలసిన పదార్థాలు.. కొబ్బరి నూనె - 1 టీస్పూన్ వాసెలిన్ - 1 టీస్పూన్ బీట్‌రూట్ రసం - 6 స్పూన్లు విటమిన్ ఇ-2 క్యాప్సూల్స్ తయారీ విధానం.. లిప్ బామ్ చేయడానికి ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో కొబ్బరినూనె, వాసెలిన్ వేసి కరిగించుకోవాలి. రెండూ కరిగిపోయాక గిన్నెలో బీట్‌రూట్ రసం వేసి కలపాలి. ప్రతిదీ బాగా కలిపిన తర్వాత గిన్నెను గ్యాస్ నుండి వేరు చేసి ఈ ద్రవాన్ని ఒక గిన్నె లో వేయాలి. చివరగా విటమిన్ ఇ ఆయిల్ వేసి లిప్ బామ్ తో మిక్స్ చేయాలి. ఇప్పుడు  పగిలిన పెదాలను మృదువుగా మార్చే లిప్ బామ్ రెఢీ అయినట్టే. పెదాలను పింక్‌గా మార్చడంలో సహాయపడే బీట్‌రూట్ ఇందులో ఉపయోగించారు కాబట్టి పెదవులు పింక్ గా కూడా మారతాయి.  దీన్ని వాడితే లిప్ స్టిక్ వినియోగం తగ్గించుకోవచ్చు. విటమిన్-ఇ ఎలా పనిచేస్తుందంటే.. విటమిన్ ఇ నూనెలో  స్కిన్ ట్రీట్మెంట్ గుణాలు ఉంటాయి. ఇవి పెదాలను హైడ్రేట్ గా ఉంచుతాయి. రక్త ప్రసరణను పెంచుతాయి.  తరచుగా పగుళ్లు రాకుండా చేస్తుంది. విటమిన్ ఇ ఆయిల్ పెదవుల చుట్టూ టానింగ్‌ను తగ్గించడంలో కూడా మేలు చేస్తుంది.  రోజూ రాత్రి పడుకునే ముందు విటమిన్ ఇ ఆయిల్‌ని పెదవులపై రాసుకున్నా ఫలితం ఉంటుంది.                         *రూపశ్రీ.  

డార్క్ సర్కిల్స్ తగ్గించుకునే నేచురల్ రెమిడీస్ ఇవీ..! డార్క్ సర్కిల్స్.. ఎంత అందంగా ఉన్న అమ్మాయిల ముఖాన్ని అయినా పాడు చేసే పెద్ద సమస్య. కళ్ల చుట్టూ నల్లని వలయాలు ఉంటే ఏదో జబ్బు చేసిన వాళ్లలా కనిపిస్తుంటారు. ఇప్పట్లో చాలామంది ఈ డార్క్ సర్కిల్స్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. నలుగురిలోకి వెళ్ళినప్పుడు మేకప్ తో వీటిని కవర్ చేస్తుంటారు. కానీ శాశ్వతంగా ఇవి తొలగిపోవాలంటే.. ఆయుర్వేదం సూచించిన చిట్కాలను పాటించాల్సిందే.. కారణాలు.. డార్క్ సర్కిల్స్ ఎందుకొస్తాయి అనే సందేహం చాలా మందికి వచ్చే ఉంటుంది. అయితే డార్క్ సర్కిల్స్ కు ఒత్తిడి ప్రధాన కారణమట.  మానసిక, శారీరక ఒత్తిడి, పర్యావరణ లేదా భావోద్వేగ సమస్యలు కంటి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయట.  ఇవన్నీ  కలసి నిద్రలేమి, మానసికంగా అలసిపోవడం వంటి సమస్యలు సృష్టిస్తాయి.  ఎక్కువకాలం భావోద్వేగాలను క్యారీ చేయడం వల్ల ఎప్పుడూ ఏడుస్తూ ఉంటారు కొందరు.  ఇలాంటి వారిలో కూడా డార్క్ సర్కిల్స్ వస్తాయి. కళ్ల కింద చర్మం పలచబడి రక్తనాళాలు ఎక్కువగా కనిపించేలా చేయడం వల్ల డార్క్ సర్కిల్స్ ఏర్పడతాయి. అలోవెరా.. అలోవెరా లేదా కలబంద డార్క్ సర్కిల్స్ ను తగ్గించడంలో సహాయపడుతుంది.  అలోవెరా జెల్ లేదా తాజా కలబంద ను శుభ్రం చేసి స్లైస్ లుకా చేసి  డార్క్ సర్కిల్స్ మీద పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల  కళ్ల కింద నల్లటి వలయాలు నలుపు తగ్గి ఆ ప్రాంతంలో చర్మం కాంతివంతంగా మారుతుంది. దోసకాయ.. చాలామంది కళ్లమీద దోసకాయను పెట్టుకోవడం చూస్తూనే ఉంటాం.  దోసకాయ చలువ చేస్తుంది.  కళ్లను రిలాక్స్ చేస్తుంది.  ఇక కళ్ల కింద నల్లని వలయాలు ఉన్నట్టైతే  దోసకాయ రసాన్ని కళ్ల కింద రాసినా లేదా దోసకాయ ముక్కలను చక్రాలుగా కట్ చేసి కళ్ల మీద  పెచ్చుకుని అలా కాసేపు రిలాక్స్ గా పడుకున్నా మంచి ఉపశమనం ఉంటుంది.  ఇది కేవలం డార్క్ సర్కిల్స్ ను తగ్గించడమే కాదు.. ఉబ్బిన కళ్లను తిరిగి నార్మల్ చేయడంలో కూడా సహాయపడుతుంది. పసుపు.. పసుపులో యాంటీ ఆక్సిడెంట్లు,  యాంటీ ఇన్ప్లమేటరీ గుణాలు ఉంటాయి.  ఇవి వాపును తగ్గించడంలో సహాయపడతాయి. నల్లని వలయాలను చాలా తేలికగా చేస్తుంది. రోజ్ వాటర్.. రోజ్ వాటర్ డార్క్ సర్కిల్స్ ను తగ్గించడంలో సహాయపడుతుంది.  ఇందులో ఉండే గుణాలు చర్మానికి చలువదనాన్ని ఇస్తాయి.  చర్మానికి రిలాక్సేషన్ ను ఇస్తాయి.                                                    *రూపశ్రీ.

