English | Telugu

ప‌ల్ల‌కిలో జ‌బ‌ర్ద‌స్త్ కొత్త యాంక‌ర్ కు గ్రాండ్‌ వెల్క‌మ్‌!

ఖ‌త‌ర్నాక్ కామెడీ షో `జ‌బ‌ర్ద‌స్త్‌`. గ‌త కొంత కాలంగా కంటెస్టెంట్ లు, టీమ్ లీడ‌ర్ల స్కిట్ ల‌తో న‌వ్వులు పూయిస్తోంది. తాజాగా ఈ షో నుంచి యాంక‌ర్ అనసూయ త‌ప్పుకున్న విష‌యం తెలిసిందే. జూలై నెల‌లో చివ‌రి ఎపిసోడ్ తో జ‌బ‌ర్దస్త్ జ‌ర్నీకి వీడుకోలు ప‌లికింది అన‌సూయ‌. త‌న‌తో పాటు మనో కూడా ఈ షో నుంచి త‌ప్పుకున్న‌ట్టుగా క‌నిపిస్తోంది. గ‌త కొన్ని వారాలుగా స్టార్ మా లో ప్ర‌సారం అవుతున్న స్టార్ సింగ‌ర్ జూనియ‌ర్ లో కనిపిస్తున్నారు. దీంతో ఆయ‌న స్థానంలో కొత్త‌గా హీరోయిన్ సంగీత ఎంట్రీ ఇచ్చేసిన‌ట్టుగా క‌నిపిస్తోంది.

ఇక ఈ షో నుంచి అన‌సూయ కూడా వెళ్లిపోవ‌డంతో ఆ స్థాయిలో గ్లామ‌ర్ ని ఒలికించేది ఎవ‌రు? .. త‌న స్థానంలో కొత్త యాంక‌ర్ గా మ‌ల్లెమాల టీమ్ ఎవ‌రిని దించ‌బోతున్నార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. తాజాగా ఆగ‌స్టు 4న గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోని విడుద‌ల చేశారు. ఇందులో కొత్తగా జ‌బ‌ర్ద‌స్త్ లోకి ఎంట్రీ ఇచ్చే యాంక‌ర్ ని టీమ్ మెంబ‌ర్స్ అంతా తీన్మార్ డాన్సులు చేస్తూ ప‌ల్ల‌కీలో ఊరేగింపుగా తీసుకురావ‌డం క‌నిపిస్తోంది.

అయితే ప‌ల్ల‌కిలో భారీ బ‌ల్డ‌ప్ తో వ‌స్తున్న యాంక‌ర్ ర‌ష్మీనే అని కొంత మంది అంటుంటే కాదు యాంక‌ర్ మంజుషా అని మ‌రి కొంత మంది అంటున్నారు. అయితే ఫైన‌ల్ గా మాత్రం ఈ షోలోకి ఎంట్రీ ఇస్తోంది మంజుష‌నే అని తెలుస్తోంది. ఇదిలా వుంటే ఈ తాజా ఎపిసోడ్ లో `కార్తికేయ 2` టీమ్ సంద‌డి చేసింది. ఆగ‌స్టు 5న విడుద‌ల కానున్న ఈ మూవీకి చందూ మొండేటి ద‌ర్శ‌కుడు. శ్రీ‌నివాస‌రెడ్డి స‌పోర్టింగ్ పాత్ర‌లో న‌టించాడు. నిఖిల్ తో క‌లిసి ఈ ఇద్ద‌రు కూడా జ‌బ‌ర్ద‌స్త్ లో సంద‌డి చేయ‌డం విశేషం.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.