English | Telugu

బాలయ్య 'అన్ స్టాపబుల్'.. 40 కోట్ల స్ట్రీమింగ్ మినిట్స్ తో సంచలన రికార్డ్!

నటసింహం నందమూరి బాలకృష్ణ ఓటీటీ వేదిక ఆహాలో హోస్ట్ గా ఒక టాక్ షో చేస్తున్నారని న్యూస్ రాగానే అందరూ షాక్ అయ్యారు. ఆ టాక్ షో ఎవరు చూస్తారు అంటూ కొందరు పెదవి విరిచారు కూడా. కానీ బాలకృష్ణ 'నేను దిగనంత వరకే.. ఒన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్' అంటూ 'అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే' షోతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి అదరగొట్టాడు. ఆయన ఎనర్జీకి, కామెడీ టైమింగ్ కి అందరూ ఫిదా అయ్యారు. అందుకే ఈ షో రికార్డు వ్యూస్ తో సంచలనం సృష్టిస్తోంది.

మొత్తం 10 ఎపిసోడ్స్ తో అన్ స్టాపబుల్ మొదటి సీజన్ అలరించింది. మొదటి ఎపిసోడ్ కి మోహన్ బాబు గెస్ట్ గా రాగా, ముగింపు ఎపిసోడ్ లో మహేష్ బాబు సందడి చేశాడు. ప్రతి ఎపిసోడ్ లోనూ గెస్ట్ లతో బాలయ్య సరదాగా మాట్లాడే విధానం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మనస్సుకి ఏదనిపిస్తే అది చెప్తూ, చిన్న పిల్లాడిలా అల్లరి చేస్తూ.. నిజ జీవితంలో బాలకృష్ణ ఇలా ఉంటాడా అని అందరూ ఆశ్చర్యపోయేలా చేశాడు. ఈ షో ఎవరు చూస్తారు అనుకున్నవాళ్ళని కూడా షో చూసేలా చేశాడు. అందుకే గెస్ట్ తో సంబంధం లేకుండా అన్ స్టాపబుల్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

అన్ స్టాపబుల్ రికార్డు వ్యూస్ తో దూసుకుపోతోంది. ఇప్పటి వరకు అన్ స్టాపబుల్ మొదటి సీజన్ కు ఏకంగా 40 కోట్ల స్ట్రీమింగ్ మినిట్స్ దక్కాయి. దీంతో ఆహాలో మోస్ట్ వాచ్‌డ్ షోగా నిలిచింది. అంతేకాదు ఓటీటీలో తెలుగులో ఈ స్థాయిలో మరే షోకి రెస్పాన్స్ రాలేదని తెలుస్తోంది. మరి అన్ స్టాపబుల్ రెండో సీజన్ తో బాలయ్య ఇంకా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.