English | Telugu

బిగ్ బాస్ హౌస్‌‌లోకి సుజాత... రివీల్ చేసిన రాకేష్!

జోర్దార్ సుజాత బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లబోతోంది. అదేంటి బిడ్డ పుట్టి ఎన్నో రోజులు కాలేదు అప్పుడే బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు వెళ్లడం అనుకుంటున్నారా...ఈ విషయం కూడా రాకింగ్ రాకేష్ చెప్పాడు. దీనికి సంబంధించి ఒక వీడియో కూడా చేసాడు. ఇంతకు విషయం ఏమిటి అంటే వాళ్ళ ఇంట్లో బిగ్ బాస్ రూమ్ అనేదాన్ని ఒక ఏర్పాటు చేసాడు. అది కూడా రీసెంట్ గా పుట్టిన వాళ్ళ కూతురు కోసం. ఆ రూమ్ కి బిగ్ బాస్ ఎవరు వాళ్ళ అమ్మాయే. అందుకే రాకేష్ తెలివిగా సుజాత బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తోంది అంటూ చెప్పాడు. అంటే సుజాత వాళ్ళ పాప కోసం రోజూ ఆ గదిలో ఫామిలీ మెంబర్స్ ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవుతూ టైం టు టైం అన్ని బిడ్డకు ఇస్తోంది అని చెప్పుకొచ్చాడు.

బిడ్డ పుట్టాక ముందు వరకు తానే ఆ ఇంటికి బిగ్ బాస్ అని ఇప్పుడు తన బిడ్డ ఆ ఇంటికి బిగ్ బాస్ అని చెప్పాడు. అలాగే సుజాత సేవ్ ది టైగర్స్ సీజన్ 3 మరింత మంచి రోల్ లో నటిస్తోందని దానికి కూడా సుజాత ప్రిపేర్ అవుతోందని చెప్పాడు. అలాగే ఇంకా కొన్ని బిగ్ బ్యానర్స్ లో మంచి మూవీ ఆఫర్స్ వచ్చాయని..అలాగే త్వరలో జబర్దస్త్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు చెప్పుకొచ్చాడు. ఇక రాకేష్ సుజాతను ఒక మాట అడిగాడు నీకు "జబర్దస్త్ ఇష్టమా, బిగ్ బాస్ ఇష్టమా" అని. రెండు రెండు కళ్ళ లాంటివి అని చెప్పింది సుజాత. ఈ బిగ్ బాస్ హౌస్ లో తామంతా ఇలాగే ఒక ఏడాది వరకు ఉంటాం అని తమ కూతురు బిగ్ బాస్ చెప్పిన మాట వింటాం అని చెప్పాడు రాకేష్.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.