  కాలనుగుణంగా శరీర తత్వంలో కూడా మార్పు వస్తుంది.  వేసవికాలంలో ఉక్కపోత భరించలేక శరీరం మీద చెమట కాయలు, వడ గుల్లలు వంటివి వచ్చినట్టే.. చలికాలంలో చర్మం పొడిబారుతుంది. చలి గాలుల కారణంగానూ,  చలి చర్మాన్ని దెబ్బ తీయడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి.  అయితే  ఇలా పొడిబారడానికి చలి మాత్రమే ప్రధాన కారణం కాదు. ఇంకా ఇతర కారణాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే.. చలికాలంలో గాలిలో తేమ శాతం తగ్గుతుంది. ఇది చర్మం నుండి తేమను లాగేసుకుంటుంది.  పొడిగా కఠినంగా మారుస్తుంది.  దీని వల్లనే చాలా వరకు పొడి చర్మం సమస్య వస్తుంది. చలికాలంలో పొడిచర్మం ఉన్నవారికి సమస్య పెరుగుతుంది. చలికాలంలో  చలికి తాలలేక చాలా మంది వేడి నీటి స్నానమే చేస్తుంటారు.  అది కూడా చాలా వేడిగా ఉన్న నీటితో స్నానం చేస్తారు.  దీని వల్ల చర్మం దెబ్బతింటుంది.  చర్మం పొడిబారుతుంది. దీనికి కారణం.. చర్మంలో ఉండే సహజ నూనెలు తొలగిపోవడమే. చలికాలంలో చలి కారణంగా చాలా మంది నీరు తాగరు, పైగా చలి కారణంగా దాహం కూడా వేయదు. అందుకే శరీరంలో తేమ లోపించి చర్మం పొడిబారుతుంది. కేవలం పొడిబారడమే కాకుండా చర్మం నిర్జీవంగా మారుతుంది. చలి నుండి ఉపశమనం కోసం ఉన్ని బట్టలు వేసుకుంటారు.  ఇవి చర్మాన్ని రుద్దుతాయి.  చర్మానికి అలెర్జీ చర్యను ప్రేరేపిస్తాయి.  దీని కారణంగా చర్మం మీద దురద, దద్దుర్లు వస్తాయి.  ఇది కూడా చర్మం పొడిబారడానికి కారణం అవుతుంది.  చలిని భరించలేక చాలామంది ఇళ్లలో వేడి హీటర్ లు ఏర్పాటు చేసుకుంటారు.  ఈ హీటర్ నుండి వచ్చే గాలి చర్మాన్ని సున్నితంగా మార్చి చర్మం మీద తేమను లాగేస్తుంది.  ఇది చర్మం పొడిబారేలా చేస్తుంది. థైరాయిడ్, మధుమేహం వంటి సమస్యలు ఉన్నవారికి చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ.  ఈ సమస్యలు ఉన్నవారి చర్మం చాలా తొందరగా పొడిబారుతుంది.                       *రూపశ్రీ.

ఈ ఈజీ ట్రిక్స్ నేర్చుకుంటే పెద్ద మేకప్ ఆర్టిస్ట్ లను తలదన్నేలా రెఢీ అవ్వచ్చు..   అందంగా కనిపించడం అమ్మాయిల టార్గెట్.  అందానికి ప్రతిరూపంగా అమ్మాయిలను పోల్చడం, పువ్వులతో సమానంగా అమ్మాయిలను ప్రస్తావించడం చూస్తుంటాం.  ఇదంతా అందం మహిమే.. అయితే చాలామంది అందంగా కనిపించాలంటే బ్యూటీ పార్లర్ కు వెళ్లాల్సిందే అనే ఆలోచనలో ఉంటారు. దీనికి తగినట్టే ఏ చిన్న ఈవెంట్ .. ఏ చిన్న పార్టీ ఉన్నా పార్లర్ కు వెళ్ళి వందలాది రూపాయలు ఖర్చు చేస్తుంటారు. అయితే కొన్ని ఈజీ ట్రిక్స్ ఫాలో అయితే పెద్ద మేకప్ ఆర్టిస్ట్ లు చేసిన మేకప్ కూడా చిన్నబోతుంది.  మేకప్ ను ఇష్టపడే ప్రతి అమ్మాయి తెలుసుకోవాల్సిన ఆ ట్రిక్స్ ఏంటంటే.. ఐ షాడో.. అమ్మాయిలను చూడగానే మొదటగా ఆకట్టుకునేవి కళ్లు. ఒకప్పుడు కళ్లకు కాటుక పెట్టి సహజంగా కంటి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ కళ్లను ఆకర్షణగా ఉంచుకునేవారు.  అయితే ఇప్పట్లో కళ్లకు ఐ లైనర్,  ఐ షాడో తో మెరుగులు దిద్దుతున్నారు.  ఐ షాడో ఫర్పెక్ట్ గా పెడితే కళ్లను చూసి ఇతరులు కళ్లు తిప్పుకోలేరు. అంత అందంగా కనిపిస్తారు.  అందుకే ఐ షాడో ను టేప్ సహాయంతో ఈజీగా అప్లై చేయడం నేర్చుకోవాలి. ఐ లైనర్.. ఐ షాడో మాత్రమే కాదు..  ఐ లైనర్ వేసుకుంటూ ఉంటారు.  రెండు కళ్లక వేర్వేరు ఐ లైనర్ వేసుకునేవారు కూడా ఉంటారు. అలాంటి వారు ఐ లైనర్ ను ఈజీగా అప్లై చేసుకునే విధానం ఉంది.   చూపుడు వేలిపై ఒక చుక్క ఐ లైనర్ ఉంచాలి. వేలిని కళ్ల మూలలో నుంచి చెవి వైపుకు నెమ్మదిగా ఒక గీతను గీసినట్టు అప్లై చేయాలి.  అంతే.. కష్టం లేకుండా కేవలం సెకెన్ల వ్యవధిలో అందంగా ఐ లైనర్ అప్లై చేసుకున్నట్టే. కలర్ ఫుల్ షాడో.. టేప్ సహాయంతో ఐ షాడో అప్లై చేయడం తెలుసుకున్నారు కదా.. ఇప్పుడు ఐ షాడోను మరింత ఆకర్షణగా మార్చడానికి ఇయర్ బడ్ తీసుకోవాలి. ఈ ఇయర్ బడ్ సహాయంతో కలర్ ఫుల్ షాడ్ ను అప్లై చేయాలి.  ఇయర్ బడ్ తో రుద్దాలి.  ఇలా చేస్తే మిక్స్డ్ కలర్ లో ఐ షాడో ఔరా అనిపిస్తుంది.                             *రూపశ్రీ.  

ఎర్ర కందిపప్పు ఇలా వాడితే.. మచ్చలేని చర్మం మీ సొంతం..! మచ్చలేని చర్మం కావాలని కోరుకోని అమ్మాయిలు ఉండరు. ఇందుకోసం చాలా రకాల టోనర్లు,  సీరమ్ లు, ఫేస్ ప్యాక్ లు, క్రీమ్ లు వాడుతుంటారు. అయితే అవన్నీ కాదు.. వంటింట్లో ఉండే ఎర్ర కందిపప్పును వాడితే ముఖం మీద మచ్చలు మాయమవుతాయట. మచ్చలేని చర్మం సొంతమవుతుందని అంటున్నారు. చర్మాన్ని నేచురల్ గా మెరిపించే పేస్ ప్యాక్ లను ఎర్ర కందిపప్పుతో తయారు చేసుకుని వాడవచ్చు.  అవెలా చేయాలో తెలుసుకుంటే.. కందిపప్పు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. కందిపప్పులో ప్రోటీన్,  ఫైబర్ తో పాటు చాలా పోషకాలు ఉంటాయి.  అయితే ఎర్ర కందిపప్పును పేస్ ఫ్యాక్ గా ఉపయోగించవచ్చు. ఎలా ఉపయోగించాలో తెలుుకుంటే.. ఎర్రకందిపప్పు.. పాలు.. పొడి చర్మంతో ఇబ్బంది పడేవారు ఎర్రకందిపప్పు,  పాలతో పేస్ ప్యాక్ తయారు చేసుకుని వాడవచ్చు. ఇది ముఖానికి తేమను అందిస్తుంది.  చాలా సేపు చర్మం తేమను నిలిపి ఉంచుకుంటుంది.  చర్మం మృదువుగా ఉండటంలో సహాయపడుతుంది. కావసిన పదార్థాలు.. తయారీ విధానం.. ఎర్ర కందిపప్పును రాత్రంతా నానబెట్టుకోవాలి.  మరుసటి రోజు పప్పును గ్రైండ్ చేసి పేస్ట్ లా చేసుకోవాలి.  తరువాత 2 చెంచాల పాలు వేసి ముఖానికి అప్లై చేసుకోవాలి.  ఇది మరీ జారుడుగా ఉండకూడదు. కాస్త పేస్ట్ లా ఉండాలి.   మొదట ముఖాన్ని శుభ్రం చేసుకుని ముఖం మీద దుమ్ము, ధూళి మలినాలు లేకుండా చేసుకోవాలి. తరువాత ముఖాన్ని తుడుచుకుని శుభ్రం గా ఉన్న ముఖానికి  ఎర్ర కందిపప్పు ఫేస్ ప్యాక్ వేసుకోవాలి.  15 నుండి 20 నిమిషాలు ఈ పేస్ట్ ను అలాగే ఉంచి తరువాత నీటితో ముఖం కడుక్కోవాలి. ఎర్ర కందిపప్పు నానబెట్టుకోలేని పక్షంలో దీన్ని మెత్తని పొడిగా చేసి నిల్వ చేసుకోవాలి.  ఫేస్ ప్యాక్ వేసుకోవడానికి 15 నుండి 30 నిమిషాల ముందు కొద్దీగా పొడిని పాలలో నానబెట్టి ఫేస్ ప్యాక్ వేసుకోవాలి.   మెరిసే చర్మం సొంతమవుతుంది. ఎర్రకందిపప్పు,  ముల్తానీ మట్టి,  తేనె.. ముల్తానీ మట్టి ముఖానికి చాలా మేలు చేస్తుంది. ఇది చర్మాన్ని బాగా శుభ్రపరుస్తుంది.  ఎర్ర కందిపప్పు లో ముల్తానీ మట్టిని కలపాలి. అందులో ఒక స్పూన్ తేనెను కలపాలి.  దీన్ని పేస్ ప్యాక్ వేసుకోవాలి. 15 నిమిషాలు అలాగే ఉంచి ఆ తరువాత ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి.  దీన్ని వారానికి రెండు సార్లు వేసుకుంటే చర్మం మెరుస్తూ ఉంటుంది.  ఈ ఫేస్ ప్యాక్ లు రెండూ కూడా మంచి ఫలితాలు ఇస్తాయి.                                       *రూపశ్రీ.

