English | Telugu

సన్యాసం తీసుకుంటున్న బుల్లితెర నటి


బుల్లితెర మీద విష్ణుప్రియ కనిపిస్తే చాలు విపరీతమైన నవ్వు ముంచుకొస్తుంది. ఇక ఈమె జోడి ప్రిథ్వి శెట్టి వీళ్ళిద్దరూ కలిస్తే ఆడియన్స్ కి పండగే పండగా. అలాంటి విష్ణు ప్రియా ఒక ఇంటర్వ్యూలో పెళ్లి గురించి చెప్పుకొచ్చింది. "నీకు నచ్చే హజ్బెండ్ కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి" అనేసరికి "ఈషా మెడిటేటర్ అయ్యి ఉండాలి..వేదాలు గురించి తెలిసి ఉండాలి, డాన్స్, సింగింగ్ వస్తే ఇంకా మంచిది, కుకింగ్ కూడా వచ్చి ఉండాలి, అట్లీస్ట్ బేసిక్స్ అన్నా అంటే అన్నం, పప్పు అన్నా చేయగలగాలి." అని చెప్పింది విష్ణు ప్రియా. ఇక హోస్ట్ ఐతే "వస్తాడా ఈ క్వాలిటీస్ ఉన్న అబ్బాయి" అని అడిగింది. "అంటే వస్తే చేసుకుంటా లేదంటే సన్యాసం పుచ్చుకోవడానికి నేను రెడీగా ఉన్నాను" అని చెప్పింది.

"నచ్చిన అబ్బాయి రాకపోతే సన్యాసంలోకి వెళ్ళిపోతావా" అని అడిగింది హోస్ట్. "అవును నేను ఎప్పుడూ అదే ఆలోచించుకుంటూ ఉంటా. 50 , 58 వచ్చేసరికి నేను హరే రామ హరే కృష్ణ అనుకుంటూ నేను గుండుతో తులసి మాల వేసుకుని భగవద్గీత గురించి చెప్తూ ఉండాలి అనుకుంటూ ఉంటాను, లేదంటే కాశీకి వెళ్లి అక్కడ అలా భగవన్నామ స్మరణ చేసుకుంటూ ఉండిపోదామా అనుకుంటూ ఉంటాను." అని చెప్పింది. "విష్ణు నువ్వు ఇలా చేంజ్ ఐపోవడానికి కారణాలు ఏమిటి" అని హోస్ట్ అడిగింది. "చిన్నప్పటి నుంచి కృష్ణుడి ఆశీస్సులు నాతోనే ఉన్నాయనుకుంటాను. నేను ఉన్న హాస్టల్ లో భగవద్గీత ఒక సబ్జెక్టు. అలా నాకు భగవద్గీత నోటికి వచ్చేసింది. దేవుడు నిన్ను భూమిలోకి పాతేసి తర్వాత నిన్ను నెమ్మదిగా పైకి తీసుకొస్తాడు అని చెప్తూ ఒక భగవద్గీతా శ్లోకం కూడా చెప్పేసింది." ఇక హోస్ట్ ఐతే ఆ శ్లోకం విని "తర్వాత నీకు ఏ దేవిశ్రీ ప్రసాద్ గారో ఫోన్ చేసి ఒక పాట పాడాలి విష్ణు అని చెప్తారు అంది. తర్వాత ఇక లింగాష్టకం, అయిగిరి నందిని భక్తి గీతాలు కూడా తనకు వచ్చు అని చెప్పింది. ఇక దేవుళ్ళే తన ఫామిలీ అని చెప్పింది.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.