English | Telugu

'అంతఃపురం'లో పాటొస్తే సాయికుమార్ భార్యకు కోపం ఎందుకంటే?

'అసలేం గుర్తుకు రాదు... నా కన్నుల ముందు నువ్వు ఉండగా' - కృష్ణవంశీ దర్శకత్వం వహించిన 'అంతఃపురం' సినిమాలో ఈ పాట సూపర్ హిట్. దానిని సాయికుమార్, సౌందర్యపై తెరకెక్కించారు. టీవీల్లో ఈ పాట వచ్చినప్పుడల్లా సాయికుమార్ భార్య సురేఖకు కోపం వస్తుంది. ఇదే విషయం డైలాగ్ కింగ్ ఎప్పుడూ కుటుంబ సభ్యులతో చెబుతుంటారట. ఎందుకు అంటే? 'అసలేం గుర్తుకు రాదు' పాట వచ్చిన ప్రతిసారీ తనను డాన్స్ చేయమని సాయికుమార్ అడుగుతుండటంతో కోపం వస్తుందని సురేఖ చెప్పారు. సాయికుమార్ 60వ పుట్టినరోజు సందర్భంగా 'వావ్' షోకు ఫ్యామిలీ మెంబర్స్ గెస్టులుగా వచ్చారు. అప్పుడు ఈ సంగతి సురేఖ బయటపెట్టారు.

సాయికుమార్ జీవితంలో జరిగిన ఓ సంఘటనను 'బొమ్మాళీ' రవిశంకర్ గుర్తు చేసుకున్నారు. చిన్నతనంలో తల్లి వేడినీళ్లు పోయడంతో సాయికుమార్ చెయ్యి పక్షవాతం వచ్చిన వ్యక్తి చేతిలా అయ్యిందట. అప్పుడు ఒక డాక్టర్ క్రికెట్ ఆడమని చెప్పడంతో ఆడారట. బౌలింగ్ చేయడంతో మళ్ళీ సరి అయ్యిందట. ఇంకా సాయికుమార్ ఫ్యామిలీలో పలు సంగతులను 'వావ్' షోలో ఆయన కుటుంబ సభ్యులు పంచుకున్నారు. తమ్ముళ్లు, చెల్లెళ్లు, పిల్లలు అందరూ షోకు వచ్చారు. ఆది సాయికుమార్ భార్య అరుణతో 'కోడలు అయిన తర్వాత భయం అన్నది పోవాలి' అని సాయికుమార్ అనడంతో ఆమె నవ్వేసింది.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.