రెండు చుక్కల నెయ్యి ముఖానికి రాయండి.. ఫలితాలు చూసి షాకవుతారు..!   చలికాలం చర్మానికి పరీక్ష కాలం అని చెప్పవచ్చు.   చర్మాన్ని సంరక్షించుకోవడానికి ఈ కాలంలో చాలా రకాల చిట్కాలు పాటిస్తుంటారు. వందలు, వేలాది రూపాయలు వెచ్చించి  ఫేస్ క్రీమ్ లు, లోషన్లు, మాయిశ్చరైజర్లు కొనుగోలు చేస్తుంటారు.  మరికొందరు ఇంట్లోనే చిట్కాలు ట్రై చేస్తుంటారు. అయితే ఖరీదైన వాణిజ్య ఉత్పత్తులను వదిలి కేవలం రెండు చుక్కల నెయ్యిని ముఖానికి రాసుకోమని చెబుతున్నారు  చర్మ సంరక్షణ నిపుణుల నుండి వైద్యుల వరకు. అసలు నెయ్యిని ముఖానికి రాయడం వల్ల జరిగేదేంటి? ఖరీదైన వాణిజ్య ఉత్పత్తులను మించి నెయ్యి చేసే మ్యాజిక్ ఏంటి? తెలుసుకుంటే.. ముఖం పై మచ్చలు, ముడతలు, పొడిబారడం వంటి వాటిని పోగొట్టుకోవడానికి చాలా మంది ఖరీదైన ఉత్పత్తులు వాడతారు. అలాగే చలికాలంలో వచ్చే సమస్యలను తగ్గించడానికి కూడా వాడతారు. అయితే వీటి బదులు నెయ్యి వాడవచ్చు. నెయ్యిని ముఖానికి రాసుకోవడం వల్ల చర్మానికి మ్యాజిక్ జరుగుతుంది.  నెయ్యిని ముఖానికి రాస్తుంటే చర్మంలో తేమ నిలిచి ఉంటుంది. ఇది చర్మం చలి కారణంగా  పొడిబారడం, పగుళ్లు ఏర్పడటాన్ని నివారిస్తుంది.  నెయ్యిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.  ఇవి చర్మం దెబ్బతినకుండా కాపాడతాయి. నెయ్యిలో అరాకిడోనిక్, లినోలెనిక్ ఆమ్లం వంటి ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి.  ఇవి దెబ్బతిన్న చర్మానికి పోషణను ఇస్తాయి. ఫలితంగా వాడిపోయి పగుళ్లు ఏర్పడిన చర్మం తిరిగి యవ్వనంగా, ఆరోగ్యంగా మారుతుంది. ముఖ చర్మం వాడిపోయి రంగు కోల్పోయినట్టుగా ఉన్నప్పుడు రెండు చుక్కల స్వచ్చమైన నెయ్యిని ముఖానికి అప్లై చేసి కాస్త మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల  ముఖం చర్మం కాంతివంతంగా మారుతుంది.  చర్మ కణాల నష్టం తగ్గుతుంది. ముఖం మీద మచ్చలు, మొటిమలు వంటివి వస్తుంటే రెండు చుక్కల నెయ్యిని ముఖానికి అప్లై చేయాలి.  ఇలా ప్రతిరోజూ రెండు చుక్కల నెయ్యి ముఖానికి పూస్తుంటే  చర్మం పై మచ్చలు,  మొటిమలు వదులుతాయి.  చర్మం మీద అన్ని రకాల మచ్చలు లేకుండా క్లిస్టర్ క్లియర్ అవుతుంది. నెయ్యిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయనే విషయం తెలిసిందే.  ఈ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ముఖం మీద ముడతలను తొలగించి ముఖ చర్మాన్ని యవ్వనంగా మారుస్తుంది.  ప్రతిరోజూ నెయ్యిని ఇలా ముఖానికి రాసుకుంటూ ఉంటే ఎంత వయసు పెరిగినా చర్మం యవ్వనంగా ఉంటుంది.                                        *రూపశ్రీ.  

