English | Telugu

హౌ డేర్ యు..మీరెవరు అసలు నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలో చెప్పడానికి ?

శుభశ్రీ రాయగురు బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ వెళ్లి అందరినీ అలరించిన నటి. అటు మూవీస్ లో కూడా నటించింది. ఆమె రీసెంట్ గా ఏజె మైసూర్ అలియాస్ అజయ్ మైసూర్ అనే అతనితో ఎంగేజ్మెంట్ చేసుకుంది. ఇతను కూడా ప్రొడ్యూసర్ అండ్ యాక్టర్. మైసూర్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద "కమ్మ రాజ్యంలో కడప రెడ్లు" అనే మూవీ తీసాడు. ఇతనితో శుభశ్రీ మింగిల్ అయ్యింది. ఐతే వీళ్ళ పెయిర్ మీద చాల నెగటివ్ ట్రోలింగ్స్ వచ్చాయి. దాని గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్తూ చాలా ఫీలయ్యింది. "ఆయన గురించి చెప్తూ డార్క్ కలర్ లో ఉన్నాడు. అసలు ఎలా నచ్చాడు." అంటూ కామెంట్స్ చేశారు. "ఐనా ఆ విషయాలు చెప్పడానికి మీకెంత ధైర్యం..హౌ డేర్ యు..మీరెవరు అసలు ఎలాంటి పార్ట్నర్ ని చూజ్ చేసుకోవాలో చెప్పడానికి.. "అంటూ గట్టిగా క్లాస్ పీకింది."కట్నం ఎంతిస్తున్నారు...మనీ, మనీ, మనీ అంటున్నారు...మనీ డిగ్గర్, ఆరు నెలలు కలిసుంటే చూద్దాం..ఎందుకు ఎవరూ పాజిటివ్ గా ఉండరు..నేను ఏదన్నా రాంగ్ చేసానా " అసలు ఏంటి కామెంట్స్ అంటూ తెగ ఫీలయ్యింది. తర్వాత హోస్ట్ అజయ్ మైసూర్ కి ఫోన్ చేయమని శుభశ్రీతో చెప్పింది.

దాంతో ఆమె నిజంగా ఫోన్ చేసింది. "మిమ్మల్ని అంతలా ట్రోల్ చేస్తుంటే మీరు మాత్రం అంత హ్యాపీగా ఎలా ఉన్నారు" అంటూ హోస్ట్ వర్ష అడిగింది. "నా ఫస్ట్ మూవీ 2019 లో వచ్చిన "కమ్మ రాజ్యంలో కడప రెడ్లు"..నేను అప్పటి నుంచే నేను ట్రోలింగ్ కి అలవాటు పడ్డాను..హటర్స్, లవర్స్ అందరి రెస్పాన్స్ కి థ్యాంక్యూ. వి రాక్ " అని చెప్పాడు. రీసెంట్ గా వీళ్ళిద్దరూ కలిసి చేసిన "మెజెస్టీ ఇన్ లవ్" అనే కవర్ సాంగ్ వచ్చింది.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.