English | Telugu

మితిమీరిపోతున్న శ్రీహాన్, ఇనయా మధ్య గొడవ!

బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ మధ్య గొడవలు పెరిగిపోతున్నాయి. నామినేషన్లో అయినా, టాస్క్ లో అయినా ఎవరి ప్రతిభను వారు కనబరుస్తూ వస్తోన్నారు కంటెస్టెంట్స్. దీనికి కారణం ఒక టీం గా ఆడమని బిగ్ బాస్ చెప్పినప్పుడు ఎవరికి వారే అన్నట్లుగా ఆడేవాళ్ళు కొందరు అయితే, మనకెందుకులే అని వదిలేసేవాళ్ళు మరికొందరు. ఇదే తరహాలో ఇనయా, శ్రీహాన్ ల గొడవ కొనసాగుతోంది.

"ఎప్పటి గొడవలు అప్పుడే పరిష్కారించుకోవాలి. వాటిని ప్రొలాంగ్ చేయకూడదు." అని లాస్ట్ వీక్ నాగార్జున అందరికి తెలియజేసాడు. అయితే ఇనయా, శ్రీహాన్ మ‌ధ్య గొడ‌వ కంటిన్యూ అవుతోంది. నిన్న జరిగిన నామినేషన్ ప్ర‌క్రియ‌లో శ్రీహాన్ ని నామినేట్ చేసింది ఇన‌యా. ఆ తర్వాత "నువ్వు టాస్క్ లో నాకు ఓర్పు లేదు అన్నావ్. ఓర్పు అనే వర్డ్ ఎలా అంటావ్, నాకు ఓర్పు లేదు అని నువ్వు ఎలా అంటావ్?" అని అడిగింది. "ఓర్పు లేదు అని అనలేదు. పేషెన్సీ తక్కువగా ఉంది. అది కాస్త ఉంటే బాగుండేది అన్నాను" అని శ్రీహాన్ చెప్పుకొచ్చాడు. ఇలా నామినేషన్లో కాస్త ఉద్రిక్తత చోటుచేసుకుంది.

శ్రీహాన్, ఇనయా మ‌ధ్య‌ గొడవ రోజు రోజుకి పెరుగుతుండటం. అటు హౌస్ మేట్స్ కి ఇబ్బంది గాను, ఇటు ప్రేక్షకులకు ఇబ్బందిగాను తోస్తోంది. అయితే ఈ సారి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు హౌస్ నుండి బయటకు వస్తారని అనుకొంటున్నారు ప్రేక్షకులు. అయితే నాగార్జున వీళ్ళిద్దరి మధ్య కొనసాగుతున్న గొడవను క్లియర్ చేస్తాడో, లేదో.. చూడాలి మరి.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.