జుట్టు పెరుగుదలను టార్గెట్ గా పెట్టుకున్నారా...అవిసె గింజలు ఇలా వాడండి!   అవిసె గింజలు.. ఆరోగ్యకరమైన విత్తనాలలో ఒకటి. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ఫైబర్,  విటమిన్లు, ప్రోటీన్ అన్నీ ఉంటాయి.  ప్రతి రోజూ కొన్ని అవిసె గింజలను తీసుకుంటూ ఉంటే ఆరోగ్యం ఎంతో బావుంటుందని అంటారు.  అయితే అవిసె గింజలు కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు.. చర్మ సంరక్షణలోనూ, కేశ సంరక్షణలోనూ చక్కగా సహాయపడుతుంది. ముఖ్యంగా అవిసె గింజలతో జెల్ తయారు చేసి దాన్ని జట్టుకు పట్టిస్తుంటే జుట్టుకు మ్యాజిక్ రిజల్ట్ పక్కాగా ఉంటాయట. ఇంతకీ అవిసె గింజల జెల్ ఎలా తయారు చేయాలి? ఈ జెల్ వాడటం వల్ల జుట్టుకు కలిగే ఇతర ప్రయోజనాలు ఏంటి? తెలుసుకుంటే.. అవిసె గింజల జెల్.. అవిసె గింజల జెల్ లో ప్రోటీన్లు,  విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు,  మెగ్నీషియం  ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి.  ఇవి చర్మానికి, జుట్టుకు అందాన్ని- ఆరోగ్యాన్ని ఇస్తుంది.  ఒక కప్పు నీటిలో రెండు స్పూన్ల అవిసె గింజలు వేసి స్టౌ పైన ఉంచి ఉడికించాలి. ఈ అవిసె గింజలు ఉడికి దానిమీద నురుగు వచ్చి అది కాస్త జిగటగా ఉడకడం గమనించినపుడు స్టౌ ఆఫ్ చేయాలి. ఇది చల్లారిన తరువాత దీన్ని వడగట్టి జెల్ ను సేకరించాలి.  ఈ అవిసెగింజల గింజల జెల్ ను జుట్టును పాయలుగా తీస్తూ కుదుళ్లకు పట్టేలా బాగా అప్లై చేయాలి.  తరువాత  జుట్టు పొడవు ఉన్నంత మేర పట్టించాలి. కనీసం అరగంట సేపు అయినా దీన్ని అలాగే ఉంచుకుని తరువాత సాధారణ నీటితో తల శుభ్రం చేసుకోవాలి. ప్రయోజనాలు.. అవిసె గింజల జెల్ ను ఉపయోగించడం వల్ల  జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.  ఈ జెల్ లో విటమిన్లు,  పోషకాలు,  ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లకు బలాన్నిస్తాయి. జుట్టు స్టైయిట్ అవుతుంది.. అవిసె గింజల జెల్ జుట్టును స్ట్రైయిట్ గా మారుస్తుంది.  చాలామంది రింగురింగుల జుట్టుతో ఇబ్బంది పడుతూ ఉంటారు.  జుట్టు ఎక్కువగా రింగులు ఉండటం వల్ల చిక్కులు పడుతుంది.  ఇలాంటి వారు అవిసె గింజల జెల్ ను జుట్టుకు రాసుకుంటే జుట్టు రింగులు తగ్గి స్ట్రైయిట్ గా మారుతుంది. జుట్టును తేమగా, మృదువుగా ఉంచుతుంది.  జుట్టుకు సహజంగా మెరుపును ఇస్తుంది. జుట్టు రాలడం.. జుట్టు రాలే సమస్య ఉన్నవారు అవిసె గింజల జెల్ ను రాస్తుంటే జుట్టు రాలడం తగ్గుతుంది.  ఇది జుట్టుకు మాయిశ్చరైజ్ చేసుంది.  జుట్టు చిక్కులు పడకుండా చేసి జుట్టు రాలకుండా చేస్తుంది. డ్యామేజ్.. జుట్టు డ్యామేజ్ అయినప్పుడు  జుట్టును తిరిగి రిపేర్ చేయడంలో అవిసె గింజల జెల్ సహాయపడుతుంది.  అవిసె గింజలలో విటమిన్-ఇ సమృద్దిగా ఉంటుంది.  ఇది జుట్టు వ్యాల్యూమ్ పెంచడంలోనూ,  జుట్టును బలంగా మార్చడంలోనూ సహాయపడుతుంది. జుట్టుకు మెరుపు ఇస్తుంది.  జుట్టు కుదుళ్ల మంటలు తగ్గిస్తుంది.                                         *రూపశ్రీ.  

చలికాలంలో ఇలా డై కాఫీ స్క్రబ్ వాడి చూడండి.. మెరిసిపోతారు..! ​ చలికాలం వచ్చిందంటే చాలు.. చర్మ సంరక్షణ పెరుగుతుంది. దీనికి తగ్గట్టే మార్కెట్ లో చర్మ సంరక్షణ ఉత్పత్తుల కొనుగోళ్లు కూడా పెరుగుతాయి.  ఈ కాలంలో చర్మాన్ని కాపాడుకోవడానికి సాధారణం కంటే ఎక్కువ సమయం కేటాయించాలి.  అయితే ఇంట్లోనే ఈజీగా చలికాలంలో చర్మ సంరక్షణ కోసం డై కాఫీ స్క్రబ్ తయారుచేసుకోవచ్చు.  ఇదెలా తయారు చేయాలో.. దీని కోసం కావలసిన పదార్థాలు ఏంటో తెలుసుకుంటే.. ముఖ చర్మాన్ని లోతుగా  క్లీన్ చేయడానికి కాఫీని ఉపయోగించడం చాలా బెస్ట్ ఆప్షన్.  ఇది చనిపోయిన చర్మ కణాలను సమర్థవంతంగా తొలగించడంలో సహాయపడుతుంది.  అందుకే చలికాలంలో ఇది బాగా ఉపయోగపడుతుంది. కాఫీ స్క్రబ్ ఎలా చేయాలి? కాఫీ స్క్రబ్ కు కావలసిన పదార్థాలు.. కాఫీ పొడి.. 1 స్పూన్.. తేనె.. కొద్దిగా.. ఒక స్పూన్ కాఫీ పొడిని తగినంత తేనెతో కలిపి పేస్ట్ లా చేయాలి. దీన్ని ముఖానికి పట్టించి సుమారు 20 నిమిషాల పాటు ముఖానికి మసాజ్ చేయాలి.  తరువాత సాధారణ నీటితో ముఖాన్ని కడిగేయాలి. ముఖం మీద ఉబ్బిన కళ్లు, చర్మం ముడతలు, ముఖం వాడినట్టు ఉండటం వంటి అన్ని  సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. కాఫీ, పాలతో.. కాఫీ, తేనె తో మాత్రమే కాదు.. కాఫీ, పాలతో కూడా ముఖాన్ని మెరిపించవచ్చు. కాఫీ పొడిలో పాలు కొద్దిగా వేసి చిక్కగా  చేసుకోవాలి. ఈ పేస్ట్ తో ముఖాన్ని మసాజ్ చేసుకోవాలి.  ఇది చర్మంలో మురికిని తొలగిస్తుంది.  ముఖానికి మెరుపును ఇస్తుంది.   కాఫీ, పెరుగు.. కాఫీ, పెరుగు కాంబినేషన్ కూడా ముఖానికి చాలా మంచి చిట్కా.  1 టీస్పూన్ పెరుగులో కాసింత కాఫీ పొడి, అందులోనే చిటికెడు పసుపు వేసి బాగా కలపాలి. దీన్ని ముఖానికి రాసి 20 నిమిషాలు మసాజ్ చేసుకోవాలి. తరువాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.  అందంగా, మృదువుగా ఉన్న చర్మం సొంతమవుతుంది. కాఫీ, నిమ్మరసం.. కాఫీ, నిమ్మరసం స్ర్కబ్ తో ఇన్స్టంట్ గ్లో తీసుకురావచ్చు. ఇది నిజంగా మ్యాజిక్ లాగా పనిచేస్తుంది. కాఫీ పొడిలో కాస్త నిమ్మరసం పిండి దీన్ని ముఖానికి పట్టించి బాగా మసాజ్ చేయాలి.  తరువాత ముఖాన్ని సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి. కాఫీ, అలోవెరా.. కాఫీ పౌడర్ లో అలోవెరా జెల్ వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ పేస్ట్ తో ముఖాన్ని మసాజ్ చేసుకోవాలి. 20 నిమిషాల తరువాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.  ఇది ముఖాన్ని మెరిపిస్తుంది.                                        *రూపశ్రీ.

గులాబీ రంగు పెదాలు.. ఒత్తైన కనురెప్పలు.. ఇదిగో ఈ చిట్కాలతో మీ సొంతం..!     అందంగా కనిపించడం అంటే అమ్మాయిలకు చాలా ఇష్టం.  ముఖ్యంగా అందంగా కనిపించడం కోసం వందల నుండి వేలాది రూపాయలు ఖర్చు చేస్తుంటారు. కానీ చిన్న చిన్న ఇంటి చిట్కాల సహాయంతో అందాన్ని పెంచుకోగలిగినప్పుడు డబ్బు ఎందుకు ఖర్చు చేయాలి?  కనురెప్పలు మందంగా ఉండాలన్నా లేదా పెదాలను గులాబీ రంగులోకి మార్చాలన్నా. చాలా రకాల ఆయిల్స్, సీరమ్ లు,  లిప్ బామ్ లు, లిప్ స్క్రబ్ లు వాడుతుంటారు.  వీటి కోసం చాలా  ఖర్చు చేస్తుంటారు.  అయితే ఇంట్లోనే కొన్ని ఈజీ టిప్స్ తో గులాబీ పెదాలను,  ఒత్తైన కనుబొమ్మలను సొంతం చేసుకోవచ్చు. బొద్దుగా, లేతగా ఉండే పెదాల కోసం.. ప్రతి అమ్మాయి తన పెదవులు చిన్నపిల్లల లాగా మృదువుగా,  గులాబీ రంగులోకి మారాలని కోరుకుంటుంది. ఇందుకోసం పెదవులకు వివిధ రకాల లిప్ బామ్‌లను అప్లై చేస్తుంటారు. ఇలా చేసిన తర్వాత కూడా నల్లగా,  పగుళ్లతో ఉంటే పెదవులకు కింద ఇవ్వబడిన  స్ర్కబ్ ను ఉపయోగించాలి. కొద్దిగా పెట్రోలియం జెల్లీ, విటమిన్ ఇ ఆయిల్, కొబ్బరి నూనె,  బేబీ ఆయిల్‌ను చిన్న సీసాలో వేసి బాగా కలపాలి. ఇప్పుడు దీన్ని రోజూ మీ పెదాలపై అప్లై చేసి స్క్రబ్ చేయాలి. ఇది పెదాలను మృదువుగా,  బొద్దుగా మార్చుతుంది. మందంపాటి కనుబొమ్మలు, కనురెప్పలు.. మందపాటి కనురెప్పలు,  కనుబొమ్మలు కావాలని కోరుకునే అమ్మాయిలు చాలా మంది ఉంటారు. ఎందుకంటే ఇవి ముఖ సౌందర్యానని మరింత ద్విగుణీకృతం చేస్తాయి.  కనుబొమ్మలు,  కనురెప్పలు పలుచగా ఉంటే వాటిని మందంగా మార్చడానికి ఒక మ్యాజిక్ టిప్ ఉంది. పెట్రోలియం జెల్లీ,  ఆలివ్ నూనెను ఒక కంటైనర్‌లో కలపాలి. మీ దగ్గర ఖాళీ మాస్కరా బాటిల్ ఉంటే ఆయిల్ మిశ్రమాన్ని  బాలిల్ లో నింపాలి.  ఆ తరువాత  దాన్ని ఉపయోగించాలి. పొడవాటి గోర్లు.. గోర్లు పొడవుగా మంచి ఆకారంలో ఉంటే చేతి వేళ్లు చాలా అందంగా కనిపిస్తాయి.  వీటికి గోరింట లేదా నెయిల్ పాలిష్ వంటివి పెడితే ఆ చేతి అందం అంతా ఇంతా కాదు. కానీ చాలా మందికి గోర్లు పదే పదే విరిగిపోతుంటాయి.  గోర్లు పొడవుగా, మెరుస్తూ ఆరోగ్యంగా ఉండాలంటే రెండు వస్తువులు ఉపయోగించి మంచి నెయిల్ మసాజ్ జెల్ తయారు చేయవచ్చు.  ఇందుకోసం పెట్రోలియం జెల్లీ,  బేబీ ఆయిల్ రెండూ మిక్స్ చేయాలి.  దీన్ని ఒక కంటైనర్ లో నిల్వ చేయాలి.  ఈ మిశ్రమాన్ని గోర్ల మీద రాసి రోజూ సున్నితంగా మసాజ్ చేయాలి.  గోర్లు బలంగా మారతాయి.  పొడవుగా ఆరోగ్యంగా పెరుగుతాయి. క్లియర్ స్కిన్ కోసం.. ప్రతి ఒక్కరూ శుభ్రమైన మచ్చలు  లేని మెరిసే చర్మాన్ని కోరుకుంటారు.  మార్కెట్ ఉత్పత్తులు క్లియర్ స్కిన్ ను చేకూరుస్తాయని అనుకుంటే అది పప్పులో కాలేసినట్టే.. వీటిలో రసాయనాలు కాలక్రమంలో చర్మాన్ని చాలా దెబ్బతీస్తాయి.   అందుకో ఇంటి చిట్కాలు ఉత్తమం.   ఒక గిన్నెలో పసుపు, తేనె, బియ్యప్పిండి వేసి బాగా కలపాలి.  దీన్ని ముఖంపై అప్లై చేసి  10 నిమిషాలు అలాగే ఉంచాలి.  సమయం ముగిసిన తర్వాత ముఖం కడిగేయాలి. ఈ టిప్ చాలా బాగా సహాయపడుతుంది.  చర్మానికి మెరుపు ఇస్తుంది. చర్మం మీద మచ్చలు, మొటిమలు పోగొడుతుంది.  ఈ ఫేస్ ప్యాక్ మాత్రమే కాకుండా  పుష్కలంగా నీరు త్రాగాలి.  చక్కగా  నిద్ర ఉండేలా చూసుకోవాలి.  ఇలా చేస్తుంటే ముఖం క్లిస్టర్ క్లియర్ గా మారుతుంది.                                          *రూపశ్రీ.

వాహ్.. చలికాలంలో కొబ్బరి పాలు ఇలా వాడితే.. మెరిసిపోతారు..!   చలికాలం చర్మానికి పరీక్షా కాలం.  చలికాలంలో వచ్చే సమస్యల వల్ల చర్మం చాలా దెబ్బతింటుంది.  చర్మం పొడిబారి పగుళ్లు ఏర్పడుతుంది.  చర్మం పొలుసులుగా లేస్తుంది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే నొప్పి, మంట కూడా పెడుతుంది.  చలికాలంలో ముఖ్యంగా పొడిచర్మం ఉన్నవారికి,  సున్నితమైన చర్మం ఉన్నవారికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది.  అయితే కొబ్బరి పాలను వాడితే చలికాలంలో చర్మం సాఫ్ట్ గా మారడమే కాకుండా కాంతివంతంగా మెరిసిపోతుందట. కొబ్బరి పాలు  చర్మానికి చాలా లోతుగా తేమను అందిస్తాయి.  ఈ కారణంగా పొడి చర్మం ఉన్నవారు కొబ్బరిపాలు రాసుకుంటే చర్మం పొడిబారడం తగ్గుతుంది.  చర్మం మృదువుగా మారుతుంది.  రోజులో ఒకసారి అయినా కొబ్బరి పాలను ముఖానికి రాస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. చలికాలంలో చర్మానికి సోప్,  ఫేస్ వాష్ కఠినమైన క్రీములు రాయడం వల్ల చర్మం దెబ్బతినడమే కాకుండా చర్మం నల్లగా కూడా మారుతుంది.  ముఖ్యంగా మార్కెట్లో కొనుగోలు చేసే మాయిశ్చరైజర్ క్రీములు, లోషన్లు చర్మాన్ని డార్క్ గా మారుస్తాయి. కానీ కొబ్బరి పాలను ఉపయోగించడం వల్ల చర్మం మెరుస్తుంది.  కాంతివంతంగా మారుతుంది. కొబ్బరి పాలలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి.  ఇవి చర్మం చికాకును, మంటను తగ్గించడంలో సహాయపడతాయి.  సున్నితమైన చర్మం ఉన్నవారికి కొబ్బరిపాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మొటిమలు, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ వంటి సమస్యలు ఉన్నవారికి కొబ్బరి పాలు మేలు చేస్తాయి.  చర్మాన్ని లోతుగా తేమగా ఉంచడమే కాదు. చర్మాన్ని లోతుగా శుభ్ర పరుస్తుంది కూడా.  కొబ్బరి పాలలో ఉండే పోషకాలు నల్ల మచ్చలు,  తెల్ల మచ్చలు, మొటిమలను తగ్గించడంలో సహాయపడతాయి. కొబ్బరిపాలలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చిన్న వయసులోనే వృద్దాప్యాన్ని దరికి రానివ్వవు. చర్మాన్ని ముడుతలు, గీతల నుండి రక్షిస్తుంది.  చర్మం యవ్వనంగా ఉండేలా చేస్తుంది. కొబ్బరి పాలను చలికాలంలో రెగ్యులర్ గా అప్లై చేయడం వల్ల చర్మం మెరిసిపోతుంది.  చర్మం తాజాగా ఉండేలా చేస్తుంది.  ముఖ్యంగా చలికాలం వల్ల ఏర్పడే అసౌకర్యం రానివ్వదు.                                               *రూపశ్రీ.

ఒత్తైన జుట్టు రహస్యం ఈ ఆయిల్ సొంతం! అమ్మాలకు ఒత్తైన, పొడవైన జుట్టు అంటే చాలా ఇష్టం. జుట్టు పెరగదు కాబట్టి అలా ఉంటారు కానీ.. అందంగా ఒత్తుగా, పొడవుగా, నల్లగా ఉన్న జుట్టు పెరుగుతుంటే ఎవరు మాత్రం మాకొద్దు అని అంటారు చెప్పండి.  నడుము వరకు పొడవాటి మందపాటి జుట్టు కావాలనుకుంటే మంచి హెయిర్ ఆయిల్ వాడాలి. మార్కెట్లలో బోలెడు హెయిర్ ఆయిల్స్ ఉంటాయి. ఇంత పెద్ద జుట్టు, ఇంత ఒత్తైన జుట్టు అంటూ ఒకటే ప్రమోషన్లు ఊదరగొట్టేస్తాయ్. వాళ్లకు మార్కెట్ పెరుగుతుంది తప్ప.. మీ తలలో జుట్టు కనీసం ఒక ఇంచ్ అయినా పెరగదు. అయితే జుట్టు ఆరోగ్యంగా పెరగడం కోసం కొంచెం ఓపిక తెచ్చుకుని ఇంట్లోనే హెర్బల్ హెయిర్ ఆయిల్ తయారుచేసుకుంటే..  చాలా చక్కని ఆలోచన కానీ.. యూట్యూబ్ లలో చూపించే బోలెడు చిట్కాల కారణంగా ఈ హెయిర్ ఆయిల్ సొంతంగా తయారుచేసుకోవడంలో కూడా కాస్త కన్ఫ్యూజనే.. అలాంటి కన్ఫ్యూజన్ తప్పించి ఒక క్లారిటీతో హెయిర్ ఆయిల్ తయారు చేసుకునేవిధానం మీకోసం… ఈ హెయిర్ ఆయిల్ గురించి చెప్పే ముందు.. అసలు ఇది ఎందుకు వాడాలి. చాలామందికి జుట్టు పలుచగా.. పొట్టిగా ఎందుకు ఉంటుంది?? అనే విషయం కూడా తెలుసుకోవాలి. జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే రెండు రకాలుగా పోషకాలు అందాలి. ఒకరి ఆహారం ద్వారా కడుపుకు తీసుకోవడం అయితే.. రెండవది బయటి నుండి జుట్టుకు పోషకాలు అందించడం. హెయిర్ ప్యాక్ లు, హెయిర్ ఆయిల్స్, హెయిర్ మసాజ్ ఇవన్నీ జుట్టుకు పోషకాలు అందించేవే.. కాబట్టి ఇలాంటివి చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. ఏమాత్రం తేడా వచ్చినా జుట్టు మరింత సమస్యలొకి జారుకుంటుంది. జుట్టుకు ఇలాంటి సమస్యలన్నీ తొలగించి ఆరోగ్యంగా ఉండేందుకు.. కొలతలతో సహా కావలసిన పదార్థాలు.. తయారీ విధానం ఇదిగో ఇక తెలుసుకోండి. కావలసిన పదార్థాలు..  2 టేబుల్ స్పూన్లు మెంతులు  2 టేబుల్ స్పూన్లు నల్ల విత్తనాలు(కలోంజి సీడ్స్) 20 బాదంపప్పులు 10 నుండి 20 మందార ఆకులు  2 మందార పువ్వులు -20 నుండి 25 కరివేపాకు రెండు తరిగిన ఉల్లిపాయలు ఒక కప్పు కొబ్బరి నూనె. ముందుగా బాదం, మెంతి, కలోంజి గింజలను మిక్సీలో గ్రైండ్ చెయ్యాలి, ఆ తర్వాత మందార ఆకులు, మందార పువ్వులు, కరివేపాకు, తరిగిన ఉల్లిపాయలను మిక్సీలో వేసి పేస్ట్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద చిన్న పాన్ పెట్టి వేడి చేయాలి. పాన్ వేడి అయ్యాక అందులో కొబ్బరి నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక అందులో మిక్సీ పట్టిన పౌడర్ వేయాలి. ఆ తరువాత పేస్ట్ చేసిన ముద్ద వేసి కాస్త సిమ్ మీద  ఉడికించాలి. మిశ్రమం అంతా ఉడికి నూనె పైకి తేరిన మూమెంట్లో  గ్యాస్ ఆఫ్ చేసి, 10 నిమిషాలు అలాగే ఉంచాలి.  తర్వాత, ఒక చిన్న ప్లాస్టిక్, లేదా గాజు సీసా  తీసుకుని, దానిపై కాటన్ క్లాత్ వేసి వడగట్టుకోవాలి. దీన్ని డబల్ ఫిల్టర్ చేస్తే నూనె చాలా స్వచ్ఛంగా కనిపిస్తుంది. ఇక ఇంట్లోనే హెర్బల్ ఆయిల్ రెడి అయినట్టు. ఇది మీకు వాసన వస్తుంది అనిపిస్తే దీంట్లొకి రోజ్ మేరీ ఎసెంటియల్ ఆయిల్ లేదా లావెండర్, రోజ్ ఇలా ఏదైనా వాడచ్చు. ఈ ఆయిల్స్ కలపడం వల్ల ఈ నూనె జుట్టుకు అప్లై చేసినప్పుడు తలలో రక్తప్రసరణ మెరుగ్గా ఉంటుంది. వారానికి ఒకసారి తలకు బాగా మసాజ్ చేసి ఆ తరువాత గోరువెచ్చని నీటితో.. గాఢత లేని షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా చేస్తుంటే జుట్టు ఎంతో అద్భుతంగా పెరుగుతుంది.                                      ◆నిశ్శబ్ద.

ఈ టిప్ ఫాలో అయితే.. ఒక్క రాత్రిలోనే పగిలిన మడమలు సాఫ్ట్ గా మారతాయి..!     చలికాలం మొదలవగానే పాదాల మడమలు పగలడం మొదలవుతాయి, అలాంటి పరిస్థితుల్లో  పాదాలకు నూనె రాసుకున్నా లేదా వేరే క్రీములు రాసుకున్నా పగిలిన మడమలు మానడానికి చాలా సమయం పడుతుంది. దీని వల్ల చలికాలంలో చాలా రోజులు ఈ మడమల వల్ల ఏర్పడిన పగుళ్ల నొప్పితో బాధపడతారు.  కానీ  పగిలిన మడమల సమస్యను సులభంగా పరిష్కరించుకోవచ్చని తెలుసా..? కింద చెప్పుకోబోయే చిట్కాను పాలో అయితే ఒక్క రాత్రిలోనే పగిలిన మడమలు మాయమవుతాయి. ఇందుకోసం కేవలం రెండు పదార్థాలు ఉపయోగిస్తే సరిపోతుంది. ఇంట్లోనే క్రాక్ క్రీమ్ చేయడం ఎలాగో తెలుసుకంటే.. క్రాక్ క్రీమ్ కోసం కావలసిన పదార్థాలు.. కొబ్బరి నూనె - 2 టీస్పూన్లు గ్లిజరిన్ - 1 టీస్పూన్ విటమిన్ ఇ క్యాప్సూల్ - 1 (పై పదార్థాలను ఎక్కువ మోతాదులో తీసుకుని క్రాక్ క్రీమ్ తయారు చేసుకుంటే క్రీమ్ ఎక్కువ తయారవుతుంది. దీన్ని నిల్వ చేసుకోవచ్చు కూడా.) తయారీ విధానం.. ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో 2 చెంచాల కొబ్బరి నూనె, 1 చెంచా గ్లిజరిన్,  ఒక విటమిన్ ఇ క్యాప్సూల్ వేసి బాగా కలపాలి. పగిలిన మడమలను నయం చేసి  పాదాలను అందంగా మార్చే క్రీమ్  సిద్ధంగా ఉన్నట్టే. ఈ క్రీమ్ ను  రాత్రిపూట ఉపయోగించాలి. క్రాక్ క్రీమ్ ను ఉపయోగించే ముందు  ఒక బకెట్‌లో వేడి నీళ్లు పోసి అందులో పాదాలను  10 నిమిషాలు నానబెట్టాలి. 10 నిమిషాల సమయం ముగిసిన తర్వాత నీటి నుండి పాదాలను తీసి పొడ టవల్ తో శుభ్రంగా  తుడవాలి. పాదాలు పొడిగా మారిన తరువాత  సిద్ధం చేసిన క్రీమ్‌ను అప్లై చేసి, ఆపై కాటన్ సాక్స్ వేసుకుని  నిద్రిపోవాలి. ఉదయానికల్లా  పగుళ్లు ఏర్పడిన మడమల స్థానంలో  మృదువుగా మారిన మడమలు ఉంటాయి.  మొదటిసారే చాలా మార్పు కనిపిస్తుంది.  ఈ విధంగా వరుసగా ఒక మూడు నాలుగు రోజులు చేశారంటే పాదాలు కోమలంగా మారిపోతాయి.  ఈ క్రాక్ క్రీమ్ ఇచ్చే ఫలితాలు చూసి  పక్కాగా షాకవుతారు.                                          *రూపశ్రీ.

చలికాలంలో చర్మానికి భలే ప్రొటెక్షన్.. ఇంట్లోనే బాతింగ్  పౌడర్ ఇలా..!   వాతావరణానికి తొందరగా ఎఫెక్ట్ అయ్యేది మొదట చర్మమే.. ప్రతి సీజన్ లోనూ దాని పర్యావసానం చూస్తూనే ఉన్నారు ప్రజలు. వేసవి అంటే భగ్గున మండటం ఎలా ఉంటోందో.. చలికాలం అలా మొదలయ్యిందో లేదో చాలా దారుణంగా  చలి ఉంటోంది. దీని కారణంగా చర్మం చాలా తొందరగా పగుళ్లు వచ్చి ఇబ్బంది పెడుతుంది.  పగిలిన చర్మాన్ని నిర్లక్ష్యం చేస్తే  చర్మ సంబంధ సమస్యలు మొదలవుతాయి. సాధారణంగా చలికాలం రాగానే సోప్,  ఫేస్ వాష్ అన్నీ మార్చేస్తుంటారు.  వాటికి బదులు ఇంట్లోనే బాతింగ్ పౌడర్ తయారు చేసుకుంటే చర్మం చాలా ఆరోగ్యంగా ఉంటుంది.  ఇది నేచురల్ పౌడర్ కావడంతో ఎలాంటి సైడ్  ఎఫెక్ట్స్ ఉండవు. బాతింగ్ పౌడర్.. కావలసిన పదార్థాలు.. శనగపిండి.. లేదా శనగపప్పు.. పెసరపప్పు.. పసుపు.. 2 స్పూన్లు బియ్యం.. నాలుగు స్పూన్లు. షీకాయ పొడి లేదా కుంకుడు పొడి.. రెండు స్పూన్లు. తయారీ విధానం.. శనగపిండి  ఒక కప్పు తీసుకోవాలి.  లేదంటే ఒక కప్పు శనగపప్పును తీసుకోవాలి. అలాగే ఒక కప్పు పెసరపప్పు తీసుకోవాలి. ఇందులో నాలుగు స్పూన్ల బియ్యం వేసి  ఈ మూడింటిని మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి.   పొడి అయిన పిండిలో రెండు స్పూన్ల పసుపు,  రెండు స్పూన్ల షీకాయ పొడి లేదా కుంకుడు కాయల పొడి వేసి మరొక్క సారి మిక్సీ తిప్పాలి.  ఇలా చేస్తే  అన్ని పదార్థాలు బాగా కలుస్తాయి. ఇలా మిక్సీ వేసుకున్న పిండిని ఒక కంటైనర్ లో స్టోర్ చేసుకోవాలి. ఎలా వాడాలంటే.. తయారు చేసుకున్న పిండిని ఒక చిన్న కప్పులో ఒకటి లేదా రెండు స్పూన్లు తీసుకోవాలి.  ఇందులో కొద్దిగా నీరు కలిపి మరీ పలుచగా కాకుండా కాస్త మందంగా ఉన్న పేస్ట్ లాగా చేసుకోవాలి.  ఈ పేస్ట్ ను చేతిలోకి తీసుకుని తడి శరీరం మీద రుద్దుతూ సోప్ లాగే రాసుకోవాలి.  ఈ పిండిలో కాస్త రవ్వలాగా కూడా ఉంటుంది. కాబట్టి ఇది స్క్రబ్ లాగా కూడా పనిచేస్తుంది.  సాధారణ చర్మం ఉన్నవారికి ఇది చక్కగా పనిచేస్తుంది.  సున్నితమైన చర్మం ఉన్నవారు ఇందులో నీటికి బదులు పాలు కలిపి పేస్ట్ చేసుకోవచ్చు.   చర్మ సంబంధ సమస్యలు పోవాలన్నాచర్మం సహజంగా నిగారింపు రావాలన్నా కూడా ఈ పొడి చక్కగా పనిచేస్తుంది.  కనీసం వారానికి ఒకసారి శరీరానికి నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె రాసుకుని గంట ఆగిన తరువాత ఈ పొడితో స్నానం చేస్తే చర్మం బాగా శుభ్రపడుతుంది.  చర్మం మీద మృత కణాలు తొలగిపోతాయి.  ఈ పొడిలోకి కాస్త పాలు,  కొంచెం తేనె వేసి పేస్ట్ లా చేసుకుని ముఖానికి పేస్ ప్యాక్ కూడా వేసుకోవచ్చు.  అయితే ఇలా ఫేస్ ప్యాక్ వేసుకోవాలంటే ఇందులో షీకాయను మినహాయించడం మంచిది.                                         *రూపశ్రీ.  

బంగాళదుంప గురించి మీకు తెలియని నిజం.. ఇలా ముఖానికి రాస్తే..!     బంగాళదుంప ఎంతో రుచిగా ఉంటుంది.  ఇది ఏ కర్రీలోకి అయినా ఇట్టే ఇమిడిపోతుంది.  బంగాళదుంపల చిప్స్, ఫ్రెంచ్ ప్రైస్ మొదలైనవి కూడా చాలా రుచిగా ఉంటాయి. పిల్లలు పెద్దలు కూడా వీటిని తినడానికి ఇష్టపడతారు. అయితే బంగాళదుంపలను ముఖానికి కూడా ఉపయోగిస్తారు. వీటిని ఉపయోగించి అందాన్ని పెంచుకోవచ్చు. ముఖ్యంగా బంగాళదుంపను కింద చెప్పుకున్నట్టు ముఖానికి రాస్తే ముఖం మెరిసిపోతుందట.   బంగాళదుంపల స్టార్చ్.. బంగాళదుంపల నుండి పిండిని తయారు చేసి దాన్ని ముఖానికి పట్టిస్తే ముఖం మెరిసిపోతుందట.  వందలు, వేలు ఖర్చు పెట్టిన క్రీములు ఇవ్వని ఫలితాన్ని బంగాళదుంపల స్టార్చ్ వల్ల లభిస్తుందట. బంగాళదుంప ముఖానికి ఎందుకంత ఎఫెక్ట్.. బంగాళాదుంపలో సహజమైన బ్లీచింగ్ లక్షణాలు ఉన్నాయి. ఇది  చర్మంపై మచ్చలను తేలికపరచడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాకుండా ఇందులో ఉండే విటమిన్లు  చర్మం  ఛాయను మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి.  బంగాళాదుంప పిండి   బంగాళాదుంప రసం కంటే ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది చర్మాన్ని మృదువుగా చేయడానికి, నల్లటి వలయాలను తగ్గించడానికి, టానింగ్, పిగ్మెంటేషన్,  ముడతలను తగ్గించడంలో సహాయపడుతుంది. కావసిన పదార్థాలు.. బంగాళదుంప రసం - 1 గిన్నె నిమ్మరసం - 1/2 టీస్పూన్ పాలపొడి - 1 టీస్పూన్ తయారు విధానం.. ముందుగా కొన్ని బంగాళదుంపలను తీసుకుని తురుముకోవాలి.  రసం తీసి ఆ రసాన్ని గిన్నెలో ఉంచుకోవాలి. ఒక గాజు గిన్నెలో 1-2 గంటలు పక్కన పెట్టాలి. తర్వాత గిన్నె అడుగున తెల్లగా  పేరుకుపోయినట్లు మీరు కనిపిస్తుంది. ఇప్పుడు బంగాళాదుంప రసాన్ని గిన్నె వంకరగా వంచుతూ రసాన్ని  వేరే గిన్నెలో పోయాలి. గిన్నె దిగువన తెల్లటి పదార్థం కనిపిస్తుంది.  దానిలో ఒక చెంచా బంగాళాదుంప రసాన్ని అలాగే ఉంచాలి. అడుగున ఉన్న ఈ తెల్లని పిండే బంగాళదుంప స్టార్చ్. ఇప్పుడు ఈ గిన్నెలో కొన్ని చుక్కల నిమ్మకాయ రసం,   ఒక చెంచా పాలపొడి వేసి బాగా కలపాలి. ముఖాన్ని కాంతివంతం చేసి డార్క్ స్పాట్‌లను లైట్ చేసే ఫేస్ ప్యాక్  రెడీ  అయినట్టే. దీన్ని  ముఖానికి అప్లై చేసి 10 నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత ముఖం కడుక్కోవాలి.  మొదట సారి వాడన తరువాతే చాలా మార్పు కనిపిస్తుంది.                                                          *రూపశ్రీ.  

  బాబోయ్.. తెల్ల జుట్టును నల్లగా మార్చడం ఇంత సులువా!   తెల్లజుట్టు ఇప్పట్లో చాలా మందికి సాధారణ సమస్యగా మారిపోయింది. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చాలామంది ఈ సమస్యకు బాధితులు అవుతున్నారు.  అయితే తెల్లజుట్టును వదిలించుకోవడం అంత సులువు ఏమీ కాదు.. దీని బాధ భరించలేక కొందరు హెయిర్ డైతో సరిపెట్టేస్తుంటారు. కానీ తెల్లజుట్టును కవర్ చేసే ఈ  హెయిర్ డై వల్ల జుట్టు మరింత తెల్లగా మారుతుంది. రంగు వెలిసిపోయినప్పుడు అది చాలా దారణంగా కనిపిస్తుంది.  పైగా ఇందులోని రసాయనాల వల్ల మెదడు లోపలి నరాలు చాలా బలహీనం అవుతాయి. చిన్నతనంలోనే మతిమరుపు సమస్యలు వస్తాయి.  అయితే ఇలాంటి సమస్యలు ఏమీ లేకుండా చాలా నేచురల్ గా తెల్ల జుట్టును మాయం చేసే చిట్కాలు ఆయుర్వేదంలో ఉన్నాయి.   అలాంటి చిట్కా ఒకటి ఇప్పుడు చెప్పుకుంటే.. ఆయుర్వేదంలో చాలా మంది మహర్షులు, ఋషులు చాలా రకాల వైద్య విధానాలను,  మొండి రోగాలను కూడా పోగొట్టే చికిత్సలను తెలియజేశారు.  వీరిలో బాలరాజ మహర్షి ఒకరు.  తెల్లజుట్టును నల్లగా మార్చడానికి బాలరాజ మహర్షి చెప్పిన సింపుల్ చిట్కా ఉంది.  దీనికి ఖర్చు కూడా తక్కువ. కానీ ఫలితం మాత్రం ఉహించనంత అద్భుతంగా ఉంటుంది.   చిన్న పిల్లల నుండి పెద్దవారు కూడా తెల్లజుట్టును తగ్గించుకోవడానికి ఈ చిట్కా బాగా పనిచేస్తుంది. తెల్లజుట్టు నల్లగా మారడానికి బాలరాజ మహర్షి చెప్పిన నూనె చక్కని పరిష్కారం అని చెప్పవచ్చు.   ఈ నూనె తయారీ కోసం కావలసిన పదార్థాలు.. ఆవాల నూనె.. ఒక కప్పు.. గోరింటాకు.. ఒక కప్పు.. తయారీ విధానం.. ఒక మందంగా ఉన్న కడాయి తీసుకుని దాన్ని స్టౌ మీద పెట్టి వేడి చేయాలి. ఇందులో కప్పు ఆవాల నూనె పోయాలి. కప్పు గోరింటాకును కచ్చాపచ్చాగ దంచుకోవాలి.  కచ్చాపచ్చాగ దంచుకున్న గోరింటాకును ఆవాలనూనెలో వేయాలి. దీన్ని సన్న మంట మీద బాగా ఉడికించాలి.  నూనెలో గోరింటాకు బాగా ఉడికి ఆకులు నల్లగా మారిపోయిన తరువాత  స్టౌ ఆఫ్ చేయాలి.  ఆ తరువాత దీన్ని వడగట్టి గాజు సీసాలో భద్రపరుచుకోవాలి. ఈ నూనెను వారంలో రెండు సార్లు తలకు పెడుతుంటే చాలా గొప్ప మార్పులు ఉంటాయి.  తలకు పెట్టుకుని వీలును బట్టి గంట సేపు.. వీలున్నవారు రెండు గంటల సేపు తలకు ఉంచుకుని కెమికల్స్ లేని షాంపూ లేదా షీకాయతో స్నానం చేయాలి.  లేదంటే రాత్రి సమయంలో ఈ నూనెను తలకు పెట్టుకుని మరుసటి రోజు ఉదయాన్నే తల స్నానం కూడా చేయవచ్చు.  ఈ నూనెను వాడుతూ  నువ్వులు, పల్లీలు, బెల్లం, పాలు, గుడ్లు, గుమ్మడి విత్తనాలు మొదలైనవి క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉంటే జుట్టు నల్లగా మారుతుంది. వీటిని ఆహారం నుండి మిస్ చేసుకోకుండా ఉంటే ఎంత వయసు పెరిగినా జుట్టు తెల్లబడటం అనే సమస్య చాలా వరకు ఉండదు.                                            *రూపశ్రీ.